Political News

త్వ‌ర‌లోనే ‘ఛానెల్’ పెడ‌తా: సాయిరెడ్డి

వైసీపీ రాజ్య‌స‌భ స‌భ్యుడు.. ఆ పార్టీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి విజ‌య‌సాయిరెడ్డి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. త్వరలోనే తాను మీడియా ఛానెల్ పెట్ట‌నున్న‌ట్టు తెలిపారు. తాజాగా ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ.. త‌న‌పై వ‌చ్చిన ఆరోప‌ణ‌ల‌ను ఖండించారు. అంతేకాదు.. అర్థం ప‌ర్థం లేకుండా చేసిన ప్ర‌చారం.. త‌న‌ను హ‌ర్ట్ అయ్యేలా చేసింద‌న్నారు. మీడియాకు ఎందుకంత తొంద‌ర‌? అని వ్యాఖ్యానించారు. దేవ‌దాయ శాఖ అసిస్టెంట్ క‌మిష‌నర్‌.. శాంతి భ‌ర్త రాసిన లేఖ ఆధారంగా ఆరోప‌ణ‌లు చేయ‌డాన్ని ఆయ‌న ఖండించారు.

“చ‌దువులేని వాళ్లే..మీడియా ఛానెళ్లు పెడుతున్నారు. ఎంతో చ‌దువుకున్న నేను మీడియా ఛానెల్ పెట్ట‌లేనా? ఖ‌చ్చితంగా పెడ‌తాను.” అని సాయిరెడ్డి వ్యాఖ్యానించారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న కొన్ని మీడియా ఛానెళ్లు.. శాంతి భ‌ర్త రాసిన లేఖ‌ను ఆధారంగా చేసుకుని.. త‌న‌పై వికృత ప్ర‌చారం చేశాయ‌ని.. వాటిపై చ‌ర్య‌లు తీసుకుంటాన‌ని ఆయ‌న చెప్పారు. అంతేకాదు.. ప్ర‌తి విష‌యాన్ని తాను న్యాయ స్థానంలో తేల్చుకుంటాన‌న్నారు.

“ప్ర‌తిప‌క్షంలో ఉన్నారు.. ఏం చేస్తారులే అని అనుకుంటున్నారా? ప్ర‌తిప‌క్షంలో ఉన్నా.. న్యాయం, చట్టం వంటివి ఎప్ప‌టికీ ఉంటాయి. కాబ‌ట్టి.. చ‌ట్ట ప‌రిధిలోనే చ‌ర్య‌లు తీసుకుంటా” అని సాయిరెడ్డి హెచ్చరించారు. కేవ‌లం శాంతి భ‌ర్త రాసిన లేఖ‌ను ఆధారంగా చేసుకుని.. త‌న‌పై త‌ప్పుడు ప్ర‌చారం చేశార‌ని మండిప‌డ్డారు. దీనివెనుక నిజానిజాలు తెలుసుకునే అవ‌స‌రం లేకుండా పోయిందా? అని నిల‌దీశారు. “బుద్ధిలేని ఎండోమెంట్ కమిషనర్ కు ఎంక్వయిరీ చేయమని లెటర్ ఇస్తే.. దాన్ని మీడియాకు ఎలా ఇస్తారు. ఇది కుట్రలో భాగంగానే జరిగింది. పార్లమెంట్లో వంశీకృష్ణపై ప్రివిలేజ్ మోషన్ వేస్తా” అని సాయి రెడ్డి వ్యాఖ్యానించారు.

“వచ్చిన నెలలోనే ప్రభుత్వం అరాచకాలు సృష్టించి భయభ్రాంతులకు గురిచేస్తోంది. మీ తాటాకు చప్పట్లు భయపడను. మ‌ధ్యంతర ఎన్నికలు వచ్చినా ఐదు సంవత్సరాల తర్వాత అయినా వైసీపీ అధికారంలోకి వస్తుంది. నా ప్రతిష్టలు దిగజారిచే వారిని వదిలిపెట్టను. నామీద ట్రోల్ చేసిన యూట్యూబ్ ఛానల్, టీవీ ఛానల్ పై హ్యూమన్ రైట్స్ . ట్రైబల్ వెల్ఫేర్ అసోసియేషన్, ఎస్టీ కమిషన్, ప్రెస్ కౌన్సిల్‌కు ఫిర్యాదు చేస్తాం” అని సాయిరెడ్డి వివ‌రించారు.

This post was last modified on July 15, 2024 3:23 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

బీఆర్ఎస్‌లో పూర్తి ప్ర‌క్షాళ‌న… కారణమేంటి?

తెలంగాణ ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ పార్టీని ప్రక్షాళన చేసే దిశగా అడుగులు పడుతున్నాయి. పార్టీలో సంస్థాగతంగా పనిచేస్తున్న వారిని గత…

16 minutes ago

నియోజ‌క‌వ‌ర్గాల‌పై రేవంత్ కొత్త ఫార్ములా… వ‌ర్కువ‌ట్ అయ్యేనా?

2029 పార్ల‌మెంటు ఎన్నిక‌ల నాటికి దేశంలో నియోజ‌క‌వ‌ర్గాల‌ను పున‌ర్విభ‌జించాల‌ని కేంద్ర ప్ర‌భుత్వం ల‌క్ష్యంగా పెట్టుకున్న విష‌యం తెలిసిందే. ఇటు అసెంబ్లీ,…

3 hours ago

పెను సంక్షోభంలో ప్ర‌పంచం…!

అమెరికా - ఇరాన్ దేశాల మధ్య నెలకొన్న చర్చల ప్రతిష్టంభ‌న ప్రపంచ దేశాలను పెను సంక్షోభంలోకి నెట్టే దిశగా మారుతోందా?…

4 hours ago

రాష్ట్ర‌ప‌తికి బహుమతిగా మంగళగిరి చీర

భార‌త రాష్ట్ర‌ప‌తి ద్రౌప‌దిముర్ముతో ఏపీ మంత్రి, టీడీపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి నారా లోకేష్ భేటీ అయ్యారు. పార్టీకి చెందిన…

4 hours ago

ఏపీ కొత్త ఎన్నిక‌ల క‌మిష‌న‌ర్‌… వైసీపీకి షాకేనా?

ఏపీ రాష్ట్ర ఎన్నిక‌ల సంఘం క‌మిష‌న‌ర్ ప‌ద‌వి ఖాళీ అయింది. గ‌త నెల 31వ తేదీ వ‌ర‌కు ఉన్న రాష్ట్ర…

4 hours ago

‘హోం’ ప్రశ్నలపై ‘సీఎం’ సమాధానం చెప్తారా?

తెలంగాణలో కీలకమైన హోం శాఖను సీఎం రేవంత్ రెడ్డి తన దగ్గర పెట్టుకున్నారు. శాంతిభద్రతలను ఆయనే పర్యవేక్షిస్తున్నారు. అయితే తరచుగా…

6 hours ago