Political News

రాష్ట్రంలో ఎమర్జెన్సీ ప్ర‌క‌టించండి: ష‌ర్మిల లేఖ‌

ఏపీ సీఎం చంద్ర‌బాబుకు పీసీసీ చీఫ్ వైఎస్ ష‌ర్మిల లేఖ సంధించారు. ప్ర‌స్తుతం రాష్ట్రంలో ప‌రిస్థితి ముఖ్యంగా రైత‌న్న‌ల ప‌రిస్థితి ఏమీ బాగోలేద‌ని తెలిపారు. ఇటీవ‌ల బంగాళాఖాతంలో ఏర్ప‌డిన అల్ప‌పీ డ‌నం కార‌ణంగా కురిసిన వ‌ర్షాల‌తో వ‌ర‌ద‌లు పోటెత్తి.. రాష్ట్రంలోని ఉభ‌య గోదావ‌రి జిల్లాలు స‌హా.. ఇత‌ర ప్రాంతాల్లోని రైతులు.. తీవ్రంగా న‌ష్ట‌పోయార‌ని ష‌ర్మిల తెలిపారు. ఈ నేప‌థ్యంలో రైతుల క‌ష్టాల‌ను దృష్టిలో పెట్టుకుని ‘ఫార్మ‌ర్‌ ఎమ‌ర్జెన్సీ’ని ప్ర‌క‌టించాల‌ని ఆమె కోరారు.

అదేవిధంగా స‌ర్కారు తీరును కూడా ష‌ర్మిల ఆక్షేపించారు. రాష్ట్రంలో పెద్ద ఎత్తున రైతులు న‌ష్ట‌పోయి.. తీవ్ర దుఖంలో ఉంటే.. కేబినెట్ మంత్రులు.. కూట‌మి ప్ర‌భుత్వంలోని నాయ‌కులు ఒక్క‌రంటే ఒక్క‌రు కూడా స్పందించ‌లేద‌న్నారు. ఎన్నిక‌ల‌కు ముందు రైతుల‌కు అనేక హామీలు గుప్పించార‌ని.. కానీ, ఎన్నిక‌లు అయ్యాక వారిని క‌నీసం ప‌ల‌కరించే ప్ర‌య‌త్నం కూడా చేయ‌డం లేద‌ని ష‌ర్మిల పేర్కొన్నారు. అస్తవ్యస్తంగా మారిన కాలువల నిర్వహణ కారణంగా పొలాలు మునిగిపోయ‌ని తెలిపారు.

ప‌లు జిల్లాల్లో తీవ్ర స్థాయిలో పంట నష్టం జరిగిందని, రాష్ట్ర ప్ర‌తినిధి బృందాన్ని పంపించి.. రైతుల క‌ష్టాలు ఆల‌కించాల‌ని ష‌ర్మిల కోరారు. రైతుల కష్టాలను రాష్ట్ర ఎమర్జెన్సీగా ప్రకటించాల‌ని కాంగ్రెస్ పార్టీ త‌ర‌ఫున కోరుతున్నామ‌ని ష‌ర్మిల తెలిపారు. రైతులకు జరిగిన నష్టాన్ని అంచనా వేసి, తగిన నష్టపరిహారం చెల్లించేందుకు వీలుగా వెంటనే పలు బృందాలను పంపించాల‌ని కోరారు. అదేవిధంగా కేంద్రంపైనా ఒత్తిడి తీసుకురావాల‌ని.. వ‌ర‌ద‌ల‌ను విప‌త్తుల ప‌రిధిలో చేర్చి.. రాష్ట్రమే కాకుండా.. కేంద్రం నుంచి కూడా రైతుల‌కు సాయం అందించేలా చ‌ర్య‌లు తీసుకోవాల‌ని కోరారు.

జ‌గ‌న్‌ను వ‌దల్లేదు!

అయితే.. ఈ సంద‌ర్భంగా కూడా.. ష‌ర్మిల త‌న సోద‌రుడు జ‌గ‌న్ ను వ‌దిలి పెట్ట‌క‌పోవ‌డం గ‌మ‌నార్హం. గ‌త వైసీపీ పాల‌నలో రైతుల‌కు అన్యాయం జ‌రిగింద‌ని విమ‌ర్శ‌లు గుప్పించారు. గ‌త ప్ర‌భుత్వం రైతుల‌కు డ‌బ్బులు బ‌కాయిలు పెట్టింద‌ని అన్నారు. ధాన్యం కొనుగోలు చేసి.. కూడా సొమ్ములు చెల్లించ‌లేద‌ని.. కాబ‌ట్టి.. ఇప్పుడు ఆ బ‌కాయిలును కూడా ప్ర‌భుత్వం ఇవ్వాల‌ని ష‌ర్మిల కోరారు. గ‌త ప్ర‌భుత్వం చేసిన త‌ప్పులు మీరు చేయొద్దంటూ.. చంద్ర‌బాబుకు సూచించ‌డం గ‌మ‌నార్హం.

This post was last modified on July 26, 2024 3:04 am

Share

Recent Posts

రామాయణ, వారణాసి… ఓ క్లారిటీ వస్తుందా?

రామాయణం.. తరతరాలుగా ప్రతీ ఇంటితోనూ విడదీయరాని బంధం ఉన్న ఒక గొప్ప ఎమోషన్. అయితే ఈ కథను ఇండియన్ సినిమా…

2 hours ago

చెల్లెలిపై కేటీఆర్ ఘాటు వ్యాఖ్యలు

క‌లిసి రాజ‌కీయం చేయ‌క‌పోయినా వైఎస్సార్సీపీ, బీఆర్ఎస్ పార్టీల మ‌ధ్య కొన్ని పోలిక‌లు క‌నిపిస్తున్నాయి. అటు ఏపీలో, ఇటు తెలంగాణ‌లో ఈ…

5 hours ago

చెన్నైలో చింటు మేనియా

సోష‌ల్ మీడియాలో చాలా చురుగ్గా ఉంటూ.. త‌న సినిమాల ఈవెంట్ల‌లో, ఇంట‌ర్వ్యూల్లో హాట్ హాట్ కామెంట్లు చేస్తుంటాడు ప్ర‌ముఖ తెలుగు…

5 hours ago

కనకరాజు లెక్కలు సేఫ్ గానే ఉన్నాయా?

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ 'కొరియన్ కనకరాజు'తో ఇప్పుడు తప్పకుండా హిట్ కొట్టాల్సిన పరిస్థితి వచ్చింది. గతంలో 'గద్దలకొండ గణేష్'…

5 hours ago

బాగుంది ఆదివారం… థియేటర్లలో జన సందోహం

ఆదివారం రోజు అందులోనూ ప్రత్యేకంగా సాయంత్రం షోలకు ఆక్యుపెన్సీలు బాగుండటం సహజమే కానీ ఈవారం మాత్రం బయ్యర్లు ఆనందంతో మునిగిపోయేలా…

6 hours ago

కాలేజీలు కాదు… విద్యార్థుల ఖాతాల్లోకే ఫీజు రీయంబర్స్మెంట్ జమ?

తెలంగాణలో ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకం అమలులో కీలక మార్పులు తెచ్చేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయించినట్లు ప్రచారం జరుగుతుంది. కళాశాలలకు…

6 hours ago