ఇవాళ్టి రోజున పుస్తకాలు ఇచ్చి పుచ్చుకునే సంస్కృతి దాదాపు కనుమరుగైంది. అందరూ గిఫ్టుల పేరుతో ఖరీదైన వస్తువులు మాత్రమే ఇచ్చి పుచ్చుకుంటున్నారు. ఇక, ముఖ్యమంత్రులు ఎదురు పడినప్పుడు కూడా.. ఇదే సంప్రదాయం కొనసాగుతోంది. అయితే.. అసలు గిఫ్టు ఎందుకు ఇస్తారంటే.. “నీపై నాకు ఉన్న ప్రేమ, అభిమానం, అభిప్రాయాలకు ఇదీ ప్రతీక” అని చెప్పేందుకే.. గిఫ్టులు ఇస్తారు. అందే.. సందర్భాన్ని బట్టి గిఫ్టు ప్రాధాన్యం మారుతుంది.
తాజాగా ముఖ్యమంత్రుల భేటీ సందర్భంగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి – ఏపీ సీఎం చంద్రబాబు హైదరాబాద్లోని ప్రజాభవన్లో భేటీ అయ్యారు. ఈ సమయంలో చంద్రబాబు పెద్ద స్వీటు బాక్సుతోపాటు.. శాలువా.. శ్రీవారి చిత్రపటంతో కూడిన మొమెంటోలను రేవంత్రెడ్డి బృందానికి ఇచ్చారు. ఇక, ఏపీ ముఖ్య మంత్రి చంద్రబాబుకు.. రేవంత్ కూడా బహుమతి అందించారు. వీటిలో రెండు రకాలు ఉన్నాయి. వెండి నంది విగ్రహాన్ని ఇచ్చారు. దీనికి ముందు చంద్రబాబుకు రేవంత్ కాళోజీ నారాయణరావు రాసిన “నా గొడవ” పుస్తకాన్ని కానుకగా ఇచ్చారు.
ఇలా, ఒక ముఖ్యమంత్రికి.. మరో ముఖ్యమంత్రి పుస్తకాన్ని బహూకరించడం… అనేది ఇప్పటి వరకు అయితే కనిపించలేదు. ఇది ఒకరకంగా రేవంత్తోనే ప్రారంభమైందనే అభిప్రాయం కూడా వస్తోంది. అయితే.. పైన చెప్పుకొన్నట్టుగా.. కానుకల్లో మన అంతరంగం ప్రస్ఫుటం అవుతుంది. అలానే ఇక్కడ రేవంత్ కూడా.. తన అంతరంగాన్ని సుస్పష్టం చేయడం గమనార్హం. నిజానికి రేవంత్ పుస్తకాలనే కానుకగా ఇవ్వాలని అనుకుంటే… ఇదే తెలంగాణకు చెందిన నారాయణరెడ్డి రాసిన పుస్తకాలను కానుకగా ఇవ్వొచ్చు.
కానీ.. రేవంత్ అలా ఎంచుకోలేదు. దాశరధి రంగా చార్యులు రాసిన పుస్తకాలు కూడా ఇవ్వలేదు. ఏరికోరి.. కాళోజీ నారాయణరావు రాసిన “నా గొడవ” అనే పుస్తకాన్ని కానుకగా ఇచ్చారు. అయితే.. ఇదేమీ తేలికగా.. తీసేసి పారేసేది కాదు.. చాలా లోతైన అంతరంగాన్ని సీఎం రేవంత్ రెడ్డి ఆవిష్కరించారు.
‘జీ’ అనని ‘కలేజా’తో కాళోజీ అనునది ‘నఖరా’లు లేనట్టిది!
అన్యాయాన్నెదిరిస్తే.. నాగొడవకు సంతృప్తి!
This post was last modified on July 8, 2024 7:13 am
సుప్రీంకోర్టులో రోజు వారీగా అనేక కేసులు విచారణకు వస్తాయి. న్యాయశాస్త్రంలో లబ్ధప్రతిష్టులైన అనేక మంది న్యాయవాదులు వాదనలు వినిపిస్తారు. ఇది…
రేపు కొత్త శుక్రవారం వచ్చేస్తోంది. సంక్రాంతి సినిమాల హడావిడి పూర్తిగా అయిపోవడంతో ఇప్పుడు మూవీ లవర్స్ దృష్టి వీటివైపు వెళ్లాల్సి…
బాలీవుడ్ బ్యూటీ మృణాల్ ఠాకూర్ కి విపరీతమైన ఫ్రీ పబ్లిసిటీ జరుగుతుంది. అదేంటో ఆమె సినిమాల వల్ల వచ్చిన పాపులారిటీ…
ప్రేక్షకులను తన సినిమాలతో మెప్పిస్తూ యువ హీరోగా సత్తా చాటుతున్నాడు నవీన్ పొలిశెట్టి. సంక్రాంతికి అనగనగా ఒక రాజుతో వచ్చి…
తెలుగు సినిమాలో పరిగెత్తడంలోనూ ప్రత్యేక స్టాండర్డ్ సెట్ చేసిన ఏకైక హీరో సూపర్ స్టార్ మహేష్ బాబు. అతని రన్నింగ్…
ఆల్ ఇండియా బ్లాక్ బస్టర్స్ లో ఒకటిగా అవతరించిన దురంధర్ తాజాగా ఓటిటిలో వచ్చాక కొత్త డిబేట్ మొదలయ్యింది. ఇంతకన్నా…