ఏపీలో కీలక పథకంపై రాజకీయ వివాదం రేగింది. ఎన్నికలకు ముందు చంద్రబాబు ప్రకటించిన “తల్లికి వందనం” పథకంపై వైసీపీ నాయకుల నుంచి మాటల తూటాలు పేలుతున్నాయి. ఈ పథకం అమలుకు ప్రభుత్వం నుంచి ఇంకా క్లారిటీ రాలేదు. అయితే.. నెంబరు 29 కింద ఓ జీవోను ఇష్యూ చేశారు. దీనిలో తల్లికి వందనం పథకం కోసం.. ఆధార్ కార్డును సిద్ధం చేసుకోవా లని.. ఇది లేనివాళ్లు తీసుకోవాలని సూచించారు. ఇంతలోనే దీనిపై పెద్ద ఎత్తున దుమారం రేగింది. తల్లికి వందనం పథకాన్ని ఒక్కరికే పరిమితం చేస్తున్నారంటూ.. వైసీపీ నాయకులు విరుచుకుపడ్డారు.
ఎన్నికలకుముందు.. ఇంట్లో ఎంత మంది స్కూల్కు వెళ్లే పిల్లలు ఉన్నా.. వారికి రూ.15000 చొప్పున పంపిణీ చేస్తామంటూ.. చంద్రబాబు ప్రకటించారు. ఇద్దరుంటే .. 30 వేలు, ముగ్గురంటే 45 వేలు, నలుగురుంటే 60 వేలు ఇస్తామని.. చెప్పిన మాట వాస్తవం. అయితే.. దీనిపై ఇంకా క్లారిటీ ఇవ్వలేదు. ఎప్పటి నుంచి ఈపథకాన్ని అమలు చేస్తామని కూడా చెప్పలేదు. దీంతో రాష్ట్రంలో ఈ విషయం ఒకవైపు చర్చగా మారింది. ఎప్పుడు అమలు చేస్తారంటూ.. కొందరు తల్లులు నాయకులను ప్రశ్నిస్తున్నారు. దీంతో ముందు ఈ రచ్చను సర్దుమణిగేలా చేసేందుకు సర్కారు జీవో 29ని విడుదల చేసింది.
అయితే.. ఎప్పుడు వివాదం చేద్దామని ఎదురు చూస్తున్నారో.. ఏమో వైసీపీ నాయకులు అంబటి రాంబాబు, గుడివాడ అమర్నాథ్లు స్పందించి.. అదిగో చంద్రబాబు మాట తప్పుతున్నాడంటూ.. తీవ్ర విమర్శలు చేశారు. ఇదే సమయంలో జగన్ను ఆకాశానికి ఎత్తేశారు. వాస్తవానికి 2019 ఎన్నికలకు ముందు కూడా.. జగన్ ఇంట్లో ఎంత మంది పిల్లలు ఉన్నా.. రూ.15 వేల చొప్పున ఇస్తామని చెప్పారు. కానీ, అదికారంలోకి వచ్చిన తర్వాత ఒక్కరికే పరిమితం చేశారు. ఈ పరిణామంపై అనేక విమర్శలు వచ్చినా.. ఆయన స్పందించలేదు.
ఇక, ఇప్పుడు అధికారం కోల్పోవడంతో చంద్రబాబును ఏదో ఒకరకంగా ఇరుకున పెట్టాలన్న లక్ష్యంతో వారు ఈ పథకాన్ని ఎంచుకుని విమర్శలు గుప్పిస్తున్నారు. అయితే.. గతంలో జగన్ మౌనంగా ఉన్నట్టు ఇప్పుడు చంద్రబాబు మౌనంగా లేరు. దీనిపై వివరణ ఇచ్చారు. ఈ నేపథ్యంలోనే ఇది కేవలం జీవోనేనని.. విధివిధానాలను తర్వాత ఖరారు చేస్తామని.. ఆధార్ అప్ డేషన్, ఆధార్ లేని వారు అలెర్ట్ అయ్యేందుకు మాత్రమే ఇప్పుడు జీవో ఇచ్చామని వివరణ ఇచ్చుకుంది. అయితే.. వైసీపీ అత్యుత్సాహం.. ఆ పార్టీ నేతలపైనే విమర్శలు గుప్పించేందుకు తావిచ్చింది. గతంలో మాట తప్పిన మీరా? మమ్మల్ని ప్రశ్నించేది అంటూ.. టీడీపీ నాయకులు ఎదురు ప్రశ్నిస్తున్నారు.
This post was last modified on July 12, 2024 9:12 pm
రణ్బీర్ కపూర్, సందీప్ రెడ్డి వంగా కాంబినేషన్లో వచ్చిన ‘యానిమల్’ 2023లో బాక్సాఫీస్ బిగ్ హిట్ గా నిలిచిన విషయం…
మ్యూజిక్ డైరెక్టర్ తమన్ తన ప్రపంచంలో మరో కోణాన్ని బయటపెట్టాడు. రీసెంట్గా ఒక ఇంటర్వ్యూలో పర్సనల్ చారిటీ వర్క్ గురించి…
వరుణ్ తేజ్ కు చాలా గ్యాప్ తర్వాత సక్సెస్ ఇచ్చిన సినిమాగా కొరియన్ కనకరాజు తొలి నాలుగు రోజుల్లోనే బ్రేక్…
గుజరాత్ రాష్ట్రంలో కొత్త వైరస్ కలకలం సృష్టిస్తుంది. రోజుల పరిధిలోనే పదుల సంఖ్యలో చిన్నారుల ప్రాణాలను బలికొనడం భయాందోళన కలిగిస్తుంది.…
కొన్నేళ్లుగా ఆంధ్ర రాష్ట్రంలో రాజకీయ వాతావరణంలో విచారకర మార్పులు వచ్చాయి. రాజకీయ కాలుష్యం ఏర్పడ్డటంతో ప్రజలు చిరాకు పడుతున్నారు. వైసీపీ…
2027 సంక్రాంతి పందెం క్రమంగా వేడెక్కుతోంది. శర్వానంద్ - శ్రీను వైట్ల కాంబో ' జార్జ్ క్రిష్' జనవరి 14…