రాజకీయాల్లో ఇలా ఉండాలి.. అని చెప్పే కుటుంబాలు చాలానే ఉన్నాయి. కానీ, ఎలా ఉండకూడదో నేర్పిస్తోంది… కర్ణాటకలోని మాజీ ప్రధాని దేవెగౌడ కుటుంబం. సెక్స్ కుంభకోణాలు.. హోమో సెక్సు కుంభకోణాలతో ఈ కుటుంబం భ్రష్టు పట్టిపోయింది. తాజాగా దేవెగౌడ మరో మనవడు.. కర్ణాటక శాసన మండలి సభ్యుడు సూరజ్ రేవణ్ణ.. హోమో సెక్సువల్ అంటూ.. వార్తలు వచ్చిన విషయం తెలిసిందే.
తన భార్యతోనూ.. ఆయన అసహజ శృంగారానికి పాల్ప డేందుకు ప్రయత్నించి.. వేధించడంతో సూరజ్ నుంచి ఆమె విడాకులు తీసుకుంది. దీంతో సెక్స్ కోరికలను అణుచుకోలేక పోయిన సూరజ్.. సొంత పార్టీ జేడీఎస్ కార్యకర్తను తన గెస్ట్ హౌస్కు పిలిపించుకుని.. హోమో సెక్స్కు ప్రయత్నించారు.
రాజకీయాల్లో సుదీర్ఘ అనుభవం.. దేశానికి ప్రధానిగా.. రాష్ట్రానికి ఇద్దరు ముఖ్యమంత్రులను అందించిన కుటుంబం ఇప్పుడు ఈ వివాదాల్లో తలమునకలు అవుతోంది. ఒకవైపు బాబాయి కేంద్ర మంత్రిగా, తాత దేవెగౌడ రాజ్యసభ సభ్యుడిగా ఉన్నా.. ఏమీ చేయలేని పరిస్థితిని ఎదుర్కొంటోంది.
ఈ సెక్స్ కుంభకోణాలు వివాదంగా మారడం.. తనపై అసహజ సెక్స్కు సూరజ్ ప్రయత్నించడంతో.. సదరు కార్యకర్త పోలీసులను ఆశ్రయించాడు. దీంతో విషయం వెలుగు చూసి..సూరజ్ను పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం సూరజ్ జైల్లో ఉన్నాడు. అయితే.. ఈ విషయంపై కూపీలాగుతున్న సీఐడీ అధికారులకు మరో వింత సమాచారం కూడా తెలిసింది. సూరజ్ రేవణ్ణ(దేవెగౌడ పెద్ద కుమారుడు రేవణ్ణ కొడుకు) ఆడ లక్షణాలు పెరిగాయని, హార్మోన్లపై ప్రభావం పడిందని అధికారులు గుర్తించారు.
41 ఏళ్ల సూరజ్ రేవణ్ణ అమావాస్య రోజులు, ఆదివారాల్లో.. పూర్తిగా ఆడమనిషిగా మారిపోతున్నాడట. ఎరుపు రంగు చీర కట్టుకుని.. నుదిటిన రూపాయి కాసంత ఎర్రటి బొట్టు పెట్టుకుని.. కళ్లకు కాటుక పెట్టు కుని.. చేతలుకు నల్లటి గాజులు వేసుకుని.. పెదవులకు లిప్ స్టిక్ పూసుకుని.. తలలో పూలు పెట్టుకుని తన ఆవరణలో పచార్లు చేస్తాడట. అదేరోజు ఆయన అసహజ సెక్స్ కోరికలతో రగిలిపోయేవాడని పోలీసులు గుర్తించారు. వీటికి సంబంధించిన ఫొటోలను సూరజ్ రేవణ్ణ ఫోన్లో నుంచి సేకరించారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఈ వ్యవహారం కలకలం రేపుతోంది. రాజకీయాల్లో ఎలా ఉండాలో.. ఎలా ఉండ కూడదో.. అధికారాన్ని ఎలా వినియోగించుకోవాలో.. ఎలా పక్కన పెట్టాలో దేవెగౌడ కుటుంబం నేర్పకనే నేర్పుతోందని అంటున్నారు పరిశీలకులు.
This post was last modified on June 29, 2024 10:29 am
తనపై విమర్శలు చేసే వారిని సహజంగా ఎవరైనా ప్రతివిమర్శలతో ఎదుర్కొంటారు. మాటకు మాట అంటారు. ఇక రాజకీయాల్లో అయితే ఈ…
ఇరు తెలుగు రాష్ట్రాల మధ్య ఉన్న జల వివాదాలపై యాగీ చేసుకోకుండా కూర్చుని మాట్లాడుకుంటే సమస్యలు పరిష్కారం అవుతాయని తెలంగాణ…
టీమ్ ఇండియా సీనియర్ పేసర్ మహమ్మద్ షమీ ఇంటర్నేషనల్ కెరీర్ దాదాపు ముగింపు దశకు చేరుకున్నట్లే కనిపిస్తోంది. గతేడాది జరిగిన…
రెండు రాష్ట్రాల మధ్య జల వివాదాలపై ఏపీ సీఎం చంద్రబాబు మరోసారి స్పందించారు. నీళ్లు వద్దు, గొడవలే కావాలని కొందరు…
సాధారణంగా ఏదైనా ఆర్డర్ ఇస్తే డెలివరీ బాయ్స్ వెంటనే ఇచ్చేసి వెళ్ళిపోతుంటారు. కానీ తమిళనాడులో జరిగిన ఒక ఘటన మాత్రం…
ఏపీ రాజధాని అమరావతిలో కీలక ప్రాజెక్టును తిరిగి పట్టాలెక్కించేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలో సుమారు రూ. 2…