Political News

25న ఏపీ బ‌డ్జెట్‌.. 24న జ‌గ‌న్ ధ‌ర్నా.. వ్యూహం ఇదే!

ఈ నెల 24న ఢిల్లీలో ధ‌ర్నా చేయ‌నున్న‌ట్టు వైసీపీ అధినేత‌, మాజీ సీఎం జ‌గ‌న్ ప్ర‌క‌టించిన విష‌యం తెలి సిందే. ఉమ్మ‌డి గుంటూరు జిల్లాలోని వినుకొండ‌లో న‌డిరోడ్డుపై రెండు రోజుల కింద‌ట జ‌రిగిన దారుణ హ‌త్య‌లో ప్రాణాలు కోల్పోయిన ర‌షీద్ కుటుంబాన్ని ఆయ‌న ప‌రామ‌ర్శించారు. అనంత‌రం.. కొన్ని సంచ‌ల న ప్ర‌క‌ట‌న‌లు చేశారు. రాష్ట్రంలో రాష్ట్ర‌ప‌తి పాల‌న విధించాల‌ని డిమాండ్ చేశారు. ఆ వెంట‌నే ఈ విష‌యాన్ని జాతీయ మీడియా దృష్టికి తీసుకువెళ్లేందుకు ప్ర‌ధాని మోడీ దృష్టికి తీసుకువెళ్లేందుకు వీలుగా ఢిల్లీలో ధ‌ర్నాకు పిలుపునిచ్చారు.

అయితే.. ఇక్క‌డే అస‌లైన వ్యూహం ఉంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. జ‌గ‌న్ చేయ‌నున్న ధ‌ర్నా.. 24వ తేదీ అయితే.. ఆ మ‌ర్నాడే.. ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం బ‌డ్జెట్ ప్ర‌వేశ పెట్ట‌నుంది. ఆగ‌స్టు నుంచి వ‌చ్చే ఏడాది మార్చి 31 వ‌ర‌కు ఓటాన్ అకౌంట్ బ‌డ్జెట్‌ను ప్ర‌భుత్వం స‌భ‌కు స‌మ‌ర్పించ‌నుంది. ఈ నేప‌థ్యంలో జ‌గ‌న్ చేప‌ట్ట‌నున్న ధ‌ర్నాకు ప్రాదాన్యం ఏర్ప‌డింది. ఎలాగంటే.. ఆయ‌న అక్క‌డ ధ‌ర్నా చేస్తే.. స‌హ‌జంగా నే జాతీయ మీడియా ప్ర‌సారం చేస్తుంది. రాష్ట్ర మీడియా కూడా విధిలేని ప‌రిస్థితిలో ప్రాధాన్యం క‌ల్పిస్తుంది.

దీంతో మ‌రుస‌టి రోజు రాష్ట్ర ప్ర‌భుత్వం ప్ర‌వేశ పెట్టే బ‌డ్జెట్పై చ‌ర్చ ప‌క్క దారి ప‌డుతుంది. ఇదే జ‌గ‌న్‌కు ఆ పార్టీ నాయకుల‌కు కూడా కావాల్సి ఉంటుంద‌ని ప‌రిశీల‌కులు అంచ‌నా వేస్తున్నారు. ఇక‌, జాతీయ స్థాయి లో ధ‌ర్నా చేయ‌డం ద్వారా.. రాష్ట్రంలో వైసీపీని పుంజుకునేలా చేయాల‌న్న‌ది జ‌గ‌న్ మ‌రో వ్యూహంగా ఉంద‌ని అంటున్నారు. నెల రోజులు దాటిపోయినా.. త‌మ నాయ‌కుడు ఇంకా తేరుకోలేద‌ని భావిస్తున్న వైసీపీ నాయకులు, కార్య‌క‌ర్త‌ల‌కు ఈ ధ‌ర్నా ద్వారా సందేశం పంపించాల‌న్న‌ది జ‌గ‌న్ ఉద్దేశ‌మై ఉంటుంద ని భావిస్తున్నారు.

అంటే.. ఢిల్లీ లో ధ‌ర్నా చేయ‌డం ద్వారా.. జాతీయ‌, రాష్ట్ర మీడియాలో లైవ్ లో ఉండడం.. అదేస‌మ‌యం లో పార్టీలోనూ పుంజుకునే వాతావ‌ర‌ణాన్ని క‌ల్పించ‌డం.. చంద్ర‌బాబు తొలి బ‌డ్జెట్పై చ‌ర్చ‌లేకుండా చేయా ల‌న్న వ్యూహాలు ఉన్నాయ‌నేది విశ్లేష‌కుల అంచ‌నా. నిజానికి ఇప్ప‌టికిప్పుడు జ‌గ‌న్ ఢిల్లీలో ధ‌ర్నా చేసి నా.. మోడీ కానీ. కేంద్ర స‌ర్కారు కానీ.. ప‌ట్టించుకునే అవ‌కాశం లేదు. ఎందుకంటే ఏపీలో ఉన్న‌ది కూడా. కూట‌మి స‌ర్కారే. మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలి.

This post was last modified on July 20, 2024 5:23 pm

Share

Recent Posts

హాలీవుడ్ సినిమాలకు మళ్ళీ మంచి రోజులు

ఒకప్పుడు ఇంగ్లీష్ సినిమాలకు మన దేశంలో తెగ క్రేజ్ ఉండేది. జురాసిక్ పార్క్ నుంచి ఇది విపరీతంగా పెరిగిపోయింది. దానికి…

1 hour ago

గండాన్ని దాటిన చెన్నై లవ్ స్టోరీ

గత వారం విడుదలైన ‘చెన్నై లవ్ స్టోరీ’ సినిమా ఫుల్ పాజిటివ్ టాకేమీ తెచ్చుకోలేదు. ప్రిమియర్స్ నుంచే డివైడ్ టాక్ మొదలైంది.…

1 hour ago

మోదీ కాళ్లు కడిగి ఆ నీళ్లు తాగాలని ఉంది: నటుడు

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని విష్ణుమూర్తి అవతారంగా ప్రముఖ బాలివుడ్ నటుడు సుదేష్ బెర్రీ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో…

2 hours ago

కనకరాజు సీమలో కొరియన్ దెయ్యం

బలమైన కంబ్యాక్ కోసం ఎదురు చూస్తున్న మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ఆశలన్నీ కొరియన్ కనకరాజు మీదే ఉన్నాయి. ఆగస్ట్…

2 hours ago

“కొబ్బరికాయ కొట్టాం… గుమ్మడి కాయ కట్టాం”

ఏపీ దశ దిశలను మార్చేసే భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం శనివారం ఉదయం లాంఛనంగా ప్రారంబమైంది. దేశ ప్రధాని నరేంద్ర మోదీ అల్లూరి సీతారామరాజు…

3 hours ago

దేశం కోసం కష్టపడే ప్రధాని మోదీపై విమర్శలా

జంతర్ మంతర్ ఆందోళనలో ప్రధాని మోదీపై విమర్శలు చేయడం కన్నీళ్లు తెప్పించిందని, పండ్లు కాసే చెట్టుపైకి రాళ్లేస్తారని, దేశం కోసం…

3 hours ago