ఆమె ఫస్ట్ టైం పార్లమెంటుకు ఎన్నికయ్యారు. కానీ, ముదురు షరతులు పెడుతున్నారు. నియోజకవర్గం లో ప్రజలు తనను కలసి సమస్యలు చెప్పుకొనేందుకు వస్తే.. ముందుగా వారి ఆధార్ కార్డును అడ్రస్ను చూపించాలని ఆమె షరతులు విధించారు. దీంతో ఈ వ్యవహారం తీవ్ర దుమారం రేపింది. ఇంతకీ ఆమె ఎవరో కాదు.. ఫైర్ బ్రాండ్ నాయకురాలు.. నటి.. కంగనా రనౌత్.
ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో హిమాచల్ ప్రదేశ్లోని మండి స్థానం నుంచి బీజేపీ తరఫున ఆమె పోటీ చేసిన విషయం తెలిసిందే. నిజానికి ఆమె పోటీలో ఉన్న సమయంలోనే వివాదాలకు కేంద్రంగా మారారు. ఇక, ఇప్పుడు నియోజకవర్గ ప్రజలు.. తనను కలిసి సమస్యలు చెప్పుకోవాలంటే.. రెండు షరతులు ఖచ్చితంగా పాటించాలని రనౌత్ తేల్చి చెప్పారు.
1) తనను కలిసేందుకు వచ్చేవారు ఆధార్ లేదా అడ్రస్ను ధ్రువీకరించే పత్రాలు తీసుకురావాలి.
2) ఏ సమస్య అయినా నోటితో చెప్పడం కాదు.. లిఖిత పూర్వకంగానే ఇవ్వాలి. ఈ రెండు షరతులకు లోబడి మాత్రమే.. తనను కలిసేందుకు రావాలని తేల్చి చెప్పారు.
‘హిమాచల్ ప్రదేశ్ కు చాలా మంది పర్యాటకులు వస్తుంటారు. అందువల్ల మండి ప్రాంతం నుంచి వచ్చే వారు ఆధార్ కార్డులు తీసుకురావడం తప్పనిసరి. నియోజకవర్గ పనులకు సంబంధించిన వివరాలను కూడా కాగితంపై తీసుకురండి. దీనివల్ల మీరు ఎలాంటి ఇబ్బంది పడకుండా ఉంటారు’ అంటూ కంగనా వ్యాఖ్యానించడం గమనార్హం.
మరిన్ని షరతులు…
This post was last modified on July 12, 2024 2:22 pm
ఏపీ సీఎం చంద్రబాబు ఏ చిన్న అవకాశాన్నీ వదలట్లేదా? అంటే.. ఔననే సమాధానమే వస్తోంది. పెట్టుబడులకు ఎక్కడ అవకాశం ఉంటే..…
ప్రేక్షకులను థియేటర్లకు వచ్చేలా చేయడం చిన్న సినిమాల నిర్మాతలకు దినదిన గండంగా మారిపోయింది. ఆడియన్స్ అభిరుచులు మారిపోయాయో లేక ఓటిటిల…
మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ రవిచందర్ వచ్చే మార్చి 21 హైదరాబాద్ లో లైవ్ కన్సర్ట్ చేయబోతున్న సంగతి తెలిసిందే. గచ్చిబౌలి…
ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో శాసన సభను బాయ్కాట్ చేసిన వైసీపీ ప్రజాప్రతినిధులు శాసన మండలిలో మాత్రం చిందులు తొక్కుతున్నారు.…
తనతో కలిసి సినిమాలు చేసేవాళ్లకు ప్రభాస్ విందు భోజనాలతో ఎలా సర్ప్రైజ్ చేయిస్తుంటాడో కథలు కథలుగా చెబుతుంటారు. హైదరాబాద్లో షూటింగ్స్…
ఏపీని రాజకీయంగా కుదిపేస్తున్న తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వ్యవహారంపై రాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది.…