Political News

ఎవ‌రు క‌లుస్తారు? ఎవ‌రు వ‌స్తారు? జ‌గ‌న్ కు ఎదురీతే!

సుఖాల్లో ఉన్న‌ప్పుడు.. బంధువులు క‌నిపిస్తే.. క‌ష్టాల్లో వారి సాయం అందుతుంది. సుఖాల్లో ఉన్న‌ప్పుడు.. చేతినిండా సొమ్ములు ఉన్న‌ప్పుడు.. బంధువుల‌ను దూరం పెట్టి.. తూల‌నాడిన త‌ర్వాత‌..క‌ష్టాల్లో వారిని ర‌మ్మంటే వ‌స్తారా? – అచ్చంగా ఇలానే ఉంది .. వైసీపీ అధినేత మాజీ సీఎం జ‌గ‌న్ ప‌రిస్థితి. అధికారంలో ఐదు సంవ‌త్స‌రాలు ఉన్న‌ప్పుడు.. ప్ర‌తిప‌క్షాల‌ను క‌నీసం ప‌ట్టించుకోలేదు. టీడీపీ, జ‌న‌సేనల విష‌యాన్ని ప‌క్క‌న పెడితే.. మిగిలిన క‌మ్యూనిస్టులు, కాంగ్రెస్ పార్టీ నాయ‌కుల‌ను కూడా ఆయ‌న క‌ల‌వ‌నివ్వ‌లేదు.

పోల‌వ‌రం ప్రాజెక్టు స‌హా.. రాష్ట్ర ఆర్థిక ప‌రిస్థితిపై అఖిల ప‌క్షం వేయాల‌ని.. ఆయా స‌మ‌స్య‌ల‌పై అధ్య‌య నం చేసి.. కేంద్రానికి వెళ్దామ‌ని.. నిధులు తెచ్చుకుందామ‌ని క‌మ్యూనిస్టులు నెత్తీనోరూ కొట్టుకున్నారు. అయినా.. జ‌గ‌న్ వినిపించుకోలేదు. క‌నీసం.. ప్ర‌భుత్వం మాట ఎత్తే అవ‌కాశం కూడా లేకుండా చేశారు. అంతేకాదు.. రాష్ట్రంలో ఉన్న‌ది.. ఉండ‌బోయేది.. వైసీపీనేన‌ని.. మ‌రో పార్టీనే లేద‌ని కూడా ఆయ‌న ప‌రివారంతో చెప్పించారు. దీంతో చేసేది లేక క‌మ్యూనిస్టులు.. ఇత‌ర ప్ర‌జాసంఘాలు మౌనంగా ఉన్నాయి.

కానీ, కాలం బ‌ల‌మైనది. ప్ర‌జాతీర్పు మ‌రింత క‌ఠినంగా ఉంటుంద‌నే విష‌యాన్ని వైసీపీ స‌హా అధినేత గుర్తెర‌గ‌లేక‌పోయారు. ఇప్పుడు ప్ర‌జాతీర్పు అనే జ్వాల‌ల్లో వైసీపీ మాడి మ‌సైపోయింది. ఇప్పుడు పార్టీని నిల‌బెట్టుకునేందుకు త‌న అస్థిత్వాన్ని నిల‌బెట్టుకునేందుకు జ‌గ‌న్ ప్ర‌య‌త్నిస్తున్నారు. ఈ క్ర‌మంలోనే ఢిల్లీలో ధ‌ర్నాకు పిలుపునిచ్చారు. ఇక్క‌డ ఆయ‌న ఓ సంచ‌ల‌న పిలుపునిచ్చారు. క‌లిసి వ‌చ్చే పార్టీల‌ను క‌లుపుకొని వెళ్దామ‌ని పార్టీ నాయ‌కుల‌కు చెప్పారు.

కానీ, ఇప్పుడు క‌లిసి వ‌చ్చే పార్టీలు ఏవి? క‌లిసి న‌డిచే నాయ‌కులు ఎవ‌రు? అని చూసుకుంటే.. భూత‌ద్దం పెట్టి వెతికినా.. ఎవ‌రూ క‌నిపించ‌డం లేదు. ఎందుకంటే. అధికారంలో ఉన్న‌ప్పుడు.. క‌నీసం వారిని ప‌ల‌క‌రిస్తే క‌దా! ఇప్పుడు క‌లిసిరావ‌డానికి? అలా చేయ‌కుండా.. ఇప్పుడు త‌న క‌ష్టాల‌ను వారి క‌ష్టాలుగా ప్రొజెక్టు చేసి.. అంద‌రినీ క‌లుపుకొని వెళ్దామ‌నే త‌న రాజ‌కీయ ఎత్తుగ‌డ‌ల‌కు లొంగేదెవ‌రు? క‌లిసి కాలు క‌దిపేదెవ‌రు? ఒక్క‌రంటే ఒక్క‌రు కూడా.. ముందుకు వ‌చ్చే అవ‌కాశం లేదు. ఏదేమైనా.. అధికారంలో ఉన్న‌పుడు నేల‌పై న‌డిచి ఉంటే.. అంద‌రూ క‌లిసి వ‌చ్చేవారు. కానీ..జ‌గ‌న్ చేసుకున్న పాపం.. ఇప్పుడు ఆయ‌న‌ను వెంటాడుతోంది.

This post was last modified on July 21, 2024 1:21 pm

Share

Recent Posts

‘ఆదర్శ కుటుంబం’లో తుపాకుల కలకలం

టాలీవుడ్ మూవీ లవర్స్ ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న కాంబినేషన్ హీరో వెంకటేష్, దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ జంటది. రచయితగా…

19 minutes ago

గ్రీన్‌కార్డ్ ఎఫెక్ట్ వల్ల భారత్‌కు లాభమా?

అమెరికాలో గ్రీన్‌కార్డ్ కోసం ఏళ్ల తరబడి ఎదురుచూస్తున్న భారతీయులు తిరిగి స్వదేశానికి వస్తే భారత్‌కు భారీ లాభం జరుగుతుందా? ఇండియన్…

1 hour ago

‘డీసీ’కి ప్రాణం పోసిన ఆమెకు లేదా గిఫ్ట్?

పేరున్న హీరో హీరోయిన్లు లేకపోయినా.. ప్రి రిలీజ్ బజ్ కూడా పెద్దగా లేకపోయినా.. కంటెంట్‌తో ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకుని పెద్ద…

2 hours ago

విశ్వక్ సేన్ వేగం… 36 రోజుల్లో 3 సినిమాలు

ఇమేజ్, మార్కెట్ ఉన్న స్టార్లే కాదు అప్ కమింగ్ హీరోలకు సైతం ఏడాదికి ఒక సినిమా రిలీజ్ చేయడమే మహా…

2 hours ago

చూసుకుందాం అంటున్న స్పిరిట్ నిర్మాత‌

సందీప్ రెడ్డి వంగ‌నే కాదు.. ఆయ‌న సోద‌రుడు ప్ర‌ణ‌య్ రెడ్డి వంగ కూడా మామూలోడు కాద‌ని.. ఆయ‌న కాన్ఫిడెన్స్ లెవెల్…

3 hours ago

ఎన్నికల ఫలితాలపై AI ప్రభావం

AI వల్ల ఉద్యోగాలు, బ్యాంకింగ్, విద్య రంగాల్లో మార్పులు వస్తున్నాయనే ఆందోళన ఇప్పటికే ఉంది. ఇప్పుడు ఎన్నికలపైనా దీని ప్రభావం…

3 hours ago