వైసీపీ రాజ్యసభ సభ్యుడు.. ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. త్వరలోనే తాను మీడియా ఛానెల్ పెట్టనున్నట్టు తెలిపారు. తాజాగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తనపై వచ్చిన ఆరోపణలను ఖండించారు. అంతేకాదు.. అర్థం పర్థం లేకుండా చేసిన ప్రచారం.. తనను హర్ట్ అయ్యేలా చేసిందన్నారు. మీడియాకు ఎందుకంత తొందర? అని వ్యాఖ్యానించారు. దేవదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్.. శాంతి భర్త రాసిన లేఖ ఆధారంగా ఆరోపణలు చేయడాన్ని ఆయన ఖండించారు.
“చదువులేని వాళ్లే..మీడియా ఛానెళ్లు పెడుతున్నారు. ఎంతో చదువుకున్న నేను మీడియా ఛానెల్ పెట్టలేనా? ఖచ్చితంగా పెడతాను.” అని సాయిరెడ్డి వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా ఆయన కొన్ని మీడియా ఛానెళ్లు.. శాంతి భర్త రాసిన లేఖను ఆధారంగా చేసుకుని.. తనపై వికృత ప్రచారం చేశాయని.. వాటిపై చర్యలు తీసుకుంటానని ఆయన చెప్పారు. అంతేకాదు.. ప్రతి విషయాన్ని తాను న్యాయ స్థానంలో తేల్చుకుంటానన్నారు.
“ప్రతిపక్షంలో ఉన్నారు.. ఏం చేస్తారులే అని అనుకుంటున్నారా? ప్రతిపక్షంలో ఉన్నా.. న్యాయం, చట్టం వంటివి ఎప్పటికీ ఉంటాయి. కాబట్టి.. చట్ట పరిధిలోనే చర్యలు తీసుకుంటా” అని సాయిరెడ్డి హెచ్చరించారు. కేవలం శాంతి భర్త రాసిన లేఖను ఆధారంగా చేసుకుని.. తనపై తప్పుడు ప్రచారం చేశారని మండిపడ్డారు. దీనివెనుక నిజానిజాలు తెలుసుకునే అవసరం లేకుండా పోయిందా? అని నిలదీశారు. “బుద్ధిలేని ఎండోమెంట్ కమిషనర్ కు ఎంక్వయిరీ చేయమని లెటర్ ఇస్తే.. దాన్ని మీడియాకు ఎలా ఇస్తారు. ఇది కుట్రలో భాగంగానే జరిగింది. పార్లమెంట్లో వంశీకృష్ణపై ప్రివిలేజ్ మోషన్ వేస్తా” అని సాయి రెడ్డి వ్యాఖ్యానించారు.
“వచ్చిన నెలలోనే ప్రభుత్వం అరాచకాలు సృష్టించి భయభ్రాంతులకు గురిచేస్తోంది. మీ తాటాకు చప్పట్లు భయపడను. మధ్యంతర ఎన్నికలు వచ్చినా ఐదు సంవత్సరాల తర్వాత అయినా వైసీపీ అధికారంలోకి వస్తుంది. నా ప్రతిష్టలు దిగజారిచే వారిని వదిలిపెట్టను. నామీద ట్రోల్ చేసిన యూట్యూబ్ ఛానల్, టీవీ ఛానల్ పై హ్యూమన్ రైట్స్ . ట్రైబల్ వెల్ఫేర్ అసోసియేషన్, ఎస్టీ కమిషన్, ప్రెస్ కౌన్సిల్కు ఫిర్యాదు చేస్తాం” అని సాయిరెడ్డి వివరించారు.
This post was last modified on July 15, 2024 3:23 pm
సమస్య చిన్నదయినా, పెద్దదయినా తన దృష్టికి వస్తే పరిష్కారం కావాల్సిందేనని నిత్యం నిరూపిస్తూనే ఉన్నారు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్…
మెగా ఫ్యాన్స్ జోష్ మాములుగా లేదు. మొన్నటిదాకా తమ హీరోలు వరస డిజాస్టర్లతో సతమతమవుతున్నప్పుడు వాళ్ళు పడిన బాధ అంతా…
ఏపీ ప్రభుత్వం చేపట్టాలని భావిస్తున్న పోలవరం-నల్లమల సాగర్ ప్రాజెక్టు విషయంలో తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టులో న్యాయ పోరాటం చేస్తున్న విషయం…
సంక్రాంతి బాక్సాఫీస్ వద్ద ఆసక్తికరమైన పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. వందల కోట్లతో తీసిన రాజా సాబ్ కు మిశ్రమ స్పందన…
నిన్న రాత్రి నుంచి మెగాస్టార్ చిరంజీవి అభిమానుల ఉత్సాహం మామూలుగా లేదు. చిరు కొత్త సినిమా ‘మన శంకర వరప్రసాద్…
పోలవరం అత్యత్భుతమైన ప్రాజెక్టు, ఈ ప్రాజెక్టు పూర్తి అయితే దక్షిణ భారత్లో ఏ రాష్ట్రమూ మనతో పోటీ పడలేదు.. అని…