సుఖాల్లో ఉన్నప్పుడు.. బంధువులు కనిపిస్తే.. కష్టాల్లో వారి సాయం అందుతుంది. సుఖాల్లో ఉన్నప్పుడు.. చేతినిండా సొమ్ములు ఉన్నప్పుడు.. బంధువులను దూరం పెట్టి.. తూలనాడిన తర్వాత..కష్టాల్లో వారిని రమ్మంటే వస్తారా? – అచ్చంగా ఇలానే ఉంది .. వైసీపీ అధినేత మాజీ సీఎం జగన్ పరిస్థితి. అధికారంలో ఐదు సంవత్సరాలు ఉన్నప్పుడు.. ప్రతిపక్షాలను కనీసం పట్టించుకోలేదు. టీడీపీ, జనసేనల విషయాన్ని పక్కన పెడితే.. మిగిలిన కమ్యూనిస్టులు, కాంగ్రెస్ పార్టీ నాయకులను కూడా ఆయన కలవనివ్వలేదు.
పోలవరం ప్రాజెక్టు సహా.. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై అఖిల పక్షం వేయాలని.. ఆయా సమస్యలపై అధ్యయ నం చేసి.. కేంద్రానికి వెళ్దామని.. నిధులు తెచ్చుకుందామని కమ్యూనిస్టులు నెత్తీనోరూ కొట్టుకున్నారు. అయినా.. జగన్ వినిపించుకోలేదు. కనీసం.. ప్రభుత్వం మాట ఎత్తే అవకాశం కూడా లేకుండా చేశారు. అంతేకాదు.. రాష్ట్రంలో ఉన్నది.. ఉండబోయేది.. వైసీపీనేనని.. మరో పార్టీనే లేదని కూడా ఆయన పరివారంతో చెప్పించారు. దీంతో చేసేది లేక కమ్యూనిస్టులు.. ఇతర ప్రజాసంఘాలు మౌనంగా ఉన్నాయి.
కానీ, కాలం బలమైనది. ప్రజాతీర్పు మరింత కఠినంగా ఉంటుందనే విషయాన్ని వైసీపీ సహా అధినేత గుర్తెరగలేకపోయారు. ఇప్పుడు ప్రజాతీర్పు అనే జ్వాలల్లో వైసీపీ మాడి మసైపోయింది. ఇప్పుడు పార్టీని నిలబెట్టుకునేందుకు తన అస్థిత్వాన్ని నిలబెట్టుకునేందుకు జగన్ ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలోనే ఢిల్లీలో ధర్నాకు పిలుపునిచ్చారు. ఇక్కడ ఆయన ఓ సంచలన పిలుపునిచ్చారు. కలిసి వచ్చే పార్టీలను కలుపుకొని వెళ్దామని
పార్టీ నాయకులకు చెప్పారు.
కానీ, ఇప్పుడు కలిసి వచ్చే పార్టీలు ఏవి? కలిసి నడిచే నాయకులు ఎవరు? అని చూసుకుంటే.. భూతద్దం పెట్టి వెతికినా.. ఎవరూ కనిపించడం లేదు. ఎందుకంటే. అధికారంలో ఉన్నప్పుడు.. కనీసం వారిని పలకరిస్తే కదా! ఇప్పుడు కలిసిరావడానికి? అలా చేయకుండా.. ఇప్పుడు తన కష్టాలను వారి కష్టాలుగా ప్రొజెక్టు చేసి.. అందరినీ కలుపుకొని వెళ్దామనే తన రాజకీయ ఎత్తుగడలకు లొంగేదెవరు? కలిసి కాలు కదిపేదెవరు? ఒక్కరంటే ఒక్కరు కూడా.. ముందుకు వచ్చే అవకాశం లేదు. ఏదేమైనా.. అధికారంలో ఉన్నపుడు నేలపై నడిచి ఉంటే.. అందరూ కలిసి వచ్చేవారు. కానీ..జగన్ చేసుకున్న పాపం.. ఇప్పుడు ఆయనను వెంటాడుతోంది.
This post was last modified on July 21, 2024 1:21 pm
ప్రముఖ సినీ నటుడు, వైసీపీ మాజీ నేత పోసాని కృష్ణ మురళి జైలు కష్టాలను ఎలాగోలా తప్పించుకున్నా… గుంటూరులోని సీఐడీ…
ఈ నెల విడుదల కాబోతున్న నోటెడ్ సినిమాల్లో ఓదెల 2 బిజినెస్ పరంగా మంచి క్రేజ్ సంపాదించుకుంది. టీజర్ రాక…
తెలంగాణ ఆర్టీసీలో కండక్టర్ గా పనిచేస్తున్న అమీన్ అహ్మద్ అన్సారీ నిజంగానే టికెట్లు కొట్టేందుకు పనికి రారు. టికెట్టు కొట్టడం…
వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్కు ఎదురైన పాఠాలే.. సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబుకు భవిష్యత్తు మార్గాలను చూపిస్తున్నాయా? ఆదిశగా…
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మంగళవారం ఉమ్మడి అనంతపురం జిల్లా రాప్తాడు నియోజకవర్గ పరిధిలోని రామవరం మండలం…
కేంద్రంలోని ఎన్డీఏ సర్కారు సోమవారం సంచలన నిర్ణయం తీసుకుంది. దేశవ్యాప్తంగా లిక్విఫైడ్ పెట్రోలియం గ్యాస్ (ఎల్పీజీ) గ్యాస్ ధరలను పెంచుతూ…