కాంగ్రెస్ పార్టీ అగ్రనేత, ఎంపీ రాహుల్ గాంధీ సంచలన వ్యాఖ్యలు చేశారు. సోమవారం దివంగత ఉమ్మడి ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి 75వ జయంతిని పురస్కరించుకుని ఆయన సెల్ఫీ వీడియో ఒకటి సోషల్ మీడియాలో పోస్టు చేశారు. దీనిలో ఆయన కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. వైఎస్ రాజశేఖరరెడ్డి పాదయాత్రను స్ఫూర్తిగా తీసుకుని తాను భారత్ జోడో యాత్ర చేసినట్టు వివరించారు. వైఎస్ తన పాదయాత్ర ద్వారా ఏపీలో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకువచ్చేందుకు ప్రయత్నించారన్నారు.
పేదలకు అత్యంత చేరువైన రాజశేఖరరెడ్డి.. ప్రజల నాయకుడిగా పేరు తెచ్చుకున్నట్టు రాహుల్ గాంధీ వివరించారు. ఆయన వారసత్వాన్ని ముందుకు తీసుకువెళ్లడంలో ఆయన కుమార్తె షర్మిల దూకుడుగా ముందుకు వెళ్తున్నారని.. ఆయన వారసత్వాన్ని నిలబెడతారన్న నమ్మకం కూడా తనకు ఉందని రాహుల్ వ్యాఖ్యానించారు. పాదయాత్ర ద్వారా అన్ని వర్గాలకు వైఎస్ రాజశేఖరరెడ్డి చేరువ అయ్యారని.. అదేవిధంగా ఆయన కుమార్తె కూడా చేరువ అవుతందని విశ్వసిస్తున్నానన్నారు.
ఒక దురదృష్టకర ఘటనలో వైఎస్ను కోల్పోవడం తమకు ఎంతో బాధ కలిగించిందని రాహుల్ వ్యాఖ్యానిం చారు. ప్రజానేతను కోల్పోయామన్నారు. వైఎస్ నిజమైన ప్రజానాయకుడని రాహుల్ వ్యాఖ్యానించారు. ఏపీ ప్రజల కోసం నిరంతరం ఆయన కష్టపడ్డారని తెలిపారు. ప్రజలపట్ల విశ్వాసంతో.. ప్రజల్లోనే మెలిగిన నాయకుడు రాజశేఖర్రెడ్డి అని రాహుల్ వ్యాఖ్యానించారు. వైఎస్ కుమార్తెగా షర్మిల గురించి తనకు బాగా తెలుసునని అన్నారు. తండ్రి వారసత్వాన్ని ఆమె ప్రజల్లోకి తీసుకువెళ్తారని విశ్వసిస్తున్నట్టు తెలిపారు.
This post was last modified on July 8, 2024 12:02 pm
శుక్రవారం ఏదైనా థియేటర్ రిలీజ్ మిస్ అయితే మూవీ లవర్స్ బాధ పడకుండా ఓటిటిలు ఆ లోటు తీరుస్తున్నాయి. ఇంకా…
తెలంగాణకు చెందిన ప్రముఖ రాజకీయ నాయకుడు, సీపీఐ మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య జీవిత చరిత్ర సినిమాగా రాబోతున్న సంగతి…
బయట తన హీరోలతోనే కాక తన టీంలో అందరితో చాలా సరదాగా ఉంటూ.. క్లోజ్ రిలేషన్షిప్ మెయింటైన్ చేస్తుంటాడు రాజమౌళి.…
కన్నడ కి అతి దగ్గర గా ఉండే లిపి తెలుగే. బళ్లారి ఆంధ్ర సరిహద్దు పట్టణం తెలుగు కూడా మాట్లాడుతారు.…
వెల్లులి బెట్టి పొగిచిన పుల్లని గోంగూర రుచిని బొగడగ వశమా? అంటూ గోంగూర రుచిని పొగిడారో తెలుగు కవి. గోంగూరకు…
ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…