Political News

కేతిరెడ్డి ఓటమి.. అసలు విషయం గుర్తుచేశారు

ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఓటమిని చాలామంది అంచనా వేశారు కానీ.. ఆ పార్టీ మరీ 11 సీట్లకు పరిమితం అవుతుందని మాత్రం అనుకోలేదు. బాగా పని చేశారు అని పేరున్న ఎమ్మెల్యేలు సైతం చిత్తయి పోవడం ఆశ్చర్యం కలిగించింది. అలా ఆశ్చర్యపరిచిన ఫలితాల్లో ధర్మవరం అసెంబ్లీ నియోజకవర్గానిది ఒకటి. ఇక్కడ కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి బాగా పని చేశాడని చాలామంది చెబుతుంటారు. సోషల్ మీడియాలో ఆయనకు మంచి ఫాలోయింగ్ ఉంది. రోజూ గుడ్ మార్నింగ్ ధర్మవరం అంటూ జనాల్లోకి వెళ్లి కేతిరెడ్డి సమస్యలు తెలుసుకునే వీడియోలు సోషల్ మీడియాలో బాగా పాపులర్ అయ్యాయి. ఆయన ఓటమి గురించి అందరూ ఆశ్చర్యపోయారు.

స్వయంగా కేతిరెడ్డి తాను ఎంతో మంచి చేసినా ఎందుకు ఓడిపోయానో తెలియదంటూ బాధపడ్డాడు. తాజాగా తెలంగాణ మాజీ మంత్రి కేటీఆర్ కేతిరెడ్డి ఓటమి పట్ల ఆశ్చర్యం వ్యక్తం చేయడం తెలిసిందే.

ఐతే ధర్మవరం నుంచి కేతిరెడ్డి మీద విజయం సాధించిన బీజేపీ నేత సత్యకుమార్.. కేటీఆర్ వ్యాఖ్యలపై స్పందించారు. కేతిరెడ్డి ఓటమి గురించి మాట్లాడారు. కేతిరెడ్డి రెండో కోణం గురించి ఆయన ప్రస్తావించారు. ‘‘ధర్మవరం మాజీ ఎమ్మెల్యే ఓటమిపై తెలంగాణ మాజీ మంత్రి కేటీఆర్ చిలకపలుకులు పలుకుతున్నారు. ధరణి పేరుతో మీరు తెలంగాణలో నడిపిన భూ మాఫియా లాగానే ధర్మవరంలో గుడ్ మార్నింగ్ పేరుతో మీ భూ భకాసుర మిత్రుడు ప్రభుత్వ, అసైన్డ్, ప్రైవేటు, ప్రజల ఆస్తులను ఆక్రమించాడు. చివరికి చెరువులు, కొండలను కూడా కబళించాడు. గుడ్ మార్నింగ్ అంటే ప్రజలకు గుర్తుకు వచ్చేది కబ్జా-కలెక్షన్-కరప్షన్-కమీషన్లే’’ అని పేర్కొన్నారు.

నిజానికి చెరువును భారీ స్థాయిలో ఆక్రమించి పెద్ద ఫాం హౌస్ కట్టుకున్నాడని కేతిరెడ్డిపై ఎప్పట్నుంచో ఆరోపణలు ఉన్నాయి. దానికి సంబంధించిన ప్రూఫ్స్ కూడా సోషల్ మీడియాలో పెడుతుంటారు. ఇంకా ఆయన మీద అనేక అవినీతి ఆరోపణలు కూడా ఉన్నాయి. కానీ వీటిని మించి గుడ్ మార్నింగ్ ధర్మవరం అంటూ కేతిరెడ్డి చేపట్టిన కార్యక్రమం పాపులర్ అయి.. ఆయన ఓటమిపై అందరూ ఆశ్చర్యపోతున్నారు.

This post was last modified on July 11, 2024 5:38 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

డాలర్లు, మంచి లైఫ్ కోసం విదేశాలకు వెళ్ళాక నిజం తెలిసింది

డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…

3 hours ago

జగన్ ఇలానే ఉండాలి టీడీపీ ఆశీస్సులు

వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవ‌రినీ దెబ్బతీయరు.…

6 hours ago

టీం ఇండియా ఇప్పటికైన ఆ ప్లేయర్ ను ఆడిస్తుందా?

రాయ్‌పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…

6 hours ago

చరిత్ర ఎన్నోసార్లు హెచ్చరిస్తూనే ఉంది

కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…

9 hours ago

చంద్రబాబును కలిసిన కాంగ్రెస్ మంత్రి

ఉండవల్లిలోని చంద్రబాబు క్యాంపు కార్యాలయానికి తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఈ రోజు వెళ్లారు. తెలంగాణ రైజింగ్ సమిట్‌కు…

11 hours ago

సైకో హంతకుడిగా నటించిన స్టార్ హీరో

మలయాళం మెగాస్టార్ గా అభిమానులు పిలుచుకునే మమ్ముట్టి కొత్త సినిమా కలం కవల్ ఇవాళ ప్రేక్షకుల ముందుకొచ్చింది. అఖండ 2…

11 hours ago