Political News

గచ్చిబౌలి సభపై బాబు ఉద్వేగం

ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రతిపక్షంలో ఉండగా.. ఏపీలో ఎన్నికలు జరగడానికి కొన్ని నెలల ముందు స్కిల్ డెవలప్మెంట్ కేసులో జగన్ సర్కారు అరెస్టు చేసిన సందర్భంలో హైదరాబాద్‌లోని గచ్చిబౌలిలో ఆయన కోసం వేలాది మంది మద్దతుదారులతో నిర్వహించిన సభ ఎంత ఉద్వేగంగా సాగిందో తెలిసిందే. బాబుకు జనాల్లో ఎంత మంచి పేరుందో ఆ సభతో రుజువైంది. బాబు అరెస్టును నిరసిస్తూ ఆ సభకు హాజరైన వాళ్లంతా గట్టిగా గళం వినిపించారు. టీడీపీ కార్యకర్తలు, మద్దతుదారుల్లో కసి పెరిగి ఎన్నికలకు మరింత ఉత్సాహంగా పని చేయడానికి ఆ సభ ఒక ఉత్ప్రేరకంలా పని చేసింది.

ఐతే అప్పటి ఆ స్పందన చూడ్డానికి బాబు బయట లేరు. జైల్లో ఒంటరిగా గడిపారు. కానీ బయటికి వచ్చాక ఆ సభ ఎంత గొప్పగా సాగిందో బాబు తెలుసుకున్నారు. కానీ దాని గురించి ఎన్నికల సమయంలో మాట్లాడలేదు. ఇప్పుడు ముఖ్యమంత్రిగా పగ్గాలు చేపట్టాక తొలిసారి అధికారికంగా హైదరాబాద్‌కు వచ్చిన చంద్రబాబు.. గచ్చిబౌలి సభ గురించి మాట్లాడుతూ ఉద్వేగానికి గురయ్యారు.

హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ భవన్‌లో టీటీడీపీ కార్యకర్తలతో నిర్వహించిన సమావేశంలో చంద్రబాబు మాట్లాడుతూ.. తనను ఏ కారణం లేకుండా గత ప్రభుత్వం జైల్లో పెట్టిందని.. ఆ సమయంలో తన కోసం హైదరాబాద్ వాసులు చేసిన ఆందోళనను మరిచిపోలేనని చంద్రబాబు అన్నారు. తనకు మద్దతుగా గచ్చిబౌలిలో నిర్వహించిన సభ గురించి తర్వాత తెలుసుకుని ఉద్వేగానికి గురైనట్లు బాబు చెప్పారు. తన కోసం ఇంతమంది ఆందోళనలు నిర్వహించడం చూసి గర్వపడ్డానని.. తన జన్మ ధన్యమైందని బాబు వ్యాఖ్యానించారు.

తనకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రెండూ రెండు కళ్ళని.. వాటిలో దేన్నీ వదులుకోనని బాబు చెప్పారు. తెలుగు రాష్ట్రాల మధ్య ఐక్యత ఉండాల్సిన అవసరం ఉందని.. తెలుగు జాతి ప్రయోజనాల కోసం తెలంగాణ ప్రభుత్వంతో కలిసి పని చేస్తామని చంద్రబాబు అన్నారు. తెలంగాణలోనే తెలుగుదేశం పార్టీ పుట్టిందని.. కాబట్టి ఈ ప్రాంతంలో పార్టీ పునర్వైభవానికి కృషి చేస్తామని చంద్రబాబు చెప్పారు.

This post was last modified on July 8, 2024 7:19 am

Share

Recent Posts

బీజేపీ వ‌ర్సెస్ కాంగ్రెస్‌… `ప‌ర్స‌న‌లైజ్` అవుతున్న పార్టీలు!

రెండు జాతీయ పార్టీలు.. బీజేపీ, కాంగ్రెస్‌లో గ‌తానికి భిన్న‌మైన `వ్య‌క్తిపూజ` సాగుతోందా?.. అంటే ఔన‌నే స‌మాధాన‌మే వినిపిస్తోంది. ఇందిర‌మ్మ హ‌యాంలో…

1 hour ago

టీడీపీకి ఓట్ల `ప్రాజెక్టులు`… త‌మ్ముళ్లు హ్యాపీ.. !

కీల‌క‌మైన రెండు సాగు, తాగునీటి ప్రాజెక్టుల‌కు సీఎం చంద్ర‌బాబు శ్రీకారం చుట్టారు. నిజానికి ఇవి ఏళ్ల త‌ర‌బ‌డి సాగుతున్న ప్రాజెక్టుల‌నే…

6 hours ago

దేశ‌వ్యాప్తంగా 288 మంది.. ఏపీలో ఐదుగురు.. ఏమ‌య్యారు?

దేశ‌వ్యాప్తంగా 288 మంది నేపాల్ వ‌ర‌ద‌ల్లో గ‌ల్లంత‌య్యార‌ని కేంద్ర ప్ర‌భుత్వం అధికారికంగా ప్ర‌క‌టించింది. మొత్తం 532 మంది ఆచూకీ క‌నిపించ‌కుండా…

8 hours ago

మృతదేహాల నుంచి నగల అపహరణ… నేపాల్‌లో అమానవీయం

నేపాల్ ప్రకృతి విపత్తుతో వందలాది మంది ప్రాణాలు కోల్పోయి, మరెందరో గల్లంతైన విషాద సమయంలోనూ కొందరి దుర్మార్గం వెలుగుచూసింది. వరదల్లో…

8 hours ago

ఒకే రోజు 10 మంది… మూడు వారాల్లో 60 మంది శిశువుల మృతి

దేశంలో ప్రజారోగ్యం గాలిలో దీపంలా మారింది. ప్రభుత్వాల నిర్లక్ష్యం, ప్రైవేటు వైద్యుల దోపిడీ వెరసి సామాన్య ప్రజల ప్రాణాలకు గ్యారంటీ…

8 hours ago

సినిమా పోయినా… దిల్ రాజు సేఫేనట

కన్నడ అనువాద చిత్రమైన ‘టాక్సిక్’ ఇక్కడి టాప్ స్టార్ల సినిమాల లెవెల్లో భారీగా రిలీజైందంటే అందుకు ప్రధాన కారణం.. దిల్…

9 hours ago