Political News

బిగుస్తున్న ఉచ్చు .. కొడాలి నాని జాడెక్కడ ?!

వైసీపీ ప్రభుత్వంలో మంత్రిగా, గుడివాడ ఎమ్మెల్యేగా క్రిష్ణా జిల్లా రాజకీయాల్లో చక్రం తిప్పిన కొడాలి నాని గత నెల రోజులుగా ఆచూకీ లేకుండా పోయాడు. అధికారంలో ఉన్నప్పుడు ప్రతిపక్ష నేతగా ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మీద అవసరం ఉన్నా, లేకున్నా, వేదిక ఏదైనా ఏకవచనంతో మాట్లాడుతూ నోరు పారేసుకున్నాడు కొడాలి నాని. సంధర్భం, సమయంతో సంబంధం లేకుండా బూతు మాటలతో రెచ్చిపోయాడు.

కట్ చేస్తే రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం పడిపోయింది. నాలుగు సార్లు గుడివాడ ఎమ్మెల్యేగా గెలిచిన కొడాలి నాని ఏకంగా 50 వేల ఓట్ల తేడాతో ఘోర పరాజయం పాలయ్యాడు. దీంతో టీడీపీ శ్రేణులు ఏకంగా కొడాలి నాని ఇంటిని ముట్టడించినా బయటకు రాలేదు. గత నెల రోజులలో రెండు సార్లు మాత్రమే కనిపించిన కొడాలి అసలు ఎక్కడ ఉంటున్నాడో కూడా అంతుబట్టడం లేదు.

తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పాటు కావడంతో గత పాలనలో చేసిన తప్పులకు సంబంధించి కొడాలి నాని చుట్టూ ఉచ్చు బిగుస్తున్నది. ఎన్నికల సమయంలో వాలంటీర్లతో బలవంతంగా రాజీనామా చేయించారు. దీంతో వాలంటీర్లు నానిపై కేసు పెట్టారు. ఆ తర్వాత బెవరేజెస్ గోడౌన్ లో లీజుదారు కూడా కేసు పెట్టాడు. ఈ రెండు కేసుల నుండి ముందస్తు బెయిల్ తెచ్చుకున్నా తాజాగా వెలుగులోకి వచ్చిన బియ్యం స్కాం నాని మెడకు చుట్టుకునేలా ఉంది.

ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కాకినాడ పర్యటన సంధర్భంగా బియ్యం కుంభకోణం మీద విచారణకు ఆదేశాలు ఇచ్చారు. ఒక వైపు చంద్రబాబు, మరో వైపు పవన్ కళ్యాణ్, ఇంకో వైపు నారా లోకేష్ లు నానిని టార్గెట్ చేయడంతో అతని పరిస్థితి కుడితిలో పడ్డ ఎలుకలా తయారయింది. రాజకీయాల్లో హుందాగా వ్యవహరించకుండా అడ్డగోలుగా మాట్లాడడం మూలంగానే నానికి ఈ పరిస్థితి దాపురించిందని అంటున్నారు.

పార్టీ కార్యకర్తలకు కూడా నాని అందుబాటులో లేకపోవడంతో గతంలో అతని అనుచరులు అక్రమంగా ఆక్రమించుకున్న స్థలాలను స్థానికులు తిరిగి ఆక్రమించుకుంటున్నారని సమాచారం. 20 ఏళ్లు గుడివాడలో చక్రం తిప్పిన నాని ఇప్పుడు ఎటూ పాలుపోని సంకట స్థితికి చేరుకున్నాడు.

This post was last modified on July 11, 2024 10:48 am

Share

Recent Posts

హోంమంత్రి పై కూలిన డ్రోన్‌… ఏం జ‌రిగింది?

ఏపీ హోం మంత్రి వంగ‌ల‌పూడి అనిత ప్ర‌మాదానికి గుర‌య్యారు. ఆమె ఎగుర వేసిన డ్రోన్‌.. కొద్ద దూరం పైకి వెళ్లి…

1 hour ago

కుళ్లిపోయిన 100 టన్నుల చికెన్‌… చేపల ఆహారంగా!

కుళ్లిపోయిన చికెన్‌ వ్యర్థాలను చేపలకు ఆహారంగా వినియోగిస్తున్న వ్యవహారం వెలుగులోకి రావడంతో ప్రజారోగ్యంపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. సైబరాబాద్‌ కమిషనరేట్‌ పరిధిలో…

2 hours ago

విద్యార్థినులతో కలిసి జలకాలాట… ప్రిన్సిపాల్ సస్పెండ్

బాధ్యతాయుతంగా ప్రవర్తించాల్సిన ఒక ప్రభుత్వ పాఠశాల ప్రిన్సిపాల్ అభ్యంతరకరంగా వ్యవహరించడం విమర్శలకు తావిచ్చింది. రాజస్థాన్ లోని ఒక ప్రిన్సిపాల్ విద్యార్థినులతో…

2 hours ago

ఆ ముగ్గురి మ‌ర‌ణానికి కార‌ణం ఐఫోన్ కాదా?

మ‌హారాష్ట్ర‌లో ఒక కుటుంబానికి చెందిన ముగ్గురు.. చాలామంది చూస్తుండ‌గా, నిమిషాల వ్య‌వ‌ధిలో అనూహ్యంగా ప్రాణాలు కోల్పోయిన ఘ‌ట‌న ఇప్పుడు సోష‌ల్…

3 hours ago

జగన్ మతమార్పిడులు ప్రోత్సహించారు.. విజయసాయి సంచలన ఆరోపణ

మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి హయాంలోనూ మతమార్పిడులను ప్రోత్సహించారని, హిందువులకు ఆయన చేసిందేమీ లేదని మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి…

4 hours ago

ప్యారడైజ్ కోసం ప్రాణాలు పెట్టేస్తున్నారు

సరిగ్గా ఇంకొక్క నెల రోజుల్లో ప్యారడైజ్ రిలీజ్ ఉంది. నాని అభిమానులు కౌంట్ డౌన్ మొదలుపెట్టుకున్నారు. జూన్ నుంచి వరసగా…

4 hours ago