ఆమె ఫస్ట్ టైం పార్లమెంటుకు ఎన్నికయ్యారు. కానీ, ముదురు షరతులు పెడుతున్నారు. నియోజకవర్గం లో ప్రజలు తనను కలసి సమస్యలు చెప్పుకొనేందుకు వస్తే.. ముందుగా వారి ఆధార్ కార్డును అడ్రస్ను చూపించాలని ఆమె షరతులు విధించారు. దీంతో ఈ వ్యవహారం తీవ్ర దుమారం రేపింది. ఇంతకీ ఆమె ఎవరో కాదు.. ఫైర్ బ్రాండ్ నాయకురాలు.. నటి.. కంగనా రనౌత్.
ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో హిమాచల్ ప్రదేశ్లోని మండి స్థానం నుంచి బీజేపీ తరఫున ఆమె పోటీ చేసిన విషయం తెలిసిందే. నిజానికి ఆమె పోటీలో ఉన్న సమయంలోనే వివాదాలకు కేంద్రంగా మారారు. ఇక, ఇప్పుడు నియోజకవర్గ ప్రజలు.. తనను కలిసి సమస్యలు చెప్పుకోవాలంటే.. రెండు షరతులు ఖచ్చితంగా పాటించాలని రనౌత్ తేల్చి చెప్పారు.
1) తనను కలిసేందుకు వచ్చేవారు ఆధార్ లేదా అడ్రస్ను ధ్రువీకరించే పత్రాలు తీసుకురావాలి.
2) ఏ సమస్య అయినా నోటితో చెప్పడం కాదు.. లిఖిత పూర్వకంగానే ఇవ్వాలి. ఈ రెండు షరతులకు లోబడి మాత్రమే.. తనను కలిసేందుకు రావాలని తేల్చి చెప్పారు.
‘హిమాచల్ ప్రదేశ్ కు చాలా మంది పర్యాటకులు వస్తుంటారు. అందువల్ల మండి ప్రాంతం నుంచి వచ్చే వారు ఆధార్ కార్డులు తీసుకురావడం తప్పనిసరి. నియోజకవర్గ పనులకు సంబంధించిన వివరాలను కూడా కాగితంపై తీసుకురండి. దీనివల్ల మీరు ఎలాంటి ఇబ్బంది పడకుండా ఉంటారు’ అంటూ కంగనా వ్యాఖ్యానించడం గమనార్హం.
మరిన్ని షరతులు…
నిన్న విడుదలైన హాలీవుడ్ మూవీ ది ఒడిస్సికి ఇండియాలో బ్రహ్మరథం దక్కుతోంది. క్రిస్టోఫర్ నోలన్ గత సినిమాలు దేనికి రానంత…
స్టార్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ పై తెలుగు ఫిలిం ఇండస్ట్రీ ఎంప్లాయిస్ ఫెడరేషన్ కఠిన చర్యలకు సిద్ధమైంది. ఆయనకు సహాయ…
వైసీపీ అధినేత, ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గురించి ఆయన పార్టీ నేతలు గానీ, అభిమానులు…
దురంధర్ ముందు వరకు నాన్ బాలీవుడ్ రాష్ట్రాల్లో అంతగా పరిచయం లేని పేరు ఆదిత్య ధార్. ఏడు గంటలకు పైగా…
న్యాచురల్ స్టార్ నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కలయికలో తెరకెక్కుతున్న ది ప్యారడైజ్ సెప్టెంబర్ 24 రావడం దాదాపు ఖాయమే.…
జనసేన పార్టీ అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్కు పరామర్శలు వెల్లువలా తరలి వస్తున్నాయి. ఏపీ సహా తెలంగాణ…