Political News

తిరుమల లడ్డు వ్యవహారం… టీటీడీ ఈవో బదిలీ?

తిరుమల లడ్డు కల్తీ నెయ్యి వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. విచారణ పరిధి క్రమంగా ఉన్నతాధికారుల వరకు విస్తరిస్తోంది. ఈ కేసులో దర్యాప్తు చేపట్టిన ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్‌) ప్రభుత్వానికి తాజాగా 14 పేజీల నివేదికతో పాటు లేఖను సమర్పించినట్టు తెలిసింది. కల్తీ నెయ్యి సరఫరా వ్యవహారంలో అప్పట్లో కీలక పదవుల్లో ఉన్న ముగ్గురు అధికారులపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని సిట్‌ ప్రభుత్వానికి సూచించినట్టు సమాచారం.

సిట్‌ నివేదికలో అప్పటి, ప్రస్తుత టీటీడీ ఈవో అనిల్‌కుమార్‌ సింఘాల్‌, అప్పటి అదనపు ఈవో ధర్మారెడ్డి, ఫైనాన్షియల్‌ అడ్వైజర్‌ అండ్‌ చీఫ్‌ అకౌంట్స్‌ ఆఫీసర్‌ బాలాజీ పాత్రపై తీవ్ర ఆరోపణలు ఉన్నట్టు తెలిసింది.

నెయ్యి సరఫరాకు సంబంధించిన నాణ్యతా ప్రమాణాలను బలహీనపరిచేలా వ్యవహరించారని, అవసరమైన నియమావళి తయారీలో నిర్లక్ష్యం వహించారని సిట్‌ తన లేఖలో పేర్కొన్నట్టు సమాచారం. దీని కారణంగా నెయ్యి నాణ్యతలో రాజీ జరిగిందని నివేదికలో స్పష్టం చేసినట్టు తెలిసింది.

సిట్‌ సిఫారసుల నేపథ్యంలో ఈవో అనిల్‌కుమార్‌ సింఘాల్‌ను బదిలీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్టు సమాచారం. ఈ మేరకు నేడో రేపో అధికారిక ఉత్తర్వులు వెలువడే అవకాశముందని అధికార వర్గాలు చెబుతున్నాయి.

కల్తీ నెయ్యి సరఫరాకు కారణం టీటీడీ మాజీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి హయాంలో నెయ్యి సేకరణ విధానంలో తీసుకొచ్చిన మార్పులేనని సిట్‌ దర్యాప్తులో నిర్ధారణకు వచ్చినట్టు తెలిసింది. ఆ మార్పులను అప్పట్లో ఈవో స్థాయిలో సకాలంలో గుర్తించకపోవడం లేదా గుర్తించినా పట్టించుకోకపోవడం క్షమించరాని నిర్లక్ష్యంగా సిట్‌ అభిప్రాయపడినట్టు సమాచారం.

విధి నిర్వహణలో తీవ్ర నిర్లక్ష్యం, టీటీడీ పాలక మండలి ఒత్తిడికి తలొగ్గిన అంశాలపై సిట్‌ గట్టిగా అభ్యంతరం తెలిపినట్టు తెలిసింది. ఈ నేపథ్యంలోనే ముగ్గురు అధికారులపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి సిఫారసు చేసినట్టు సమాచారం.

This post was last modified on January 31, 2026 10:49 am

Share

Recent Posts

విలక్షణ నటుడి విశ్వరూపం.. నేరుగా థియేటర్లోనే

తెలుగు సినిమా చరిత్రలోనే అత్యంత గొప్ప నటుల జాబితా తీస్తే.. అందులో టాప్-10లో ఉండే పేరు. ఆయన చేయని పాత్ర…

1 hour ago

వైష్ణవి చైతన్య బాధ వర్ణనాతీతం

యూట్యూబ్‌లో వెబ్ సిరీస్‌లు, సినిమాల్లో క్యారెక్టర్ రోల్స్ చేసుకునే అమ్మాయి వంద కోట్ల వసూళ్లు రాబట్టిన సినిమాలో భాగం కావడం..…

2 hours ago

మండాడి ఊపులో దేవర ఊసులు

తెలుగులో సముద్రం నేపథ్యంతో వచ్చిన సినిమాలు తక్కువే. తీరప్రాంతం చెప్పుకోదగ్గ స్థాయిలో ఉన్నప్పటికీ పూర్తిగా ఈ బ్యాక్ డ్రాప్ లో…

3 hours ago

మహాశక్తి దర్శనం… ఏఐ దీవెనలు

ఆరు సంవత్సరాల క్రితం నేరుగా ఓటిటిలో రిలీజైన సినిమా మూకుతి అమ్మన్. తెలుగులో అమ్మోరు తల్లిగా డబ్బింగ్ చేశారు. బాగానే…

5 hours ago

బీజేపీ ఎమ్మెల్యే అక్ర‌మాల‌పై నేరుగా మోడీకే ఫిర్యాదు చేసిన ఫ్రెండ్‌!

ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోడీ బీజేపీ అగ్ర‌నేత‌. ఇక‌, ఆయ‌న సొంత రాష్ట్రం గుజ‌రాత్‌. తాజాగా మోడీ చిన్న‌నాటి స్నేహితుడు,…

6 hours ago

రామాయణ సంగీతానికి తెర లేచింది

విడుదలకు ఇంకా రెండు నెలలు లేని నేపథ్యంలో రామాయణ బృందం సంగీత ప్రచారానికి తెరతీసింది. యూట్యూబ్ కన్నా ముందు స్పాటిఫై…

6 hours ago