ఇవాళ్టి రోజున పుస్తకాలు ఇచ్చి పుచ్చుకునే సంస్కృతి దాదాపు కనుమరుగైంది. అందరూ గిఫ్టుల పేరుతో ఖరీదైన వస్తువులు మాత్రమే ఇచ్చి పుచ్చుకుంటున్నారు. ఇక, ముఖ్యమంత్రులు ఎదురు పడినప్పుడు కూడా.. ఇదే సంప్రదాయం కొనసాగుతోంది. అయితే.. అసలు గిఫ్టు ఎందుకు ఇస్తారంటే.. “నీపై నాకు ఉన్న ప్రేమ, అభిమానం, అభిప్రాయాలకు ఇదీ ప్రతీక” అని చెప్పేందుకే.. గిఫ్టులు ఇస్తారు. అందే.. సందర్భాన్ని బట్టి గిఫ్టు ప్రాధాన్యం మారుతుంది.
తాజాగా ముఖ్యమంత్రుల భేటీ సందర్భంగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి – ఏపీ సీఎం చంద్రబాబు హైదరాబాద్లోని ప్రజాభవన్లో భేటీ అయ్యారు. ఈ సమయంలో చంద్రబాబు పెద్ద స్వీటు బాక్సుతోపాటు.. శాలువా.. శ్రీవారి చిత్రపటంతో కూడిన మొమెంటోలను రేవంత్రెడ్డి బృందానికి ఇచ్చారు. ఇక, ఏపీ ముఖ్య మంత్రి చంద్రబాబుకు.. రేవంత్ కూడా బహుమతి అందించారు. వీటిలో రెండు రకాలు ఉన్నాయి. వెండి నంది విగ్రహాన్ని ఇచ్చారు. దీనికి ముందు చంద్రబాబుకు రేవంత్ కాళోజీ నారాయణరావు రాసిన “నా గొడవ” పుస్తకాన్ని కానుకగా ఇచ్చారు.
ఇలా, ఒక ముఖ్యమంత్రికి.. మరో ముఖ్యమంత్రి పుస్తకాన్ని బహూకరించడం… అనేది ఇప్పటి వరకు అయితే కనిపించలేదు. ఇది ఒకరకంగా రేవంత్తోనే ప్రారంభమైందనే అభిప్రాయం కూడా వస్తోంది. అయితే.. పైన చెప్పుకొన్నట్టుగా.. కానుకల్లో మన అంతరంగం ప్రస్ఫుటం అవుతుంది. అలానే ఇక్కడ రేవంత్ కూడా.. తన అంతరంగాన్ని సుస్పష్టం చేయడం గమనార్హం. నిజానికి రేవంత్ పుస్తకాలనే కానుకగా ఇవ్వాలని అనుకుంటే… ఇదే తెలంగాణకు చెందిన నారాయణరెడ్డి రాసిన పుస్తకాలను కానుకగా ఇవ్వొచ్చు.
కానీ.. రేవంత్ అలా ఎంచుకోలేదు. దాశరధి రంగా చార్యులు రాసిన పుస్తకాలు కూడా ఇవ్వలేదు. ఏరికోరి.. కాళోజీ నారాయణరావు రాసిన “నా గొడవ” అనే పుస్తకాన్ని కానుకగా ఇచ్చారు. అయితే.. ఇదేమీ తేలికగా.. తీసేసి పారేసేది కాదు.. చాలా లోతైన అంతరంగాన్ని సీఎం రేవంత్ రెడ్డి ఆవిష్కరించారు.
‘జీ’ అనని ‘కలేజా’తో కాళోజీ అనునది ‘నఖరా’లు లేనట్టిది!
అన్యాయాన్నెదిరిస్తే.. నాగొడవకు సంతృప్తి!
This post was last modified on July 8, 2024 7:13 am
అభిమానుల్లోనే కాదు సినీ ప్రియుల్లోనూ విపరీతమైన అంచనాలు మోస్తున్న సినిమా పెద్ది. చికిరి చికిరి ఛార్ట్ బస్టర్ పుణ్యమాని హిందీలోనూ…
హైదరాబాద్లోని పంజాగుట్ట పోలీసులు యూట్యూబర్ అన్వేష్ (నా అన్వేషణ)పై లుకౌట్ నోటీసులు జారీ చేశారు. ప్రస్తుతం అన్వేష్ విదేశాల్లో ఉన్నారని…
ఏపీ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి నానాటికీ తీసికట్టుగా మారుతోందా? .. పార్టీ నాయకులు దీనస్థితిలో ఉన్నారా? అంటే.. ఔననే సమాధానమే…
ఇరాన్లో ప్రస్తుతం నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు అక్కడ వైద్య విద్యనభ్యసిస్తున్న భారతీయ విద్యార్థులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఒకవైపు అమెరికా…
ఇప్పుడు తెలుగులో వంద కోట్ల హీరోగా ఎదిగాడు నవీన్ పొలిశెట్టి. సంక్రాంతికి విడుదలైన తన చివరి చిత్రం అనగనగా ఒక…
2026 శర్వానంద్ కు చాలా స్పెషల్ ఇయర్ గా నిలవబోతోంది. సంక్రాంతి పండక్కు విపరీతమైన పోటీ మధ్య 'నారి నారి…