తెలంగాణలో ఎమ్మెల్యేల జంపింగుల పర్వం గత వారం నుంచి కొనసాగుతూనే ఉంది. గత నవంబరులో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ తరఫున విజయం దక్కించుకున్నవారు.. తర్వాత.. ఆ పార్టీకి గుడ్ బై చెప్పారు. కారణాలు ఏవైనా.. తొలుత ఇద్దరు ముగ్గురుతో ప్రారంభమైన ఈ గోడదూకుళ్లు.. ఇటీవల కాలంలో మరింత పెరిగాయి. వచ్చిన వారిని వచ్చినట్టు కాంగ్రెస్ పార్టీ తెలంగాణ చీఫ్, సీఎం రేవంత్ రెడ్డి పార్టీలో చేర్చుకుంటున్నారు. కండువాలు కప్పేస్తున్నారు.
అయితే.. ఈ కథ ఇప్పట్లో ముగిసిపోయేలా కనిపించడం లేదు. ఇప్పటికే.. దానం నాగేందర్, తెల్లం వెంకట్రావు, కడియం శ్రీహరి, పోచారం శ్రీనివాసరెడ్డి, సంజయ్ కుమార్, కాలె యాదయ్యలు పార్టీ వీడారు. దీంతో బీఆర్ఎస్ అధినేతలో పునరాలోచన రావాలి. కానీ, మాజీ సీఎం కేసీఆర్ పునరాలోచన చేయడం లేదు. పైగా.. మరో రెండు మాసాల్లో రేవంత్ రెడ్డి సర్కారు కూలిపోతుందనే ఆయన ఇప్పటికీ చెబుతున్నారు.
ఈ వ్యాఖ్యలతో ఎప్పుడు ఏం జరుగుతుందో అనే భావన అధికార పక్షంలో ఉంది. దీంతో ఎందుకు అవకాశం ఇవ్వాలి! అనే ధోరణి రేవంత్లోనూ కనిపిస్తోంది. దీంతో.,. నీవు నేర్పిన విద్యయే నీరజాక్షా! అంటూ.. వచ్చిన వారిని వచ్చినట్టు పార్టీ తీర్థం ఇస్తున్నారు. ఇక, ఇప్పుడు అత్యంత విశ్వసనీయ గాంధీ భవన్, బీఆర్ఎస్ వర్గాల సమాచారం మేరకు.. మరో ఐదు నుంచి 8 మంది వరకు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు.. పార్టీ మారే అవకాశం ఉందని తెలుస్తోంది. వీరిలో కొందరు బీఆర్ ఎస్ అధినేతకు అత్యంత ముఖ్యలని కూడా సమాచారం.
అంతేకాదు.. భాగ్యనగరంలోని రెండు కీలక స్థానాల ఎమ్మెల్యేలు ఇప్పటికే సీఎం రేవంత్కు టచ్లోకి వెళ్లారని అంటున్నారు. అదేసమయంలో వరంగల్, నిజామాబాద్ జిల్లాల్లోని వారు కూడా.. పార్టీ మారేందు కు రెడీగా ఉన్నారని తెలుస్తోంది. అయితే.. వారి వివరాలు ఇంకా బయటకు పొక్కలేదు. మార్పు ఖాయమ ని మాత్రం తెలుస్తోంది. ప్రస్తుతం సంప్రదింపులు జరుగుతున్నాయని తెలుస్తోంది. దీంతో వచ్చే రెండు మూడు వారాల్లోనే బీఆర్ ఎస్ నుంచి భారీ జంపింగులు ఉండే అవకాశం ఉంటుందని సమాచారం.
'బ్రహ్మోత్సవం' సినిమాలో చిన్న పాత్రతో కెరీర్ స్టార్ట్ చేసిన అవంతికా వందనపు, ఇప్పుడు అమెరికన్ మెయిన్ స్ట్రీమ్ మీడియాలో తనకంటూ…
ఇండస్ట్రీలో ఎప్పటి నుంచో డిబేట్ ఒకటుంది. జనం మునుపటిలా థియేటర్లకు ఎక్కువ సంఖ్యలో ఎందుకు రావడం లేదనేది అందులో మెయిన్…
కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామి ఆలయానికి భక్తుల నుంచి భారీ సంఖ్యలో విరాళాలు అందుతున్నాయి. ఈ నిధులతో…
ఇంకో పద్దెనిమిది రోజుల్లో లెనిన్ విడుదల. అక్కినేని అభిమానులు బాగా ఎగ్ జైట్మెంట్ తో ఉన్నారు. ఇప్పటికే పలు వాయిదాలు…
అభివృద్ధి చెందిన దేశాల్లో రాజకీయ స్థిరత్వం ఎక్కువగా ఉంటుందని భావిస్తారు. కానీ గత పదేళ్లుగా యునైటెడ్ కింగ్డమ్ పరిస్థితి మాత్రం…
టాలీవుడ్ స్టార్ రామ్ పోతినేని, యంగ్ హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సే మధ్య ప్రేమాయణం నడుస్తోందంటూ గతంలోనే సోషల్ మీడియాలో చాలా…