Political News

త్వ‌ర‌లోనే ‘ఛానెల్’ పెడ‌తా: సాయిరెడ్డి

వైసీపీ రాజ్య‌స‌భ స‌భ్యుడు.. ఆ పార్టీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి విజ‌య‌సాయిరెడ్డి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. త్వరలోనే తాను మీడియా ఛానెల్ పెట్ట‌నున్న‌ట్టు తెలిపారు. తాజాగా ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ.. త‌న‌పై వ‌చ్చిన ఆరోప‌ణ‌ల‌ను ఖండించారు. అంతేకాదు.. అర్థం ప‌ర్థం లేకుండా చేసిన ప్ర‌చారం.. త‌న‌ను హ‌ర్ట్ అయ్యేలా చేసింద‌న్నారు. మీడియాకు ఎందుకంత తొంద‌ర‌? అని వ్యాఖ్యానించారు. దేవ‌దాయ శాఖ అసిస్టెంట్ క‌మిష‌నర్‌.. శాంతి భ‌ర్త రాసిన లేఖ ఆధారంగా ఆరోప‌ణ‌లు చేయ‌డాన్ని ఆయ‌న ఖండించారు.

“చ‌దువులేని వాళ్లే..మీడియా ఛానెళ్లు పెడుతున్నారు. ఎంతో చ‌దువుకున్న నేను మీడియా ఛానెల్ పెట్ట‌లేనా? ఖ‌చ్చితంగా పెడ‌తాను.” అని సాయిరెడ్డి వ్యాఖ్యానించారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న కొన్ని మీడియా ఛానెళ్లు.. శాంతి భ‌ర్త రాసిన లేఖ‌ను ఆధారంగా చేసుకుని.. త‌న‌పై వికృత ప్ర‌చారం చేశాయ‌ని.. వాటిపై చ‌ర్య‌లు తీసుకుంటాన‌ని ఆయ‌న చెప్పారు. అంతేకాదు.. ప్ర‌తి విష‌యాన్ని తాను న్యాయ స్థానంలో తేల్చుకుంటాన‌న్నారు.

“ప్ర‌తిప‌క్షంలో ఉన్నారు.. ఏం చేస్తారులే అని అనుకుంటున్నారా? ప్ర‌తిప‌క్షంలో ఉన్నా.. న్యాయం, చట్టం వంటివి ఎప్ప‌టికీ ఉంటాయి. కాబ‌ట్టి.. చ‌ట్ట ప‌రిధిలోనే చ‌ర్య‌లు తీసుకుంటా” అని సాయిరెడ్డి హెచ్చరించారు. కేవ‌లం శాంతి భ‌ర్త రాసిన లేఖ‌ను ఆధారంగా చేసుకుని.. త‌న‌పై త‌ప్పుడు ప్ర‌చారం చేశార‌ని మండిప‌డ్డారు. దీనివెనుక నిజానిజాలు తెలుసుకునే అవ‌స‌రం లేకుండా పోయిందా? అని నిల‌దీశారు. “బుద్ధిలేని ఎండోమెంట్ కమిషనర్ కు ఎంక్వయిరీ చేయమని లెటర్ ఇస్తే.. దాన్ని మీడియాకు ఎలా ఇస్తారు. ఇది కుట్రలో భాగంగానే జరిగింది. పార్లమెంట్లో వంశీకృష్ణపై ప్రివిలేజ్ మోషన్ వేస్తా” అని సాయి రెడ్డి వ్యాఖ్యానించారు.

“వచ్చిన నెలలోనే ప్రభుత్వం అరాచకాలు సృష్టించి భయభ్రాంతులకు గురిచేస్తోంది. మీ తాటాకు చప్పట్లు భయపడను. మ‌ధ్యంతర ఎన్నికలు వచ్చినా ఐదు సంవత్సరాల తర్వాత అయినా వైసీపీ అధికారంలోకి వస్తుంది. నా ప్రతిష్టలు దిగజారిచే వారిని వదిలిపెట్టను. నామీద ట్రోల్ చేసిన యూట్యూబ్ ఛానల్, టీవీ ఛానల్ పై హ్యూమన్ రైట్స్ . ట్రైబల్ వెల్ఫేర్ అసోసియేషన్, ఎస్టీ కమిషన్, ప్రెస్ కౌన్సిల్‌కు ఫిర్యాదు చేస్తాం” అని సాయిరెడ్డి వివ‌రించారు.

This post was last modified on July 15, 2024 3:23 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

వైసీపీ పంచాంగం.. కేంద్రం ప్లస్.. రాష్ట్రం మైనస్

ఏపీలో త్వరలో మంత్రుల శాఖలు మారతాయట..? ప్రభుత్వంలో భారీగానే మార్పులు ఉంటాయట..? ఇది ఏ రాజకీయ విశ్లేషలు చెప్పిన జోస్యం…

13 minutes ago

ఆ యూట్యూబర్లకు ‘పరాభవం’ తప్పదట

సాధారణంగా ఉగాది సందర్భంగా రాజకీయ నాయకులు, వ్యాపారవేత్తలు తమ ఇంట్లో పంచాంగ శ్రవణం జరుపుతుంటారు. ఈ సందర్భంగా వారికి ఈ…

1 hour ago

క‌విత పార్టీకి న్యాయ చిక్కులు… ఏం జరిగింది?

బీఆర్ఎస్ నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చి.. సొంత పార్టీ పెట్టుకునేందుకు రెడీ అయిన మాజీ సీఎం కేసీఆర్ కుమార్తె క‌విత త‌న…

3 hours ago

ఫిక్స్… మూడో భాగం ఛాన్స్ లేదు

బాక్సాఫీస్ వద్ద ర్యాంపేజ్ చూపిస్తున్న దురంధర్ ది రివెంజ్ కు సంబంధించి ఒక ముఖ్యమైన ప్రశ్న అందరి మెదళ్లను తొలిచేసింది.…

3 hours ago

పవన్ పట్టుకు బాలినేని లొంగిపోయారా?

బాలినేని శ్రీనివాస రెడ్డి జనసేనలో చేరిన తర్వాత పెద్దగా యాక్టివ్ గా లేని సంగతి తెలిసిందే. అధికారికంగా జనసేన నిర్వహించే…

4 hours ago

ఊపిరి పీల్చుకుంటున్న తెలుగు థియేటర్లు

ఫిబ్రవరితో మొదలుపెట్టి మార్చి రెండో వారం దాకా పట్టుమని వారం రోజులు హౌస్ ఫుల్ చేసే సినిమా లేక గగ్గోలు…

4 hours ago