ఏపీ దేవదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ శాంతికి పుట్టిన బిడ్డ వ్యవహారం అనేక మలుపులు తిరుగుతున్న విషయం తెలిసిందే. ఈ బిడ్డకు సుభాష్ రెడ్డి తండ్రి అని శాంతి చెబుతుంటే.. తాను కాదని సుభాష్ చెప్పేశాడు. ఇక, అసలు భర్త.. మదన్ మోహన్ మాత్రం శాంతికి పుట్టిన బిడ్డకు తండ్రి విజయసాయి రెడ్డేనని తేల్చి చెబుతున్నారు. దీనికి సంబంధించి ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశారు. రాష్ట్ర హోం మంత్రికి కంప్లయింట్ కూడా చేశారు.
సాయిరెడ్డే.. శాంతి బిడ్డకు తండ్రి అని మదన్ వాదన. ఈ క్రమంలో తాజాగా ఆయన ఢిల్లీలో ధర్నా చేపట్టారు. ఓ వైపు వైసీపీ అధినేత జగన్ ధర్నా చేస్తుంటే.. మరో పక్కన మదన్ కూడా మీడియాతో మాట్లాడుతూ.. ధర్నాకు కూర్చోవడం సంచలనంగా మారింది. సాయిరెడ్డికి డీఎన్ఏ టెస్ట్ చేయాల్సిందేనని ఆయన పట్టుబడుతున్నారు. చిత్రం ఏంటంటే.. జగన్ చేపట్టిన ధర్నాలో సాయిరెడ్డి కూడా పాల్గొన్న విషయం తెలిసిందే. ఈ ధర్నాకు సమీపంలోనే.. మదన్ కూడా పాల్గొన్నాడు.
ఇతర ప్రజాసంఘాల నాయకులతో కలసి జంతర్ మంతర్ వద్దకు వచ్చిన మదన్.. ధర్నా చేశారు. తన భార్య శాంతికి మాయ మాటలు చెప్పి విజయసాయిరెడ్డి మోసం చేశారని, బిడ్డకు ఆయనే తండ్రి అని వ్యాఖ్యానించాడు. ఈ నేపథ్యంలో సాయిరెడ్డి రాజ్యసభ సభ్వత్వాన్ని కూడా రద్దు చేయాలని.. డీఎన్ఏ టెస్టు చేయించాలని డిమాండ్ చేయడం గమనార్హం. అధికారాన్ని అడ్డం పెట్టుకుని తన భార్యతో అనేక చట్ట విరుద్ధమైన పనులు చేయించారని మదన్ చెప్పడం విశేషం. వేల కోట్ల విలువైన భూములను శాంతిని అడ్డుపెట్టుకుని దోచేశారని అన్నాడు.
ముదురుతున్న వివాదం..
శాంతి-బిడ్డ-తండ్రి- వ్యవహారం ముదురుతోంది. మదన్కు జాతీయ గిరిజన సంఘాలు సంఘీభావం ప్రక టించాయి. సాయిరెడ్డి రాజ్యసభ సభ్యత్వాన్ని రద్దు చేయాలని కోరుతూ.. సంఘాల జేఏసీ నేత సుభాష్ చంద్ర.. రాష్ట్రపతి ముర్ముకు వినతి పత్రం ఇవ్వనున్నట్టు తెలిపారు. అదేసమయంలో రాజ్యసభ చైర్మన్కు కూడా వినతిపత్రం ఇవ్వనున్నట్టు చెప్పారు. సాయిరెడ్డి డీఎన్ఏ టెస్టుకు రెడీ కావాలని డిమాండ్ చేశారు.
This post was last modified on July 25, 2024 7:05 am
శ్రీకాకుళం జిల్లా వైసీపీ నాయకుడు, మాజీ మంత్రి సీదిరి అప్పలరాజును జైల్లో పరామర్శించేందుకు వెళ్లిన వైసీపీ అధినేత జగన్.. అప్పలరాజును…
రాష్ట్రంలో ఎవరి దయాదాక్షిణ్యాలపైనా తాను ముఖ్యమంత్రిని కాలేదని.. 4 కోట్ల మంది ఓటర్లు ఓటేసి తనను గెలిపించుకున్నారని.. వారి ఆశీర్వాదం,…
తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి... పాలిటిక్స్ తో పాటు ఇతరత్రా అంశాలపైనా ఓ రేంజి అవగాహన కలిగిన నేతగా…
మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు తనయుడు ఆరవ్ యాక్సిడెంట్ చేయడంతో దానయ్య అనే గొర్రెల కాపరి మృతి చెందిన సంగతి…
తెలుగులో గత కొన్నేళ్లలో వచ్చిన ఉత్తమ ప్రేమకథా చిత్రాల్లో ‘అశోక వనంలో అర్జున కళ్యాణం’ ఒకటి. ఎక్కువగా అగ్రెసివ్ క్యారెక్టర్లు…
ప్రభాస్ అభిమానులకు పీడకలగా మిగిలిపోయిన ఆదిపురుష్ మరోసారి సోషల్ మీడియా టాపిక్ అయ్యింది. కారణం రామాయణ ట్రైలర్. రెండు సినిమాల్లో…