తెలంగాణలో డిసెంబర్ వరకు లాక్ డౌన్ పొడిగించాలని ముఖ్యమంత్రి కేసీఆర్కు కాంగ్రెస్ పార్టీ తరుపున లేఖ రాస్తానని జగ్గారెడ్డి ప్రకటించారు. రంజాన్ తరువాత మోహర్రం , బోనాలు , దసరా పండుగ లు వచ్చే అవకాశం ఉండటంతో లాక్ డౌన్ డిసెంబర్ వరకు పొడిగించాలని జగ్గారెడ్డి డిమాండ్ చేశారు. పండుగల పేరుతో లాక్ డౌన్ ఎత్తి వేస్తే ప్రభుత్వం ఇప్పటి వరకు కష్టపడిందంత వృధా అవుతుందని జగ్గారెడ్డి విశ్లేషించారు.
కరోన కట్టడి కోసం రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకున్న కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలుగా తాము సహకరిస్తామని జగ్గారెడ్డి తెలిపారు. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో రాజకీయలు మాట్లాడటం పిచ్చి వాళ్ళ చర్య అని జగ్గారెడ్డి పేర్కొన్నారు. లాక్ డౌన్ వల్ల మాత్రమే కరోనను కట్టడి చేయలేము అని చెప్పారు తప్ప ఎత్తివేయమని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ అనలేదని ఆయన పేర్కొన్నారు.
ప్రభుత్వం ధాన్యం కొనుగోలు సమర్థవంతంగా చేస్తోందని జగ్గారెడ్డి తెలిపారు. తన నియోజకవర్గంలో స్వయంగా తానే కొనుగోళ్లు ప్రారంభించడమే కాకుండా రైతులకు చెక్కులు కూడా అందించామని అన్నారు. తద్వారా కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డికి జగ్గారెడ్డి కౌంటర్ ఇచ్చారు. అకాల వర్షాలతో నష్టపోయిన మామిడి రైతులకు ప్రభుత్వం చేయుత ఇవ్వాలని జగ్గారెడ్డి డిమాండ్ చేశారు. రంజాన్ సందర్భంగా ముస్లింల పై బీజేపీ నేతలు చేస్తున్న వ్యాఖ్యలు అర్థరహితమన్నారు. రాజకీయ పార్టీలన్ని కొన్ని రోజులు రాజకీయ పరమైన విమర్శలు చేసుకోకపోవడం మంచిదని సూచించారు.
This post was last modified on April 27, 2020 7:22 pm
రాష్ట్రంలో కొత్త మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరించాలనే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపిస్తూ విపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్రవ్యాప్తంగా కోటి సంతకాల…
కోల్కతా సాల్ట్లేక్ స్టేడియంలో ఫుట్బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సీ పర్యటన సందర్భంగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మెస్సీ స్టేడియంలో కేవలం…
బాలీవుడ్ లోనే కాదు ఇతర రాష్ట్రాల్లోనూ దురంధర్ ప్రభంజనం మాములుగా లేదు. మొదటి రోజు స్లోగా మొదలై ఇప్పుడు పదో…
దేశవ్యాప్తంగా మెస్సీ మ్యానియా హోరెత్తుతోంది. అర్జెంటీనా ఫుట్బాల్ లెజెండ్ లియోనెల్ మెస్సీ మూడు రోజుల పాటు జరిగే గోట్ ఇండియా…
మొన్న రాత్రి ప్రీమియర్లతో విడుదలైన అఖండ 2 తాండవం ఏపీ తెలంగాణ వ్యాప్తంగా భారీ ఆక్యుపెన్సీలు నమోదు చేసింది. తొలి…
ఈ రోజుల్లో ఒక హీరో సినిమా గురించి తన అభిమానులు చేసే పాజిటివ్ ప్రచారం కంటే.. యాంటీ ఫాన్స్ చేసే…