వైసీపీ ప్రభుత్వంలో మంత్రిగా, గుడివాడ ఎమ్మెల్యేగా క్రిష్ణా జిల్లా రాజకీయాల్లో చక్రం తిప్పిన కొడాలి నాని గత నెల రోజులుగా ఆచూకీ లేకుండా పోయాడు. అధికారంలో ఉన్నప్పుడు ప్రతిపక్ష నేతగా ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మీద అవసరం ఉన్నా, లేకున్నా, వేదిక ఏదైనా ఏకవచనంతో మాట్లాడుతూ నోరు పారేసుకున్నాడు కొడాలి నాని. సంధర్భం, సమయంతో సంబంధం లేకుండా బూతు మాటలతో రెచ్చిపోయాడు.
కట్ చేస్తే రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం పడిపోయింది. నాలుగు సార్లు గుడివాడ ఎమ్మెల్యేగా గెలిచిన కొడాలి నాని ఏకంగా 50 వేల ఓట్ల తేడాతో ఘోర పరాజయం పాలయ్యాడు. దీంతో టీడీపీ శ్రేణులు ఏకంగా కొడాలి నాని ఇంటిని ముట్టడించినా బయటకు రాలేదు. గత నెల రోజులలో రెండు సార్లు మాత్రమే కనిపించిన కొడాలి అసలు ఎక్కడ ఉంటున్నాడో కూడా అంతుబట్టడం లేదు.
తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పాటు కావడంతో గత పాలనలో చేసిన తప్పులకు సంబంధించి కొడాలి నాని చుట్టూ ఉచ్చు బిగుస్తున్నది. ఎన్నికల సమయంలో వాలంటీర్లతో బలవంతంగా రాజీనామా చేయించారు. దీంతో వాలంటీర్లు నానిపై కేసు పెట్టారు. ఆ తర్వాత బెవరేజెస్ గోడౌన్ లో లీజుదారు కూడా కేసు పెట్టాడు. ఈ రెండు కేసుల నుండి ముందస్తు బెయిల్ తెచ్చుకున్నా తాజాగా వెలుగులోకి వచ్చిన బియ్యం స్కాం నాని మెడకు చుట్టుకునేలా ఉంది.
ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కాకినాడ పర్యటన సంధర్భంగా బియ్యం కుంభకోణం మీద విచారణకు ఆదేశాలు ఇచ్చారు. ఒక వైపు చంద్రబాబు, మరో వైపు పవన్ కళ్యాణ్, ఇంకో వైపు నారా లోకేష్ లు నానిని టార్గెట్ చేయడంతో అతని పరిస్థితి కుడితిలో పడ్డ ఎలుకలా తయారయింది. రాజకీయాల్లో హుందాగా వ్యవహరించకుండా అడ్డగోలుగా మాట్లాడడం మూలంగానే నానికి ఈ పరిస్థితి దాపురించిందని అంటున్నారు.
పార్టీ కార్యకర్తలకు కూడా నాని అందుబాటులో లేకపోవడంతో గతంలో అతని అనుచరులు అక్రమంగా ఆక్రమించుకున్న స్థలాలను స్థానికులు తిరిగి ఆక్రమించుకుంటున్నారని సమాచారం. 20 ఏళ్లు గుడివాడలో చక్రం తిప్పిన నాని ఇప్పుడు ఎటూ పాలుపోని సంకట స్థితికి చేరుకున్నాడు.
This post was last modified on July 11, 2024 10:48 am
`క్యాసినో కింగ్`గా గుర్తింపు తెచ్చుకుని వందల కోట్ల రూపాయలను అక్రమంగా ఆర్జించారన్న కేసులు ఎదుర్కొంటున్న చీకోటి ప్రవీణ్కు బీజేపీ కీలక…
ప్రభాస్ కెరీర్లో ‘బాహుబలి-2’ తర్వాత అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచిన ‘కల్కి’ మెజారిటీ ప్రేక్షకులను ఆకట్టుకుంది. కేవలం రెండు…
గత ఏడాది కుంభమేళా సందర్భంగా కెమెరాల కళ్లలో పడి విపరీతమైన పాపులారిటీ సంపాదించిన అమ్మాయి.. మోనాలిసా. మధ్యప్రదేశ్లోని ఇండోర్కు చెందిన…
ఇరాన్తో యుద్ధం విషయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రాంగ్ స్టెప్ వేశారా? నాణేనికి ఒక వైపే చూశారా? అంటే..…
దేశంలో గతంలో ఎన్నడూ లేని విధంగా పలు కీలక అంశాలు చోటు చేసుకుంటున్నాయి. ఏకంగా ప్రధాని పైనే గత ఐదేళ్లలో…
ఏపీలో కడుపేదల కోసం పీ 4 ఫార్ములాను రూపొందించి దానిని అమలు చేస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇప్పుడు కలెక్టర్ల…