సుఖాల్లో ఉన్నప్పుడు.. బంధువులు కనిపిస్తే.. కష్టాల్లో వారి సాయం అందుతుంది. సుఖాల్లో ఉన్నప్పుడు.. చేతినిండా సొమ్ములు ఉన్నప్పుడు.. బంధువులను దూరం పెట్టి.. తూలనాడిన తర్వాత..కష్టాల్లో వారిని రమ్మంటే వస్తారా? – అచ్చంగా ఇలానే ఉంది .. వైసీపీ అధినేత మాజీ సీఎం జగన్ పరిస్థితి. అధికారంలో ఐదు సంవత్సరాలు ఉన్నప్పుడు.. ప్రతిపక్షాలను కనీసం పట్టించుకోలేదు. టీడీపీ, జనసేనల విషయాన్ని పక్కన పెడితే.. మిగిలిన కమ్యూనిస్టులు, కాంగ్రెస్ పార్టీ నాయకులను కూడా ఆయన కలవనివ్వలేదు.
పోలవరం ప్రాజెక్టు సహా.. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై అఖిల పక్షం వేయాలని.. ఆయా సమస్యలపై అధ్యయ నం చేసి.. కేంద్రానికి వెళ్దామని.. నిధులు తెచ్చుకుందామని కమ్యూనిస్టులు నెత్తీనోరూ కొట్టుకున్నారు. అయినా.. జగన్ వినిపించుకోలేదు. కనీసం.. ప్రభుత్వం మాట ఎత్తే అవకాశం కూడా లేకుండా చేశారు. అంతేకాదు.. రాష్ట్రంలో ఉన్నది.. ఉండబోయేది.. వైసీపీనేనని.. మరో పార్టీనే లేదని కూడా ఆయన పరివారంతో చెప్పించారు. దీంతో చేసేది లేక కమ్యూనిస్టులు.. ఇతర ప్రజాసంఘాలు మౌనంగా ఉన్నాయి.
కానీ, కాలం బలమైనది. ప్రజాతీర్పు మరింత కఠినంగా ఉంటుందనే విషయాన్ని వైసీపీ సహా అధినేత గుర్తెరగలేకపోయారు. ఇప్పుడు ప్రజాతీర్పు అనే జ్వాలల్లో వైసీపీ మాడి మసైపోయింది. ఇప్పుడు పార్టీని నిలబెట్టుకునేందుకు తన అస్థిత్వాన్ని నిలబెట్టుకునేందుకు జగన్ ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలోనే ఢిల్లీలో ధర్నాకు పిలుపునిచ్చారు. ఇక్కడ ఆయన ఓ సంచలన పిలుపునిచ్చారు. కలిసి వచ్చే పార్టీలను కలుపుకొని వెళ్దామని పార్టీ నాయకులకు చెప్పారు.
కానీ, ఇప్పుడు కలిసి వచ్చే పార్టీలు ఏవి? కలిసి నడిచే నాయకులు ఎవరు? అని చూసుకుంటే.. భూతద్దం పెట్టి వెతికినా.. ఎవరూ కనిపించడం లేదు. ఎందుకంటే. అధికారంలో ఉన్నప్పుడు.. కనీసం వారిని పలకరిస్తే కదా! ఇప్పుడు కలిసిరావడానికి? అలా చేయకుండా.. ఇప్పుడు తన కష్టాలను వారి కష్టాలుగా ప్రొజెక్టు చేసి.. అందరినీ కలుపుకొని వెళ్దామనే తన రాజకీయ ఎత్తుగడలకు లొంగేదెవరు? కలిసి కాలు కదిపేదెవరు? ఒక్కరంటే ఒక్కరు కూడా.. ముందుకు వచ్చే అవకాశం లేదు. ఏదేమైనా.. అధికారంలో ఉన్నపుడు నేలపై నడిచి ఉంటే.. అందరూ కలిసి వచ్చేవారు. కానీ..జగన్ చేసుకున్న పాపం.. ఇప్పుడు ఆయనను వెంటాడుతోంది.
This post was last modified on July 21, 2024 1:21 pm
కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీయే కూటమిని బలోపేతం చేసేందుకు.. రాబోయే రోజుల్లో మరింత ఐక్యంగా ముందుకు సాగేలా వ్యూహాత్మక అడుగులు…
తెలుగు సినీ అభిమానుల్లో ఎన్నెన్ని వర్గాలున్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అందులో ఒక వర్గానికి ఇంకో వర్గానికి అస్సలు…
ఒకప్పుడు హిందీ సినిమాలు తెలుగులోకి అనువాదం కావడం, ఇక్కడ పెద్ద స్థాయిలో రిలీజ్ కావడమే ఉండేది తప్ప.. తెలుగు చిత్రాలు…
మాజీ మంత్రి మల్లారెడ్డి స్టేజ్ ఎక్కారంటే, మైక్ అందుకున్నారు అంటే మెరుపులు మెరవాల్సిందే. అది రాజకీయ సభ అయినా.. సినిమా…
మన దేశంలో చాలా చోట్ల కోతుల బెడద ఉంది. అడవుల నరికివేత, పట్టణీకరణ నేపథ్యంలో కోతులు జనావాసాల మధ్యకు వచ్చాయి.…
అల్లు అర్జున్ అంటే ఒకప్పుడు మెగా హీరోల్లో ఒకడు. అతను మెగాస్టార్ చిరంజీవినో, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్నో పొగిడితేనో..…