Political News

పార్ల‌మెంటుకు జ‌గ‌న్‌.. ఉత్తుత్తి ప్ర‌చార‌మా? నిజ‌మా?

వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తున్నారా? వచ్చే కొన్ని రోజుల్లో ఆయన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి కడప ఎంపీగా పోటీ చేయనున్నారా? ఈ రెండు ప్రశ్నలకు సమాధానం అయితే అధికారికంగా ఎక్కడ వినిపించడం లేదు. అయితే సోషల్ మీడియాలో మాత్రం భారీ ఎత్తున ఈ రెండు విషయాలు ప్రచారంలోకి వచ్చాయి. వైసిపి అధినేత జగన్మోహన్ రెడ్డి తాజా ఎన్నికల్లో ఘోర పరాజ‌యం మూట కట్టుకున్నటువంటి విషయం తెలిసిందే.

175 స్థానాల్లో విజయం సాధిస్తానని చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి కేవలం 11 స్థానాలకు పరిమితం కావడం.. ప్రధాన ఇబ్బందిగా మారింది. దీనికి తోడు అసెంబ్లీలో ఆయనకు ప్రధాన ప్రతిపక్ష హోదా దక్కుతుందా లేదా అనే విషయం మీద కూడా ఇంకా సస్పెన్షన్ కొన‌సాగుతోంది. ఇదిలా ఉంటే అసలు జగన్మోహన్ రెడ్డి తాను గెలిచినటువంటి పులివెందుల స్థానానికి రాజీనామా చేయటం, అదే సమయంలో కడప ఎంపీగా పోటీ చేయటం అనే ఈ రెండు కాన్సెప్టులు కూడా అత్యంత చర్చనీయ‌ అంశంగా మారాయి.

ఇది నిజమేనా కాదా అనే విషయాన్ని పార్టీ ఇంతవరకు స్పందించలేదు. కానీ వాస్తవం ఏంటంటే జగన్మోహన్ రెడ్డికి ఇప్పటికి ఇప్పుడు ఇలా చేయాల్సినటువంటి అవసరం కానీ అవకాశం కానీ ఉందా అంటే లేదు. ఎందుకంటే ఇక్కడైనా.. పార్లమెంట్లో అయినా ఆయన చేసేది పెద్దగా ఏమీ లేదు. అయితే పార్లమెంటుకు వెళ్లడం ద్వారా కేంద్రంలో పరిచయాలు పెరుగుతాయని కేంద్రంలో ఉన్నటువంటి ప్రధానమంత్రితో మరింత చనువు వస్తుందని కొన్ని వర్గాలు భావిస్తున్నాయి. కానీ, జ‌గ‌న్ స్థాయిని బట్టి అంచనా వేస్తే ఇది అంత పెద్ద విషయం కాకపోవచ్చు.

పైగా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయటం అంటే రాష్ట్రంలో ఓటమిని ఆయన తట్టుకోలేక, జీర్ణించుకోలేక రాజీనామా చేశారు అనేటటువంటి విమర్శలు మరింత పెరుగుతాయి. కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఇలాంటి ప్రయత్నం అయితే చేయడు అని మరో వర్గం చెప్తుంది. మరో వైపు తన మాతృమూర్తి విజయలక్ష్మిని పులివెందుల నుంచి పోటీ చేయిస్తారని తద్వారా తాను కడప ఎంపీగా పోటీచేసి పార్లమెంట్లో అడుగుపెడతారని మరో ప్రచారం జరుగుతోంది. దీనిలోనూ వాస్తవం పెద్దగా కనిపించడం లేదు.

ఎందుకంటే విజయలక్ష్మి ఇప్ప‌టికే రాజ‌కీయంగా పక్కకు తప్పుకున్నారు. రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. కేవలం ఆమె తన కుమారుడు, కుమార్తె విషయంలో కొద్దిపాటి మద్దతు మాత్రమే ప్రకటిస్తున్నారు. పైగా వైసీపీ గౌరవ అధ్యక్షురాలుగా కూడా ఆమె పదవిని వదులుకున్నారు. విజయలక్ష్మి ఇప్పటికి ఇప్పుడు రావటం పోటీ చేయటం అనేటటువంటిది నిస్సందేహంగా అనుమానం. పైగా జగన్మోహన్ రెడ్డి పులివెందుల వంటి బలమైన స్థానాన్ని వదులుకొని పార్లమెంటుకు పోటీ చేసి ఇప్పుడు కొత్తగా కోరి కష్టాలు కొని తెచ్చుకుంటారని ఎవరో ఊహించరు.

రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితుల్లో పార్టీని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత ఆయనదే. వచ్చే ఐదు సంవత్సరాలు పార్టీకి ఒక అగ్నిపరీక్ష లాంటిది. కాబట్టి ఈ సమయంలో ఆయన రాష్ట్రాన్ని వదిలి ఢిల్లీలో ఉంటారని, పార్లమెంట్లో పాల్గొంటారని అనేవి.. అనవసరమైన ప్రచారమే తప్ప దీనిలో పెద్దగా ఒరిగేది గాని మరొకటి గానీ ఏమీ లేదు. కచ్చితంగా జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి వెళ్తారు. అదేవిధంగా రాష్ట్రంలో పార్టీని కాపాడుకుంటారు. అందులో ఎలాంటి సందేహం లేదు.

This post was last modified on July 7, 2024 12:20 pm

Share
Show comments
Published by
Satya
Tags: Jagan

Recent Posts

`ఏఐ`లో ఏపీ దూకుడు.. పార్ల‌మెంటు సాక్షిగా కేంద్రం!

ఆర్టిఫిషియ‌ల్ ఇంటెలిజెన్స్‌(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉంద‌ని కేంద్ర ప్ర‌భుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్ప‌త్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…

1 hour ago

అధికారంలో ఉన్నాం ఆ తమ్ముళ్ల బాధే వేరుగా ఉందే…!

అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…

4 hours ago

డాలర్లు, మంచి లైఫ్ కోసం విదేశాలకు వెళ్ళాక నిజం తెలిసింది

డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…

7 hours ago

జగన్ ఇలానే ఉండాలంటూ టీడీపీ ఆశీస్సులు

వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవ‌రినీ దెబ్బతీయరు.…

10 hours ago

టీం ఇండియా ఇప్పటికైన ఆ ప్లేయర్ ను ఆడిస్తుందా?

రాయ్‌పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…

10 hours ago

చరిత్ర ఎన్నోసార్లు హెచ్చరిస్తూనే ఉంది

కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…

12 hours ago