తెలంగాణలో డిసెంబర్ వరకు లాక్ డౌన్ పొడిగించాలని ముఖ్యమంత్రి కేసీఆర్కు కాంగ్రెస్ పార్టీ తరుపున లేఖ రాస్తానని జగ్గారెడ్డి ప్రకటించారు. రంజాన్ తరువాత మోహర్రం , బోనాలు , దసరా పండుగ లు వచ్చే అవకాశం ఉండటంతో లాక్ డౌన్ డిసెంబర్ వరకు పొడిగించాలని జగ్గారెడ్డి డిమాండ్ చేశారు. పండుగల పేరుతో లాక్ డౌన్ ఎత్తి వేస్తే ప్రభుత్వం ఇప్పటి వరకు కష్టపడిందంత వృధా అవుతుందని జగ్గారెడ్డి విశ్లేషించారు.
కరోన కట్టడి కోసం రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకున్న కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలుగా తాము సహకరిస్తామని జగ్గారెడ్డి తెలిపారు. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో రాజకీయలు మాట్లాడటం పిచ్చి వాళ్ళ చర్య అని జగ్గారెడ్డి పేర్కొన్నారు. లాక్ డౌన్ వల్ల మాత్రమే కరోనను కట్టడి చేయలేము అని చెప్పారు తప్ప ఎత్తివేయమని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ అనలేదని ఆయన పేర్కొన్నారు.
ప్రభుత్వం ధాన్యం కొనుగోలు సమర్థవంతంగా చేస్తోందని జగ్గారెడ్డి తెలిపారు. తన నియోజకవర్గంలో స్వయంగా తానే కొనుగోళ్లు ప్రారంభించడమే కాకుండా రైతులకు చెక్కులు కూడా అందించామని అన్నారు. తద్వారా కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డికి జగ్గారెడ్డి కౌంటర్ ఇచ్చారు. అకాల వర్షాలతో నష్టపోయిన మామిడి రైతులకు ప్రభుత్వం చేయుత ఇవ్వాలని జగ్గారెడ్డి డిమాండ్ చేశారు. రంజాన్ సందర్భంగా ముస్లింల పై బీజేపీ నేతలు చేస్తున్న వ్యాఖ్యలు అర్థరహితమన్నారు. రాజకీయ పార్టీలన్ని కొన్ని రోజులు రాజకీయ పరమైన విమర్శలు చేసుకోకపోవడం మంచిదని సూచించారు.
This post was last modified on April 27, 2020 7:22 pm
అదేంటి ఇప్పటికే బోలెడు సినిమాల్లో చూసేశాం కదా కొత్తగా మళ్ళీ డెబ్యూ ఏంటనుకుంటున్నారా. మ్యాటర్ వేరే ఉంది. శ్రీలీల బాలీవుడ్…
చిన్న సినిమాలను జనాల్లోకి తీసుకెళ్లడం, ప్రేక్షకులను థియేటర్లకు రప్పించడం ఈ రోజుల్లో పెద్ద సవాలుగా మారిపోయింది. గతంలో సినిమా బాగుంటే…
ఐపీఎల్ 2026 సీజన్లో లక్నో సూపర్ జెయింట్స్ (LSG) పరిస్థితి రోజురోజుకూ అట్టడుగుకు పడిపోతోంది. నేటి మ్యాచ్ లో సొంత…
ఇటీవలే టోవినో థామస్ 'పళ్ళి చట్టంబి' తెలుగు వెర్షన్ విడుదలయ్యింది. మార్నింగ్ షోనే డెఫిసిట్ తో మొదలై సాయంత్రానికే డిజాస్టర్…
కల్వకుంట్ల కవిత.. మాజీసీఎం కేసీఆర్ తనయగా.. రాజకీయాల్లోకి అడుగు పెట్టిన ఆమె.. ఎంపీగా, ఎమ్మెల్సీగా వ్యవహరించారు. ఇక, ఆ పార్టీతో…
టాలీవుడ్లో బిగ్గెస్ట్ సినీ ఫ్యామిలీ ఏది అంటే.. మెగా కుటుంబం గురించే ముందుగా చెప్పుకోవాలి. ఆ కుటుంబంలో ఉన్నంత మంది…