ఆంధ్రప్రదేశ్లో ఈ ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో వైసీపీ పార్టీ దారుణ పరాభవాన్ని మూటగట్టుకుంది. కేవలం 11 స్థానాల్లో మాత్రమే గెలిచింది. అఖండ విజయంతో కూటమి అధికారంలోకి వచ్చింది. కానీ మాజీ సీఎం, వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డికి ఈ వాస్తవం ఇంకా బోధపడుతున్నట్లు లేదు.
ఇప్పటికీ అధికారం తమదే అన్నట్లు జగన్ వ్యవహరిస్తున్నారనే టాక్ వినిపిస్తోంది. ఈ కష్ట కాలంలో పార్టీని, క్యాడర్ను పట్టించుకోకుండా తనకు అలవాటైన రీతిలో ఆయన కార్యకర్తలకు దూరంగా ఉండటమే అందుకు కారణమని చెప్పొచ్చు.
అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయం తర్వాత తిరిగి పార్టీని బతికించాల్సిన బాధ్యత జగన్పై ఉంది. పార్టీ శ్రేణులకు అండగా ఉంటూ, భవిష్యత్ తమదే అనే భరోసా కల్పించాల్సి ఉంది. కానీ అధికారంలో ఉన్నప్పుడు తాడేపల్లి ప్యాలెస్కే పరిమితమైన జగన్.. ఇప్పుడు బెంగళూరు కోటలోనే మకాం వేస్తున్నారని టాక్.
ఏపీలో ఉండకుండా జగన్ ఎక్కువగా బెంగళూరులోనే గడుపుతున్నారని, ఇలా అయితే పార్టీ పరిస్థితి ఏమిటని వైసీపీ శ్రేణులే ప్రశ్నిస్తున్నాయి. ఇక అధికారంలో ఉన్నప్పుడు జగన్ భజన చేసిన అప్పటి మంత్రులు కూడా పత్తా లేకుండా పోయారు.
జగన్ ప్రభుత్వంలో అధికారం, హోదాతో అహంకారపూరితంగా వ్యవహరించారనే ఆరోపణలున్న మంత్రులు ఇప్పుడు కనిపించడం లేదు. అంబటి రాంబాబు, పేర్ని నాని, గుడివాడ అమర్నాథ్ వంటి వారు మినహా మిగతా నాయకులు బయటకు రావడం లేదు. జగన్ సమావేశాలు పెట్టిన వీళ్లలో చలనం ఉండటం లేదని టాక్.
సొంత వ్యాపారాలను కాపాడుకోవడం కోసం మాజీ మంత్రుల్లో చాలా మంది ఇప్పటికే ఏపీ బార్డర్ దాటేశారనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే చాలా నియోజకవర్గాల్లో పార్టీ శ్రేణులకు వీళ్లు అందుబాటులో లేకుండా పోయారు. దీంతో అటు జగన్ పట్టించుకోక.. ఇటు మాజీ మంత్రుల జాడ లేక వైసీపీ కేడర్ మరింత ఆందోళన వ్యక్తం చేస్తోందని తెలిసింది.
This post was last modified on July 20, 2024 2:40 pm
ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…
ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…
అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…
డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…