కాంగ్రెస్ పార్టీ అగ్రనేత, ఎంపీ రాహుల్ గాంధీ సంచలన వ్యాఖ్యలు చేశారు. సోమవారం దివంగత ఉమ్మడి ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి 75వ జయంతిని పురస్కరించుకుని ఆయన సెల్ఫీ వీడియో ఒకటి సోషల్ మీడియాలో పోస్టు చేశారు. దీనిలో ఆయన కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. వైఎస్ రాజశేఖరరెడ్డి పాదయాత్రను స్ఫూర్తిగా తీసుకుని తాను భారత్ జోడో యాత్ర చేసినట్టు వివరించారు. వైఎస్ తన పాదయాత్ర ద్వారా ఏపీలో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకువచ్చేందుకు ప్రయత్నించారన్నారు.
పేదలకు అత్యంత చేరువైన రాజశేఖరరెడ్డి.. ప్రజల నాయకుడిగా పేరు తెచ్చుకున్నట్టు రాహుల్ గాంధీ వివరించారు. ఆయన వారసత్వాన్ని ముందుకు తీసుకువెళ్లడంలో ఆయన కుమార్తె షర్మిల దూకుడుగా ముందుకు వెళ్తున్నారని.. ఆయన వారసత్వాన్ని నిలబెడతారన్న నమ్మకం కూడా తనకు ఉందని రాహుల్ వ్యాఖ్యానించారు. పాదయాత్ర ద్వారా అన్ని వర్గాలకు వైఎస్ రాజశేఖరరెడ్డి చేరువ అయ్యారని.. అదేవిధంగా ఆయన కుమార్తె కూడా చేరువ అవుతందని విశ్వసిస్తున్నానన్నారు.
ఒక దురదృష్టకర ఘటనలో వైఎస్ను కోల్పోవడం తమకు ఎంతో బాధ కలిగించిందని రాహుల్ వ్యాఖ్యానిం చారు. ప్రజానేతను కోల్పోయామన్నారు. వైఎస్ నిజమైన ప్రజానాయకుడని రాహుల్ వ్యాఖ్యానించారు. ఏపీ ప్రజల కోసం నిరంతరం ఆయన కష్టపడ్డారని తెలిపారు. ప్రజలపట్ల విశ్వాసంతో.. ప్రజల్లోనే మెలిగిన నాయకుడు రాజశేఖర్రెడ్డి అని రాహుల్ వ్యాఖ్యానించారు. వైఎస్ కుమార్తెగా షర్మిల గురించి తనకు బాగా తెలుసునని అన్నారు. తండ్రి వారసత్వాన్ని ఆమె ప్రజల్లోకి తీసుకువెళ్తారని విశ్వసిస్తున్నట్టు తెలిపారు.
This post was last modified on July 8, 2024 12:02 pm
వెయ్యి కోట్లకు పైగా గ్రాస్ తో ఆల్ టైం బ్లాక్ బస్టర్ గా నిలిచిన కల్కి 2898 ఏడి విడుదలై…
బాహుబలి రేంజులో కోలీవుడ్ స్థాయిని పెంచుతుందని అక్కడి యావత్ పరిశ్రమ ఆశలు పెట్టుకున్న ప్యాన్ ఇండియా మూవీ కంగువ. ఇప్పటికే…
అధికారంలో ఉన్నప్పుడు అంతా నాదే అంటూ.. కొందరు వైసీపీ నేతలు చెలరేగిపోయారు. క్షేత్రస్థాయిలో నాయకులకు అవకాశం కూడా కల్పించలేదు. బలమైన…
శ్రీను వైట్ల కెరీర్కు పెద్ద బ్రేక్ వేసిన సినిమా.. అమర్ అక్బర్ ఆంటోనీ. దాని కంటే ముందు ఆగడు, బ్రూస్…
కేవీపీ రామచంద్రరావు. కాంగ్రెస్ పార్టీ స్టార్వార్ట్గా ఆయన ప్రసిద్ధి చెందారు. దివంగత వైఎస్ రాజశేఖర రెడ్డికి అన్నీ తానై 2004-2009…
రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి నాలుగు మాసాలు పూర్తవుతోంది. ఈ నేపథ్యంలో `ప్రజా ప్రభుత్వం `పై సామాన్యుల టాక్ ఎలా…