Political News

మ‌ద‌న‌ప‌ల్లె అగ్ని ప్ర‌మాదంపై జ‌గ‌న్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

ఉమ్మ‌డి చిత్తూరు జిల్లాలోని మ‌ద‌నప‌ల్లెలో ఆర్డీవో కార్యాల‌యంలో జ‌రిగిన అగ్ని ప్ర‌మాద ఘ‌ట‌న‌పై మాజీ సీఎం జ‌గ‌న్ తాజాగా రియాక్ట్ అయ్యారు. దీనిని ఎవ‌రు చేసినా.. త‌ప్పేన‌న్న ఆయ‌న అయితే.. దీనిని ఇంతగా హైలెట్ చేయాల్సిన అవ‌స‌రం ఎందుకు వ‌చ్చిందని ప్ర‌శ్నించారు. అదే రోజు తాను.. వినుకొండ‌లో ప‌ర్య‌ట‌న‌కు వెళ్లి.. దారుణ హ‌త్య‌కు గురైన ర‌షీద్ కుటుంబాన్ని ప‌రామర్శించేందుకు ప్ర‌య‌త్నించాన‌ని అన్నారు. ఈ స‌మ‌యంలో మీడియా త‌న‌కు కొంత క‌వ‌రేజీ ఇచ్చింద‌ని, అయితే.. దీనిని డైవ‌ర్ట్ చేసేందుకు చంద్ర‌బాబు కుయుక్తులు ప‌న్నార‌ని అన్నారు.

దీనిలో భాగంగా ముందు రోజు రాత్రి జ‌రిగిన అగ్ని ప్ర‌మాద ఘ‌ట‌న‌పై తెల్ల‌వారి స్పందించ‌కుండా.. సాయంత్రం నేను వినుకొండ‌లో ప‌ర్య‌టించిన‌ప్పుడే పెద్ద ఎత్తున హ‌డావుడి చేయ‌డం రాజ‌కీయ వ్యూహంలో భాగంగా కాదా? అని ప్ర‌శ్నించారు. ఒక‌టికి మూడు సార్లు రివ్యూ చేశార‌ని.. ఆ వెంట‌నే సీఐడీ చీఫ్‌, డీజీపీల ను కూడా ప్ర‌త్యేకంగా హెలికాప్ట‌ర్ ఇచ్చి అక్క‌డ‌కు పంపించార‌ని.. కానీ, అప్ప‌టి వ‌ర‌కు ఏం చేశార‌ని ప్ర‌శ్నించారు. ఒక‌వేళ నిజంగానే.. ఆర్డీవో ఆఫీసులో ఫైళ్లు త‌గ‌ల‌బ‌డి పోయినా.. క‌లెక్ట‌ర్ ఆఫీసులో భద్రంగా ఉంటాయ‌ని.. లేక‌పోతే.. ఆన్‌లైన్‌లోనే ఉంటాయ‌ని తెలిపారు.

పోనీ..అక్క‌డ కూడా లేక‌పోతే.. అమ‌రావ‌తిలోని సీసీఎల్ ఏ డేటాలో భ‌ద్రంగా ఉంటాయ‌ని.. ఈ విష‌యం చంద్ర‌బాబుకు తెలిసి కూడా.. పెద్ద ఎత్తున హ‌డావుడి చేశార‌ని అన్నారు. దీనికి కార‌ణం.. వినుకొండలో తన ప‌ర్య‌ట‌న‌ను డైల్యూట్ చేయాల‌న్న ఉద్దేశ‌మేన‌ని జ‌గ‌న్ వ్యాఖ్యానించారు. ఇక‌, చంద్ర‌బాబుకు అంత బాధ్య‌త ఉంటే.. నంద్యాల‌లో నిమ‌చ్చుమ‌ర్రిలో బాలిక‌పై జ‌రిగిన హ‌త్యాచార ఘ‌ట‌న‌ను ఇంత సీరియ‌స్‌గా ఎందుకు తీసుకోలేద‌ని ప్ర‌శ్నించారు. అస‌లు ప‌ట్టించుకున్నారా? అని ప్ర‌శ్నించారు.

చంద్ర‌బాబు అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత‌.. ఏకంగా 12 మంది మ‌హిళ‌ల‌పై అత్యాచారం.. న‌లుగురిపై అత్యాచారం, హ‌త్య కూడా జ‌రిగాయ‌ని. వాటిని ఎందుకు విచారించ‌డం లేద‌ని ప్ర‌శ్నించారు. మ‌ద‌న‌ప‌ల్లె ఘ‌ట‌న‌లో ఏదో జ‌రిగిపోయింద‌ని తెలుపుతూ.. పెద్దిరెడ్డి రామ‌చంద్రారెడ్డి, మిథున్ రెడ్డిల‌పై ఏదో అభాండాలు వేయాల‌న్న ప్ర‌య‌త్నం చేస్తున్నార‌ని చెప్పారు. కానీ రామ‌చంద్ర‌రెడ్డి 7 సార్లు ఎమ్మెల్యేగా, మిథున్ రెడ్డి మూడు సార్లు ఎంపీగా గెలిచార‌ని.. వారిని ప్ర‌జ‌లు ఆద‌రిస్తుండ‌బట్టే క‌దా.. గెలిచార‌ని జ‌గన్ వ్యాఖ్యానించారు.

Satya

Recent Posts

పాపం ఎవరిది… టికెట్ రేట్లదా ? పాప్ కార్న్ ధరలదా ?

ఇండస్ట్రీ, ప్రేక్షకుల్లో టాపిక్ పాతదే అయినా మరోసారి కొత్త డిబేట్ మొదలయ్యింది. లెనిన్ ప్రమోషన్లలో భాగంగా ఒక ఇంటర్వ్యూలో నిర్మాత…

4 hours ago

చెన్నై సంగీతం ఇంకా గట్టిగా వినిపించాలి

ఈ నెల విడుదలవుతున్న సినిమాల్లో చెన్నై లవ్ స్టోరీ మీద మంచి అంచనాలున్నాయి. దర్శకుడు రవి నంబూరి అయినప్పటికీ, కథ…

7 hours ago

వారణాసి విలన్ నో బడీ… చప్పుడు లేదేంటి

సలార్ లో వరదరాజ మన్నార్ గా తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన మలయాళ హీరో పృథ్విరాజ్ సుకుమారన్ ఆ తర్వాత తెలుగులో…

8 hours ago

ప్రేక్షకుల పల్స్ పట్టుకోవడం ఎలా

మొన్న విడుదలైన రావు బహదూర్ సినిమాకు కొందరు విమర్శకుల ప్రశంసలు దక్కాయి. ఫస్ట్ హాఫ్ మరీ నెమ్మదిగా ఉన్నా సెకండాఫ్…

9 hours ago

తమిళంలోకి శివాజీ క్రేజీ ఎంట్రీ

తెలుగులో ఒకప్పుడు చిన్న సినిమాల కథానాయకుడిగా చాలా ఏళ్ల పాటు కెరీర్‌ను నడిపించాడు శివాజీ. కానీ తర్వాత అతడి మనసు…

9 hours ago

నాయకుల మాట వినకపోతే చీలిక తప్పదు జగన్…!

ఏపీలో ప్ర‌తిప‌క్షంగా ఉన్న వైసీపీలో చీలిక రానుందా? ఆ పార్టీ నాయ‌కులు చీలిపోవ‌డ‌మో.. లేక కూట‌మిలోని ఓ పార్టీలో చేరిపోవ‌డ‌మో…

9 hours ago