ఒకప్పుడు ఆయన మాట అంటే శాసనం. పార్టీలో, ప్రభుత్వంలో ఆయన మాటకు ఎదురే లేదు. వరుసగా రెండు సార్లు సీఎం పీఠంపై కూర్చుని రాష్ట్రాన్ని గుప్పిట్లో పెట్టుకున్నారనే చెప్పాలి. కానీ కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు కదా.
అధికారం ఉందని ఎగిరెగిరి పడితే ప్రజలు ఓటుతో తగిన బుద్ధి చెబుతారన్నది కాదనలేని నిజం. ఎన్నికల్లో ఓటమితో ఆ నాయకుడి పవర్ పోయింది. మాటలు వినేవాళ్లే లేరు. ఆ నేత ఎవరో కాదు కేసీఆర్. అవును.. ఇప్పుడు కేసీఆర్ మాటను వినేవాళ్లెవరు? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
మునిగిపోయే కారులో ఉండటం కంటే అధికారంలో ఉన్న చేయిని అందుకోవడం మేలని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్లోకి వరుస కట్టారు. ఇప్పటికే 9 మంది ఎమ్మెల్యేలు పార్టీ జంప్ అయ్యారు. మరికొంత మంది లైన్లో ఉన్నారు. పార్టీ మొత్తం ఖాళీ అయ్యే పరిస్థితి నెలకొంది.
అయినా కేసీఆర్ మాత్రం సైలెంట్గా ఫామ్హౌజ్లో రెస్టు తీసుకుంటున్నారు. ఇటీవల ఒకసారి ఎమ్మెల్యేలు, నాయకులతో సమావేశం పెట్టి పార్టీలోనే ఉండాలని చెప్పారు. భవిష్యత్ బీఆర్ఎస్దేనని పేర్కొన్నారు. కానీ ఆయన మాటలను పట్టించుకోని నాయకులు నమ్మకం లేదు దొరా అంటూ రేవంత్కు జై కొడుతున్నారు.
ఒకప్పుడు కేసీఆర్ మాటను జవదాటని నాయకులు ఇప్పుడు లెక్క చేయడం లేదు. కేసీఆర్ వైఖరి కారణంగానే గత ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓడిందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అందుకే కేసీఆర్ మాటకు ఇప్పుడు విలువ లేకుండా పోయిందనే టాక్ వినిపిస్తోంది.
మరోవైపు కేసీఆర్ కూడా వాస్తవ పరిస్థితులను తెలుసుకుని సైలెంట్గా ఉండిపోతున్నారని అంటున్నారు. పార్టీ మారొద్దని చెప్పగలరు కానీ బలవంతంగా ఎవరినీ ఆపలేరు కదా. కేసీఆర్ వరస చూస్తుంటే కాంగ్రెస్లో బీఆర్ఎస్ ఎల్పీ విలీనం ఖాయమనే నిర్ణయానికి వచ్చినట్లు కనిపిస్తున్నారనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.
This post was last modified on July 14, 2024 11:03 pm
వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…
అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…
మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ.. సంక్రాంతి. ఇళ్లకే కాదు.. గ్రామాలకు సైతం శోభను తీసుకువచ్చే సంక్రాంతికి.. కోడి…
ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…
బీజేపీ కురువృద్ధ నాయకుడు, దేశ మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు.. ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకొన్నారు. అయితే.. ఆయన…