వైసీపీ హయాంలో చేసిన అప్పులు.. ప్రస్తుతం చంద్ర బాబు ప్రభుత్వం చెబుతున్న లెక్కల వ్యవహారానికి సంబంధించి మాజీ సీఎం , వైసీపీ అధినేత జగన్.. తాజాగా గణాంకాలతో సహా వివరాలు వెల్లడించారు. తాము అధికారంలోకి వచ్చేసరికి అప్పటి చంద్రబాబు ప్రభుత్వం తమకు రూ.100 కోట్లు మాత్రమే ఖజానా లో మిగిలించిందని.. అయినా.. తాము భారీ స్థాయిలో అప్పులు చేయకుండానే ప్రభుత్వాన్ని ముందుకు నడిపించామని జగన్ చెప్పారు.
అయితే.. తమపై ఎన్నికల సమయంలో అభూత కల్పనలతో తప్పుడు ప్రచారం చేయించారని జగన్ విమర్శించారు. తమ ప్రభుత్వం 14 లక్షల్ కోట్ల రూపాయలు అప్పులు చేసిందని చంద్రబాబు సహా అనేక మంది నాయకులు చెప్పుకొచ్చారని అన్నారు. కానీ, వాస్తవంగా మాత్రం తాము చేసింది.. 4 లక్షల కోట్లేనని తాజాగా వెల్లడించిన ఆర్బీఐ నివేదిక కూడా స్పష్టం చేసిందన్నారు. అయినప్పటికీ.. తాము చేసిన అప్పుల విషయాన్ని పరిశీలిస్తే.. ఈ ఏడాది జూన్ 10వ తేదీ వరకు వేసుకున్నా.,. 5.7 లక్షల కోట్లు దాటలేదన్నారు.
చంద్రబాబు 2014లో అధికారం చేపట్టే సమయానికి 1.7 లక్షల కోట్ల అప్పు ఉందని.. దానిని ఆయన ఐదేళ్ల కాలంలో 3.27 లక్షల కోట్లకు చేర్చారని జగన్ చెప్పారు. తమ ఐదేళ్ల పాలనలో అన్ని రకాల అప్పులను కలుపుకొన్నా.. 7 లక్షల కోట్లకు మించలేదన్నారు. వాస్తవానికి కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలు అప్పులు చేసుకునేందుకు భారీ ఎత్తున వెసులుబాటు కల్పించినా.. తాము వాడుకోలేదన్నారు. ఎఫ్ ఆర్బీఎం పరిమితిని ఏనాడూ దాటకుండా.. జాగ్రత్తగా అప్పులు చేసుకుంటూ వచ్చామని వివరించారు.
అయినా.. ఎన్నికల్లో గెలుపు కోసం..చంద్రబాబు అబద్ధాలు చెప్పారని.. ప్రజలను నమ్మించారని జగన్ ఆవేదన వ్యక్తం చేశారు. చంద్రబాబు హయాంలో 21.63 శాతం దాకా అప్పు చేస్తే.. తాము 12.9 శాతం అప్పు చేశామని జగన్ వివరించారు. ఆర్థిక సర్వే సైతం వైసీపీ పానలను మెచ్చుకుందనిజగన్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా పలు ఆధారాలను ఆయన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. దీనిని ప్రజల్లోకి తీసుకువెళ్లాలని ఆయన మీడియాను అభ్యర్థించారు.
This post was last modified on July 26, 2024 2:34 pm
అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…
మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ.. సంక్రాంతి. ఇళ్లకే కాదు.. గ్రామాలకు సైతం శోభను తీసుకువచ్చే సంక్రాంతికి.. కోడి…
ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…
బీజేపీ కురువృద్ధ నాయకుడు, దేశ మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు.. ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకొన్నారు. అయితే.. ఆయన…
చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…
కుప్పం.. ఏపీ సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గం. గత 40 సంవత్సరాలుగా ఏక ఛత్రాధిపత్యంగా చంద్రబాబు ఇక్కడ విజయం దక్కించుకుంటున్నారు.…