Political News

మ‌ద‌న‌ప‌ల్లె అగ్ని ప్ర‌మాదంపై జ‌గ‌న్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

ఉమ్మ‌డి చిత్తూరు జిల్లాలోని మ‌ద‌నప‌ల్లెలో ఆర్డీవో కార్యాల‌యంలో జ‌రిగిన అగ్ని ప్ర‌మాద ఘ‌ట‌న‌పై మాజీ సీఎం జ‌గ‌న్ తాజాగా రియాక్ట్ అయ్యారు. దీనిని ఎవ‌రు చేసినా.. త‌ప్పేన‌న్న ఆయ‌న అయితే.. దీనిని ఇంతగా హైలెట్ చేయాల్సిన అవ‌స‌రం ఎందుకు వ‌చ్చిందని ప్ర‌శ్నించారు. అదే రోజు తాను.. వినుకొండ‌లో ప‌ర్య‌ట‌న‌కు వెళ్లి.. దారుణ హ‌త్య‌కు గురైన ర‌షీద్ కుటుంబాన్ని ప‌రామర్శించేందుకు ప్ర‌య‌త్నించాన‌ని అన్నారు. ఈ స‌మ‌యంలో మీడియా త‌న‌కు కొంత క‌వ‌రేజీ ఇచ్చింద‌ని, అయితే.. దీనిని డైవ‌ర్ట్ చేసేందుకు చంద్ర‌బాబు కుయుక్తులు ప‌న్నార‌ని అన్నారు.

దీనిలో భాగంగా ముందు రోజు రాత్రి జ‌రిగిన అగ్ని ప్ర‌మాద ఘ‌ట‌న‌పై తెల్ల‌వారి స్పందించ‌కుండా.. సాయంత్రం నేను వినుకొండ‌లో ప‌ర్య‌టించిన‌ప్పుడే పెద్ద ఎత్తున హ‌డావుడి చేయ‌డం రాజ‌కీయ వ్యూహంలో భాగంగా కాదా? అని ప్ర‌శ్నించారు. ఒక‌టికి మూడు సార్లు రివ్యూ చేశార‌ని.. ఆ వెంట‌నే సీఐడీ చీఫ్‌, డీజీపీల ను కూడా ప్ర‌త్యేకంగా హెలికాప్ట‌ర్ ఇచ్చి అక్క‌డ‌కు పంపించార‌ని.. కానీ, అప్ప‌టి వ‌ర‌కు ఏం చేశార‌ని ప్ర‌శ్నించారు. ఒక‌వేళ నిజంగానే.. ఆర్డీవో ఆఫీసులో ఫైళ్లు త‌గ‌ల‌బ‌డి పోయినా.. క‌లెక్ట‌ర్ ఆఫీసులో భద్రంగా ఉంటాయ‌ని.. లేక‌పోతే.. ఆన్‌లైన్‌లోనే ఉంటాయ‌ని తెలిపారు.

పోనీ..అక్క‌డ కూడా లేక‌పోతే.. అమ‌రావ‌తిలోని సీసీఎల్ ఏ డేటాలో భ‌ద్రంగా ఉంటాయ‌ని.. ఈ విష‌యం చంద్ర‌బాబుకు తెలిసి కూడా.. పెద్ద ఎత్తున హ‌డావుడి చేశార‌ని అన్నారు. దీనికి కార‌ణం.. వినుకొండలో తన ప‌ర్య‌ట‌న‌ను డైల్యూట్ చేయాల‌న్న ఉద్దేశ‌మేన‌ని జ‌గ‌న్ వ్యాఖ్యానించారు. ఇక‌, చంద్ర‌బాబుకు అంత బాధ్య‌త ఉంటే.. నంద్యాల‌లో నిమ‌చ్చుమ‌ర్రిలో బాలిక‌పై జ‌రిగిన హ‌త్యాచార ఘ‌ట‌న‌ను ఇంత సీరియ‌స్‌గా ఎందుకు తీసుకోలేద‌ని ప్ర‌శ్నించారు. అస‌లు ప‌ట్టించుకున్నారా? అని ప్ర‌శ్నించారు.

చంద్ర‌బాబు అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత‌.. ఏకంగా 12 మంది మ‌హిళ‌ల‌పై అత్యాచారం.. న‌లుగురిపై అత్యాచారం, హ‌త్య కూడా జ‌రిగాయ‌ని. వాటిని ఎందుకు విచారించ‌డం లేద‌ని ప్ర‌శ్నించారు. మ‌ద‌న‌ప‌ల్లె ఘ‌ట‌న‌లో ఏదో జ‌రిగిపోయింద‌ని తెలుపుతూ.. పెద్దిరెడ్డి రామ‌చంద్రారెడ్డి, మిథున్ రెడ్డిల‌పై ఏదో అభాండాలు వేయాల‌న్న ప్ర‌య‌త్నం చేస్తున్నార‌ని చెప్పారు. కానీ రామ‌చంద్ర‌రెడ్డి 7 సార్లు ఎమ్మెల్యేగా, మిథున్ రెడ్డి మూడు సార్లు ఎంపీగా గెలిచార‌ని.. వారిని ప్ర‌జ‌లు ఆద‌రిస్తుండ‌బట్టే క‌దా.. గెలిచార‌ని జ‌గన్ వ్యాఖ్యానించారు.

This post was last modified on July 26, 2024 6:51 pm

Share
Show comments

Recent Posts

11న అసెంబ్లీ… ఆ 11 మంది వస్తారా?

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మళ్లీ వేడి పెరుగుతోంది. 16వ శాసనసభ ఐదో సమావేశాలు ఫిబ్రవరి 11 నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ…

7 minutes ago

తిరుమల లడ్డు వ్యవహారం… టీటీడీ ఈవో బదిలీ?

తిరుమల లడ్డు కల్తీ నెయ్యి వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. విచారణ పరిధి క్రమంగా ఉన్నతాధికారుల వరకు విస్తరిస్తోంది. ఈ…

36 minutes ago

నేనే ‘కింగ్’ అంటున్న దళపతి విజయ్

నిన్నటివరకు టీవీకే అధ్యక్షుడు, దళపతి విజయ్ ఎవరితో పొత్తు పెట్టుకుంటారని కేవలం తమిళనాట ప్రజలు మాత్రమే కాదు, దక్షిణ భారత…

2 hours ago

ఈ తరంలో చిరుకు నచ్చిన యంగ్ హీరో

మెగాస్టార్ చిరంజీవి అభినందన అంటే యువ నటీనటులకు ఒక సర్టిఫికెట్ లాంటిదే. ఐతే ఏదైనా ఈవెంట్లకు వచ్చినపుడు అక్కడున్న వారిని…

5 hours ago

‘అమ్మాయిలను అనుభవించడానికే సినిమాలు తీస్తున్నారు’

సినీ ప‌రిశ్ర‌మ‌లో కాస్టింగ్ కౌచ్ లేదు అని చెప్ప‌లేమ‌ని సీనియ‌ర్ ద‌ర్శ‌క నిర్మాత త‌మ్మారెడ్డి భ‌ర‌ద్వాజ స్ప‌ష్టం చేశారు. ఇటీవ‌ల…

10 hours ago

డిప్యూటీ సీఎంగా అజిత్ పవార్ సతీమణి

బరామతి విమాన ప్రమాదంలో దుర్మరణం చెందిన మహారాష్ట్ర డిప్యూటీ ముఖ్యమంత్రి అజిత్ పవార్ స్థానాన్ని ఇప్పుడు ఆయన భార్య సునేత్ర…

13 hours ago