వైసీపీ రాజ్యసభ సభ్యుడు.. ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. త్వరలోనే తాను మీడియా ఛానెల్ పెట్టనున్నట్టు తెలిపారు. తాజాగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తనపై వచ్చిన ఆరోపణలను ఖండించారు. అంతేకాదు.. అర్థం పర్థం లేకుండా చేసిన ప్రచారం.. తనను హర్ట్ అయ్యేలా చేసిందన్నారు. మీడియాకు ఎందుకంత తొందర? అని వ్యాఖ్యానించారు. దేవదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్.. శాంతి భర్త రాసిన లేఖ ఆధారంగా ఆరోపణలు చేయడాన్ని ఆయన ఖండించారు.
“చదువులేని వాళ్లే..మీడియా ఛానెళ్లు పెడుతున్నారు. ఎంతో చదువుకున్న నేను మీడియా ఛానెల్ పెట్టలేనా? ఖచ్చితంగా పెడతాను.” అని సాయిరెడ్డి వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా ఆయన కొన్ని మీడియా ఛానెళ్లు.. శాంతి భర్త రాసిన లేఖను ఆధారంగా చేసుకుని.. తనపై వికృత ప్రచారం చేశాయని.. వాటిపై చర్యలు తీసుకుంటానని ఆయన చెప్పారు. అంతేకాదు.. ప్రతి విషయాన్ని తాను న్యాయ స్థానంలో తేల్చుకుంటానన్నారు.
“ప్రతిపక్షంలో ఉన్నారు.. ఏం చేస్తారులే అని అనుకుంటున్నారా? ప్రతిపక్షంలో ఉన్నా.. న్యాయం, చట్టం వంటివి ఎప్పటికీ ఉంటాయి. కాబట్టి.. చట్ట పరిధిలోనే చర్యలు తీసుకుంటా” అని సాయిరెడ్డి హెచ్చరించారు. కేవలం శాంతి భర్త రాసిన లేఖను ఆధారంగా చేసుకుని.. తనపై తప్పుడు ప్రచారం చేశారని మండిపడ్డారు. దీనివెనుక నిజానిజాలు తెలుసుకునే అవసరం లేకుండా పోయిందా? అని నిలదీశారు. “బుద్ధిలేని ఎండోమెంట్ కమిషనర్ కు ఎంక్వయిరీ చేయమని లెటర్ ఇస్తే.. దాన్ని మీడియాకు ఎలా ఇస్తారు. ఇది కుట్రలో భాగంగానే జరిగింది. పార్లమెంట్లో వంశీకృష్ణపై ప్రివిలేజ్ మోషన్ వేస్తా” అని సాయి రెడ్డి వ్యాఖ్యానించారు.
“వచ్చిన నెలలోనే ప్రభుత్వం అరాచకాలు సృష్టించి భయభ్రాంతులకు గురిచేస్తోంది. మీ తాటాకు చప్పట్లు భయపడను. మధ్యంతర ఎన్నికలు వచ్చినా ఐదు సంవత్సరాల తర్వాత అయినా వైసీపీ అధికారంలోకి వస్తుంది. నా ప్రతిష్టలు దిగజారిచే వారిని వదిలిపెట్టను. నామీద ట్రోల్ చేసిన యూట్యూబ్ ఛానల్, టీవీ ఛానల్ పై హ్యూమన్ రైట్స్ . ట్రైబల్ వెల్ఫేర్ అసోసియేషన్, ఎస్టీ కమిషన్, ప్రెస్ కౌన్సిల్కు ఫిర్యాదు చేస్తాం” అని సాయిరెడ్డి వివరించారు.
This post was last modified on July 15, 2024 3:23 pm
వైసీపీ నేత, ఫైర్ బ్రాండ్ నాయకుడు, మాజీ మంత్రి జోగి రమేష్ ఫ్యామిలీలో కోడలు చేసిన ఆరోపణలు పెను కుదుపునకు…
సినిమాల్లో రాజకీయ అంశాలు పెట్టాలంటే ఒకటికి రెండుసార్లు ఆలోచించుకోవాల్సిన పరిస్థితులున్నాయి ప్రస్తుతం. తమ నాయకుల మీద పొలిటికల్ కౌంటర్లు వేస్తే…
జన నాయకుడు సినిమా ఎలా ఉందనేది మళ్ళీ చెప్పనవసరం లేదు. విజయ్ ఇమేజ్ పుణ్యమాని రెండు వందల కోట్లు దాటేసింది…
ఏపీలో గత 2 మాసాల కిందటి వరకు తీవ్రస్థాయిలో చర్చనీయాంశం అయిన ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా, ఉండి నియోజకవర్గం…
ప్రజలు, శాంతియుతంగా నిరసన చేస్తున్నవారిని కొట్టే హక్కు పోలీసులకు ఉందా? అని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. ఇలా అయితే.. దేశం మొత్తం…
వైసీపీ మాజీ నాయకుడు, రాజ్యసభ మాజీ సభ్యుడు వి. విజయసాయిరెడ్డి కొత్తగా రాజకీయ పార్టీని పెడతానని కొన్నాళ్ల కిందటే ప్రకటించారు.…