మెగాస్టార్ చిరంజీవి అభినందన అంటే యువ నటీనటులకు ఒక సర్టిఫికెట్ లాంటిదే. ఐతే ఏదైనా ఈవెంట్లకు వచ్చినపుడు అక్కడున్న వారిని ఎవరైనా పొగుడుతారు. చిరు కూడా అందుకు మినహాయింపు కాదు. కానీ పరోక్షంలో అడిగి మరీ ఒక నటుడి గురించి ప్రస్తావిస్తే.. తన ప్రతిభను కొనియాడితే.. దాని గురించి మూడో వ్యక్తి వచ్చి మరో వేదిక మీద చెబితే.. అది చాలా స్పెషల్.
నవీన్ పొలిశెట్టిని మెగాస్టార్ చిరంజీవి అలాగే పొగిడిన సంగతిని దర్శకుడు బాబీ కొల్లి వెల్లడించాడు.
సంక్రాంతికి చిరు మూవీ ‘మన శంకర వరప్రసాద్ గారు’తో పోటీ పడి బాక్సాఫీస్ దగ్గర సత్తా చాటింది నవీన్ సినిమా ‘అనగనగా ఒక రాజు’. ఈ సినిమాలో అతడిది వన్ మ్యాన్ షో అని చెప్పొచ్చు. నటుడిగా సినిమాను తన భుజాల మీద మోయడమే కాక.. స్క్రిప్టులోనూ అతను కీలక పాత్ర పోషించాడు.
ఈ మధ్య తమ కలయికలో రానున్న కొత్త సినిమా చర్చల్లో భాగంగా చిరును కలిశానని.. ఆ సందర్భంగా చిరు మాట్లాడుతూ ‘‘అనగనగా ఒక రాజు సినిమా బాగుందట కదా. ఈ తరం నటుల్లో నాకు నచ్చిన హీరో నవీన్ పొలిశెట్టి’’ అని తనతో అన్నట్లు బాబీ వెల్లడించాడు. ఈ విషయం చెప్పినపుడు ఆడిటోరియం హోరెత్తింది. నవీన్ అమితానందానికి గురయ్యాడు.
తాను తరచుగా నవీన్తో మాట్లాడుతుంటానని.. ‘మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి’ తర్వాత ఓ ప్రమాదంలో గాయాలైనా పట్టించుకోకుండా ‘అనగనగా ఒక రాజు’ కోసం కష్టపడ్డాడని.. ఆ కష్టానికి ఫలితమే ఈ సక్సెస్ అని అన్నాడు బాబీ.
మామూలుగా టైమ్ బాగుంటే హీరోలవుతారని.. టైమింగ్ బాగుండి హీరో అయిన నటుడు నవీన్ అని బాబీ కొనియాడాడు. ‘అనగనగా ఒక రాజు’ చిత్రానికి చిన్మయి ఘాట్రాజుతో కలిసి నవీనే స్క్రిప్టు అందించాడు. ఈ చిత్రాన్ని తమిళ దర్శకుడైన మారి డైరెక్ట్ చేశాడు. నాగవంశీ నిర్మించగా.. మీనాక్షి చౌదరి కథానాయికగా నటించింది. సంక్రాంతికి రిలీజైన ఈ సినిమా వంద కోట్లకు పైగా వసూళ్లు సాధించింది.
This post was last modified on January 31, 2026 10:01 am
తిరుమల లడ్డు కల్తీ నెయ్యి వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. విచారణ పరిధి క్రమంగా ఉన్నతాధికారుల వరకు విస్తరిస్తోంది. ఈ…
నిన్నటివరకు టీవీకే అధ్యక్షుడు, దళపతి విజయ్ ఎవరితో పొత్తు పెట్టుకుంటారని కేవలం తమిళనాట ప్రజలు మాత్రమే కాదు, దక్షిణ భారత…
సినీ పరిశ్రమలో కాస్టింగ్ కౌచ్ లేదు అని చెప్పలేమని సీనియర్ దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ స్పష్టం చేశారు. ఇటీవల…
బరామతి విమాన ప్రమాదంలో దుర్మరణం చెందిన మహారాష్ట్ర డిప్యూటీ ముఖ్యమంత్రి అజిత్ పవార్ స్థానాన్ని ఇప్పుడు ఆయన భార్య సునేత్ర…
తన సొంత నియోజకవర్గం కుప్పాన్ని ప్రయోగశాలగా మార్చనున్నట్టు సీఎం చంద్రబాబు తెలిపారు. తాజాగా శుక్రవారం రాత్రి తన నియోజకవర్గానికి వచ్చిన…
ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణ విషయంలో తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పంతం నెగ్గలేదు. తనను ఎర్రవెల్లిలోని తన ఫామ్…