తెలంగాణలో డిసెంబర్ వరకు లాక్ డౌన్ పొడిగించాలని ముఖ్యమంత్రి కేసీఆర్కు కాంగ్రెస్ పార్టీ తరుపున లేఖ రాస్తానని జగ్గారెడ్డి ప్రకటించారు. రంజాన్ తరువాత మోహర్రం , బోనాలు , దసరా పండుగ లు వచ్చే అవకాశం ఉండటంతో లాక్ డౌన్ డిసెంబర్ వరకు పొడిగించాలని జగ్గారెడ్డి డిమాండ్ చేశారు. పండుగల పేరుతో లాక్ డౌన్ ఎత్తి వేస్తే ప్రభుత్వం ఇప్పటి వరకు కష్టపడిందంత వృధా అవుతుందని జగ్గారెడ్డి విశ్లేషించారు.
కరోన కట్టడి కోసం రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకున్న కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలుగా తాము సహకరిస్తామని జగ్గారెడ్డి తెలిపారు. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో రాజకీయలు మాట్లాడటం పిచ్చి వాళ్ళ చర్య అని జగ్గారెడ్డి పేర్కొన్నారు. లాక్ డౌన్ వల్ల మాత్రమే కరోనను కట్టడి చేయలేము అని చెప్పారు తప్ప ఎత్తివేయమని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ అనలేదని ఆయన పేర్కొన్నారు.
ప్రభుత్వం ధాన్యం కొనుగోలు సమర్థవంతంగా చేస్తోందని జగ్గారెడ్డి తెలిపారు. తన నియోజకవర్గంలో స్వయంగా తానే కొనుగోళ్లు ప్రారంభించడమే కాకుండా రైతులకు చెక్కులు కూడా అందించామని అన్నారు. తద్వారా కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డికి జగ్గారెడ్డి కౌంటర్ ఇచ్చారు. అకాల వర్షాలతో నష్టపోయిన మామిడి రైతులకు ప్రభుత్వం చేయుత ఇవ్వాలని జగ్గారెడ్డి డిమాండ్ చేశారు. రంజాన్ సందర్భంగా ముస్లింల పై బీజేపీ నేతలు చేస్తున్న వ్యాఖ్యలు అర్థరహితమన్నారు. రాజకీయ పార్టీలన్ని కొన్ని రోజులు రాజకీయ పరమైన విమర్శలు చేసుకోకపోవడం మంచిదని సూచించారు.
This post was last modified on April 27, 2020 7:22 pm
కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…
ఉండవల్లిలోని చంద్రబాబు క్యాంపు కార్యాలయానికి తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ఈ రోజు వెళ్లారు. తెలంగాణ రైజింగ్ సమిట్కు…
మలయాళం మెగాస్టార్ గా అభిమానులు పిలుచుకునే మమ్ముట్టి కొత్త సినిమా కలం కవల్ ఇవాళ ప్రేక్షకుల ముందుకొచ్చింది. అఖండ 2…
టీమిండియా స్టార్ క్రికెటర్ స్మృతి మంధాన పెళ్లి ఆగిపోవడం అభిమానులను నిరాశపరిచింది. తండ్రి ఆరోగ్యం బాగోలేకపోవడంతో నవంబర్ 23న జరగాల్సిన…
పార్వతీపురం మన్యం జిల్లా, భామినిలో నేడు నిర్వహించిన మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు,…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తెలుగులో ఎన్నో విజయవంతమైన చిత్రాలు వచ్చాయి. తొలినాళ్లలో తీసిన చాలా సినిమాలు బ్లాక్ బస్టర్…