ఆమె ఫస్ట్ టైం పార్లమెంటుకు ఎన్నికయ్యారు. కానీ, ముదురు షరతులు పెడుతున్నారు. నియోజకవర్గం లో ప్రజలు తనను కలసి సమస్యలు చెప్పుకొనేందుకు వస్తే.. ముందుగా వారి ఆధార్ కార్డును అడ్రస్ను చూపించాలని ఆమె షరతులు విధించారు. దీంతో ఈ వ్యవహారం తీవ్ర దుమారం రేపింది. ఇంతకీ ఆమె ఎవరో కాదు.. ఫైర్ బ్రాండ్ నాయకురాలు.. నటి.. కంగనా రనౌత్.
ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో హిమాచల్ ప్రదేశ్లోని మండి స్థానం నుంచి బీజేపీ తరఫున ఆమె పోటీ చేసిన విషయం తెలిసిందే. నిజానికి ఆమె పోటీలో ఉన్న సమయంలోనే వివాదాలకు కేంద్రంగా మారారు. ఇక, ఇప్పుడు నియోజకవర్గ ప్రజలు.. తనను కలిసి సమస్యలు చెప్పుకోవాలంటే.. రెండు షరతులు ఖచ్చితంగా పాటించాలని రనౌత్ తేల్చి చెప్పారు.
1) తనను కలిసేందుకు వచ్చేవారు ఆధార్ లేదా అడ్రస్ను ధ్రువీకరించే పత్రాలు తీసుకురావాలి.
2) ఏ సమస్య అయినా నోటితో చెప్పడం కాదు.. లిఖిత పూర్వకంగానే ఇవ్వాలి. ఈ రెండు షరతులకు లోబడి మాత్రమే.. తనను కలిసేందుకు రావాలని తేల్చి చెప్పారు.
‘హిమాచల్ ప్రదేశ్ కు చాలా మంది పర్యాటకులు వస్తుంటారు. అందువల్ల మండి ప్రాంతం నుంచి వచ్చే వారు ఆధార్ కార్డులు తీసుకురావడం తప్పనిసరి. నియోజకవర్గ పనులకు సంబంధించిన వివరాలను కూడా కాగితంపై తీసుకురండి. దీనివల్ల మీరు ఎలాంటి ఇబ్బంది పడకుండా ఉంటారు’ అంటూ కంగనా వ్యాఖ్యానించడం గమనార్హం.
మరిన్ని షరతులు…
This post was last modified on July 12, 2024 2:22 pm
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు మొదటిసారి సీఎంగా పదవీ బాధ్యతలు చేపట్టలేదు. ఇప్పటికే పలుమార్లు ముఖ్యమంత్రిగా వ్యవహరించిన ఆయన.. పాలనా పరంగా…
హైదరాబాద్ రూపురేఖలు మారిపోతున్నాయి. గతానికి భిన్నంగా దేశంలోని మెట్రోపాలిటిన్ నగరాల్లో కొన్నింటిని మించిపోయిన భాగ్యనగరి.. మరికొన్ని మహానగరాల దూకుడుకు ఏ…
రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం తీసుకువచ్చిన రెండు కీలక వ్యవస్థలను ప్రభుత్వ శాఖల్లో కలిపేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. జగన్ హయాంలో…
ఒక అపార్టుమెంట్ లోని పార్కింగ్ వద్ద చోటు చేసుకున్న పంచాయితీ ఏకంగా దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు వరకు వెళ్లటం…
దేవర పార్ట్ 1 విడుదల కోసం అభిమానులతో సమానంగా విలన్ గా నటించిన సైఫ్ అలీ ఖాన్ ఆతృతగా ఎదురు…
ఏపీలో చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం నూతన మద్యం విధానాన్ని తీసుకువస్తున్న విషయం తెలిసిందే. తాజాగా జరిగిన మంత్రి వర్గ…