ఇవాళ్టి రోజున పుస్తకాలు ఇచ్చి పుచ్చుకునే సంస్కృతి దాదాపు కనుమరుగైంది. అందరూ గిఫ్టుల పేరుతో ఖరీదైన వస్తువులు మాత్రమే ఇచ్చి పుచ్చుకుంటున్నారు. ఇక, ముఖ్యమంత్రులు ఎదురు పడినప్పుడు కూడా.. ఇదే సంప్రదాయం కొనసాగుతోంది. అయితే.. అసలు గిఫ్టు ఎందుకు ఇస్తారంటే.. “నీపై నాకు ఉన్న ప్రేమ, అభిమానం, అభిప్రాయాలకు ఇదీ ప్రతీక” అని చెప్పేందుకే.. గిఫ్టులు ఇస్తారు. అందే.. సందర్భాన్ని బట్టి గిఫ్టు ప్రాధాన్యం మారుతుంది.
తాజాగా ముఖ్యమంత్రుల భేటీ సందర్భంగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి – ఏపీ సీఎం చంద్రబాబు హైదరాబాద్లోని ప్రజాభవన్లో భేటీ అయ్యారు. ఈ సమయంలో చంద్రబాబు పెద్ద స్వీటు బాక్సుతోపాటు.. శాలువా.. శ్రీవారి చిత్రపటంతో కూడిన మొమెంటోలను రేవంత్రెడ్డి బృందానికి ఇచ్చారు. ఇక, ఏపీ ముఖ్య మంత్రి చంద్రబాబుకు.. రేవంత్ కూడా బహుమతి అందించారు. వీటిలో రెండు రకాలు ఉన్నాయి. వెండి నంది విగ్రహాన్ని ఇచ్చారు. దీనికి ముందు చంద్రబాబుకు రేవంత్ కాళోజీ నారాయణరావు రాసిన “నా గొడవ” పుస్తకాన్ని కానుకగా ఇచ్చారు.
ఇలా, ఒక ముఖ్యమంత్రికి.. మరో ముఖ్యమంత్రి పుస్తకాన్ని బహూకరించడం… అనేది ఇప్పటి వరకు అయితే కనిపించలేదు. ఇది ఒకరకంగా రేవంత్తోనే ప్రారంభమైందనే అభిప్రాయం కూడా వస్తోంది. అయితే.. పైన చెప్పుకొన్నట్టుగా.. కానుకల్లో మన అంతరంగం ప్రస్ఫుటం అవుతుంది. అలానే ఇక్కడ రేవంత్ కూడా.. తన అంతరంగాన్ని సుస్పష్టం చేయడం గమనార్హం. నిజానికి రేవంత్ పుస్తకాలనే కానుకగా ఇవ్వాలని అనుకుంటే… ఇదే తెలంగాణకు చెందిన నారాయణరెడ్డి రాసిన పుస్తకాలను కానుకగా ఇవ్వొచ్చు.
కానీ.. రేవంత్ అలా ఎంచుకోలేదు. దాశరధి రంగా చార్యులు రాసిన పుస్తకాలు కూడా ఇవ్వలేదు. ఏరికోరి.. కాళోజీ నారాయణరావు రాసిన “నా గొడవ” అనే పుస్తకాన్ని కానుకగా ఇచ్చారు. అయితే.. ఇదేమీ తేలికగా.. తీసేసి పారేసేది కాదు.. చాలా లోతైన అంతరంగాన్ని సీఎం రేవంత్ రెడ్డి ఆవిష్కరించారు.
‘జీ’ అనని ‘కలేజా’తో కాళోజీ అనునది ‘నఖరా’లు లేనట్టిది!
అన్యాయాన్నెదిరిస్తే.. నాగొడవకు సంతృప్తి!
This post was last modified on July 8, 2024 7:13 am
వైసీపీ పాలనా కాలంలో తిరుమల శ్రీవారి పరకామణిలో 900 డాలర్ల చోరీ జరిగిన విషయం తెలిసిందే. ఈ పరిణామం తిరుమల…
నేటి రాజకీయ నాయకులలో చాలామందిలో పారదర్శకత కోసం భూతద్దం వేసి వెతికినా కనిపించదు. జవాబుదారీతనం గురించి మాట్లడుకునే అవసరం లేదు.…
ప్రభాస్ సినిమా అంటే బడ్జెట్లు.. బిజినెస్ లెక్కలు.. వసూళ్లు అన్నీ భారీగానే ఉంటాయి. కొంచెం మీడియం బడ్జెట్లో తీద్దాం అని…
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ట్రైనీ కానిస్టేబుళ్లకు భారీ శుభవార్త అందించారు. మంగళగిరి ఏపీఎస్సీ పరేడ్ గ్రౌండ్లో 5,757…
అడిగిందే తడవు అన్నట్లు.. పాలనలో పవన వేగాన్ని చూపుతున్నారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. మొన్నటికి మొన్న విద్యార్థులు అడిగారని…