ఏపీ సీఎం చంద్రబాబుకు పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల లేఖ సంధించారు. ప్రస్తుతం రాష్ట్రంలో పరిస్థితి ముఖ్యంగా రైతన్నల పరిస్థితి ఏమీ బాగోలేదని తెలిపారు. ఇటీవల బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీ డనం కారణంగా కురిసిన వర్షాలతో వరదలు పోటెత్తి.. రాష్ట్రంలోని ఉభయ గోదావరి జిల్లాలు సహా.. ఇతర ప్రాంతాల్లోని రైతులు.. తీవ్రంగా నష్టపోయారని షర్మిల తెలిపారు. ఈ నేపథ్యంలో రైతుల కష్టాలను దృష్టిలో పెట్టుకుని ‘ఫార్మర్ ఎమర్జెన్సీ’ని ప్రకటించాలని ఆమె కోరారు.
అదేవిధంగా సర్కారు తీరును కూడా షర్మిల ఆక్షేపించారు. రాష్ట్రంలో పెద్ద ఎత్తున రైతులు నష్టపోయి.. తీవ్ర దుఖంలో ఉంటే.. కేబినెట్ మంత్రులు.. కూటమి ప్రభుత్వంలోని నాయకులు ఒక్కరంటే ఒక్కరు కూడా స్పందించలేదన్నారు. ఎన్నికలకు ముందు రైతులకు అనేక హామీలు గుప్పించారని.. కానీ, ఎన్నికలు అయ్యాక వారిని కనీసం పలకరించే ప్రయత్నం కూడా చేయడం లేదని షర్మిల పేర్కొన్నారు. అస్తవ్యస్తంగా మారిన కాలువల నిర్వహణ కారణంగా పొలాలు మునిగిపోయని తెలిపారు.
పలు జిల్లాల్లో తీవ్ర స్థాయిలో పంట నష్టం జరిగిందని, రాష్ట్ర ప్రతినిధి బృందాన్ని పంపించి.. రైతుల కష్టాలు ఆలకించాలని షర్మిల కోరారు. రైతుల కష్టాలను రాష్ట్ర ఎమర్జెన్సీగా ప్రకటించాలని కాంగ్రెస్ పార్టీ తరఫున కోరుతున్నామని షర్మిల తెలిపారు. రైతులకు జరిగిన నష్టాన్ని అంచనా వేసి, తగిన నష్టపరిహారం చెల్లించేందుకు వీలుగా వెంటనే పలు బృందాలను పంపించాలని కోరారు. అదేవిధంగా కేంద్రంపైనా ఒత్తిడి తీసుకురావాలని.. వరదలను విపత్తుల పరిధిలో చేర్చి.. రాష్ట్రమే కాకుండా.. కేంద్రం నుంచి కూడా రైతులకు సాయం అందించేలా చర్యలు తీసుకోవాలని కోరారు.
జగన్ను వదల్లేదు!
అయితే.. ఈ సందర్భంగా కూడా.. షర్మిల తన సోదరుడు జగన్ ను వదిలి పెట్టకపోవడం గమనార్హం. గత వైసీపీ పాలనలో రైతులకు అన్యాయం జరిగిందని విమర్శలు గుప్పించారు. గత ప్రభుత్వం రైతులకు డబ్బులు బకాయిలు పెట్టిందని అన్నారు. ధాన్యం కొనుగోలు చేసి.. కూడా సొమ్ములు చెల్లించలేదని.. కాబట్టి.. ఇప్పుడు ఆ బకాయిలును కూడా ప్రభుత్వం ఇవ్వాలని షర్మిల కోరారు. గత ప్రభుత్వం చేసిన తప్పులు మీరు చేయొద్దంటూ.. చంద్రబాబుకు సూచించడం గమనార్హం.
This post was last modified on July 26, 2024 3:04 am
ప్రేక్షకులను థియేటర్లకు వచ్చేలా చేయడం చిన్న సినిమాల నిర్మాతలకు దినదిన గండంగా మారిపోయింది. ఆడియన్స్ అభిరుచులు మారిపోయాయో లేక ఓటిటిల…
మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ రవిచందర్ వచ్చే మార్చి 21 హైదరాబాద్ లో లైవ్ కన్సర్ట్ చేయబోతున్న సంగతి తెలిసిందే. గచ్చిబౌలి…
తనతో కలిసి సినిమాలు చేసేవాళ్లకు ప్రభాస్ విందు భోజనాలతో ఎలా సర్ప్రైజ్ చేయిస్తుంటాడో కథలు కథలుగా చెబుతుంటారు. హైదరాబాద్లో షూటింగ్స్…
ఏపీని రాజకీయంగా కుదిపేస్తున్న తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వ్యవహారంపై రాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది.…
ఇవాళ చెప్పుకోదగ్గ కౌంట్ లో కొత్త సినిమాలు విడుదలయ్యాయి. ముఖ్యంగా హే బలవంత్ కోసం చాలా ప్రమోషన్లు చేశారు. మీడియాతో…
ఉస్తాద్ భగత్ సింగ్తో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాలకు టాటా చెప్పేస్తాడని గత ఏడాది ఓ ప్రచారం జరిగింది.…