Political News

సాయిరెడ్డి డీఎన్ ఏ టెస్టు చేయాల్సిందే.. ఢిల్లీలో మ‌ద‌న్ ధ‌ర్నా

ఏపీ దేవ‌దాయ శాఖ అసిస్టెంట్ క‌మిష‌న‌ర్ శాంతికి పుట్టిన బిడ్డ వ్య‌వ‌హారం అనేక మ‌లుపులు తిరుగుతున్న విష‌యం తెలిసిందే. ఈ బిడ్డ‌కు సుభాష్ రెడ్డి తండ్రి అని శాంతి చెబుతుంటే.. తాను కాద‌ని సుభాష్ చెప్పేశాడు. ఇక‌, అస‌లు భ‌ర్త‌.. మ‌ద‌న్ మోహ‌న్ మాత్రం శాంతికి పుట్టిన బిడ్డకు తండ్రి విజ‌య‌సాయి రెడ్డేన‌ని తేల్చి చెబుతున్నారు. దీనికి సంబంధించి ఆయ‌న పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు. రాష్ట్ర హోం మంత్రికి కంప్ల‌యింట్ కూడా చేశారు.

సాయిరెడ్డే.. శాంతి బిడ్డ‌కు తండ్రి అని మ‌ద‌న్ వాద‌న‌. ఈ క్ర‌మంలో తాజాగా ఆయ‌న ఢిల్లీలో ధ‌ర్నా చేప‌ట్టారు. ఓ వైపు వైసీపీ అధినేత జ‌గ‌న్ ధ‌ర్నా చేస్తుంటే.. మ‌రో ప‌క్క‌న మ‌ద‌న్ కూడా మీడియాతో మాట్లాడుతూ.. ధ‌ర్నాకు కూర్చోవ‌డం సంచ‌ల‌నంగా మారింది. సాయిరెడ్డికి డీఎన్ఏ టెస్ట్ చేయాల్సిందేన‌ని ఆయ‌న ప‌ట్టుబ‌డుతున్నారు. చిత్రం ఏంటంటే.. జ‌గ‌న్ చేప‌ట్టిన ధ‌ర్నాలో సాయిరెడ్డి కూడా పాల్గొన్న విష‌యం తెలిసిందే. ఈ ధ‌ర్నాకు స‌మీపంలోనే.. మ‌ద‌న్ కూడా పాల్గొన్నాడు.

ఇతర ప్రజాసంఘాల నాయ‌కుల‌తో కలసి జంతర్ మంతర్ వద్దకు వ‌చ్చిన మ‌ద‌న్‌.. ధర్నా చేశారు. తన భార్య శాంతికి మాయ మాటలు చెప్పి విజయసాయిరెడ్డి మోసం చేశారని, బిడ్డ‌కు ఆయ‌నే తండ్రి అని వ్యాఖ్యానించాడు. ఈ నేప‌థ్యంలో సాయిరెడ్డి రాజ్య‌స‌భ స‌భ్వ‌త్వాన్ని కూడా ర‌ద్దు చేయాల‌ని.. డీఎన్ఏ టెస్టు చేయించాల‌ని డిమాండ్ చేయ‌డం గ‌మ‌నార్హం. అధికారాన్ని అడ్డం పెట్టుకుని తన భార్యతో అనేక చట్ట విరుద్ధమైన పనులు చేయించారని మ‌ద‌న్ చెప్ప‌డం విశేషం. వేల కోట్ల విలువైన భూముల‌ను శాంతిని అడ్డుపెట్టుకుని దోచేశార‌ని అన్నాడు.

ముదురుతున్న వివాదం..

శాంతి-బిడ్డ-తండ్రి- వ్య‌వ‌హారం ముదురుతోంది. మ‌ద‌న్‌కు జాతీయ గిరిజ‌న సంఘాలు సంఘీభావం ప్ర‌క టించాయి. సాయిరెడ్డి రాజ్య‌స‌భ స‌భ్య‌త్వాన్ని ర‌ద్దు చేయాల‌ని కోరుతూ.. సంఘాల జేఏసీ నేత సుభాష్ చంద్ర‌.. రాష్ట్ర‌ప‌తి ముర్ముకు విన‌తి ప‌త్రం ఇవ్వ‌నున్న‌ట్టు తెలిపారు. అదేస‌మ‌యంలో రాజ్య‌స‌భ చైర్మ‌న్‌కు కూడా విన‌తిప‌త్రం ఇవ్వ‌నున్న‌ట్టు చెప్పారు. సాయిరెడ్డి డీఎన్‌ఏ టెస్టుకు రెడీ కావాలని డిమాండ్ చేశారు.

This post was last modified on July 25, 2024 7:05 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

వైసీపీలా చెడ్డపేరు తెచ్చుకోవద్దు: పవన్ హెచ్చరిక

ఏపీలో మద్యం అమ్మకాల విషయంపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వ నిబంధనలను ఎవరూ పట్టించుకోవడం…

41 minutes ago

టాక్సిక్ ఎందుకు భయపడటం లేదు

దురంధర్ 2 ది రివెంజ్ దెబ్బకు అడివి శేష్ డెకాయిట్ వాయిదా పడింది. ఇదే రూటులో టాక్సిక్ కూడా మనసు…

1 hour ago

లడ్డూ తయారిలో 58 లక్షల లీటర్ల పామాయిల్?

సుప్రీం కోర్టు ఆదేశాల ప్రకారం తిరుమల లడ్డూలో కల్తీ నెయ్యి వ్యవహారంపై సీబీఐ ఆధ్వర్యంలో ఏర్పాటైన సిట్ నివేదిక వెల్లడైన…

2 hours ago

సింగర్ చిన్మ‌యిపై కేసు

సోష‌ల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉండే త‌మిళ గాయ‌ని, డ‌బ్బింగ్ ఆర్టిస్ట్ చిన్మ‌యిపై కేసు న‌మోదైంది. ఎక్స్‌లో ఆమె చేసిన…

2 hours ago

అన్నయ్య రూటులోనే బేబీ హీరో రిస్కు

రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ తమ్ముడిగా ఇండస్ట్రీకి వచ్చిన ఆనంద్ దేవరకొండని సక్సెస్ వరించడానికి టైం అయితే పట్టింది. బేబీ…

3 hours ago

ఏపీ సర్కారు వేసిన కమిషన్… దోషులను పట్టిస్తుందా?

తిరుమ‌ల శ్రీవారి ప‌విత్ర ల‌డ్డూ ప్ర‌సాదంలో క‌ల్తీ నెయ్యి వినియోగంపై ఇప్ప‌టికే సీబీఐ నేతృత్వంలోని ప్ర‌త్యేక ద‌ర్యాప్తు బృందం విచార‌ణ…

3 hours ago