ఇవాళ్టి రోజున పుస్తకాలు ఇచ్చి పుచ్చుకునే సంస్కృతి దాదాపు కనుమరుగైంది. అందరూ గిఫ్టుల పేరుతో ఖరీదైన వస్తువులు మాత్రమే ఇచ్చి పుచ్చుకుంటున్నారు. ఇక, ముఖ్యమంత్రులు ఎదురు పడినప్పుడు కూడా.. ఇదే సంప్రదాయం కొనసాగుతోంది. అయితే.. అసలు గిఫ్టు ఎందుకు ఇస్తారంటే.. “నీపై నాకు ఉన్న ప్రేమ, అభిమానం, అభిప్రాయాలకు ఇదీ ప్రతీక” అని చెప్పేందుకే.. గిఫ్టులు ఇస్తారు. అందే.. సందర్భాన్ని బట్టి గిఫ్టు ప్రాధాన్యం మారుతుంది.
తాజాగా ముఖ్యమంత్రుల భేటీ సందర్భంగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి – ఏపీ సీఎం చంద్రబాబు హైదరాబాద్లోని ప్రజాభవన్లో భేటీ అయ్యారు. ఈ సమయంలో చంద్రబాబు పెద్ద స్వీటు బాక్సుతోపాటు.. శాలువా.. శ్రీవారి చిత్రపటంతో కూడిన మొమెంటోలను రేవంత్రెడ్డి బృందానికి ఇచ్చారు. ఇక, ఏపీ ముఖ్య మంత్రి చంద్రబాబుకు.. రేవంత్ కూడా బహుమతి అందించారు. వీటిలో రెండు రకాలు ఉన్నాయి. వెండి నంది విగ్రహాన్ని ఇచ్చారు. దీనికి ముందు చంద్రబాబుకు రేవంత్ కాళోజీ నారాయణరావు రాసిన “నా గొడవ” పుస్తకాన్ని కానుకగా ఇచ్చారు.
ఇలా, ఒక ముఖ్యమంత్రికి.. మరో ముఖ్యమంత్రి పుస్తకాన్ని బహూకరించడం… అనేది ఇప్పటి వరకు అయితే కనిపించలేదు. ఇది ఒకరకంగా రేవంత్తోనే ప్రారంభమైందనే అభిప్రాయం కూడా వస్తోంది. అయితే.. పైన చెప్పుకొన్నట్టుగా.. కానుకల్లో మన అంతరంగం ప్రస్ఫుటం అవుతుంది. అలానే ఇక్కడ రేవంత్ కూడా.. తన అంతరంగాన్ని సుస్పష్టం చేయడం గమనార్హం. నిజానికి రేవంత్ పుస్తకాలనే కానుకగా ఇవ్వాలని అనుకుంటే… ఇదే తెలంగాణకు చెందిన నారాయణరెడ్డి రాసిన పుస్తకాలను కానుకగా ఇవ్వొచ్చు.
కానీ.. రేవంత్ అలా ఎంచుకోలేదు. దాశరధి రంగా చార్యులు రాసిన పుస్తకాలు కూడా ఇవ్వలేదు. ఏరికోరి.. కాళోజీ నారాయణరావు రాసిన “నా గొడవ” అనే పుస్తకాన్ని కానుకగా ఇచ్చారు. అయితే.. ఇదేమీ తేలికగా.. తీసేసి పారేసేది కాదు.. చాలా లోతైన అంతరంగాన్ని సీఎం రేవంత్ రెడ్డి ఆవిష్కరించారు.
‘జీ’ అనని ‘కలేజా’తో కాళోజీ అనునది ‘నఖరా’లు లేనట్టిది!
అన్యాయాన్నెదిరిస్తే.. నాగొడవకు సంతృప్తి!
లెనిన్ సినిమా ప్రమోషన్లలో హీరో అఖిల్ అక్కినేని గురించి ఒక ఇంట్రెస్టింగ్ కామెంట్ చేశాడు నిర్మాతల్లో ఒకరైన నాగవంశీ. లెనిన్…
పిల్లలు సంపద అని సీఎం చంద్రబాబు మరోసారి స్పష్టం చేశారు. తాను చెప్పిన మాటకే కట్టుబడి ఉన్నానని తెలిపారు. దీనిని…
వియత్నాంలో విహార యాత్రకు వెళ్లిన భారతీయుల కుటుంబాల్లో విషాదం నెలకొంది. ఊహించని ప్రమాదంలో చిక్కుకుని 15 మంది భారతీయులు మృతి…
తన సినిమాకు పని చేసిన టెక్నీషియన్ను ఒక నిర్మాత సైకోగా అభివర్ణించడం ఎప్పుడైనా చూశారా? సితార ఎంటర్టైన్మెంట్స్ అధినేత నాగవంశీ…
శుక్రవారం విడుదలైన లెనిన్ దూకుడు బాక్సాఫీస్ వద్ద కొనసాగుతోంది. తొలి రోజు పదమూడు కోట్లకు పైగా వసూలు చేసి శని…
ఏపీ రాజధాని అమరావతిలో శనివారం తెల్లవారు జాము నుంచి పోలీసులు అధికారులు పెద్ద ఎత్తున మోహరించారు. ఈ ప్రాంతంలో రాజధాని…