Political News

‘ప్ర‌ధాన‌ ప్ర‌తిప‌క్షం’ లేన‌ట్టే.. జ‌గ‌న్ స‌హ‌నానికి ప‌రీక్ష‌

ఏపీ మాజీ సీఎం, వైసీపీ అధినేత జ‌గ‌న్ స‌హ‌నానికి ప‌రీక్ష ఎదురు కానుంది. రాష్ట్ర అసెంబ్లీ బ‌డ్జెట్ స‌మావేశాలు.. ఈ నెల 23వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. 25న బ‌డ్జెట్‌ను ప్ర‌వేశ పెట్ట‌నున్నారు. ఆగ‌స్టు-మార్చి-2025 వ‌ర‌కు ఏడు మాసాల కాలానికి మ‌ధ్యంత‌ర‌(ఇంటీరియం) బడ్జెట్‌ను ప్ర‌వేశ పెట్టేందుకు చంద్ర‌బాబు స‌ర్కారు రెడీ అయింది. అయితే.. ప్ర‌భుత్వం పక్షం ప‌రిస్థితి ఎలా ఉన్న‌ప్ప‌టికీ.. అధికారం కోల్పోయి.. క‌నీసం ప్ర‌తిప‌క్ష హోదా కూడా ద‌క్క‌ని వైసీపీ పరిస్థితిపైనా.. ముఖ్యంగా ఆ పార్టీ అధినేత జ‌గ‌న్ వ్య‌వ‌హార శైలిపైనా రాష్ట్ర వ్యాప్తంగా ఆస‌క్తి నెల‌కొంది.

వాస్త‌వానికి ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష హోదా కోసం.. జ‌గ‌న్ స్పీక‌ర్ అయ్య‌న్న పాత్రుడికి లేఖ రాశారు. ఇది జ‌రిగి మూడు వారాలైనా స్పీక‌ర్ ఎలాంటి నిర్ణ‌యం తీసుకోలేదు. ప్ర‌జ‌లే ప్ర‌తిప‌క్ష హోదా ఇవ్వ‌నప్పుడు తామెలా ఇస్తామ‌ని మంత్రులు ఒక‌రిద్ద‌రు వ్యాఖ్యానించా రు. ఇక, సీఎం చంద్ర‌బాబు ఈ విష‌యంలో చాలా వ్యూహాత్మ‌క మౌనం పాటిస్తున్నారు. ఈ నేప‌థ్యంలో స‌భ‌కు హాజ‌ర‌య్యే విషయంలో వైసీపీ డోలాయ‌మానంలో ప‌డినా.. మేధావుల సూచ‌న‌ల మేర‌కు.. స‌భ‌కు హాజ‌ర‌వ్వాల‌నే నిర్ణ‌యించుకున్నార‌ని తెలుస్తోంది. అయితే.. 11 మంది ఎమ్మెల్యేలు మాత్ర‌మే ఉన్న వైసీపీ పరిస్థితి స‌భ‌లో ఎలా ఉంటుంది? మాట్లాడేందుకు అవ‌కాశం ఉంటుందా? ఉండ‌దా? అనేది సందేహాలు.

స‌హ‌జంగా స‌భాప‌తి స్పీక‌ర్ స్థానంలో ఉన్న వ్య‌క్తిపైనే ఈ నిర్ణ‌యం ఆధార‌ప‌డి ఉంటుంది. స్పీక‌ర్ తీసుకునే నిర్ణ‌య‌మే అంతిమంగా విప‌క్షానికి అవ‌కాశం వ‌చ్చేలా చేస్తుంది. సంఖ్యాబ‌లం ఉన్నా.. మైకు ఇవ్వ‌ని సంద‌ర్భాలు అనేకం ఉన్నాయి. సంఖ్యా బ‌లం లేక‌పోయినా.. మాట్లాడే స‌బ్జెక్టు ఆధారంగా మైకు తీసుకున్న సంద‌ర్భాలు కూడా ఉన్నాయి. ఈ నేప‌థ్యంలో ఒక గంట స‌మ‌యాన్ని స్పీక‌ర్ వెచ్చించాల‌ని అనుకుంటే.. దీనిలో 50 నిమిషాల పాటు.. అధికార పార్టీకే ఇస్తారు. చివ‌రి 10 నిమిషాలు మాత్ర‌మే ఇప్పుడున్న ప‌రిస్థితిలో (11 మంది స‌భ్యులు) వైసీపీకి ద‌క్కే అవ‌కాశం ఉంటుంది. అది కూడా.. స‌భ‌లో అంద‌రూ మాట్లాడ‌డం అయిపోయిన త‌ర్వాతే!

అయితే.. అప్ప‌టి వ‌ర‌కు జ‌గ‌న్ వేచి ఉండాలా? అంటే.. త‌ప్ప‌దు! ఓపిక‌, స‌హ‌నం వంటివి ఇప్పుడు జ‌గ‌న్‌కు అవ‌స‌రం. స‌మయం ఇచ్చే వ‌ర‌కు వేచి ఉండాలి. ఒక్కొక్క‌సారి స‌మ‌యం చిక్క‌క‌పోయినా.. మాట్లాడుతున్న రెండు నిమిషాల్లోనే మైకు క‌ట్ చేసినా.. భ‌రించాలి. అలాకాదు.. స‌భ‌కు వెళ్ల‌న‌ని అంటే.. ప్ర‌జాస్వామ్య స్ఫూర్తికి విఘాతం క‌లిగిస్తున్నార‌ని.. ప్ర‌జ‌లు ఇచ్చిన తీర్పును గౌర‌వించ‌లేక‌పోతున్నార‌నే వాద‌న బ‌య‌లుదేరుతుంది. సో.. ఎలా చూసుకున్నా.. స‌భ‌కు వెళ్లాల్సిందే.. స‌హ‌నంతో వ్య‌వ‌హ‌రించా ల్సిందే. అప్పుడే.. ఎంతో కొంత సింప‌తీ అయినా ఏర్ప‌డుతుంది. లేక‌పోతే.. అస‌లు నాయ‌కుడిగా కూడా.. ఆయ‌న ప‌నిచేస్తారా? అనే చ‌ర్చ వ‌చ్చినా ఆశ్చ‌ర్యం లేదు. ఎలా చూసుకున్నా.. జ‌గ‌న్ కు ఇప్ప‌టికిప్పుడు కావాల్సింది.. వ్యూహంతోపాటు స‌హ‌నం. సంయ‌మ‌నం!! మ‌రి ఏం చేస్తారో చూడాలి.

Satya

Recent Posts

అమెరికాలో మరో తెలుగు విద్యార్థి మృతి!

తెలుగు రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు, యువ ఉద్యోగుల మరణ వార్తలు అమెరికా నుంచి వరుసగా వస్తుండటం ఆందోళన కలిగిస్తోంది. రోడ్డు…

2 hours ago

వైసీపీ కాపుల సభలో ఏం జరిగింది?

వైసీపీ ఆధ్వ‌ర్యంలో ఉమ్మ‌డి తూర్పుగోదావ‌రి జిల్లాలోని కోన‌సీమ‌లో ఆదివారం నిర్వ‌హించిన కాపుల స‌భ‌లో మాజీ మంత్రి, ఉత్త‌రాంధ్ర‌కు చెందిన బొత్స…

4 hours ago

ప్రేక్షక దేవుళ్ల ఆశీర్వాదం దొరికిందా

బిచ్చగాడు హీరోగా విజయ్ ఆంటోనీకి ఫ్లాపులతో సంబంధం లేకుండా తెలుగు ప్రేక్షకుల్లో గుర్తింపు ఉంది. అయితే వరస డిజాస్టర్లు తన…

9 hours ago

అమెరికా వెళ్లే వారికి అలెర్ట్‌… నాలుగేళ్లే గ‌డువు!

అగ్ర‌రాజ్యం అమెరికాలో చ‌దువుకునేందుకు వెళ్లేవారు అప్ర‌మ‌త్తం కావాల్సిన అవ‌స‌రం ఏర్ప‌డింది. ఇప్ప‌టి వ‌ర‌కు ఈ దేశంలో చ‌దువుకునేందుకు వెళ్లేవారు.. ఎడ్యుకేష‌న్…

9 hours ago

పెద్ది కాస్త తొందరపడి ఉండాల్సింది

400 కోట్లకు పైగా వసూలు చేసినా గట్టిగా బ్లాక్ బస్టరని చెప్పుకోలేని విచిత్ర పరిస్థితి పెద్దిది. ఓవర్సీస్, ఉత్తరాది రాష్ట్రాలు,…

11 hours ago

హనుమాన్ ఇంత హడావిడి ఎందుకు చేసినట్టు

ఇవాళ హైదరాబాద్ ప్రసాద్ పీసీఎక్స్ లో హనుమాన్ 3డి రీ రిలీజ్ ట్రైలర్ లాంచ్ జరిగింది. మళ్ళీ విడుదల చేస్తున్న…

11 hours ago