ఏపీ మాజీ సీఎం, వైసీపీ అధినేత జగన్ సహనానికి పరీక్ష ఎదురు కానుంది. రాష్ట్ర అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు.. ఈ నెల 23వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. 25న బడ్జెట్ను ప్రవేశ పెట్టనున్నారు. ఆగస్టు-మార్చి-2025 వరకు ఏడు మాసాల కాలానికి మధ్యంతర(ఇంటీరియం) బడ్జెట్ను ప్రవేశ పెట్టేందుకు చంద్రబాబు సర్కారు రెడీ అయింది. అయితే.. ప్రభుత్వం పక్షం పరిస్థితి ఎలా ఉన్నప్పటికీ.. అధికారం కోల్పోయి.. కనీసం ప్రతిపక్ష హోదా కూడా దక్కని వైసీపీ పరిస్థితిపైనా.. ముఖ్యంగా ఆ పార్టీ అధినేత జగన్ వ్యవహార శైలిపైనా రాష్ట్ర వ్యాప్తంగా ఆసక్తి నెలకొంది.
వాస్తవానికి ప్రధాన ప్రతిపక్ష హోదా కోసం.. జగన్ స్పీకర్ అయ్యన్న పాత్రుడికి లేఖ రాశారు. ఇది జరిగి మూడు వారాలైనా స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ప్రజలే ప్రతిపక్ష హోదా ఇవ్వనప్పుడు తామెలా ఇస్తామని మంత్రులు ఒకరిద్దరు వ్యాఖ్యానించా రు. ఇక, సీఎం చంద్రబాబు ఈ విషయంలో చాలా వ్యూహాత్మక మౌనం పాటిస్తున్నారు. ఈ నేపథ్యంలో సభకు హాజరయ్యే విషయంలో వైసీపీ డోలాయమానంలో పడినా.. మేధావుల సూచనల మేరకు.. సభకు హాజరవ్వాలనే నిర్ణయించుకున్నారని తెలుస్తోంది. అయితే.. 11 మంది ఎమ్మెల్యేలు మాత్రమే ఉన్న వైసీపీ పరిస్థితి సభలో ఎలా ఉంటుంది? మాట్లాడేందుకు అవకాశం ఉంటుందా? ఉండదా? అనేది సందేహాలు.
సహజంగా సభాపతి స్పీకర్ స్థానంలో ఉన్న వ్యక్తిపైనే ఈ నిర్ణయం ఆధారపడి ఉంటుంది. స్పీకర్ తీసుకునే నిర్ణయమే అంతిమంగా విపక్షానికి అవకాశం వచ్చేలా చేస్తుంది. సంఖ్యాబలం ఉన్నా.. మైకు ఇవ్వని సందర్భాలు అనేకం ఉన్నాయి. సంఖ్యా బలం లేకపోయినా.. మాట్లాడే సబ్జెక్టు ఆధారంగా మైకు తీసుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఒక గంట సమయాన్ని స్పీకర్ వెచ్చించాలని అనుకుంటే.. దీనిలో 50 నిమిషాల పాటు.. అధికార పార్టీకే ఇస్తారు. చివరి 10 నిమిషాలు మాత్రమే ఇప్పుడున్న పరిస్థితిలో (11 మంది సభ్యులు) వైసీపీకి దక్కే అవకాశం ఉంటుంది. అది కూడా.. సభలో అందరూ మాట్లాడడం అయిపోయిన తర్వాతే!
అయితే.. అప్పటి వరకు జగన్ వేచి ఉండాలా? అంటే.. తప్పదు! ఓపిక, సహనం వంటివి ఇప్పుడు జగన్కు అవసరం. సమయం ఇచ్చే వరకు వేచి ఉండాలి. ఒక్కొక్కసారి సమయం చిక్కకపోయినా.. మాట్లాడుతున్న రెండు నిమిషాల్లోనే మైకు కట్ చేసినా.. భరించాలి. అలాకాదు.. సభకు వెళ్లనని అంటే.. ప్రజాస్వామ్య స్ఫూర్తికి విఘాతం కలిగిస్తున్నారని.. ప్రజలు ఇచ్చిన తీర్పును గౌరవించలేకపోతున్నారనే వాదన బయలుదేరుతుంది. సో.. ఎలా చూసుకున్నా.. సభకు వెళ్లాల్సిందే.. సహనంతో వ్యవహరించా ల్సిందే. అప్పుడే.. ఎంతో కొంత సింపతీ అయినా ఏర్పడుతుంది. లేకపోతే.. అసలు నాయకుడిగా కూడా.. ఆయన పనిచేస్తారా? అనే చర్చ వచ్చినా ఆశ్చర్యం లేదు. ఎలా చూసుకున్నా.. జగన్ కు ఇప్పటికిప్పుడు కావాల్సింది.. వ్యూహంతోపాటు సహనం. సంయమనం!! మరి ఏం చేస్తారో చూడాలి.
This post was last modified on July 21, 2024 11:24 am
రాజకీయాల్లో విమర్శలు చేయొచ్చు. ప్రతివిమర్శలు కూడా ఎదుర్కొనచ్చు. కానీ, ప్రతి విషయంలోనూ కొన్ని హద్దులు ఉంటాయి. ఎంత రాజకీయ పార్టీకి…
ఏపీలో బీజేపీ-టీడీపీ-జనసేన పొత్తు పెట్టుకుని గత 2024 ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన విషయం తెలిసిందే. ఇప్పటికి 17 మాసాలుగా ఈ…
తెలుగు ప్రేక్షకులకు ఎంతో ఇష్టమైన తమిళ స్టార్ ద్వయం సూర్య, కార్తి చాలా ఏళ్లుగా పెద్ద కమర్షియల్ హిట్ లేక…
భారత ఆర్థిక వ్యవస్థను ప్రభావితం చేసేది.. `రూపాయి మారకం విలువ`. ప్రపంచ దేశాలన్నీ దాదాపు అమెరికా డాలరుతోనే తమతమ కరెన్సీ…
తిరుమలలో పరకామణి చోరీ వ్యవహారంపై రెండు రోజుల కిందట ప్రెస్ మీట్ లో మాజీ సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలు…
ఎనభై తొంబై దశకంలో సినిమాలు చూసినవాళ్లకు బాగా పరిచయమున్న పేరు నందమూరి కళ్యాణ చక్రవర్తి. స్వర్గీయ ఎన్టీఆర్ సోదరుడు త్రివిక్రమరావు…