తెలంగాణలో ఎమ్మెల్యేల జంపింగుల పర్వం గత వారం నుంచి కొనసాగుతూనే ఉంది. గత నవంబరులో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ తరఫున విజయం దక్కించుకున్నవారు.. తర్వాత.. ఆ పార్టీకి గుడ్ బై చెప్పారు. కారణాలు ఏవైనా.. తొలుత ఇద్దరు ముగ్గురుతో ప్రారంభమైన ఈ గోడదూకుళ్లు.. ఇటీవల కాలంలో మరింత పెరిగాయి. వచ్చిన వారిని వచ్చినట్టు కాంగ్రెస్ పార్టీ తెలంగాణ చీఫ్, సీఎం రేవంత్ రెడ్డి పార్టీలో చేర్చుకుంటున్నారు. కండువాలు కప్పేస్తున్నారు.
అయితే.. ఈ కథ ఇప్పట్లో ముగిసిపోయేలా కనిపించడం లేదు. ఇప్పటికే.. దానం నాగేందర్, తెల్లం వెంకట్రావు, కడియం శ్రీహరి, పోచారం శ్రీనివాసరెడ్డి, సంజయ్ కుమార్, కాలె యాదయ్యలు పార్టీ వీడారు. దీంతో బీఆర్ఎస్ అధినేతలో పునరాలోచన రావాలి. కానీ, మాజీ సీఎం కేసీఆర్ పునరాలోచన చేయడం లేదు. పైగా.. మరో రెండు మాసాల్లో రేవంత్ రెడ్డి సర్కారు కూలిపోతుందనే ఆయన ఇప్పటికీ చెబుతున్నారు.
ఈ వ్యాఖ్యలతో ఎప్పుడు ఏం జరుగుతుందో అనే భావన అధికార పక్షంలో ఉంది. దీంతో ఎందుకు అవకాశం ఇవ్వాలి! అనే ధోరణి రేవంత్లోనూ కనిపిస్తోంది. దీంతో.,. నీవు నేర్పిన విద్యయే నీరజాక్షా! అంటూ.. వచ్చిన వారిని వచ్చినట్టు పార్టీ తీర్థం ఇస్తున్నారు. ఇక, ఇప్పుడు అత్యంత విశ్వసనీయ గాంధీ భవన్, బీఆర్ఎస్ వర్గాల సమాచారం మేరకు.. మరో ఐదు నుంచి 8 మంది వరకు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు.. పార్టీ మారే అవకాశం ఉందని తెలుస్తోంది. వీరిలో కొందరు బీఆర్ ఎస్ అధినేతకు అత్యంత ముఖ్యలని కూడా సమాచారం.
అంతేకాదు.. భాగ్యనగరంలోని రెండు కీలక స్థానాల ఎమ్మెల్యేలు ఇప్పటికే సీఎం రేవంత్కు టచ్లోకి వెళ్లారని అంటున్నారు. అదేసమయంలో వరంగల్, నిజామాబాద్ జిల్లాల్లోని వారు కూడా.. పార్టీ మారేందు కు రెడీగా ఉన్నారని తెలుస్తోంది. అయితే.. వారి వివరాలు ఇంకా బయటకు పొక్కలేదు. మార్పు ఖాయమ ని మాత్రం తెలుస్తోంది. ప్రస్తుతం సంప్రదింపులు జరుగుతున్నాయని తెలుస్తోంది. దీంతో వచ్చే రెండు మూడు వారాల్లోనే బీఆర్ ఎస్ నుంచి భారీ జంపింగులు ఉండే అవకాశం ఉంటుందని సమాచారం.
This post was last modified on July 1, 2024 9:07 am
ఇటీవల ‘ఉస్తాద్ భగత్ సింగ్’ ప్రి రిలీజ్ ఈవెంట్ సందర్భంగా జరిగిన ఒక పరిణామానికి సంబంధించి ఓ వీడియో సోషల్…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒకప్పటిలా సినిమాల మీద సీరియస్గా లేకపోయినా, తన పొటెన్షియాలిటీకి తగ్గ సినిమాలు చేయలేకపోతున్నా.. ఆయన…
వైసీపీ అధినేత జగన్పై ఆయన సోదరి, ఏపీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల మరోసారి నిప్పులు చెరిగారు. 'అన్న'…
దేశంలో విమానయాన సంస్థల గుత్తాధిపత్యానికి చెక్ పెడుతూ.. కేంద్ర ప్రభుత్వం తాజాగా సంచలన నిర్ణయం తీసుకుంది. ఇప్పటి వరకు ఉన్న…
ఏపీలో మరో కీలక పథకం ప్రజలకు అందుబాటులోకి వచ్చింది. 'దివ్యాంగ శక్తి' పేరుతో కీలక పథకాన్ని సీఎం చంద్రబాబు, ఉప…
మంత్రి నారా లోకేష్.. మంగళవారం ఉమ్మడి కృష్ణాజిల్లాలోని ఓ పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ విషయాన్ని అత్యంత గోప్యంగా…