ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్ పై ఉన్న అక్రమాస్తుల కేసు విచారణ గత ఐదేళ్లుగా నత్తనడకన సాగుతోన్న సంగతి తెలిసిందే. జగన్ కేసుల రోజువారీ విచారణ చేపట్టాలని 2024 ఎన్నికలకు ముందు కాపు సంక్షేమ సంఘం అధ్యక్షుడు, మాజీ కేంద్ర మంత్రి హరి రామ జోగయ్య వేసిన పిటిషన్ పై ఈరోజు తెలంగాణ హైకోర్టు విచారణ జరిపింది. ఈ నేపథ్యంలోనే జగన్ కేసుల్లో రోజువారీ విచారణ చేయాలని తెలంగాణ హైకోర్టు ఆదేశిస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది. జగన్ పై నమోదైన సీబీఐ, ఈడీ కేసుల రోజువారీ విచారణ చేపట్టి తేల్చేలాగా హైదరాబాద్ సీబీఐ కోర్టుకు ఆదేశాలివ్వాలని తెలంగాణ హైకోర్టులో హరిరామ జోగయ్య పిల్ వేశారు.
సీబీఐ, ఈడీ కేసులు లేని నేతను ఎన్నుకోవాలని ప్రజలు అనుకుంటున్నారని, సుదీర్ఘకాలంగా పెండింగ్ లో ఉన్న కేసుల్లో నిందితుడైన జగన్ వరుస పిటిషన్లు వేసి విచారణను సాగనివ్వడం లేదని ఆయన ఆరోపించారు. జగన్ అక్రమాస్తుల కేసుల విచారణ వేగంగా సాగడం లేదని, ఇతర రాష్ట్రాలకు ఈ కేసులను బదిలీ చేయాలని రఘురామకృష్ణరాజు సుప్రీంకోర్టును కూడా ఆశ్రయించిన సంగతి తెలిసిందే. ఆ క్రమంలోనే సీబీఐని విచారణ జరిపి కారణం చెప్పాలంటూ సుప్రీంకోర్టు ప్రశ్నించింది. అయితే, వరుసగా వివిధ రకాల పిటిషన్లు నిందితులు వేయడంతోనే విచారణ ఆలస్యమైందని కోర్టుకు సీబీఐ తెలిపింది.
క్విడ్ ప్రోకో ఆరోపణలతో మొత్తం 20 ఛార్జ్ షీట్లను జగన్ పై సిఐడి,ఈడి దాఖలు చేశాయి. ఈ కేసులపై సీబీఐ కోర్టులో 12 ఏళ్లుగా విచారణ కొనసాగుతూనే ఉంది. ఆ చార్జిషీట్ల నుంచి తప్పించాలని జగన్, విజయసాయిరెడ్డి ఇతర నిందితులు దాఖలు చేసిన 130 డిశ్చార్జ్ పిటిషన్ లపై తీర్పు వెల్లడి కాలేదు. తీర్పు చెప్పాల్సిన రోజు జడ్జి బదిలీ కావడంతో ఆ కేసు వాదనలను తాజా సీబీఐ జడ్జి మళ్ళీ వింటున్నారు.
ఇండస్ట్రీ, ప్రేక్షకుల్లో టాపిక్ పాతదే అయినా మరోసారి కొత్త డిబేట్ మొదలయ్యింది. లెనిన్ ప్రమోషన్లలో భాగంగా ఒక ఇంటర్వ్యూలో నిర్మాత…
ఈ నెల విడుదలవుతున్న సినిమాల్లో చెన్నై లవ్ స్టోరీ మీద మంచి అంచనాలున్నాయి. దర్శకుడు రవి నంబూరి అయినప్పటికీ, కథ…
ప్రభాస్ కెరీర్లో బిగ్గెస్ట్ హిట్లలో ఒకటవుతుందని అభిమానులు అంచనాలు పెట్టుకున్న చిత్రం.. రాజాసాబ్. ముందు మారుతి దర్శకత్వంలో ప్రభాస్ సినిమా…
సలార్ లో వరదరాజ మన్నార్ గా తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన మలయాళ హీరో పృథ్విరాజ్ సుకుమారన్ ఆ తర్వాత తెలుగులో…
మొన్న విడుదలైన రావు బహదూర్ సినిమాకు కొందరు విమర్శకుల ప్రశంసలు దక్కాయి. ఫస్ట్ హాఫ్ మరీ నెమ్మదిగా ఉన్నా సెకండాఫ్…
తెలుగులో ఒకప్పుడు చిన్న సినిమాల కథానాయకుడిగా చాలా ఏళ్ల పాటు కెరీర్ను నడిపించాడు శివాజీ. కానీ తర్వాత అతడి మనసు…