Political News

బిల్లులు ఇచ్చారు.. డ‌బ్బులే రాలేదు..మ‌రో వైట్ పేప‌ర్‌

ఏపీలో గ‌త వైసీపీ పాల‌న‌కు సంబంధించి జ‌రిగిన ప‌లు విష‌యాల‌పై ప్ర‌స్తుత కూట‌మి ప్ర‌భుత్వం శ్వేత‌ప త్రాల‌ను విడుద‌ల చేస్తున్న విష‌యం తెలిసిందే. ఈ క్ర‌మంలో తాజాగా వైసీపీ హ‌యాంలో జ‌రిగిన ఆర్థిక అవ‌క‌త‌వ‌క‌ల‌కు సంబంధించిన శ్వేత‌ప‌త్రాన్ని ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశ‌వ్ అసెంబ్లీలో ప్ర‌వేశ పెట్టారు. ఈ సంద‌ర్బంగా కొన్ని కీల‌క విష‌యాల‌ను ఆయ‌న వెల్ల‌డించారు. గ‌త వైసీపీ ప్ర‌భుత్వం బిల్లులు ఇచ్చినా.. డ‌బ్బులు ఇవ్వ‌లేద‌ని తెలిపారు.

దీంతో అనేక సంస్థ‌లు, కాంట్రాక్ట‌ర్లు ఇబ్బందులు ప‌డ్డార‌ని ప‌య్యావుల తెలిపారు. మొత్తంగా రూ.ల‌క్షా 41 వేల 588 కోట్ల మేర‌కు బిల్లుల పెండింగు ఉన్న‌ట్టు లెక్క తేలిన‌ట్టు చెప్పారు. వీరిలో ఉద్యోగులు కూడా ఉన్నార‌ని తెలిపారు. వారికి ఇవ్వాల్సిన డీఏల‌ను కూడా ఇవ్వ‌లేద‌న్నారు. అదేవిదంగా కాంట్రాక్ట‌ర్ల‌కు.. 93 వేల కోట్ల మేర‌కు బ‌కాయిలు ఉన్నాయని తెలిపారు. వీటిని ఇచ్చిన‌ట్టుగా చూపించినా.. ఎక్క‌డా ఇచ్చిన‌ట్టు రుజువు లేద‌ని చెప్పారు.

మ‌రిన్ని వివ‌రాలు..

  • మొత్తం పెండింగు బ‌కాయిలు: రూ.1,41,588 కోట్లు
  • రూ.93 వేల కోట్లు సీఎఫ్ఎంఎస్‌లోకి అప్ లోడ్ చేయలేదు.
  • రూ.48 వేల కోట్ల కు సంబంధించిన‌ బిల్లులు సీఎఫ్ ఎంఎస్‌లోకి అప్ లోడ్ చేసినా నిధులు విడుద‌ల చేయ‌లేదు.
  • భారీగా పెండింగు పెట్టిన శాఖ‌లు నీటి పారుదల శాఖ, పోలవరం ప్రాజెక్టు ప‌నుల‌కు
  • మ‌ధ్య త‌ర‌హా ప్రాజెక్టుల‌కు సంబంధించి పెండింగులో ఉన్న బ‌కాయిలు: రూ.19,324 కోట్లు
  • కేవ‌లం ఆర్థిక శాఖ వ‌ద్దే పెండింగులో ఉన్న బిల్లుల మొత్తం రూ.19,549 కోట్లు
  • పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ బ‌కాయిలు: రూ.14 వేల కోట్లు
  • మున్సిపల్ శాఖలో బ‌కాయిలు: రూ.7,700 కోట్లు.

This post was last modified on July 25, 2024 2:44 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

తేడా కొడుతోంది అనిరుధ్ భాయ్

సౌత్ మ్యూజిక్ లో సెన్సేషన్ అంటే అనిరుధ్ రవిచందర్ పేరే ముందు గుర్తొస్తుంది. తను పని చేస్తున్నాడని తెలిస్తే చాలు…

23 minutes ago

బీఆర్ఎస్‌లో పూర్తి ప్ర‌క్షాళ‌న… కారణమేంటి?

తెలంగాణ ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ పార్టీని ప్రక్షాళన చేసే దిశగా అడుగులు పడుతున్నాయి. పార్టీలో సంస్థాగతంగా పనిచేస్తున్న వారిని గత…

42 minutes ago

నియోజ‌క‌వ‌ర్గాల‌పై రేవంత్ కొత్త ఫార్ములా… వ‌ర్కువ‌ట్ అయ్యేనా?

2029 పార్ల‌మెంటు ఎన్నిక‌ల నాటికి దేశంలో నియోజ‌క‌వ‌ర్గాల‌ను పున‌ర్విభ‌జించాల‌ని కేంద్ర ప్ర‌భుత్వం ల‌క్ష్యంగా పెట్టుకున్న విష‌యం తెలిసిందే. ఇటు అసెంబ్లీ,…

4 hours ago

పెను సంక్షోభంలో ప్ర‌పంచం…!

అమెరికా - ఇరాన్ దేశాల మధ్య నెలకొన్న చర్చల ప్రతిష్టంభ‌న ప్రపంచ దేశాలను పెను సంక్షోభంలోకి నెట్టే దిశగా మారుతోందా?…

4 hours ago

రాష్ట్ర‌ప‌తికి బహుమతిగా మంగళగిరి చీర

భార‌త రాష్ట్ర‌ప‌తి ద్రౌప‌దిముర్ముతో ఏపీ మంత్రి, టీడీపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి నారా లోకేష్ భేటీ అయ్యారు. పార్టీకి చెందిన…

5 hours ago

ఏపీ కొత్త ఎన్నిక‌ల క‌మిష‌న‌ర్‌… వైసీపీకి షాకేనా?

ఏపీ రాష్ట్ర ఎన్నిక‌ల సంఘం క‌మిష‌న‌ర్ ప‌ద‌వి ఖాళీ అయింది. గ‌త నెల 31వ తేదీ వ‌ర‌కు ఉన్న రాష్ట్ర…

5 hours ago