Political News

జగన్ అరాచక పాలనపై చంద్రబాబు శ్వేతపత్రం

ఏపీ అసెంబ్లీ సమావేశాల సందర్భంగా గత ప్రభుత్వం చేసిన అవకతవకలపై ప్రభుత్వం శ్వేత పత్రాలు విడుదల చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే మద్యంపై శ్వేత పత్రాలు విడుదల చేసిన సీఎం చంద్రబాబు…తాజాగా సభలో శాంతి భద్రతల అంశంపై శ్వేతపత్రం విడుదల చేశారు. ఈ క్రమంలోనే సభలో చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. రాయలసీమలో ఫ్యాక్షనిజం లేకుండా పోవడానికి టీడీపీనే కారణమని స్పష్టం చేశారు. కానీ, గత వైసీపీ ప్రభుత్వ పాలనలో ప్రజలు మానసికంగా, శారీరకంగా మనోవేదన అనుభవించారని విమర్శించారు.

పోలీసుల అండతో ప్రజాస్వామ్య పునాదులపైనే దాడులు జరిగాయని ఆరోపించారు. ప్రభుత్వ కక్ష సాధింపు చర్యలకు పోలీసులు ఆయుధంగా మారారని అన్నారు. గతం ప్రభుత్వంలో వైసీపీ నేతలతో పోలీసులు కుమ్మక్కయ్యారని, నిబంధనలు ఉల్లంఘించారని ఆరోపించారు. ఐదేళ్ల పాటు వీఆర్ లోనే కొందరు పోలీసు అధికారులు కూడా ఉన్నారంటూ ఏబీవీ గురించి పరోక్షంగా ప్రస్తావించారు. టీడీపీ హయాంలో గతంలో హైదరాబాదులో మత కల్లోలాలను ఉక్కుపాదంతో అణచివేశామని అన్నారు.

గతంలో తనపై బాబ్లీ కేసు ఒక్కటే ఉండేదని, జగన్ పాలనలో తనపై 17 కేసులు, పవన్ కల్యాణ్ పై 7 కేసులు పెట్టారని తెలిపారు. జేసీ ప్రభాకర్ రెడ్డిపై 60కి పైగా కేసులు పెట్టారని, ప్రతిపక్ష నేతలను అణచివేశారని ఆరోపించారు. సంగం డెయిరీలో అక్రమాలంటూ ధూళిపాళ్ల నరేంద్రను జైల్లో పెట్టారని, పులివెందులలో పోటీ చేసిన బీటెక్ రవిని జైల్లో పెట్టారని మండిపడ్డారు.

ఫర్నిచర్ తీసుకువెళ్లారని ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో అవమానంగా భావించిన కోడెల ఆత్మహత్యకు పాల్పడ్డారని భావోద్వేగానికి గురయ్యారు. గత ప్రభుత్వంలోని ఫర్నిచర్ జగన్ ఇంట్లో లేదా అని ప్రశ్నించారు.

రఘురామకృష్ణరాజును లాకప్ లో పెట్టి దారుణంగా చిత్రహింసల పాల్జేశారని, ఆ వీడియో చూసి అప్పటి ముఖ్యమంత్రి పైశాచిక ఆనందం పొందడాన్ని ఏమనాలని ప్రశ్నించారు.

జగన్ ప్రభుత్వం అమరావతి రైతులను, మహిళలను కనీసం మనుషులుగా కూడా చూడలేదని, కేసులు, అరెస్ట్ లే కాదు, కనీసం తిండి కూడా తిననివ్వకుండా చేసిన చరిత్ర నాటి ప్రభుత్వానిదని మండిపడ్డారు.

వివేకా హత్య జరిగితే..గుండెపోటు అని, ఆ తర్వాత హత్య అఅని అన్నారని, అవినాశ్ రెడ్డిని అరెస్ట్ చేసేందుకు సీబీఐ వెళితే అడ్డుకున్నారని ఆరోపించారు. నాలుగు దశాబ్దాల నా రాజకీయ చరిత్రలో జగన్ వంటి వ్యక్తిని ఎప్పుడూ చూడలేదని విమర్శించారు. జగన్ వంటి వ్యక్తులు రాజకీయాల్లో ఉండేందుకు అనర్హుడని, అటువంటి వ్యక్తి రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షీణించాయంటూ ఢిల్లీలో నిరసనలు తెలుపుతున్నారని ఎద్దేవా చేశారు.

అసెంబ్లీలో తనకు జరిగిన అన్యాయానికి కన్నీళ్లు పెట్టుకున్నానని, ప్రాణసమానులైన కార్యకర్తలను కోల్పోయానని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజలు తమకు అధికారం ఇచ్చింది కక్ష సాధింపుల కోసం కాదని, శాంతి భద్రతలకు విఘాతం కలిగించే వ్యక్తి ఏ స్థాయిలో ఉన్నా శిక్షిస్తామని అన్నారు. వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో శాంతిభద్రతలపై ప్రత్యేక చర్చ చేపడతామని అన్నారు.

This post was last modified on July 26, 2024 2:50 am

Share
Show comments

Recent Posts

చంద్రబాబును కలిసిన కాంగ్రెస్ మంత్రి

ఉండవల్లిలోని చంద్రబాబు క్యాంపు కార్యాలయానికి తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఈ రోజు వెళ్లారు. తెలంగాణ రైజింగ్ సమిట్‌కు…

46 minutes ago

సైకో హంతకుడిగా నటించిన స్టార్ హీరో

మలయాళం మెగాస్టార్ గా అభిమానులు పిలుచుకునే మమ్ముట్టి కొత్త సినిమా కలం కవల్ ఇవాళ ప్రేక్షకుల ముందుకొచ్చింది. అఖండ 2…

1 hour ago

ఎంగేజ్మెంట్ తర్వాత ఆమె చేతికి రింగ్ లేదేంటి?

టీమిండియా స్టార్ క్రికెటర్ స్మృతి మంధాన పెళ్లి ఆగిపోవడం అభిమానులను నిరాశపరిచింది. తండ్రి ఆరోగ్యం బాగోలేకపోవడంతో నవంబర్ 23న జరగాల్సిన…

1 hour ago

కాసేపు క్లాస్ రూములో విద్యార్థులుగా మారిన చంద్రబాబు, లోకేష్

పార్వతీపురం మన్యం జిల్లా, భామినిలో నేడు నిర్వహించిన మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు,…

2 hours ago

పవన్ కల్యాణ్ హీరోగా… టీడీపీ ఎమ్మెల్యే నిర్మాతగా…

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తెలుగులో ఎన్నో విజయవంతమైన చిత్రాలు వచ్చాయి. తొలినాళ్లలో తీసిన చాలా సినిమాలు బ్లాక్ బస్టర్…

3 hours ago

రష్యా vs ఉక్రెయిన్ – ఇండియా ఎవరివైపో చెప్పిన మోడీ

ప్రపంచమంతా ఉత్కంఠగా ఎదురుచూస్తున్న సమావేశం ఢిల్లీలోని హైదరాబాద్ హౌస్‌లో జరిగింది. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, భారత ప్రధాని నరేంద్ర…

3 hours ago