Political News

బాబును ఇరికిద్దామ‌ని.. తానే ఇరుక్కున్న జ‌గ‌న్‌!

ఏపీలో కీల‌క ప‌థ‌కంపై రాజ‌కీయ వివాదం రేగింది. ఎన్నిక‌ల‌కు ముందు చంద్ర‌బాబు ప్ర‌క‌టించిన “త‌ల్లికి వంద‌నం” ప‌థ‌కంపై వైసీపీ నాయ‌కుల నుంచి మాట‌ల తూటాలు పేలుతున్నాయి. ఈ ప‌థ‌కం అమ‌లుకు ప్ర‌భుత్వం నుంచి ఇంకా క్లారిటీ రాలేదు. అయితే.. నెంబ‌రు 29 కింద ఓ జీవోను ఇష్యూ చేశారు. దీనిలో త‌ల్లికి వంద‌నం ప‌థ‌కం కోసం.. ఆధార్ కార్డును సిద్ధం చేసుకోవా ల‌ని.. ఇది లేనివాళ్లు తీసుకోవాల‌ని సూచించారు. ఇంత‌లోనే దీనిపై పెద్ద ఎత్తున దుమారం రేగింది. త‌ల్లికి వంద‌నం ప‌థ‌కాన్ని ఒక్క‌రికే ప‌రిమితం చేస్తున్నారంటూ.. వైసీపీ నాయ‌కులు విరుచుకుప‌డ్డారు.

ఎన్నిక‌ల‌కుముందు.. ఇంట్లో ఎంత మంది స్కూల్కు వెళ్లే పిల్ల‌లు ఉన్నా.. వారికి రూ.15000 చొప్పున పంపిణీ చేస్తామంటూ.. చంద్ర‌బాబు ప్ర‌క‌టించారు. ఇద్ద‌రుంటే .. 30 వేలు, ముగ్గురంటే 45 వేలు, న‌లుగురుంటే 60 వేలు ఇస్తామ‌ని.. చెప్పిన మాట వాస్త‌వం. అయితే.. దీనిపై ఇంకా క్లారిటీ ఇవ్వ‌లేదు. ఎప్ప‌టి నుంచి ఈప‌థ‌కాన్ని అమ‌లు చేస్తామ‌ని కూడా చెప్ప‌లేదు. దీంతో రాష్ట్రంలో ఈ విష‌యం ఒకవైపు చ‌ర్చ‌గా మారింది. ఎప్పుడు అమ‌లు చేస్తారంటూ.. కొంద‌రు త‌ల్లులు నాయ‌కుల‌ను ప్ర‌శ్నిస్తున్నారు. దీంతో ముందు ఈ ర‌చ్చ‌ను స‌ర్దుమ‌ణిగేలా చేసేందుకు స‌ర్కారు జీవో 29ని విడుద‌ల చేసింది.

అయితే.. ఎప్పుడు వివాదం చేద్దామ‌ని ఎదురు చూస్తున్నారో.. ఏమో వైసీపీ నాయ‌కులు అంబ‌టి రాంబాబు, గుడివాడ అమ‌ర్నాథ్‌లు స్పందించి.. అదిగో చంద్ర‌బాబు మాట త‌ప్పుతున్నాడంటూ.. తీవ్ర విమ‌ర్శ‌లు చేశారు. ఇదే స‌మ‌యంలో జ‌గ‌న్‌ను ఆకాశానికి ఎత్తేశారు. వాస్త‌వానికి 2019 ఎన్నిక‌ల‌కు ముందు కూడా.. జ‌గ‌న్ ఇంట్లో ఎంత మంది పిల్ల‌లు ఉన్నా.. రూ.15 వేల చొప్పున ఇస్తామ‌ని చెప్పారు. కానీ, అదికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత ఒక్క‌రికే ప‌రిమితం చేశారు. ఈ ప‌రిణామంపై అనేక విమ‌ర్శ‌లు వ‌చ్చినా.. ఆయ‌న స్పందించ‌లేదు.

ఇక‌, ఇప్పుడు అధికారం కోల్పోవ‌డంతో చంద్ర‌బాబును ఏదో ఒక‌ర‌కంగా ఇరుకున పెట్టాల‌న్న ల‌క్ష్యంతో వారు ఈ ప‌థ‌కాన్ని ఎంచుకుని విమ‌ర్శ‌లు గుప్పిస్తున్నారు. అయితే.. గ‌తంలో జ‌గ‌న్ మౌనంగా ఉన్న‌ట్టు ఇప్పుడు చంద్ర‌బాబు మౌనంగా లేరు. దీనిపై వివ‌రణ ఇచ్చారు. ఈ నేప‌థ్యంలోనే ఇది కేవ‌లం జీవోనేన‌ని.. విధివిధానాల‌ను త‌ర్వాత ఖ‌రారు చేస్తామ‌ని.. ఆధార్ అప్ డేష‌న్‌, ఆధార్ లేని వారు అలెర్ట్ అయ్యేందుకు మాత్ర‌మే ఇప్పుడు జీవో ఇచ్చామ‌ని వివ‌ర‌ణ ఇచ్చుకుంది. అయితే.. వైసీపీ అత్యుత్సాహం.. ఆ పార్టీ నేత‌ల‌పైనే విమ‌ర్శ‌లు గుప్పించేందుకు తావిచ్చింది. గ‌తంలో మాట త‌ప్పిన మీరా? మ‌మ్మ‌ల్ని ప్ర‌శ్నించేది అంటూ.. టీడీపీ నాయ‌కులు ఎదురు ప్ర‌శ్నిస్తున్నారు.

This post was last modified on July 12, 2024 9:12 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

ష‌ర్మిలమ్మా.. మీ పార్టీ దీన‌స్థితి చూడ‌మ్మా.. !

ఏపీ కాంగ్రెస్ పార్టీ ప‌రిస్థితి నానాటికీ తీసిక‌ట్టుగా మారుతోందా? .. పార్టీ నాయ‌కులు దీన‌స్థితిలో ఉన్నారా? అంటే.. ఔన‌నే స‌మాధాన‌మే…

1 hour ago

ఇరాన్‌లో భారతీయ విద్యార్థులు.. ఇటు ప్రాణాలు, అటు పరీక్షలు

ఇరాన్‌లో ప్రస్తుతం నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు అక్కడ వైద్య విద్యనభ్యసిస్తున్న భారతీయ విద్యార్థులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఒకవైపు అమెరికా…

2 hours ago

బాలీవుడ్‌కు పొలిశెట్టి పంచ్

ఇప్పుడు తెలుగులో వంద కోట్ల హీరోగా ఎదిగాడు న‌వీన్ పొలిశెట్టి. సంక్రాంతికి విడుదలైన త‌న చివ‌రి చిత్రం అన‌గ‌న‌గా ఒక…

2 hours ago

శర్వానంద్ భోగికి అసలైన ఛాలెంజ్

2026 శర్వానంద్ కు చాలా స్పెషల్ ఇయర్ గా నిలవబోతోంది. సంక్రాంతి పండక్కు విపరీతమైన పోటీ మధ్య 'నారి నారి…

3 hours ago

అయ్యన్నను ఓడించిన రఘురామ

రాజ‌కీయాల్లోనే కాదు.. ఆట‌ల్లోనూ త‌న సత్తా నిరూపించారు... ఉండి ఎమ్మెల్యే అసెంబ్లీ డిప్యూటీ స్పీక‌ర్ ర‌ఘురామ‌కృష్ణ‌రాజు. అసెంబ్లీ బడ్జెట్ స‌మావేశాల…

3 hours ago

నంది అవార్డులంటే అంత చులకనా

ఇప్పుడు ఏపీలో ఇంకా వాటి పునరుద్ధరణ జరగలేదు, తెలంగాణలో గద్దర్ గా పేరు మారింది కానీ ఒకప్పుడు నంది అవార్డులంటే…

4 hours ago