ఏపీ దేవదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ శాంతికి పుట్టిన బిడ్డ వ్యవహారం అనేక మలుపులు తిరుగుతున్న విషయం తెలిసిందే. ఈ బిడ్డకు సుభాష్ రెడ్డి తండ్రి అని శాంతి చెబుతుంటే.. తాను కాదని సుభాష్ చెప్పేశాడు. ఇక, అసలు భర్త.. మదన్ మోహన్ మాత్రం శాంతికి పుట్టిన బిడ్డకు తండ్రి విజయసాయి రెడ్డేనని తేల్చి చెబుతున్నారు. దీనికి సంబంధించి ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశారు. రాష్ట్ర హోం మంత్రికి కంప్లయింట్ కూడా చేశారు.
సాయిరెడ్డే.. శాంతి బిడ్డకు తండ్రి అని మదన్ వాదన. ఈ క్రమంలో తాజాగా ఆయన ఢిల్లీలో ధర్నా చేపట్టారు. ఓ వైపు వైసీపీ అధినేత జగన్ ధర్నా చేస్తుంటే.. మరో పక్కన మదన్ కూడా మీడియాతో మాట్లాడుతూ.. ధర్నాకు కూర్చోవడం సంచలనంగా మారింది. సాయిరెడ్డికి డీఎన్ఏ టెస్ట్ చేయాల్సిందేనని ఆయన పట్టుబడుతున్నారు. చిత్రం ఏంటంటే.. జగన్ చేపట్టిన ధర్నాలో సాయిరెడ్డి కూడా పాల్గొన్న విషయం తెలిసిందే. ఈ ధర్నాకు సమీపంలోనే.. మదన్ కూడా పాల్గొన్నాడు.
ఇతర ప్రజాసంఘాల నాయకులతో కలసి జంతర్ మంతర్ వద్దకు వచ్చిన మదన్.. ధర్నా చేశారు. తన భార్య శాంతికి మాయ మాటలు చెప్పి విజయసాయిరెడ్డి మోసం చేశారని, బిడ్డకు ఆయనే తండ్రి అని వ్యాఖ్యానించాడు. ఈ నేపథ్యంలో సాయిరెడ్డి రాజ్యసభ సభ్వత్వాన్ని కూడా రద్దు చేయాలని.. డీఎన్ఏ టెస్టు చేయించాలని డిమాండ్ చేయడం గమనార్హం. అధికారాన్ని అడ్డం పెట్టుకుని తన భార్యతో అనేక చట్ట విరుద్ధమైన పనులు చేయించారని మదన్ చెప్పడం విశేషం. వేల కోట్ల విలువైన భూములను శాంతిని అడ్డుపెట్టుకుని దోచేశారని అన్నాడు.
ముదురుతున్న వివాదం..
శాంతి-బిడ్డ-తండ్రి- వ్యవహారం ముదురుతోంది. మదన్కు జాతీయ గిరిజన సంఘాలు సంఘీభావం ప్రక టించాయి. సాయిరెడ్డి రాజ్యసభ సభ్యత్వాన్ని రద్దు చేయాలని కోరుతూ.. సంఘాల జేఏసీ నేత సుభాష్ చంద్ర.. రాష్ట్రపతి ముర్ముకు వినతి పత్రం ఇవ్వనున్నట్టు తెలిపారు. అదేసమయంలో రాజ్యసభ చైర్మన్కు కూడా వినతిపత్రం ఇవ్వనున్నట్టు చెప్పారు. సాయిరెడ్డి డీఎన్ఏ టెస్టుకు రెడీ కావాలని డిమాండ్ చేశారు.
This post was last modified on July 25, 2024 7:05 am
అభిమానుల్లోనే కాదు సినీ ప్రియుల్లోనూ విపరీతమైన అంచనాలు మోస్తున్న సినిమా పెద్ది. చికిరి చికిరి ఛార్ట్ బస్టర్ పుణ్యమాని హిందీలోనూ…
హైదరాబాద్లోని పంజాగుట్ట పోలీసులు యూట్యూబర్ అన్వేష్ (నా అన్వేషణ)పై లుకౌట్ నోటీసులు జారీ చేశారు. ప్రస్తుతం అన్వేష్ విదేశాల్లో ఉన్నారని…
ఏపీ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి నానాటికీ తీసికట్టుగా మారుతోందా? .. పార్టీ నాయకులు దీనస్థితిలో ఉన్నారా? అంటే.. ఔననే సమాధానమే…
ఇరాన్లో ప్రస్తుతం నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు అక్కడ వైద్య విద్యనభ్యసిస్తున్న భారతీయ విద్యార్థులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఒకవైపు అమెరికా…
ఇప్పుడు తెలుగులో వంద కోట్ల హీరోగా ఎదిగాడు నవీన్ పొలిశెట్టి. సంక్రాంతికి విడుదలైన తన చివరి చిత్రం అనగనగా ఒక…
2026 శర్వానంద్ కు చాలా స్పెషల్ ఇయర్ గా నిలవబోతోంది. సంక్రాంతి పండక్కు విపరీతమైన పోటీ మధ్య 'నారి నారి…