Political News

వైఎస్ వార‌సురాలు ష‌ర్మిల‌: రాహుల్ గాంధీ

కాంగ్రెస్ పార్టీ అగ్ర‌నేత, ఎంపీ రాహుల్ గాంధీ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. సోమ‌వారం దివంగ‌త ఉమ్మ‌డి ఏపీ ముఖ్య‌మంత్రి వైఎస్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి 75వ జ‌యంతిని పుర‌స్క‌రించుకుని ఆయ‌న సెల్ఫీ వీడియో ఒక‌టి సోష‌ల్ మీడియాలో పోస్టు చేశారు. దీనిలో ఆయ‌న కొన్ని కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. వైఎస్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి పాద‌యాత్ర‌ను స్ఫూర్తిగా తీసుకుని తాను భార‌త్ జోడో యాత్ర చేసిన‌ట్టు వివ‌రించారు. వైఎస్ త‌న పాద‌యాత్ర ద్వారా ఏపీలో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకువ‌చ్చేందుకు ప్ర‌య‌త్నించారన్నారు.

పేద‌ల‌కు అత్యంత చేరువైన రాజ‌శేఖ‌ర‌రెడ్డి.. ప్ర‌జ‌ల నాయ‌కుడిగా పేరు తెచ్చుకున్న‌ట్టు రాహుల్ గాంధీ వివ‌రించారు. ఆయ‌న వార‌సత్వాన్ని ముందుకు తీసుకువెళ్ల‌డంలో ఆయ‌న కుమార్తె ష‌ర్మిల దూకుడుగా ముందుకు వెళ్తున్నార‌ని.. ఆయ‌న వార‌స‌త్వాన్ని నిల‌బెడ‌తార‌న్న న‌మ్మ‌కం కూడా త‌న‌కు ఉంద‌ని రాహుల్ వ్యాఖ్యానించారు. పాద‌యాత్ర ద్వారా అన్ని వ‌ర్గాల‌కు వైఎస్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి చేరువ అయ్యార‌ని.. అదేవిధంగా ఆయ‌న కుమార్తె కూడా చేరువ అవుతంద‌ని విశ్వ‌సిస్తున్నాన‌న్నారు.

ఒక దురదృష్ట‌క‌ర ఘ‌ట‌న‌లో వైఎస్‌ను కోల్పోవ‌డం త‌మ‌కు ఎంతో బాధ క‌లిగించింద‌ని రాహుల్ వ్యాఖ్యానిం చారు. ప్ర‌జానేత‌ను కోల్పోయామ‌న్నారు. వైఎస్ నిజ‌మైన ప్ర‌జానాయ‌కుడ‌ని రాహుల్ వ్యాఖ్యానించారు. ఏపీ ప్ర‌జ‌ల కోసం నిరంత‌రం ఆయ‌న క‌ష్ట‌ప‌డ్డార‌ని తెలిపారు. ప్ర‌జ‌ల‌ప‌ట్ల విశ్వాసంతో.. ప్ర‌జ‌ల్లోనే మెలిగిన నాయ‌కుడు రాజ‌శేఖ‌ర్రెడ్డి అని రాహుల్ వ్యాఖ్యానించారు. వైఎస్ కుమార్తెగా ష‌ర్మిల గురించి త‌న‌కు బాగా తెలుసున‌ని అన్నారు. తండ్రి వార‌స‌త్వాన్ని ఆమె ప్ర‌జ‌ల్లోకి తీసుకువెళ్తార‌ని విశ్వ‌సిస్తున్న‌ట్టు తెలిపారు.

This post was last modified on July 8, 2024 12:02 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

బీఆర్ఎస్‌లో పూర్తి ప్ర‌క్షాళ‌న… కారణమేంటి?

తెలంగాణ ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ పార్టీని ప్రక్షాళన చేసే దిశగా అడుగులు పడుతున్నాయి. పార్టీలో సంస్థాగతంగా పనిచేస్తున్న వారిని గత…

14 minutes ago

నియోజ‌క‌వ‌ర్గాల‌పై రేవంత్ కొత్త ఫార్ములా… వ‌ర్కువ‌ట్ అయ్యేనా?

2029 పార్ల‌మెంటు ఎన్నిక‌ల నాటికి దేశంలో నియోజ‌క‌వ‌ర్గాల‌ను పున‌ర్విభ‌జించాల‌ని కేంద్ర ప్ర‌భుత్వం ల‌క్ష్యంగా పెట్టుకున్న విష‌యం తెలిసిందే. ఇటు అసెంబ్లీ,…

3 hours ago

పెను సంక్షోభంలో ప్ర‌పంచం…!

అమెరికా - ఇరాన్ దేశాల మధ్య నెలకొన్న చర్చల ప్రతిష్టంభ‌న ప్రపంచ దేశాలను పెను సంక్షోభంలోకి నెట్టే దిశగా మారుతోందా?…

4 hours ago

రాష్ట్ర‌ప‌తికి బహుమతిగా మంగళగిరి చీర

భార‌త రాష్ట్ర‌ప‌తి ద్రౌప‌దిముర్ముతో ఏపీ మంత్రి, టీడీపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి నారా లోకేష్ భేటీ అయ్యారు. పార్టీకి చెందిన…

4 hours ago

ఏపీ కొత్త ఎన్నిక‌ల క‌మిష‌న‌ర్‌… వైసీపీకి షాకేనా?

ఏపీ రాష్ట్ర ఎన్నిక‌ల సంఘం క‌మిష‌న‌ర్ ప‌ద‌వి ఖాళీ అయింది. గ‌త నెల 31వ తేదీ వ‌ర‌కు ఉన్న రాష్ట్ర…

4 hours ago

‘హోం’ ప్రశ్నలపై ‘సీఎం’ సమాధానం చెప్తారా?

తెలంగాణలో కీలకమైన హోం శాఖను సీఎం రేవంత్ రెడ్డి తన దగ్గర పెట్టుకున్నారు. శాంతిభద్రతలను ఆయనే పర్యవేక్షిస్తున్నారు. అయితే తరచుగా…

6 hours ago