తెలంగాణలో ఎమ్మెల్యేల జంపింగుల పర్వం గత వారం నుంచి కొనసాగుతూనే ఉంది. గత నవంబరులో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ తరఫున విజయం దక్కించుకున్నవారు.. తర్వాత.. ఆ పార్టీకి గుడ్ బై చెప్పారు. కారణాలు ఏవైనా.. తొలుత ఇద్దరు ముగ్గురుతో ప్రారంభమైన ఈ గోడదూకుళ్లు.. ఇటీవల కాలంలో మరింత పెరిగాయి. వచ్చిన వారిని వచ్చినట్టు కాంగ్రెస్ పార్టీ తెలంగాణ చీఫ్, సీఎం రేవంత్ రెడ్డి పార్టీలో చేర్చుకుంటున్నారు. కండువాలు కప్పేస్తున్నారు.
అయితే.. ఈ కథ ఇప్పట్లో ముగిసిపోయేలా కనిపించడం లేదు. ఇప్పటికే.. దానం నాగేందర్, తెల్లం వెంకట్రావు, కడియం శ్రీహరి, పోచారం శ్రీనివాసరెడ్డి, సంజయ్ కుమార్, కాలె యాదయ్యలు పార్టీ వీడారు. దీంతో బీఆర్ఎస్ అధినేతలో పునరాలోచన రావాలి. కానీ, మాజీ సీఎం కేసీఆర్ పునరాలోచన చేయడం లేదు. పైగా.. మరో రెండు మాసాల్లో రేవంత్ రెడ్డి సర్కారు కూలిపోతుందనే ఆయన ఇప్పటికీ చెబుతున్నారు.
ఈ వ్యాఖ్యలతో ఎప్పుడు ఏం జరుగుతుందో అనే భావన అధికార పక్షంలో ఉంది. దీంతో ఎందుకు అవకాశం ఇవ్వాలి! అనే ధోరణి రేవంత్లోనూ కనిపిస్తోంది. దీంతో.,. నీవు నేర్పిన విద్యయే నీరజాక్షా! అంటూ.. వచ్చిన వారిని వచ్చినట్టు పార్టీ తీర్థం ఇస్తున్నారు. ఇక, ఇప్పుడు అత్యంత విశ్వసనీయ గాంధీ భవన్, బీఆర్ఎస్ వర్గాల సమాచారం మేరకు.. మరో ఐదు నుంచి 8 మంది వరకు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు.. పార్టీ మారే అవకాశం ఉందని తెలుస్తోంది. వీరిలో కొందరు బీఆర్ ఎస్ అధినేతకు అత్యంత ముఖ్యలని కూడా సమాచారం.
అంతేకాదు.. భాగ్యనగరంలోని రెండు కీలక స్థానాల ఎమ్మెల్యేలు ఇప్పటికే సీఎం రేవంత్కు టచ్లోకి వెళ్లారని అంటున్నారు. అదేసమయంలో వరంగల్, నిజామాబాద్ జిల్లాల్లోని వారు కూడా.. పార్టీ మారేందు కు రెడీగా ఉన్నారని తెలుస్తోంది. అయితే.. వారి వివరాలు ఇంకా బయటకు పొక్కలేదు. మార్పు ఖాయమ ని మాత్రం తెలుస్తోంది. ప్రస్తుతం సంప్రదింపులు జరుగుతున్నాయని తెలుస్తోంది. దీంతో వచ్చే రెండు మూడు వారాల్లోనే బీఆర్ ఎస్ నుంచి భారీ జంపింగులు ఉండే అవకాశం ఉంటుందని సమాచారం.
This post was last modified on July 1, 2024 9:07 am
యుఎస్లో పెద్ద పెద్ద స్టార్లను మించి మంచి మార్కెట్ సంపాదించుకున్న హీరో.. నాని. హీరోగా తొలి అడుగులు వేస్తున్న రోజుల్లోనే…
కాంగ్రెస్పార్టీ మాజీ అధ్యక్షురాలు, ప్రస్తుత రాజ్యసభ సభ్యురాలు సోనియా గాంధీ రాసిన ఆత్మకథ ..పుస్తకం ముద్రణ వ్యవహారం వివాదంగా మారింది.…
ఆగస్ట్ అయిపోతోంది. ఎన్ని సినిమాలు రిలీజైనా ఇరుముడినే క్లియర్ విన్నర్ గా నిలిచి రికార్డుల భరతం పట్టేసింది. విశ్వనాథ్ అండ్…
ఆకస్మిక ప్రచండ వరదలతో అతలాకుతలమైన నేపాల్ తాజాగా ప్రపంచ దేశాలను ఉద్దేశించి కీలక ప్రకటన చేసింది. ``భౌతికంగా మీరు మాకు…
ఈ మధ్య కాలంలో టాలీవుడ్ బాక్సాఫీస్లో అతి పెద్ద సంచలనం ‘ఇరుముడి’ సినిమానే అని చెప్పాలి. ఈ సినిమా రేంజికి…
సినిమా బాగుంటే భాషా భేదం లేకుండా తెలుగు ప్రేక్షకులు ఎలా ఆదరిస్తారో కొత్తగా చెప్పాల్సిన పని లేదు. ఇందుకు చరిత్రలో…