Political News

రచ్చరచ్చ చేసిన రంజిత్ రెడ్డి

ఒకవైపు ప్రపంచ వ్యాప్తంగా ఏం జరుగుతుందో పరిశీలిస్తూనే మరోవైపు క్షణక్షణం తెలంగాణలో పరిస్థితులను సమీక్షిస్తున్న కేసీఆర్ ఎట్టి పరిస్థితుల్లోను ఇతర పెద్ద రాష్ట్రాల కంటే ముందుగా తెలంగాణ నుంచి కరోనా తరిమేయాలనే లక్ష్యంతో ఉన్నారు. ఈ సంక్షోభాన్ని అవకాశంగా మలచుకుని సమర్థతను చాటుకుంటే భవిష్యత్తులో ఇన్వెస్టర్లు తమ వైపు చూస్తారన్న ఆలోచనతో ముఖ్యమంత్రి కేసీఆర్ నిరంతర ప్రణాళిక రచిస్తున్నారు. అయితే, అనుకోని విధంగా ఆయన ఆలోచనకు ఆయన పార్టీ నేతే గండి కొట్టే ప్రయత్నం అప్రయత్నంగా చేశారు.

చేవెళ్ల ఎంపీ రంజిత్ రెడ్డి టీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా హైటెక్ కన్వెన్షన్ సెంటర్లో కూరగాయలు, సరుకులు పంచుతున్నట్టు ప్రకటించారు. అయితే… ఆ పంపిణీ లాక్ డౌన్ నిబంధనలకు అనుగుణంగా జరపాల్సిన ప్లానింగ్ మాత్రం పట్టించుకోలేదు. బహుశా అందరికీ ఇస్తాం కాబట్టి ప్రజలు లైన్లో వస్తారనే భావనతో, అవగాహనతో ఉన్నారనుకున్నారో ఏమో ఆ ఏర్పాట్లేమీ చేయకుండా పెద్ద ఎత్తున కూరగాయలను, సరుకులను వాహనాల్లో అక్కడికి తెచ్చారు.

ఈ క్రమంలో పేదలు తమకు దక్కుతాయో లేదో అన్న ఆందోళనతో ఎగబడ్డారు. ఈ క్రమంలో గందరగోళానికి దారితీసింది. పెద్ద ఎత్తున జనం గుమిగూడి తోసుకుంటూ వాటికోసం చేతులు చేశారు. అప్పుడు కూడా దీనిని గమనించి తగిన ఏర్పాట్లు చేయకుండా వాహనాల నుంచే సరుకులను విసరడం మొదలుపెట్టారు. ఈ క్రమంలో సామాజిక దూరం అనేదే జీరో అయిపోయింది. అసలే హైదరాబాదులో కరోనా బలంగా ఉన్న నేపథ్యంలో ఇలాంటి పని ఏ ప్రమాదానికి దారితీస్తుందో అని ఆందోళన చెందే పరిస్థితి. ఇన్నాళ్లు ఏపీలో కనిపించిన సీను ఇపుడు హైదరాబాదులో కనిపించి జనాల్ని ఉలిక్కిపడేలా చేసింది. అధినేతతో ఎంపీకి ఈరోజు చీవాట్లు తప్పేలా లేవు. ఇక నుంచైనా ఇవి జరగకుండా చూసుకోవడం ఆయా నాయకుల బాధ్యత.

This post was last modified on April 27, 2020 8:00 pm

Share
Show comments

Recent Posts

దురంధర్ భామకు దశ తిరుగుతోంది

ఇటీవలే విడుదలైన బాలీవుడ్ మూవీ దురంధర్ అంచనాలకు మించి ఆడేస్తోంది. మరీ జవాన్, పఠాన్ రేంజులో కాదు కానీ రణ్వీర్…

2 hours ago

అఖండ-2… కొత్త హైప్… కొత్త ట్రైలర్?

గత వారం రావాల్సిన అఖండ-2.. నిర్మాతలకు, ఈరోస్ సంస్థకు మధ్య ఉన్న పాత ఫైనాన్స్ వివాదం కోర్టుకు చేరడంతో అనూహ్యంగా…

3 hours ago

సూర్య, గిల్‌.. ఒక్క రోజు హిట్టు.. పది రోజులు ఫట్టు

కటక్‌లో జరిగిన టీ20 మ్యాచ్‌లో టీమిండియా 101 పరుగుల భారీ విజయం సాధించినా, సోషల్ మీడియాలో మాత్రం కెప్టెన్ సూర్యకుమార్…

3 hours ago

నాగార్జున మీద రీసెర్చ్ చేయాలన్న సేతుపతి

అక్కినేని నాగార్జున ప్రస్తుతం 67వ పడిలో ఉన్నారు. ఆయన ఎవరో తెలియని వాళ్లకు ఆయన్ని చూపించి తన వయసెంత అంటే 40-45 మధ్య చెబుతారేమో. నిజానికి ఆ…

4 hours ago

రాష్ట్రంలో జోన్లు, రీజియన్లు, కారిడార్లు, క్లస్టర్లు, హబ్‌లు

ఏపీ సీఎం చంద్ర‌బాబు కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. రాష్ట్రాన్ని త్వ‌ర‌లోనే జోన్లు, రీజియన్లు, కారిడార్లు, క్లస్టర్లు, హబ్‌లుగా విభజించుకుని అభివృద్ధి…

4 hours ago

మోగ్లీకి ఊహించని పరీక్ష

బాక్సాఫీస్ పరిణామాలు సస్పెన్స్ థ్రిల్లర్ తరహాలో మలుపులు తిరుగుతున్నాయి. డిసెంబర్ 5 అఖండ 2 వాయిదా పడింది. క్రిస్మస్ కు…

4 hours ago