Political News

ఎవ‌రు క‌లుస్తారు? ఎవ‌రు వ‌స్తారు? జ‌గ‌న్ కు ఎదురీతే!

సుఖాల్లో ఉన్న‌ప్పుడు.. బంధువులు క‌నిపిస్తే.. క‌ష్టాల్లో వారి సాయం అందుతుంది. సుఖాల్లో ఉన్న‌ప్పుడు.. చేతినిండా సొమ్ములు ఉన్న‌ప్పుడు.. బంధువుల‌ను దూరం పెట్టి.. తూల‌నాడిన త‌ర్వాత‌..క‌ష్టాల్లో వారిని ర‌మ్మంటే వ‌స్తారా? – అచ్చంగా ఇలానే ఉంది .. వైసీపీ అధినేత మాజీ సీఎం జ‌గ‌న్ ప‌రిస్థితి. అధికారంలో ఐదు సంవ‌త్స‌రాలు ఉన్న‌ప్పుడు.. ప్ర‌తిప‌క్షాల‌ను క‌నీసం ప‌ట్టించుకోలేదు. టీడీపీ, జ‌న‌సేనల విష‌యాన్ని ప‌క్క‌న పెడితే.. మిగిలిన క‌మ్యూనిస్టులు, కాంగ్రెస్ పార్టీ నాయ‌కుల‌ను కూడా ఆయ‌న క‌ల‌వ‌నివ్వ‌లేదు.

పోల‌వ‌రం ప్రాజెక్టు స‌హా.. రాష్ట్ర ఆర్థిక ప‌రిస్థితిపై అఖిల ప‌క్షం వేయాల‌ని.. ఆయా స‌మ‌స్య‌ల‌పై అధ్య‌య నం చేసి.. కేంద్రానికి వెళ్దామ‌ని.. నిధులు తెచ్చుకుందామ‌ని క‌మ్యూనిస్టులు నెత్తీనోరూ కొట్టుకున్నారు. అయినా.. జ‌గ‌న్ వినిపించుకోలేదు. క‌నీసం.. ప్ర‌భుత్వం మాట ఎత్తే అవ‌కాశం కూడా లేకుండా చేశారు. అంతేకాదు.. రాష్ట్రంలో ఉన్న‌ది.. ఉండ‌బోయేది.. వైసీపీనేన‌ని.. మ‌రో పార్టీనే లేద‌ని కూడా ఆయ‌న ప‌రివారంతో చెప్పించారు. దీంతో చేసేది లేక క‌మ్యూనిస్టులు.. ఇత‌ర ప్ర‌జాసంఘాలు మౌనంగా ఉన్నాయి.

కానీ, కాలం బ‌ల‌మైనది. ప్ర‌జాతీర్పు మ‌రింత క‌ఠినంగా ఉంటుంద‌నే విష‌యాన్ని వైసీపీ స‌హా అధినేత గుర్తెర‌గ‌లేక‌పోయారు. ఇప్పుడు ప్ర‌జాతీర్పు అనే జ్వాల‌ల్లో వైసీపీ మాడి మ‌సైపోయింది. ఇప్పుడు పార్టీని నిల‌బెట్టుకునేందుకు త‌న అస్థిత్వాన్ని నిల‌బెట్టుకునేందుకు జ‌గ‌న్ ప్ర‌య‌త్నిస్తున్నారు. ఈ క్ర‌మంలోనే ఢిల్లీలో ధ‌ర్నాకు పిలుపునిచ్చారు. ఇక్క‌డ ఆయ‌న ఓ సంచ‌ల‌న పిలుపునిచ్చారు. క‌లిసి వ‌చ్చే పార్టీల‌ను క‌లుపుకొని వెళ్దామ‌ని పార్టీ నాయ‌కుల‌కు చెప్పారు.

కానీ, ఇప్పుడు క‌లిసి వ‌చ్చే పార్టీలు ఏవి? క‌లిసి న‌డిచే నాయ‌కులు ఎవ‌రు? అని చూసుకుంటే.. భూత‌ద్దం పెట్టి వెతికినా.. ఎవ‌రూ క‌నిపించ‌డం లేదు. ఎందుకంటే. అధికారంలో ఉన్న‌ప్పుడు.. క‌నీసం వారిని ప‌ల‌క‌రిస్తే క‌దా! ఇప్పుడు క‌లిసిరావ‌డానికి? అలా చేయ‌కుండా.. ఇప్పుడు త‌న క‌ష్టాల‌ను వారి క‌ష్టాలుగా ప్రొజెక్టు చేసి.. అంద‌రినీ క‌లుపుకొని వెళ్దామ‌నే త‌న రాజ‌కీయ ఎత్తుగ‌డ‌ల‌కు లొంగేదెవ‌రు? క‌లిసి కాలు క‌దిపేదెవ‌రు? ఒక్క‌రంటే ఒక్క‌రు కూడా.. ముందుకు వ‌చ్చే అవ‌కాశం లేదు. ఏదేమైనా.. అధికారంలో ఉన్న‌పుడు నేల‌పై న‌డిచి ఉంటే.. అంద‌రూ క‌లిసి వ‌చ్చేవారు. కానీ..జ‌గ‌న్ చేసుకున్న పాపం.. ఇప్పుడు ఆయ‌న‌ను వెంటాడుతోంది.

This post was last modified on July 21, 2024 1:21 pm

Share

Recent Posts

హాలీవుడ్ సినిమాలకు మళ్ళీ మంచి రోజులు

ఒకప్పుడు ఇంగ్లీష్ సినిమాలకు మన దేశంలో తెగ క్రేజ్ ఉండేది. జురాసిక్ పార్క్ నుంచి ఇది విపరీతంగా పెరిగిపోయింది. దానికి…

2 hours ago

గండాన్ని దాటిన చెన్నై లవ్ స్టోరీ

గత వారం విడుదలైన ‘చెన్నై లవ్ స్టోరీ’ సినిమా ఫుల్ పాజిటివ్ టాకేమీ తెచ్చుకోలేదు. ప్రిమియర్స్ నుంచే డివైడ్ టాక్ మొదలైంది.…

2 hours ago

మోదీ కాళ్లు కడిగి ఆ నీళ్లు తాగాలని ఉంది: నటుడు

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని విష్ణుమూర్తి అవతారంగా ప్రముఖ బాలివుడ్ నటుడు సుదేష్ బెర్రీ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో…

3 hours ago

కనకరాజు సీమలో కొరియన్ దెయ్యం

బలమైన కంబ్యాక్ కోసం ఎదురు చూస్తున్న మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ఆశలన్నీ కొరియన్ కనకరాజు మీదే ఉన్నాయి. ఆగస్ట్…

3 hours ago

“కొబ్బరికాయ కొట్టాం… గుమ్మడి కాయ కట్టాం”

ఏపీ దశ దిశలను మార్చేసే భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం శనివారం ఉదయం లాంఛనంగా ప్రారంబమైంది. దేశ ప్రధాని నరేంద్ర మోదీ అల్లూరి సీతారామరాజు…

4 hours ago

దేశం కోసం కష్టపడే ప్రధాని మోదీపై విమర్శలా

జంతర్ మంతర్ ఆందోళనలో ప్రధాని మోదీపై విమర్శలు చేయడం కన్నీళ్లు తెప్పించిందని, పండ్లు కాసే చెట్టుపైకి రాళ్లేస్తారని, దేశం కోసం…

4 hours ago