పల్నాడు జిల్లాలోని వినుకొండలో రషీద్ అనే వైసీపీ కార్యకర్త దారుణ హత్యకు గురైన సంగతి తెలిసిందే. రషీద్ ను వినుకొండ బస్టాండ్ సెంటర్ దగ్గర నడిరోడ్డుపై అందరూ చూస్తుండగానే జిలాని అనే మరో యువకుడు కత్తితో దాడి చేసి చేయి నరికిన వైనం రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపింది. అయితే, జిలాని టీడీపీ కార్యకర్త అని వైసీపీ నేతలు, వైసీపీ కార్యకర్త అని టిడిపి నేతలు ఆరోపణలు చేసుకుంటున్నారు. ఈ క్రమంలోనే రషీద్ కుటుంబాన్ని పరామర్శించేందుకు ఏపీ మాజీ సీఎం, వైసీపీ అధినేత జగన్ ఈరోజు వినుకొండలో పర్యటించనున్నారు.
ఈ నేపథ్యంలోనే జగన్ పర్యటనపై గుంటూరు రేంజ్ ఐజీ సర్వశ్రేష్ఠ త్రిపాఠీ కీలక ప్రకటన చేశారు. వినుకొండలో 144 సెక్షన్ అమల్లో ఉందని, ఎటువంటి ర్యాలీలు, ప్రదర్శనలకు అనుమతి లేదని అన్నారు. అయితే, జగన్ వచ్చి రషీద్ కుటుంబ సభ్యులను పరామర్శించవచ్చని చెప్పారు. కానీ, జన సమీకరణ చేయవద్దని, ఎక్కువమంది గుమిగూడి ప్రదర్శనలు వంటివి చేయకూడదని ఆయన సూచించారు. ప్రస్తుతం వినుకొండ పట్టణంలో పరిస్థితి ప్రశాంతంగా ఉందని, అనవసరంగా ఎవరూ రోడ్లపైకి రావద్దని ఆయన పిలుపునిచ్చారు.
మరోవైపు, జగన్ వెంట కొందరు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీ ఎమ్మెల్యేల వాహనాలను వెళ్లకుండా పోలీసులు అడ్డుకుంటున్నారు. వారి కార్లను తాడేపల్లి, మంగళగిరి, గుంటూరుతో పాటు వినుకొండ వెళ్లే మార్గమధ్యలో ఆపివేశారని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. జగన్ కు బుల్లెట్ ప్రూఫ్ వాహనం తొలగించి వేరే వాహనం ఇచ్చారని, అది బాగోలేకపోవడంతో జగన్ సొంత వాహనంలో వెళుతున్నారని చెబుతున్నారు.
This post was last modified on July 19, 2024 12:39 pm
2029 పార్లమెంటు ఎన్నికల నాటికి దేశంలో నియోజకవర్గాలను పునర్విభజించాలని కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్న విషయం తెలిసిందే. ఇటు అసెంబ్లీ,…
అమెరికా - ఇరాన్ దేశాల మధ్య నెలకొన్న చర్చల ప్రతిష్టంభన ప్రపంచ దేశాలను పెను సంక్షోభంలోకి నెట్టే దిశగా మారుతోందా?…
భారత రాష్ట్రపతి ద్రౌపదిముర్ముతో ఏపీ మంత్రి, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ భేటీ అయ్యారు. పార్టీకి చెందిన…
ఏపీ రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ పదవి ఖాళీ అయింది. గత నెల 31వ తేదీ వరకు ఉన్న రాష్ట్ర…
తెలంగాణలో కీలకమైన హోం శాఖను సీఎం రేవంత్ రెడ్డి తన దగ్గర పెట్టుకున్నారు. శాంతిభద్రతలను ఆయనే పర్యవేక్షిస్తున్నారు. అయితే తరచుగా…
తెలంగాణలో అధికార పార్టీ కాంగ్రెస్ కు చెందిన మహిళా నేత, సీఎం ఎనుముల రేవంత్ రెడ్డి కేబినెట్ లో కీలక…