Political News

పోల‌వ‌రానికి అదే శాపం.. పాపం: కేంద్రం తాజా అప్‌డేట్

ఏపీ ప్ర‌జ‌ల జ‌ల జీవ‌నాడి పోల‌వ‌రం ప్రాజెక్టుపై కేంద్ర ప్ర‌భుత్వం తాజాగా స్పందించింది. దీనికి సంబంధించి ప‌లు వివ‌రాల‌ను లిఖిత పూర్వ‌కంగా వెల్ల‌డించింది. పోల‌వ‌రం ప్రాజెక్టు ఊహించ‌ని విధంగా ఆలస్యమైన‌ విష‌యం తెలిసిందే. దీనికి సంబంధించి ఇప్ప‌టి వ‌ర‌కు ఎందుకు ఆల‌స్య‌మైంద‌న్న ప్ర‌శ్న‌కు గ‌త వైసీపీ ప్ర‌భుత్వం కానీ.. గ‌త మోడీ స‌ర్కారు కానీ.. స‌మాధానం చెప్ప‌లేదు. అయితే.. తాజాగా ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం రావ‌డం.. పోల‌వ‌రం కోసం ప‌ట్టుబ‌ట్ట‌డం.. కేంద్రం కూడా నిర్మాణానికి సుముఖ‌త వ్య‌క్తం చేయ‌డం తెలిసిందే.

ఈ నేప‌థ్యంలో గురువారం పార్ల‌మెంటులో పోల‌వ‌రంపై ఏపీకి చెందిన ప‌లువురు ఎంపీలు ప్ర‌శ్న‌లు సంధించారు. ఈ సంద‌ర్భంగా కేంద్ర జ‌ల శ‌క్తి శాఖ లిఖిత పూర్వ‌కంగా స‌మాధానం ఇచ్చింది. ఆల‌స్యానికి కార‌ణం.. 2019-20 మ‌ధ్య పోల‌వ‌రం ప్రాజెక్టు నిర్మాణాల‌ను చూస్తున్న న‌వ‌యుగ కాంట్రాక్ట‌ర్ సంస్థ‌ను త‌ప్పించ‌డ‌మేన‌ని స్ప‌ష్టం చేసింది. ఈ కాంట్రాక్టును ర‌ద్దు చేయ‌వ‌ద్ద‌ని తాము సూచించిన‌ట్టు పేర్కొంది. అయిన‌ప్ప‌టికీ.. అప్ప‌టి ప్ర‌భుత్వం కాంట్రాక్టును ర‌ద్దు చేసింద‌ని.. దీంతో ఆల‌స్య‌మైంద‌ని తెలిపింది.

ఇక‌, పోల‌వ‌రం నిర్మాణానికి విడ‌తల వారీగా ఇచ్చిన నిధుల వివ‌రాల‌ను కూడా కేంద్ర ప్ర‌భుత్వం వెల్ల‌డించింది. 8 వేల 44 కోట్ల రూపాయ‌ల‌ను ఇప్ప‌టి వ‌ర‌కు ఇచ్చిన‌ట్టు తెలిపింది. కొన్ని ప‌ద్దుల‌కు త‌మ‌కు బిల్లులు రావాల్సి ఉంద‌ని పేర్కొంది. గ‌త మూడేళ్ల‌లో ఇచ్చిన నిధుల‌ను స‌క్ర‌మంగానే అమ‌లు చేసిన‌ట్టు రాష్ట్ర ప్ర‌భుత్వం తెలిపిన‌ట్టు చెప్పింది. అదేవిధంగా గ‌త మూడేళ్ల‌లో కాంక్రీటు ప‌నులు 5 శాతం మేర‌కు జ‌రిగాయ‌ని.. వివ‌రించింది.

అదేవిధంగా.. పోల‌వ‌రం ప్రాజెక్టు తొలి ద‌శ ప‌నుల‌ను 2026 మార్చి నాటికి పూర్తి చేయ‌నున్న‌ట్టు కేంద్రం వెల్ల‌డించింది. అయితే.. పూర్తిస్థాయిలో ప్రాజెక్టు నిర్మాణం ఎప్పుడు పూర్త‌వుతుంద‌నే వివ‌రాలు వెల్ల‌డించేందుకు స‌మ‌యం ప‌డుతుంద‌ని ప్ర‌స్తుతం ప్రాజెక్టు ప‌రిస్థితి అగ‌మ్యగోచ‌రంగా(నాన్ కాన్షియ‌స్‌నెస్‌) ఉంద‌ని కేంద్ర ప్ర‌భుత్వం వివ‌రించింది. అయిన‌ప్ప‌టికీ.. ప‌నులు చేసేందుకు కేంద్రం క‌ట్టుబ‌డి ఉంద‌ని తెలిపింది.

This post was last modified on July 26, 2024 3:00 am

Share

Recent Posts

జంతర్ మంతర్ కు చెక్ ?

దేశ రాజధాని ఢిల్లీలోని జంతర్ మంతర్ కు ఇటీవల ఎక్కడ లేని ప్రాచుర్యం లభించింది. నీట్ పేపర్ లీకేజి కి…

4 hours ago

సత్య హాస్యం చాలా ప్లస్ అవుతోంది

గతంలో బ్రహ్మానందం, బాబు మోహన్ లాంటి కమెడియన్స్ ఉన్నప్పుడు వాళ్ళ కోసమే విడిగా కామెడీ ఎపిసోడ్స్ రాసేవాళ్ళు. మెయిన్ రైటర్స్…

4 hours ago

వెంక‌ట‌ప్ప ఫెయిల్… ఇక మాలిక్ ఏం చేస్తాడో?

తెలుగు సినిమా చ‌రిత్ర‌లోనే అత్యంత గొప్ప న‌టుల జాబితా తీస్తే.. అందులో పైవ‌రుస‌లో ఉండే ఆర్టిస్టుల్లో మోహన్ బాబు ఒక‌రు.…

5 hours ago

పీకే ఇక ఎమ్మెల్యే సాబ్!

ప్రముఖ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ కొత్త ప్రస్థానం మొదలైపోయింది. నిన్నటిదాకా రాజకీయ వ్యూహకర్తగా, ఓ రాజకీయ పార్టీకి అధినేతగా…

6 hours ago

వ్య‌క్తి చ‌నిపోతే… కేసు మూసేయొచ్చు: ఉండ‌వ‌ల్లి కేసుపై సుప్రీంకోర్టు

ఉమ్మ‌డి ఆంధ్ర‌ప్ర‌దేశ్‌కు చెందిన ఓ కీల‌క కేసు విష‌యంలో సుప్రీంకోర్టు సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసింది. వ్య‌క్తి చ‌నిపోయిన త‌ర్వాత‌.. కేసును…

6 hours ago

డాటరాఫ్ రవీనా… ఫలితం కూడా అదేనా

టాలీవుడ్ విచిత్రాలు కొన్ని భలే అనిపిస్తాయి. కాకతాళీయమే అయినా అదేదో రాసిపెట్టి జరగడం ఆశ్చర్యం కలిగిస్తుంది. ఇటీవలే విడుదలైన శ్రీనివాస…

6 hours ago