మరికొన్ని రోజుల్లో కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ను ప్రవేశ పెట్టనుంది. అయితే.. దీనిలో ఎలాంటి బాదుళ్లు ఉంటాయి? ఎయే పన్నులు వడ్డిస్తారనే చర్చ జోరుగా సాగుతోంది. అయితే.. ఇంతలోనే ప్రజలకు చేరువైన కొన్ని ప్రైవేటు కంపెనీలు తమదైన శైలిలో బాదుడు ప్రారంభించాయి. పోనీ.. వీటి సేవలను వదులుకుందామా? అంటే.. సాధ్యమయ్యే పనికాదు. ఎందుకంటే.. ఆయా సంస్థలతో.. ఆయన సేవలతో మన జీవితాలను మనమే.. మనకు తెలియకుండా ముడివేసుకుపోయాం!!
దీంతో సదరు ప్రైవేటు సంస్థలు సొమ్ములు పిండుతున్నా.. మౌనంగా భరించాల్సి వస్తోంది. ఉదాహరణకు.. ఇటీవలే ప్రైవేటు టెలిఫోన్ ఆపరేటర్లు.. జియో సహా.. ఎయిర్టెల్ సంస్థకు భారీ ఎత్తున టారిఫ్ పెంచాయి. ఒక్కొక్క టారిఫ్ స్థాయిని బట్టి 60-450 వరకు పెరిగిపోయింది. అదే ప్లాన్.. అదే డేటా.. అదే లిమిట్.. అయినా ధరలు మాత్రం ఆకాశాన్నిఅంటాయి. దీనిని ప్రశ్నించిన వారు కానీ, దీనిపై నిరసన వ్యక్తం చేసిన వారు కానీ.. ఎవరూ కనిపించలేదు.
ఇక, ఇప్పుడు దేశవ్యాప్తంగా ప్రాచుర్యం పొందిన ఫుడ్ డెలివరీ సంస్థలు కూడా.. ప్రజలను బాదేస్తున్నాయి. దక్షిణాది రాష్ట్రాల్లో చిరపరిచయమైన.. జొమాటో, స్విగ్గీ సంస్థలు.. తమ సేవలపై చార్జీలను పెంచేశాయి. నిన్న మొన్నటి వరకు రూ.4గా ఉన్న సేవలు.. ఒక్కొక్క ఆర్డర్పై రూ.6కు పెంచాయి. కేవలం ఒక్కరూపాయే కదా.. అని అనుకుంటే పొరపాటే.. ఒక ఇంట్లో నాలుగు ఆర్డర్లు ఇస్తే.. నాలిగిటికీ వేర్వేరు రూపాల్లో చార్జీలు వేస్తారు. సో.. మొన్న మొబైల్, నేడు ఫుడ్ డెలివరీ సంస్థలు బాదేశాయి.
ఇక, ఇప్పుడు ఓలా రెడీ అయింది. తాజాగా.. పెంపు ప్రతిపాదనలను వెలువరించేందుకు రెడీ అయింది. ప్రయాణ చార్జీలను పెంచడంతోపాటు.. తమ నష్టాలను కూడా.. ప్రజలపై వేసేందుకు రెడీ అయింది. దీంతో ఓలా ఆటో, కారు, ఇతర వాహనాల చార్జీలను కిలో మీటరుకు రూ.5 చొప్పున పెంచేందుకు ఓలా రెడీ అయినట్టు తెలుస్తోంది. దీనిపై ఒకటి రెండు రోజుల్లోనే ప్రకటన రానుంది. అంటే.. కేంద్ర బడ్జెట్ కంటే ముందే.. ప్రైవేటు సంస్థలు బాదేస్తున్నాయి. మరి కేంద్ర బడ్జెట్లో ఎలాంటి బాదుళ్లు ఉంటాయో చూడాలి.
This post was last modified on July 15, 2024 3:32 pm
పవన్ కళ్యాణ్ కొత్త సినిమా నుంచి పాట వస్తోందంటే అభిమానులకు ఎక్కడ లేని హుషారు పుట్టుకొస్తుంది. అందులోనూ గబ్బర్ సింగ్…
నెల్లూరు పార్లమెంటు సభ్యుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి వ్యవహారం వైసీపీలో హాట్ టాపిక్గా మారింది. ఇటీ వల వేమిరెడ్డి ప్రభాకర్రెడ్డి,…
వైసీపీ హయాంలో అప్పటి సీఎం జగన్ కనుసన్నల్లో పనిచేసిన అధికారులు రూల్స్ను పక్కన పెట్టి ఇష్టానుసారంగా వ్యవహరించారని ఆరోపణలు ఉన్నాయి.…
జగన్ హయాంలో తీసుకున్న పలువురు నిర్ణయాలు రాష్ట్రాన్ని వెనక్కి నెట్టాయని, ముఖ్యంగా ఆర్థికంగానే కాకుండా రాజధాని పరంగా కూడా రాష్ట్రానికి…
రాజస్థాన్ రాష్ట్రంలోని జోధ్పూర్ జిల్లా మనాయ్ గ్రామంలో శనివారం జరగాల్సిన వివాహ కార్యక్రమాలకు కొద్దిగంటల ముందు ఇద్దరు అక్కచెల్లెళ్లు అనుమానాస్పద…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రకటనలు చేస్తానంటే ఆయనకు భారీ పారితోషకం ఇవ్వడానికి బోలెడన్ని కంపెనీలు ముందుకు వస్తాయి. కానీ…