Political News

జగన్ వెళ్ళొచ్చు, మిగతా వారు కుదరదు

పల్నాడు జిల్లాలోని వినుకొండలో రషీద్ అనే వైసీపీ కార్యకర్త దారుణ హత్యకు గురైన సంగతి తెలిసిందే. రషీద్ ను వినుకొండ బస్టాండ్ సెంటర్ దగ్గర నడిరోడ్డుపై అందరూ చూస్తుండగానే జిలాని అనే మరో యువకుడు కత్తితో దాడి చేసి చేయి నరికిన వైనం రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపింది. అయితే, జిలాని టీడీపీ కార్యకర్త అని వైసీపీ నేతలు, వైసీపీ కార్యకర్త అని టిడిపి నేతలు ఆరోపణలు చేసుకుంటున్నారు. ఈ క్రమంలోనే రషీద్ కుటుంబాన్ని పరామర్శించేందుకు ఏపీ మాజీ సీఎం, వైసీపీ అధినేత జగన్ ఈరోజు వినుకొండలో పర్యటించనున్నారు.

ఈ నేపథ్యంలోనే జగన్ పర్యటనపై గుంటూరు రేంజ్ ఐజీ సర్వశ్రేష్ఠ త్రిపాఠీ కీలక ప్రకటన చేశారు. వినుకొండలో 144 సెక్షన్ అమల్లో ఉందని, ఎటువంటి ర్యాలీలు, ప్రదర్శనలకు అనుమతి లేదని అన్నారు. అయితే, జగన్ వచ్చి రషీద్ కుటుంబ సభ్యులను పరామర్శించవచ్చని చెప్పారు. కానీ, జన సమీకరణ చేయవద్దని, ఎక్కువమంది గుమిగూడి ప్రదర్శనలు వంటివి చేయకూడదని ఆయన సూచించారు. ప్రస్తుతం వినుకొండ పట్టణంలో పరిస్థితి ప్రశాంతంగా ఉందని, అనవసరంగా ఎవరూ రోడ్లపైకి రావద్దని ఆయన పిలుపునిచ్చారు.

మరోవైపు, జగన్ వెంట కొందరు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీ ఎమ్మెల్యేల వాహనాలను వెళ్లకుండా పోలీసులు అడ్డుకుంటున్నారు. వారి కార్లను తాడేపల్లి, మంగళగిరి, గుంటూరుతో పాటు వినుకొండ వెళ్లే మార్గమధ్యలో ఆపివేశారని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. జగన్ కు బుల్లెట్ ప్రూఫ్ వాహనం తొలగించి వేరే వాహనం ఇచ్చారని, అది బాగోలేకపోవడంతో జగన్ సొంత వాహనంలో వెళుతున్నారని చెబుతున్నారు.

This post was last modified on July 19, 2024 12:39 pm

Share
Show comments
Published by
Satya
Tags: Jagan

Recent Posts

ష‌ర్మిలమ్మా.. మీ పార్టీ దీన‌స్థితి చూడ‌మ్మా.. !

ఏపీ కాంగ్రెస్ పార్టీ ప‌రిస్థితి నానాటికీ తీసిక‌ట్టుగా మారుతోందా? .. పార్టీ నాయ‌కులు దీన‌స్థితిలో ఉన్నారా? అంటే.. ఔన‌నే స‌మాధాన‌మే…

2 hours ago

ఇరాన్‌లో భారతీయ విద్యార్థులు.. ఇటు ప్రాణాలు, అటు పరీక్షలు

ఇరాన్‌లో ప్రస్తుతం నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు అక్కడ వైద్య విద్యనభ్యసిస్తున్న భారతీయ విద్యార్థులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఒకవైపు అమెరికా…

2 hours ago

బాలీవుడ్‌కు పొలిశెట్టి పంచ్

ఇప్పుడు తెలుగులో వంద కోట్ల హీరోగా ఎదిగాడు న‌వీన్ పొలిశెట్టి. సంక్రాంతికి విడుదలైన త‌న చివ‌రి చిత్రం అన‌గ‌న‌గా ఒక…

3 hours ago

శర్వానంద్ భోగికి అసలైన ఛాలెంజ్

2026 శర్వానంద్ కు చాలా స్పెషల్ ఇయర్ గా నిలవబోతోంది. సంక్రాంతి పండక్కు విపరీతమైన పోటీ మధ్య 'నారి నారి…

3 hours ago

అయ్యన్నను ఓడించిన రఘురామ

రాజ‌కీయాల్లోనే కాదు.. ఆట‌ల్లోనూ త‌న సత్తా నిరూపించారు... ఉండి ఎమ్మెల్యే అసెంబ్లీ డిప్యూటీ స్పీక‌ర్ ర‌ఘురామ‌కృష్ణ‌రాజు. అసెంబ్లీ బడ్జెట్ స‌మావేశాల…

4 hours ago

నంది అవార్డులంటే అంత చులకనా

ఇప్పుడు ఏపీలో ఇంకా వాటి పునరుద్ధరణ జరగలేదు, తెలంగాణలో గద్దర్ గా పేరు మారింది కానీ ఒకప్పుడు నంది అవార్డులంటే…

4 hours ago