తెలంగాణలో డిసెంబర్ వరకు లాక్ డౌన్ పొడిగించాలని ముఖ్యమంత్రి కేసీఆర్కు కాంగ్రెస్ పార్టీ తరుపున లేఖ రాస్తానని జగ్గారెడ్డి ప్రకటించారు. రంజాన్ తరువాత మోహర్రం , బోనాలు , దసరా పండుగ లు వచ్చే అవకాశం ఉండటంతో లాక్ డౌన్ డిసెంబర్ వరకు పొడిగించాలని జగ్గారెడ్డి డిమాండ్ చేశారు. పండుగల పేరుతో లాక్ డౌన్ ఎత్తి వేస్తే ప్రభుత్వం ఇప్పటి వరకు కష్టపడిందంత వృధా అవుతుందని జగ్గారెడ్డి విశ్లేషించారు.
కరోన కట్టడి కోసం రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకున్న కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలుగా తాము సహకరిస్తామని జగ్గారెడ్డి తెలిపారు. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో రాజకీయలు మాట్లాడటం పిచ్చి వాళ్ళ చర్య అని జగ్గారెడ్డి పేర్కొన్నారు. లాక్ డౌన్ వల్ల మాత్రమే కరోనను కట్టడి చేయలేము అని చెప్పారు తప్ప ఎత్తివేయమని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ అనలేదని ఆయన పేర్కొన్నారు.
ప్రభుత్వం ధాన్యం కొనుగోలు సమర్థవంతంగా చేస్తోందని జగ్గారెడ్డి తెలిపారు. తన నియోజకవర్గంలో స్వయంగా తానే కొనుగోళ్లు ప్రారంభించడమే కాకుండా రైతులకు చెక్కులు కూడా అందించామని అన్నారు. తద్వారా కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డికి జగ్గారెడ్డి కౌంటర్ ఇచ్చారు. అకాల వర్షాలతో నష్టపోయిన మామిడి రైతులకు ప్రభుత్వం చేయుత ఇవ్వాలని జగ్గారెడ్డి డిమాండ్ చేశారు. రంజాన్ సందర్భంగా ముస్లింల పై బీజేపీ నేతలు చేస్తున్న వ్యాఖ్యలు అర్థరహితమన్నారు. రాజకీయ పార్టీలన్ని కొన్ని రోజులు రాజకీయ పరమైన విమర్శలు చేసుకోకపోవడం మంచిదని సూచించారు.
పెద్ద సినిమా విడుదలవుతున్న ప్రతిసారి తెలంగాణలో టికెట్ రేట్ల పెంపు అనేది పెద్ద సమస్యగా మారిపోయింది. ప్రతిసారి ప్రభుత్వాన్ని అడగలేక,…
మాములుగా దర్శక నిర్మాతలు తమ సినిమాకు ఎంత ఖర్చు పెట్టినా బడ్జెట్ ని బాహాటంగా బయటికి చెప్పుకోరు. దానికి కారణాలు…
ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మాటల్లో రాజీపడరు.. చేతల్లో ఆలస్యం చేయరు. ఇదేదో మనం చెప్పే మాట కాదు..…
తన కొత్త సినిమా పెద్ది ప్రమోషన్లలో భాగంగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఎక్కడికి వెళ్లినా… ఆయన వెంట…
ఇండస్ట్రీలో హీరోయిన్ల కెరీర్ కు ఒక ఎక్స్ పైరీ డేట్ ఉంటుందనేది ఎప్పటినుంచో వినిపించే మాటే. పాతికేళ్ల నుంచి ముప్పై…
మహారాష్ట్ర ముఖ్యమంత్రి, బీజేపీ సీనియర్ నాయకుడు దేవేంద్ర ఫడణవీస్తో ఏపీ మంత్రి, టీడీపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్…