మాటకు మాట.. అన్నట్టుగా ఏపీ రాజకీయాలు సాగుతున్నాయి. వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్.. గుం టూరు జిల్లా వినుకొండలో దారుణ హత్యకు గురైన రషీద్ కుటుంబాన్ని పరామర్శించారు. ఈ సందర్భంగా రషీద్ను హత్య చేసిన జిలానీకి.. స్థానిక వినుకొండ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు కుటుంబానికి సత్సంబంధాలు ఉన్నాయని పేర్కొన్నారు. వారి కుటుంబంలో జరిగిన వేడుకలకు జిలానీ హాజరయ్యారని.. ఎమ్మెల్యే సతీమణికి ఆయన కేక్ తినిపించిన సందర్భం ఉందన్నారు.
ఇదే సమయంలో ఎమ్మెల్యేతోనూ.. జిలానీకి వ్యక్తిగత సంబంధాలు ఉన్నాయంటూ.. కొన్ని ఫొటోలను మీడియాకు చూపించారు. జిలానీతో సత్సంబంధాలు ఉన్న ఎమ్మెల్యే కుటుంబంపైనా కేసులు ఎందుకు నమోదు చేయలేదని జగన్ ప్రశ్నించారు.
ఆయన ఆరోపణలు చేసి .,. 24 గంటలు గడవకుండానే.. కూటమి సర్కారు నుంచి అంతే ఎదురు దాడి ఎదురైంది. జగన్ బాబాయి.. వివేకానందరెడ్డి దారుణ హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న సునీల్ యాదవ్కు సంబంధించిన ఫొటోలను టీడీపీ నేతలు సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు.
సునీల్ యాదవ్తో జగన్ సతీమణి.. వైఎస్ భారతి దిగిన ఫొటోలను.. అదేవిధంగా కడప ఎంపీ వైఎస్ అవినాష్, ఆయన తండ్రి భాస్కరరెడ్డి దిగిన ఫొటోలను.. ఇతర కుటుంబ సభ్యులు సునీల్ యాదవ్తో ఉన్న ఫొటోలను జత చేసి.. జగన్ చేసిన వ్యాఖ్యలతో కలిపి ప్రచారం ప్రారంభించారు.
సునీల్ యాదవ్తో ఉన్న అందరిపైనా.. కేసులు నమోదు చేయాలి కదా.. ఇప్పుడేమంటవ్? అని టీడీపీ నాయకులు ప్రశ్నిస్తు న్నారు. అంటే.. జగన్ ఒకటంటే.. కూటమి వంద వ్యాఖ్యలతో.. వందల కొద్దీ సమాచారంతో విరుచుకుప డుతుండడం గమనార్హం. ఇది రాజకీయంగా ఎంత వరకు వెళ్తుందో చూడాలి.
This post was last modified on July 20, 2024 4:29 pm
కొందరు ఫిలిం మేకర్స్ తమ సినిమా కథేంటో చివరి వరకు దాచి పెట్టాలని ప్రయత్నిస్తారు. నేరుగా థియేటర్లలో ప్రేక్షకులను ఆశ్చర్యపరచాలనుకుంటారు.…
ఏపీ సీఎం చంద్రబాబుకు ప్రముఖ దినపత్రిక `ఎకనమిక్ టైమ్స్`.. ప్రతిష్టాత్మక వ్యాపార సంస్కర్త-2025 పురస్కారానికి ఎంపిక చేసిన విషయం తెలిసిందే.…
బంగ్లాదేశ్లో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు భారత్కు పెద్ద తలనొప్పిగా మారాయి. 1971 విముక్తి యుద్ధం తర్వాత మన దేశానికి ఇదే…
ప్రేమ ఎప్పుడు ఎవరి మీద పుడుతుందో చెప్పలేం అంటారు. కానీ జపాన్ లో జరిగిన ఈ పెళ్లి చూస్తే టెక్నాలజీ…
ప్రభుత్వం తరఫున ఖర్చుచేసేది ప్రజాధనమని సీఎం చంద్రబాబు తెలిపారు. అందుకే ఖర్చు చేసే ప్రతి రూపాయికీ ఫలితాన్ని ఆశిస్తానని చెప్పారు.…
`వ్యాపార సంస్కర్త-2025` అవార్డును ఏపీ సీఎం చంద్రబాబు కైవసం చేసుకున్నారు. అయితే.. దేశవ్యాప్తంగా 28 రాష్ట్రాలు, 28 మంది ముఖ్యమంత్రులు…