Political News

టీడీపీలో ప‌ద‌వుల ర‌గ‌డ‌.. ఏం జ‌రుగుతోందంటే..!

ఉత్తరాంధ్ర టిడిపిలో పదవుల కలకలం రేగింది. కీలకమైన నాయకులకు సీఎం చంద్రబాబు ఎలాంటి పదవులు ఇవ్వలేదు. ఉదాహరణకు మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు ఈసారి భీమిలి నుంచి భారీ మెజారిటీతో విజయం దక్కించుకున్నారు. అయితే ఆయనను మంత్రివర్గంలోకి తీసుకుంటారని, పదవి ఇస్తారని ఆయన వర్గం ఆశించింది. కానీ అట్లాంటిదేమి చంద్రబాబు పట్టించుకోలేదు. ఇదే సమయంలో విజయనగరం జిల్లాకు చెందిన మాజీమంత్రి పూసపాటి అశోక్ గజపతిరాజు కుమార్తె అదితి గజపతిరాజు కూడా తొలిసారి విజయం దక్కించుకున్నారు.

వాస్తవానికి క్షత్రియ వెలమ సామాజిక వర్గం నుంచి అశోక్ గజపతిరాజు కుమార్తె అతిథి గజపతిరాజుకు మంత్రివర్గంలో చోటు తగ్గుతుందని ఆయన కూడా ఆశలు పెట్టుకున్నారు. అయితే చంద్రబాబు వారికి కూడా అవకాశం కల్పించలేదు. ఇక ఇదే జిల్లాలోని వైసీపీ నుంచి టిడిపిలోకి వచ్చిన బేబీ నాయన అదే విధంగా ఇతర నాయకులు కూడా మంత్రివర్గంలో సీట్లు దొరుకు దొరుకుతాయని ఆశలు పెట్టుకున్నారు. వారి అసలు కూడా చంద్రబాబు తీర్చ లేకపోయారు. వీరంతా టిడిపిపై ఒకంత అసహనంతో ఉన్నారు. దీంతో ఫ‌లితం వ‌చ్చి నెలరోజులు అయినప్పటికీ.. తొలి వారం రోజులు కొంత హడావిడి చేసినా ఆ తర్వాత మాత్రం అందరూ సైలెంట్ అయిపోయారు.

ఎవరూ బయటికి రావట్లేదు. ఉదాహరణకు విశాఖ రుషికొండపై వైయస్ జగన్మోహన్ రెడ్డి హయంలో పెద్ద ఎత్తున భవనాలు నిర్మించారంటూ మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు మీడియాను తీసుకెళ్లి మరి చూపించారు. దానిపై పెద్ద ఎత్తున విమర్శలు కూడా చేశారు. నిజానిజాలు తెలుసుకోమని చెప్పారు. అయితే ఇదంతా మంత్రివర్గం ఏర్పాటు కాకముందు జరిగింది. మంత్రివర్గం ఏర్పడిన తర్వాత ఆయన కూడా సైలెంట్ అయిపోయారు. ఎక్కడా మాట్లాడటం లేదు. కనీసం మీడియా ముందు కూడా రావట్లేదు. అంటే ఆయన కూడా అసంతృప్తితో ఉన్నారనే విషయం స్పష్టంగా తెలుస్తోంది.

ఇక‌, అసోక్ గ‌జ‌ప‌తి రాజు తన కుమార్తెకు మంత్రి పదవి ఇస్తారని ఆశలు పెట్టుకున్నారు. అయితే చంద్రబాబు ఆమెకు కాకుండా ఎస్టీ సామాజిక వర్గానికి చెందిన‌ గుమ్మ‌డి సంధ్యారాణికి అవకాశం కల్పించారు. దీంతో పూస‌పాటి వ‌ర్గం కూడా ఆవేదన‌లో ఉంది. ఇక సంప్రదాయంగా వస్తున్న టెక్కలి నియోజకవర్గం ఎమ్మెల్యే, పార్టీ గత అధ్యక్షుడు అచ్చం నాయుడుకి పదవి ఇవ్వటం, ఇతర నాయకులను పట్టించుకోకపోవడం కూడా పార్టీలో కొంత అసంతృప్తికి దారితీస్తోంది. దీంతో ఉత్తరాంధ్ర టిడిపిలో అసంతృప్తి స్పష్టంగా కనిపిస్తోంది.

మరి దీన్ని చల్లారిచేందుకు చంద్రబాబు ఏమైనా నామినేటెడ్ పదవులను ఇస్తారా లేక నాయకులను బుజ్జగిస్తారా ఇవన్నీ కాదనుకుంటే ఎలా ఉన్నా పరవాలేదు అనుకుని వేచి చూస్తారా అనేది రాజకీయంగా టిడిపిలో చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుతం ఉన్న పరిస్థితి అయితే ఉత్తరాంధ్రలో ఒకింత న‌ర్మగ‌ర్బంగానే ఉంది. ఇదిలా ఉంటే త్వరలోనే విజయనగరం మున్సిపల్ స్థానిక సంస్థల ఎన్నికల పరిధిలో ఎమ్మెల్సీ ఉప ఎన్నిక రానుంది. విజయం సాధించాలి అంటే అందరూ కలిసికట్టుగా పనిచేయాల్సిన అవసరం ఉంది. ఈ నేపథ్యంలో చంద్రబాబు పార్టీ నాయకులను ఏకతాటిపైకి తీసుకు వస్తారా లేదా అనేది కూడా ఇప్పుడు వేచి చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది.

This post was last modified on July 11, 2024 4:18 pm

Share
Show comments

Recent Posts

నియోజ‌క‌వ‌ర్గాల‌పై రేవంత్ కొత్త ఫార్ములా… వ‌ర్కువ‌ట్ అయ్యేనా?

2029 పార్ల‌మెంటు ఎన్నిక‌ల నాటికి దేశంలో నియోజ‌క‌వ‌ర్గాల‌ను పున‌ర్విభ‌జించాల‌ని కేంద్ర ప్ర‌భుత్వం ల‌క్ష్యంగా పెట్టుకున్న విష‌యం తెలిసిందే. ఇటు అసెంబ్లీ,…

2 hours ago

పెను సంక్షోభంలో ప్ర‌పంచం…!

అమెరికా - ఇరాన్ దేశాల మధ్య నెలకొన్న చర్చల ప్రతిష్టంభ‌న ప్రపంచ దేశాలను పెను సంక్షోభంలోకి నెట్టే దిశగా మారుతోందా?…

2 hours ago

రాష్ట్ర‌ప‌తికి బహుమతిగా మంగళగిరి చీర

భార‌త రాష్ట్ర‌ప‌తి ద్రౌప‌దిముర్ముతో ఏపీ మంత్రి, టీడీపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి నారా లోకేష్ భేటీ అయ్యారు. పార్టీకి చెందిన…

3 hours ago

ఏపీ కొత్త ఎన్నిక‌ల క‌మిష‌న‌ర్‌… వైసీపీకి షాకేనా?

ఏపీ రాష్ట్ర ఎన్నిక‌ల సంఘం క‌మిష‌న‌ర్ ప‌ద‌వి ఖాళీ అయింది. గ‌త నెల 31వ తేదీ వ‌ర‌కు ఉన్న రాష్ట్ర…

3 hours ago

‘హోం’ ప్రశ్నలపై ‘సీఎం’ సమాధానం చెప్తారా?

తెలంగాణలో కీలకమైన హోం శాఖను సీఎం రేవంత్ రెడ్డి తన దగ్గర పెట్టుకున్నారు. శాంతిభద్రతలను ఆయనే పర్యవేక్షిస్తున్నారు. అయితే తరచుగా…

4 hours ago

కేసీఆర్ వరకు వెళ్లిన సీతక్క పంచాయితీ

తెలంగాణలో అధికార పార్టీ కాంగ్రెస్ కు చెందిన మహిళా నేత, సీఎం ఎనుముల రేవంత్ రెడ్డి కేబినెట్ లో కీలక…

5 hours ago