వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తున్నారా? వచ్చే కొన్ని రోజుల్లో ఆయన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి కడప ఎంపీగా పోటీ చేయనున్నారా? ఈ రెండు ప్రశ్నలకు సమాధానం అయితే అధికారికంగా ఎక్కడ వినిపించడం లేదు. అయితే సోషల్ మీడియాలో మాత్రం భారీ ఎత్తున ఈ రెండు విషయాలు ప్రచారంలోకి వచ్చాయి. వైసిపి అధినేత జగన్మోహన్ రెడ్డి తాజా ఎన్నికల్లో ఘోర పరాజయం మూట కట్టుకున్నటువంటి విషయం తెలిసిందే.
175 స్థానాల్లో విజయం సాధిస్తానని చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి కేవలం 11 స్థానాలకు పరిమితం కావడం.. ప్రధాన ఇబ్బందిగా మారింది. దీనికి తోడు అసెంబ్లీలో ఆయనకు ప్రధాన ప్రతిపక్ష హోదా దక్కుతుందా లేదా అనే విషయం మీద కూడా ఇంకా సస్పెన్షన్ కొనసాగుతోంది. ఇదిలా ఉంటే అసలు జగన్మోహన్ రెడ్డి తాను గెలిచినటువంటి పులివెందుల స్థానానికి రాజీనామా చేయటం, అదే సమయంలో కడప ఎంపీగా పోటీ చేయటం అనే ఈ రెండు కాన్సెప్టులు కూడా అత్యంత చర్చనీయ అంశంగా మారాయి.
ఇది నిజమేనా కాదా అనే విషయాన్ని పార్టీ ఇంతవరకు స్పందించలేదు. కానీ వాస్తవం ఏంటంటే జగన్మోహన్ రెడ్డికి ఇప్పటికి ఇప్పుడు ఇలా చేయాల్సినటువంటి అవసరం కానీ అవకాశం కానీ ఉందా అంటే లేదు. ఎందుకంటే ఇక్కడైనా.. పార్లమెంట్లో అయినా ఆయన చేసేది పెద్దగా ఏమీ లేదు. అయితే పార్లమెంటుకు వెళ్లడం ద్వారా కేంద్రంలో పరిచయాలు పెరుగుతాయని కేంద్రంలో ఉన్నటువంటి ప్రధానమంత్రితో మరింత చనువు వస్తుందని కొన్ని వర్గాలు భావిస్తున్నాయి. కానీ, జగన్ స్థాయిని బట్టి అంచనా వేస్తే ఇది అంత పెద్ద విషయం కాకపోవచ్చు.
పైగా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయటం అంటే రాష్ట్రంలో ఓటమిని ఆయన తట్టుకోలేక, జీర్ణించుకోలేక రాజీనామా చేశారు అనేటటువంటి విమర్శలు మరింత పెరుగుతాయి. కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఇలాంటి ప్రయత్నం అయితే చేయడు అని మరో వర్గం చెప్తుంది. మరో వైపు తన మాతృమూర్తి విజయలక్ష్మిని పులివెందుల నుంచి పోటీ చేయిస్తారని తద్వారా తాను కడప ఎంపీగా పోటీచేసి పార్లమెంట్లో అడుగుపెడతారని మరో ప్రచారం జరుగుతోంది. దీనిలోనూ వాస్తవం పెద్దగా కనిపించడం లేదు.
ఎందుకంటే విజయలక్ష్మి ఇప్పటికే రాజకీయంగా పక్కకు తప్పుకున్నారు. రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. కేవలం ఆమె తన కుమారుడు, కుమార్తె విషయంలో కొద్దిపాటి మద్దతు మాత్రమే ప్రకటిస్తున్నారు. పైగా వైసీపీ గౌరవ అధ్యక్షురాలుగా కూడా ఆమె పదవిని వదులుకున్నారు. విజయలక్ష్మి ఇప్పటికి ఇప్పుడు రావటం పోటీ చేయటం అనేటటువంటిది నిస్సందేహంగా అనుమానం. పైగా జగన్మోహన్ రెడ్డి పులివెందుల వంటి బలమైన స్థానాన్ని వదులుకొని పార్లమెంటుకు పోటీ చేసి ఇప్పుడు కొత్తగా కోరి కష్టాలు కొని తెచ్చుకుంటారని ఎవరో ఊహించరు.
రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితుల్లో పార్టీని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత ఆయనదే. వచ్చే ఐదు సంవత్సరాలు పార్టీకి ఒక అగ్నిపరీక్ష లాంటిది. కాబట్టి ఈ సమయంలో ఆయన రాష్ట్రాన్ని వదిలి ఢిల్లీలో ఉంటారని, పార్లమెంట్లో పాల్గొంటారని అనేవి.. అనవసరమైన ప్రచారమే తప్ప దీనిలో పెద్దగా ఒరిగేది గాని మరొకటి గానీ ఏమీ లేదు. కచ్చితంగా జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి వెళ్తారు. అదేవిధంగా రాష్ట్రంలో పార్టీని కాపాడుకుంటారు. అందులో ఎలాంటి సందేహం లేదు.
This post was last modified on July 7, 2024 12:20 pm
సుప్రీంకోర్టులో రోజు వారీగా అనేక కేసులు విచారణకు వస్తాయి. న్యాయశాస్త్రంలో లబ్ధప్రతిష్టులైన అనేక మంది న్యాయవాదులు వాదనలు వినిపిస్తారు. ఇది…
రేపు కొత్త శుక్రవారం వచ్చేస్తోంది. సంక్రాంతి సినిమాల హడావిడి పూర్తిగా అయిపోవడంతో ఇప్పుడు మూవీ లవర్స్ దృష్టి వీటివైపు వెళ్లాల్సి…
బాలీవుడ్ బ్యూటీ మృణాల్ ఠాకూర్ కి విపరీతమైన ఫ్రీ పబ్లిసిటీ జరుగుతుంది. అదేంటో ఆమె సినిమాల వల్ల వచ్చిన పాపులారిటీ…
ప్రేక్షకులను తన సినిమాలతో మెప్పిస్తూ యువ హీరోగా సత్తా చాటుతున్నాడు నవీన్ పొలిశెట్టి. సంక్రాంతికి అనగనగా ఒక రాజుతో వచ్చి…
తెలుగు సినిమాలో పరిగెత్తడంలోనూ ప్రత్యేక స్టాండర్డ్ సెట్ చేసిన ఏకైక హీరో సూపర్ స్టార్ మహేష్ బాబు. అతని రన్నింగ్…
ఆల్ ఇండియా బ్లాక్ బస్టర్స్ లో ఒకటిగా అవతరించిన దురంధర్ తాజాగా ఓటిటిలో వచ్చాక కొత్త డిబేట్ మొదలయ్యింది. ఇంతకన్నా…