Political News

2029లో ఏపీ సీఎం ష‌ర్మిలే: రేవంత్

తెలంగాణ ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి, ఏపీ పీసీసీ చీఫ్ ష‌ర్మిల‌ను ఉద్దేశించి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. 2029లో జ‌రిగే ఏపీ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో ష‌ర్మిల ముఖ్య‌మంత్రి కావ‌డం త‌థ్య‌మ‌ని చెప్పారు. ఆమె పోరాట ప‌టిమ ఎలా ఉంటుందో.. ప్ర‌చార స‌త్తా ఎలా ఉంటుందో.. తాజాగా జ‌రిగిన ఎన్నిక‌ల్లో గ‌ల్లీ నుంచి ఢిల్లీ వ‌ర‌కు తెలిసింద‌న్నారు. నాయ‌కుల‌ను క‌లుపుకొనిపోవ‌డం, కార్య‌క‌ర్త‌ల‌ను ఉత్తేజ ప‌ర‌చ‌డంలోనూ ష‌ర్మిల విజ‌యం సాధించార‌ని తెలిపారు. వ‌చ్చే నాలుగేళ్ల పాటు రాష్ట్రంలో ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష పాత్ర‌ను ష‌ర్మిల విజ‌యవంతంగా నిర్వ‌హించ‌నున్నార‌ని తెలిపారు.

వైఎస్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి 75వ జ‌యంతిని పుర‌స్క‌రించుకుని గుంటూరు జిల్లాలోని మంగ‌ళగిరిలో నిర్వ‌హించిన కార్య‌క్ర‌మంలో రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈసంద‌ర్భంగా ఆయ‌న సంచ‌ల‌న వ్యాఖ్య‌ల‌తో కూడిన ప్ర‌సంగంతో కాంగ్రెస్ నాయ‌కుల‌ను ఉత్తేజ ప‌రిచారు. ఇటీవ‌ల జ‌రిగిన ఎన్నిక‌ల్లో ష‌ర్మిల అనుకున్న‌ది సాధించార‌ని తెలిపారు. పార్టీని బ‌లోపేతం చేయ‌డంలో ఆమె ఉత్సాహంగా ముందుకు సాగిన‌ట్టు వివ‌రించారు. కార్యకర్తల త్యాగం, షర్మిల పోరాటం ఊరికే పోదని, 2029లో పార్టీ అధికారంలోకి వ‌స్తుంద‌ని రేవంత్ చెప్పారు. అటు కేంద్రంలోనూ 2029లో రాహుల్‌గాంధీ ప్రధాని అవుతారని ఆశాభావం వ్య‌క్తం చేశారు.

ప్రజల పక్షాన పోరాడబోయేది షర్మిల మాత్రమేన‌ని రేవంత్ రెడ్డి చెప్పారు. వైఎస్‌ పేరుతో వ్యాపారం చేసేవాళ్లు వారసులు కాదంటూ.. ప‌రోక్షంగా వైసీపీ అధినేత‌, మాజీ సీఎం జ‌గ‌న్‌ను ఉద్దేశించి రేవంత్ విమ‌ర్శ‌లు గుప్పించారు. కాంగ్రెస్ త‌ర‌ఫున నిర్వ‌హించే ప్ర‌తి కార్య‌క్ర‌మానికీ త‌మ మ‌ద్ద‌తు ఉంటుంద‌ని.. ష‌ర్మిల‌కు అన్ని విధాలా స‌హ‌క‌రిస్తామ‌ని చెప్పారు. ప్రజల కోసం పోరాడేవాళ్లే వైఎస్‌ వారసులు అంటూ.. వైఎస్ వార‌స‌త్వాన్ని కూడా ఆయ‌న ప్ర‌స్తావించారు. అయితే.. ఒకే ఒక్క సంద‌ర్భంలో త‌ప్ప‌.. జ‌గ‌న్ పేరు ఎక్క‌డా రేవంత్ ప్ర‌స్తావించ‌క‌పోవ‌డం గ‌మ‌నార్హం. ఏదేమైనా.. రేవంత్ రాక‌తో.. వైఎస్ జ‌యంతి కార్య‌క్రమం రాజ‌కీయంగా చ‌ర్చ‌కు దారితీసింది.

This post was last modified on July 9, 2024 2:20 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

తమన్నాకు తెలుగులో మళ్లీ ఓ మంచి ఛాన్స్?

ఒకప్పుడు టాలీవుడ్లో తిరుగులేని ఆధిపత్యం చలాయించిన కథానాయికల్లో తమన్నా ఒకరు. టీనేజీలోనే కథానాయిక అవతారం ఎత్తిన ఆమె పదేళ్లకు పైగానే టాప్…

2 hours ago

8 వారాల వైపు సీరియస్ అడుగులు

థియేటర్, ఓటిటి మధ్య ఖచ్చితంగా ఎనిమిది వారాల గ్యాప్ ఉండాలనే నిబంధన మీద దక్షిణాది ఇండస్ట్రీ పెద్దలు చాలా సీరియస్…

2 hours ago

ఈసారి జ‌గ‌న్ వదిలిన ట్రోల్ పాయింట్?

అధికారంలోకి రావ‌డానికి ముందు వ‌ర‌కు వైఎస్ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి చాలా ఫెరోషియ‌స్‌గా క‌నిపించేవారు. అవినీతి కేసుల వ్య‌వ‌హారం పక్క‌న పెడితే…

3 hours ago

బన్నీ గ్లింప్స్ షారుఖ్ చేతుల మీదుగా?

‘బాహుబలి’ సినిమాకు బాలీవుడ్ నుంచి అప్పట్లో ఎంత గొప్ప సహకారం అందిందో తెలిసిందే. కరణ్ జోహార్ లాంటి అగ్ర నిర్మాత ఆ…

3 hours ago

ప్రేమ పెళ్లితో షాకిచ్చిన వైర‌ల్ మోనాలిసా

మోనాలిసా.. గ‌త ఏడాది సోష‌ల్ మీడియాను ఒక ఊపు ఊపేసిన పేరిది. ఉత్తర్‌ప్రదేశ్‌లో జ‌రిగిన‌ మహా కుంభమేళాతో వెలుగులోకి వచ్చిన…

4 hours ago

కిం క‌ర్త‌వ్యం… అంత‌ర్మ‌థ‌నంలో బీఆర్ఎస్‌?

తెలంగాణ ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌, ఆ పార్టీ కార్య‌నిర్వాహ‌క అధ్య‌క్షుడు కేటీఆర్‌, మాజీ మంత్రి పార్టీ కీల‌క…

5 hours ago