Political News

జ‌గ‌న్ ఒక‌టంటే.. కూట‌మి వందంటోంది!

మాట‌కు మాట‌.. అన్న‌ట్టుగా ఏపీ రాజ‌కీయాలు సాగుతున్నాయి. వైసీపీ అధినేత, మాజీ సీఎం జ‌గ‌న్‌.. గుం టూరు జిల్లా వినుకొండ‌లో దారుణ హ‌త్య‌కు గురైన ర‌షీద్ కుటుంబాన్ని ప‌రామ‌ర్శించారు. ఈ సంద‌ర్భంగా ర‌షీద్‌ను హ‌త్య చేసిన జిలానీకి.. స్థానిక వినుకొండ ఎమ్మెల్యే జీవీ ఆంజ‌నేయులు కుటుంబానికి స‌త్సంబంధాలు ఉన్నాయ‌ని పేర్కొన్నారు. వారి కుటుంబంలో జ‌రిగిన వేడుక‌ల‌కు జిలానీ హాజ‌ర‌య్యార‌ని.. ఎమ్మెల్యే స‌తీమ‌ణికి ఆయ‌న కేక్ తినిపించిన సంద‌ర్భం ఉంద‌న్నారు.

ఇదే స‌మ‌యంలో ఎమ్మెల్యేతోనూ.. జిలానీకి వ్య‌క్తిగ‌త సంబంధాలు ఉన్నాయంటూ.. కొన్ని ఫొటోల‌ను మీడియాకు చూపించారు. జిలానీతో స‌త్సంబంధాలు ఉన్న ఎమ్మెల్యే కుటుంబంపైనా కేసులు ఎందుకు న‌మోదు చేయ‌లేద‌ని జ‌గ‌న్ ప్ర‌శ్నించారు.

ఆయ‌న ఆరోప‌ణ‌లు చేసి .,. 24 గంట‌లు గ‌డ‌వ‌కుండానే.. కూట‌మి స‌ర్కారు నుంచి అంతే ఎదురు దాడి ఎదురైంది. జ‌గ‌న్ బాబాయి.. వివేకానంద‌రెడ్డి దారుణ హ‌త్య కేసులో ఆరోప‌ణలు ఎదుర్కొంటున్న సునీల్ యాద‌వ్‌కు సంబంధించిన ఫొటోల‌ను టీడీపీ నేత‌లు సోష‌ల్ మీడియాలో ప్ర‌చారం చేస్తున్నారు.

సునీల్ యాద‌వ్‌తో జ‌గ‌న్ స‌తీమ‌ణి.. వైఎస్ భార‌తి దిగిన ఫొటోల‌ను.. అదేవిధంగా క‌డ‌ప ఎంపీ వైఎస్ అవినాష్, ఆయ‌న తండ్రి భాస్క‌ర‌రెడ్డి దిగిన ఫొటోల‌ను.. ఇత‌ర కుటుంబ స‌భ్యులు సునీల్ యాద‌వ్‌తో ఉన్న ఫొటోల‌ను జ‌త చేసి.. జ‌గ‌న్ చేసిన వ్యాఖ్య‌ల‌తో క‌లిపి ప్ర‌చారం ప్రారంభించారు.

సునీల్ యాద‌వ్‌తో ఉన్న అంద‌రిపైనా.. కేసులు న‌మోదు చేయాలి క‌దా.. ఇప్పుడేమంట‌వ్‌? అని టీడీపీ నాయ‌కులు ప్ర‌శ్నిస్తు న్నారు. అంటే.. జ‌గ‌న్ ఒక‌టంటే.. కూట‌మి వంద వ్యాఖ్య‌ల‌తో.. వంద‌ల కొద్దీ స‌మాచారంతో విరుచుకుప డుతుండ‌డం గ‌మ‌నార్హం. ఇది రాజ‌కీయంగా ఎంత వ‌ర‌కు వెళ్తుందో చూడాలి.

This post was last modified on July 20, 2024 4:29 pm

Share
Show comments
Published by
Satya
Tags: Jagan

Recent Posts

నియోజ‌క‌వ‌ర్గాల‌పై రేవంత్ కొత్త ఫార్ములా… వ‌ర్కువ‌ట్ అయ్యేనా?

2029 పార్ల‌మెంటు ఎన్నిక‌ల నాటికి దేశంలో నియోజ‌క‌వ‌ర్గాల‌ను పున‌ర్విభ‌జించాల‌ని కేంద్ర ప్ర‌భుత్వం ల‌క్ష్యంగా పెట్టుకున్న విష‌యం తెలిసిందే. ఇటు అసెంబ్లీ,…

1 hour ago

పెను సంక్షోభంలో ప్ర‌పంచం…!

అమెరికా - ఇరాన్ దేశాల మధ్య నెలకొన్న చర్చల ప్రతిష్టంభ‌న ప్రపంచ దేశాలను పెను సంక్షోభంలోకి నెట్టే దిశగా మారుతోందా?…

2 hours ago

రాష్ట్ర‌ప‌తికి బహుమతిగా మంగళగిరి చీర

భార‌త రాష్ట్ర‌ప‌తి ద్రౌప‌దిముర్ముతో ఏపీ మంత్రి, టీడీపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి నారా లోకేష్ భేటీ అయ్యారు. పార్టీకి చెందిన…

2 hours ago

ఏపీ కొత్త ఎన్నిక‌ల క‌మిష‌న‌ర్‌… వైసీపీకి షాకేనా?

ఏపీ రాష్ట్ర ఎన్నిక‌ల సంఘం క‌మిష‌న‌ర్ ప‌ద‌వి ఖాళీ అయింది. గ‌త నెల 31వ తేదీ వ‌ర‌కు ఉన్న రాష్ట్ర…

2 hours ago

‘హోం’ ప్రశ్నలపై ‘సీఎం’ సమాధానం చెప్తారా?

తెలంగాణలో కీలకమైన హోం శాఖను సీఎం రేవంత్ రెడ్డి తన దగ్గర పెట్టుకున్నారు. శాంతిభద్రతలను ఆయనే పర్యవేక్షిస్తున్నారు. అయితే తరచుగా…

4 hours ago

కేసీఆర్ వరకు వెళ్లిన సీతక్క పంచాయితీ

తెలంగాణలో అధికార పార్టీ కాంగ్రెస్ కు చెందిన మహిళా నేత, సీఎం ఎనుముల రేవంత్ రెడ్డి కేబినెట్ లో కీలక…

5 hours ago