Political News

గచ్చిబౌలి సభపై బాబు ఉద్వేగం

ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రతిపక్షంలో ఉండగా.. ఏపీలో ఎన్నికలు జరగడానికి కొన్ని నెలల ముందు స్కిల్ డెవలప్మెంట్ కేసులో జగన్ సర్కారు అరెస్టు చేసిన సందర్భంలో హైదరాబాద్‌లోని గచ్చిబౌలిలో ఆయన కోసం వేలాది మంది మద్దతుదారులతో నిర్వహించిన సభ ఎంత ఉద్వేగంగా సాగిందో తెలిసిందే. బాబుకు జనాల్లో ఎంత మంచి పేరుందో ఆ సభతో రుజువైంది. బాబు అరెస్టును నిరసిస్తూ ఆ సభకు హాజరైన వాళ్లంతా గట్టిగా గళం వినిపించారు. టీడీపీ కార్యకర్తలు, మద్దతుదారుల్లో కసి పెరిగి ఎన్నికలకు మరింత ఉత్సాహంగా పని చేయడానికి ఆ సభ ఒక ఉత్ప్రేరకంలా పని చేసింది.

ఐతే అప్పటి ఆ స్పందన చూడ్డానికి బాబు బయట లేరు. జైల్లో ఒంటరిగా గడిపారు. కానీ బయటికి వచ్చాక ఆ సభ ఎంత గొప్పగా సాగిందో బాబు తెలుసుకున్నారు. కానీ దాని గురించి ఎన్నికల సమయంలో మాట్లాడలేదు. ఇప్పుడు ముఖ్యమంత్రిగా పగ్గాలు చేపట్టాక తొలిసారి అధికారికంగా హైదరాబాద్‌కు వచ్చిన చంద్రబాబు.. గచ్చిబౌలి సభ గురించి మాట్లాడుతూ ఉద్వేగానికి గురయ్యారు.

హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ భవన్‌లో టీటీడీపీ కార్యకర్తలతో నిర్వహించిన సమావేశంలో చంద్రబాబు మాట్లాడుతూ.. తనను ఏ కారణం లేకుండా గత ప్రభుత్వం జైల్లో పెట్టిందని.. ఆ సమయంలో తన కోసం హైదరాబాద్ వాసులు చేసిన ఆందోళనను మరిచిపోలేనని చంద్రబాబు అన్నారు. తనకు మద్దతుగా గచ్చిబౌలిలో నిర్వహించిన సభ గురించి తర్వాత తెలుసుకుని ఉద్వేగానికి గురైనట్లు బాబు చెప్పారు. తన కోసం ఇంతమంది ఆందోళనలు నిర్వహించడం చూసి గర్వపడ్డానని.. తన జన్మ ధన్యమైందని బాబు వ్యాఖ్యానించారు.

తనకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రెండూ రెండు కళ్ళని.. వాటిలో దేన్నీ వదులుకోనని బాబు చెప్పారు. తెలుగు రాష్ట్రాల మధ్య ఐక్యత ఉండాల్సిన అవసరం ఉందని.. తెలుగు జాతి ప్రయోజనాల కోసం తెలంగాణ ప్రభుత్వంతో కలిసి పని చేస్తామని చంద్రబాబు అన్నారు. తెలంగాణలోనే తెలుగుదేశం పార్టీ పుట్టిందని.. కాబట్టి ఈ ప్రాంతంలో పార్టీ పునర్వైభవానికి కృషి చేస్తామని చంద్రబాబు చెప్పారు.

This post was last modified on July 8, 2024 7:19 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

జూనియర్ రమేష్ బాబు సౌండ్ పెంచాలి

ఘట్టమనేని ఫ్యామిలీ నుంచి వస్తున్న మూడో తరం వారసుడు జయకృష్ణ కొత్త సినిమా శ్రీనివాస మంగాపురం షూటింగ్ పూర్తయ్యే స్టేజికు…

1 hour ago

పవన్ కళ్యాణ్ సినిమాలకు దారి దొరికేనా

ఇటీవలే శ్వాసనాళానికి సంబంధించిన శస్త్ర చికిత్స చేయించుకున్న ఏపీ ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ క్రమంగా కోలుకుంటున్నారు. కొద్దిరోజుల క్రితం హైదరాబాద్…

7 hours ago

ఈసారి మెజారిటీ తగ్గకూడదు తమ్ముళ్లు

టిడిపిలోనే కొందరు నాయకులకు మెజారిటీ సమస్య ఇప్పుడు కొంత గడబిడగా మారింది. గత ఎన్నికల సమయంలో భారీ స్థాయి మెజారిటీతో…

7 hours ago

రాజీకి వస్తారా… రచ్చ చేస్తారా

ఎవరు ఔనన్నా కాదన్నా టాలీవుడ్ రెండు వర్గాలుగా విడిపోయింది. ఎగ్జిబిటర్లు ప్లస్ వాళ్లలోనే ఉన్న నిర్మాతలు, ప్రొడ్యూసర్లు ప్లస్ వాళ్లలోనే…

11 hours ago

కేటీఆర్ కు మళ్ళీ ఉచ్చు బిగిసినట్టేనా…?

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు (కేటీఆర్)కు నిజంగానే ఉచ్చు బిగుస్తోందన్న వాదనలు బలంగా వినిపిస్తున్నాయి.…

15 hours ago

రండి బాబూ రండి.. డబ్బులిచ్చి జైల్లో ఉండండి

జైలు.. ఈ మాట వినగానే సామాన్యులకు వామ్మో అనిపిస్తుంది. అక్కడి పరిస్థితుల గురించి అనుభవం ఉన్న వాళ్లు చెబుతుంటే.. సినిమాల్లో…

15 hours ago