Political News

పోల‌వ‌రానికి అదే శాపం.. పాపం: కేంద్రం తాజా అప్‌డేట్

ఏపీ ప్ర‌జ‌ల జ‌ల జీవ‌నాడి పోల‌వ‌రం ప్రాజెక్టుపై కేంద్ర ప్ర‌భుత్వం తాజాగా స్పందించింది. దీనికి సంబంధించి ప‌లు వివ‌రాల‌ను లిఖిత పూర్వ‌కంగా వెల్ల‌డించింది. పోల‌వ‌రం ప్రాజెక్టు ఊహించ‌ని విధంగా ఆలస్యమైన‌ విష‌యం తెలిసిందే. దీనికి సంబంధించి ఇప్ప‌టి వ‌ర‌కు ఎందుకు ఆల‌స్య‌మైంద‌న్న ప్ర‌శ్న‌కు గ‌త వైసీపీ ప్ర‌భుత్వం కానీ.. గ‌త మోడీ స‌ర్కారు కానీ.. స‌మాధానం చెప్ప‌లేదు. అయితే.. తాజాగా ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం రావ‌డం.. పోల‌వ‌రం కోసం ప‌ట్టుబ‌ట్ట‌డం.. కేంద్రం కూడా నిర్మాణానికి సుముఖ‌త వ్య‌క్తం చేయ‌డం తెలిసిందే.

ఈ నేప‌థ్యంలో గురువారం పార్ల‌మెంటులో పోల‌వ‌రంపై ఏపీకి చెందిన ప‌లువురు ఎంపీలు ప్ర‌శ్న‌లు సంధించారు. ఈ సంద‌ర్భంగా కేంద్ర జ‌ల శ‌క్తి శాఖ లిఖిత పూర్వ‌కంగా స‌మాధానం ఇచ్చింది. ఆల‌స్యానికి కార‌ణం.. 2019-20 మ‌ధ్య పోల‌వ‌రం ప్రాజెక్టు నిర్మాణాల‌ను చూస్తున్న న‌వ‌యుగ కాంట్రాక్ట‌ర్ సంస్థ‌ను త‌ప్పించ‌డ‌మేన‌ని స్ప‌ష్టం చేసింది. ఈ కాంట్రాక్టును ర‌ద్దు చేయ‌వ‌ద్ద‌ని తాము సూచించిన‌ట్టు పేర్కొంది. అయిన‌ప్ప‌టికీ.. అప్ప‌టి ప్ర‌భుత్వం కాంట్రాక్టును ర‌ద్దు చేసింద‌ని.. దీంతో ఆల‌స్య‌మైంద‌ని తెలిపింది.

ఇక‌, పోల‌వ‌రం నిర్మాణానికి విడ‌తల వారీగా ఇచ్చిన నిధుల వివ‌రాల‌ను కూడా కేంద్ర ప్ర‌భుత్వం వెల్ల‌డించింది. 8 వేల 44 కోట్ల రూపాయ‌ల‌ను ఇప్ప‌టి వ‌ర‌కు ఇచ్చిన‌ట్టు తెలిపింది. కొన్ని ప‌ద్దుల‌కు త‌మ‌కు బిల్లులు రావాల్సి ఉంద‌ని పేర్కొంది. గ‌త మూడేళ్ల‌లో ఇచ్చిన నిధుల‌ను స‌క్ర‌మంగానే అమ‌లు చేసిన‌ట్టు రాష్ట్ర ప్ర‌భుత్వం తెలిపిన‌ట్టు చెప్పింది. అదేవిధంగా గ‌త మూడేళ్ల‌లో కాంక్రీటు ప‌నులు 5 శాతం మేర‌కు జ‌రిగాయ‌ని.. వివ‌రించింది.

అదేవిధంగా.. పోల‌వ‌రం ప్రాజెక్టు తొలి ద‌శ ప‌నుల‌ను 2026 మార్చి నాటికి పూర్తి చేయ‌నున్న‌ట్టు కేంద్రం వెల్ల‌డించింది. అయితే.. పూర్తిస్థాయిలో ప్రాజెక్టు నిర్మాణం ఎప్పుడు పూర్త‌వుతుంద‌నే వివ‌రాలు వెల్ల‌డించేందుకు స‌మ‌యం ప‌డుతుంద‌ని ప్ర‌స్తుతం ప్రాజెక్టు ప‌రిస్థితి అగ‌మ్యగోచ‌రంగా(నాన్ కాన్షియ‌స్‌నెస్‌) ఉంద‌ని కేంద్ర ప్ర‌భుత్వం వివ‌రించింది. అయిన‌ప్ప‌టికీ.. ప‌నులు చేసేందుకు కేంద్రం క‌ట్టుబ‌డి ఉంద‌ని తెలిపింది.

This post was last modified on July 26, 2024 3:00 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

కాలర్ లాంటి కంటెంట్ ఉంటే చాలు

మార్చి 19 విడుదల కాబోతున్న ఉస్తాద్ భగత్ సింగ్ నుంచి 'మెడ ముట్టుకుంటే తొడ కొట్టినట్టే' పాట వచ్చినప్పుడు పాజిటివిటీ…

17 minutes ago

‘అటవీశాఖ అధికారులను కిడ్నాప్ చెయ్యాలి’

అమరావతిలో జరిగిన కలెక్టర్ల సదస్సులో అటవీ శాఖ అధికారుల పనితీరుపై సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ…

1 hour ago

కష్టాల నాయకుడికి ‘ప్రైమ్’ షాకు ?

రాజకీయాలంటే అంతే. అడుగుపెట్టాక చాలా బురదను కడుక్కోవాల్సి ఉంటుంది. కొందరు తట్టుకుంటారు. కొందరు వదిలేస్తారు. చిరంజీవి ప్రజారాజ్యం విషయంలో ఎక్కడైతే…

1 hour ago

పవన్ ఫ్యాన్స్ బాధ అర్థం చేసుకున్నారు

అభిమానులందు పవన్ అభిమానులు వేరయా అంటే అందులో అతిశయోక్తి ఏమీ లేదు. ఆయనకున్న లాయల్ ఫ్యాన్ బేస్ ఇండియా మొత్తంలో…

3 hours ago

అక్షయ్ కామెడీ… ఇప్పుడు పండుతుందా?

​బాలీవుడ్ ఖిలాడీ అక్షయ్ కుమార్ ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద సరైన సక్సెస్ కోసం ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో తనకి ఎన్నో…

3 hours ago

మార్కెటింగ్ అవసరం లేని కొత్త పాఠం

వందల కోట్లతో ప్యాన్ ఇండియా మూవీస్ తీస్తున్నప్పుడు పెద్ద ఎత్తున ప్రమోషన్లు అవసరం. ఎవరికైనా ఇది తప్పదు. ఎప్పుడో 2027…

4 hours ago