ఏపీ ప్రజల సాగు, తాగు నీటి అవసరాలకు కీలకమైన ప్రాజెక్టు పోలవరం. అయితే. దశాబ్దాలుగా ఈ ప్రాజెక్టు నిర్మాణం రెండడుగు లు ముందుకు, నాలుగు అడుగులు వెనక్కి అన్నచందంగా మారింది. ఏ ప్రభుత్వం వచ్చినా.. దీనిని పూర్తి చేస్తామని చెబుతోంది . కానీ, చేతల్లో ఎక్కడో తేడా కొడుతోంది. ఫలితంగా పోలవరం ప్రాజెక్టు.. గోలవరంగా మారిపోయింది. గత వైసీపీ సర్కారు ఈ ప్రాజెక్టును పూర్తి చేస్తామని 2019 ఎన్నికల సమయంలో హామీ ఇచ్చింది. కానీ, ఐదేళ్లలో కనీసం ప్రధాన పనులు ఏవీ చేయకుండానే కాలం హరించింది. అనేక వివాదాలు కూడా తెరమీదికి వచ్చాయి. ఈ నేపథ్యంలో వైసీపీ హయాంలో పోలవరం ప్రాజెక్టు పనుల తీరు తెన్నులపై ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు వైట్ పేపర్ రిలీజ్ చేశారు. దీనిలో ముఖ్యాంఖాలు.. చంద్రబాబు చెప్పిన వాస్తవాలు ఇవీ..
వైసీపీ అసమర్థత!
వైసీపీ ప్రభుత్వ అసమర్థత కారణంగా పోలవరం ప్రాజెక్టు నాశనం అయిపోయిందని చంద్రబాబు వ్యాఖ్యానించారు. ప్రాజెక్టును పూర్తి చేయడంపైనా మోస పూరిత ప్రకటనలు చేశారని తెలిపారు. అధికారంలోకి రాగానే 2021 జూన్ నాటికి పూర్తి చేస్తామన్నారు, ఆ తర్వాత డిసెంబర్ అన్నారు. అప్పటికీ చేయలేదని చంద్రబాబు చెప్పారు. ఇక, 2022 జూన్ నాటికి పోలవరం పూర్తవుతుందని చెప్పారు. తర్వాత మళ్లీ డిసెంబరు నాటికి అన్నారని అప్పుడు కూడా చేయలేదన్నారు. చివరగా అసలు ప్రాజెక్టు ఎప్పటికి పూర్తవుతుందో చెప్పలేమన్నారని దుయ్యబట్టారు.
మెగా హీరోల సినిమాలకు సంబంధించి ఏ ఈవెంట్ అయినా.. అందులో ఎక్కడో ఒక చోట పవర్ స్టార్ పవన్ కళ్యాణ్…
హైదరాబాద్ శిల్పకళా వేదికలో జరిగిన పెద్ది సక్సెస్ మీట్ కోసం వేలాది అభిమానులు తరలివచ్చారు. ఈ సినిమాకు సంబంధించి ఇదే…
జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ను టార్గెట్ చేస్తూ విపక్ష వైసీపీ ఇటీవల డోస్ పెంచిన…
ప్రతి సంవత్సరం విజయ్కి స్పెషల్ పిక్తో పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్పే త్రిష.. ఈసారి చెప్పలేదు. ఇన్స్టాగ్రామ్లో కూడా ఆయన్ని…
నిజమే…ఆ ఇద్దరూ కలిశారు. రాష్ట్ర అభివృద్ది కోసం రాజకీయాలను పక్కనపెట్టేశారు. అంతే… ఇద్దరు ముగ్గురయ్యారు. ఆ ముగ్గురూ నలుగురయ్యారు. వెరసి…
కొందరు స్టార్ హీరోయిన్లు కెరీర్ మంచి ఊపులో కొనసాగుతున్న టైంలోనే వ్యక్తిగత జీవితంలో సెటిల్ అవ్వాలని చూస్తుంటారు. ఈ క్రమంలో…