ఎన్నికల్లో కూటమి ఇచ్చిన హామీలను అమలు చేసే దిశగా సీఎం చంద్రబాబు నాయుడు జోరు ప్రదర్శిస్తున్నారు. గత అయిదేళ్ల అరాచక పాలన నుంచి విముక్తి కోసం తమను నమ్మి ఓట్లు వేసిన జనానికి లబ్ధి చేకూర్చేలా బాబు పనిచేస్తున్నారు. ఇప్పటికే మెగా డీఎస్సీ నొటిఫికేషన్తో పాటు పింఛన్ల పెంపు, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు, అన్నా క్యాంటీన్ల ప్రారంభం వంటి హామీలను కూటమి ప్రభుత్వం అమలు చేసింది. త్వరలోనే మిగిలిన హామీలను పట్టాలెక్కించేందుకు చంద్రబాబు సిద్ధంగా ఉన్నారు. ఈ క్రమంలోనే నిరుద్యోగులకు ఇచ్చిన హామీ ప్రకారం నిరుద్యోగ భృతి అందించేందుకు బాబు కసరత్తులు చేస్తున్నట్లు తెలుస్తోంది.
త్వరలోనే ఏపీలోని నిరుద్యోగ యువతకు సీఎం చంద్రబాబు నాయుడు గుడ్న్యూస్ వినిపించనున్నారని సమాచారం. నిరుద్యోగ భృతి అమలు కోసం కసరత్తు మొదలైందని తెలిసింది. ఎన్నికల ప్రచారంలో భాగంగా నిరుద్యోగ భృతి కింద నిరుద్యోగులకు నెలకు రూ.3 వేల ఇస్తామని బాబు చెప్పారు. ఇప్పుడు రాష్ట్రంలో నిరుద్యోగులు ఎంతమంది ఉన్నారు? ఈ పథకం అమలు చేయాలంటే ఎంత బడ్జెట్ అవసరమవుతుంది? తదితర విషయాలపై దృష్టి పెట్టాలని అధికారులను బాబు ఆదేశించారని సమాచారం. జిల్లాల వారీగా నిరుద్యోగ యువత వివరాలను పరిశీలించేందుకు బాబు సిద్ధమవుతున్నారని టాక్.
నిరుద్యోగ భృతిని అందించేందుకు అవసరమైన విధివిధానాలు, అర్హతలపై బాబు ఫోకస్ పెట్టారని తెలిసింది. ఈ మేరకు టీడీపీ సోషల్ మీడియాలోని ఓ పోస్టు కూడా వైరల్గా మారింది. నిరుద్యోగ భృతి పొందాలంటే ఏపీకి చెందిన వాళ్లయి ఉండాలని, వయసు 22 నుంచి 35 లోపు ఉండాలని తెలుస్తోంది. అలాగే ఇంటర్మీడియట్, డిప్లొమా లేదా డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. ఈ నిరుద్యోగ భృతి పొందాలనుకునే వాళ్లకు ఇతర మార్గాల ద్వారా నెలకు రూ.10 వేల కంటే ఎక్కువ ఆదాయం రాకూడదు. ఇలా కొన్ని నిబంధనలు, అర్హతలను ఈ నిరుద్యోగ భృతికి ప్రామాణికంగా పెట్టుకున్నారని సమాచారం.
This post was last modified on July 19, 2024 3:09 pm
బాహుబలి, బాహుబలి-2 చిత్రాలతో దేశవ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్రభాస్. ఇదంతా రాజమౌళి పుణ్యం అంటూ కొందరు…
చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…
సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…
వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…
మూడేళ్లకు పైగా టైం తీసుకుని, 400 కోట్లకు పైగా బడ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…