ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి దేశ రాజధాని ఢిల్లీకి వెళ్లటం.. కేంద్రమంత్రుల్ని కలిసేందుకు.. రాష్ట్ర ప్రయోజనాల గురించి మాట్లాడేందుకు అని చెప్పేటప్పుడు సీఎం వెంట ఎవరెవరు వెళతారు? అన్నది చాలా ప్రాధమికమైన అంశంగా చెప్పొచ్చు. వీలైనంత వరకు ముఖ్యమంత్రి.. ఆయన వెంట కీలకమైన అధికారులు కొందరు వెళుతుంటారు. ఢిల్లీకి చేరుకున్న తర్వాత ఎంపీలు కలుస్తారు. అవసరమనుకుంటే.. వారిని కూడా తీసుకొని కేంద్రమంత్రితో భేటీ అవుతుంటారు రాష్ట్రాల ముఖ్యమంత్రులు.
ఎప్పుడూ లేని రీతిలో తాజాగా సీఎం జగన్ తన ఢిల్లీ టూర్ కు తనతో పాటుగా తీసుకెళ్లిన వారి బ్యాక్ గ్రౌండ్ ఆసక్తికరంగా మారింది. ఎప్పుడూ లేని రీతిలో సీఎం జగన్ ఈసారి తన వెంటనే పలువురు లాయర్లను వెంట పెట్టుకొని వెళ్లాల్సిన అవసరం ఏముంది? అన్న ప్రశ్న ఇప్పుడు వినిపిస్తోంది. తాజాగా సీఎం జగన్ వెంట ఢిల్లీకి వెళ్లిన వారిలో అడ్వొకేట్ జనరల్ శ్రీరామ్ సుబ్రహ్మణ్యం.. న్యాయవాది భూషణ్ లు వెళ్లారు. ఇంతకీ ఈ న్యాయవాది భూషణ్ మరెవరో కాదు.. సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ చలమేశ్వర్ కుమారుడు.
వీరితో పాటు.. రాజ్యసభ సభ్యుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి.. సీఎం సేఫీ అధికారులు ప్రవీణ్ ప్రకాశ్.. కృష్ణ మోహన్రెడ్డి, పరమేశ్వర్రెడ్డిలు కూడా ఢిల్లీ వెళ్లారు. కేంద్రమంత్రి షాతో భేటీ సందర్భంగా సీఎం జగన్ తో పాటు.. ఎంపీ బాలశౌరి.. ప్రవీణ్ ప్రకాశ్.. ఓఎస్డీ కృష్ణ మోహన్రెడ్డి మాత్రమే కారులో ఉన్నట్లుగా చెబుతున్నారు. అయితే.. షా తో భేటీ సందర్భంగా మాత్రం జగన్ ఒక్కరే లోపలకు వెళ్లినట్లుగా చెబుతున్నారు.
This post was last modified on September 23, 2020 10:53 am
సినిమాల్లో డ్యూయల్ రోల్స్ తో మెప్పించిన హీరో విజయ్ ఇప్పుడు రాజకీయ రంగంలోనూ అదే తరహాలో రెండు నియోజకవర్గాల నుంచి…
అమెరికా-ఇరాన్ యుద్ధం ఇప్పుడు కేవలం భూమి, ఆకాశానికే పరిమితం కాకుండా సముద్ర గర్భంలో ఉన్న ఇంటర్నెట్ వ్యవస్థపై కూడా నీలినీడలు…
రోటీన్ కు తగ్గట్లు వ్యవహరిస్తే కిక్ ఏముంటుంది? వినూత్న ఆలోచనలకు వేదికగా హైదరాబాద్ మహానగరం సాగుతోంది. ఇందులో భాగంగా సరికొత్త…
వసూళ్ల లెక్కల్లోనే కాదు చాలా విషయాల్లో దురంధర్ ది రివెంజ్ ఎవరికీ అందని రికార్డులు సొంతం చేసుకుంటోంది. భారతీయ సినీ…
నిన్న జరిగిన బ్యాండ్ మేళం సక్సెస్ మీట్ లో ఎక్కువ శాతం నటీనటులు, దర్శకుడు ఒక పాయింట్ మీద ఫిర్యాదు…
అనుకున్నది ఒకటి.. అవుతున్నది మరొకటి అన్నట్లుగా మారింది అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తీరు. ఇరాన్ తో మొదలు పెట్టిన యుద్ధాన్ని…