ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఢిల్లీ పర్యటనకు వెళ్లనున్న సంగతి తెలిసిందే. బుధవారం ఆయన దేశ రాజధానికి వెళుతున్నారు. తన పర్యటనలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, హోంమంత్రి అమిత్ షాతో పాటు పలువురు కేంద్ర మంత్రులతో భేటీ కానున్నారు. ఈ పర్యటనలో భాగంగా కలిసే కేంద్ర మంత్రులందరితోనూ.. రాష్ట్రానికి అవసరమైన నిధులను తీసుకురావటమే లక్ష్యమని చెబుతున్నారు.
కేంద్రం నుంచి రావాల్సిన నిధులు.. ఏఏ ప్రాజెక్టు.. స్కీంల కింద కేంద్రం నుంచి రావాల్సిన వాటి వివరాల్ని సేకరించి.. సంబంధిత శాఖా మంత్రులతో భేటీ కావటం.. వీలైనంత త్వరగా నిధులను విడుదల చేయాల్సిందిగా కోరనున్నట్లు చెబుతున్నారు. ఇందులో భాగంగా మంగళవారం ఆయన మంత్రులతో భేటీ అయ్యారు. కేంద్రం నుంచి రాబట్టాల్సిన నిధులకు సంబంధించిన ఒక ప్రణాళికను సిద్ధం చేసినట్లు తెలుస్తోంది.
ఏపీ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి వివరించి.. రాష్ట్రంలో మౌలిక వసతుల కల్పనకు వీలైనన్ని ఎక్కువ నిధులు సేకరించేలా ప్రణాళికల్ని సిద్ధం చేయించారు. తాజా పర్యటనలో సీఎం చంద్రబాబు కలవనున్న కేంద్ర మంత్రుల జాబితాలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, జేపీ నడ్డా, నితిన్ గడ్కరీ, సీఆర్ పాటిల్ తో పాటు మరికొందరు మంత్రులతోనూ భేటీ కానున్నారు. చంద్రబాబు వెంట వెళ్లే ఏపీ మంత్రుల్లో బీసీ జనార్దన్.. నిమ్మల రామానాయుడు, పయ్యావుల కేశవ్ తదితరులు వెళ్లనున్నారు. కేంద్రంలో ఎన్డీయే సర్కారు వచ్చేందుకు కీలకభూమిక పోషించిన చంద్రబాబు తన తాజా పర్యటనతో ఏపీకి ఏమేరకు వరాల్ని పొందుతారన్నది ఇప్పుడు ఆసక్తకరంగా మారింది.
This post was last modified on July 3, 2024 10:50 am
కొందరు ఫిలిం మేకర్స్ తమ సినిమా కథేంటో చివరి వరకు దాచి పెట్టాలని ప్రయత్నిస్తారు. నేరుగా థియేటర్లలో ప్రేక్షకులను ఆశ్చర్యపరచాలనుకుంటారు.…
ఏపీ సీఎం చంద్రబాబుకు ప్రముఖ దినపత్రిక `ఎకనమిక్ టైమ్స్`.. ప్రతిష్టాత్మక వ్యాపార సంస్కర్త-2025 పురస్కారానికి ఎంపిక చేసిన విషయం తెలిసిందే.…
బంగ్లాదేశ్లో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు భారత్కు పెద్ద తలనొప్పిగా మారాయి. 1971 విముక్తి యుద్ధం తర్వాత మన దేశానికి ఇదే…
ప్రేమ ఎప్పుడు ఎవరి మీద పుడుతుందో చెప్పలేం అంటారు. కానీ జపాన్ లో జరిగిన ఈ పెళ్లి చూస్తే టెక్నాలజీ…
ప్రభుత్వం తరఫున ఖర్చుచేసేది ప్రజాధనమని సీఎం చంద్రబాబు తెలిపారు. అందుకే ఖర్చు చేసే ప్రతి రూపాయికీ ఫలితాన్ని ఆశిస్తానని చెప్పారు.…
`వ్యాపార సంస్కర్త-2025` అవార్డును ఏపీ సీఎం చంద్రబాబు కైవసం చేసుకున్నారు. అయితే.. దేశవ్యాప్తంగా 28 రాష్ట్రాలు, 28 మంది ముఖ్యమంత్రులు…