ఏపీ ప్రజల సాగు, తాగు నీటి అవసరాలకు కీలకమైన ప్రాజెక్టు పోలవరం. అయితే. దశాబ్దాలుగా ఈ ప్రాజెక్టు నిర్మాణం రెండడుగు లు ముందుకు, నాలుగు అడుగులు వెనక్కి అన్నచందంగా మారింది. ఏ ప్రభుత్వం వచ్చినా.. దీనిని పూర్తి చేస్తామని చెబుతోంది . కానీ, చేతల్లో ఎక్కడో తేడా కొడుతోంది. ఫలితంగా పోలవరం ప్రాజెక్టు.. గోలవరంగా మారిపోయింది. గత వైసీపీ సర్కారు ఈ ప్రాజెక్టును పూర్తి చేస్తామని 2019 ఎన్నికల సమయంలో హామీ ఇచ్చింది. కానీ, ఐదేళ్లలో కనీసం ప్రధాన పనులు ఏవీ చేయకుండానే కాలం హరించింది. అనేక వివాదాలు కూడా తెరమీదికి వచ్చాయి. ఈ నేపథ్యంలో వైసీపీ హయాంలో పోలవరం ప్రాజెక్టు పనుల తీరు తెన్నులపై ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు వైట్ పేపర్ రిలీజ్ చేశారు. దీనిలో ముఖ్యాంఖాలు.. చంద్రబాబు చెప్పిన వాస్తవాలు ఇవీ..
వైసీపీ అసమర్థత!
వైసీపీ ప్రభుత్వ అసమర్థత కారణంగా పోలవరం ప్రాజెక్టు నాశనం అయిపోయిందని చంద్రబాబు వ్యాఖ్యానించారు. ప్రాజెక్టును పూర్తి చేయడంపైనా మోస పూరిత ప్రకటనలు చేశారని తెలిపారు. అధికారంలోకి రాగానే 2021 జూన్ నాటికి పూర్తి చేస్తామన్నారు, ఆ తర్వాత డిసెంబర్ అన్నారు. అప్పటికీ చేయలేదని చంద్రబాబు చెప్పారు. ఇక, 2022 జూన్ నాటికి పోలవరం పూర్తవుతుందని చెప్పారు. తర్వాత మళ్లీ డిసెంబరు నాటికి అన్నారని అప్పుడు కూడా చేయలేదన్నారు. చివరగా అసలు ప్రాజెక్టు ఎప్పటికి పూర్తవుతుందో చెప్పలేమన్నారని దుయ్యబట్టారు.
This post was last modified on June 28, 2024 9:06 pm
చిన్న సినిమాలను జనాల్లోకి తీసుకెళ్లడం, ప్రేక్షకులను థియేటర్లకు రప్పించడం ఈ రోజుల్లో పెద్ద సవాలుగా మారిపోయింది. గతంలో సినిమా బాగుంటే…
ఐపీఎల్ 2026 సీజన్లో లక్నో సూపర్ జెయింట్స్ (LSG) పరిస్థితి రోజురోజుకూ అట్టడుగుకు పడిపోతోంది. నేటి మ్యాచ్ లో సొంత…
ఇటీవలే టోవినో థామస్ 'పళ్ళి చట్టంబి' తెలుగు వెర్షన్ విడుదలయ్యింది. మార్నింగ్ షోనే డెఫిసిట్ తో మొదలై సాయంత్రానికే డిజాస్టర్…
కల్వకుంట్ల కవిత.. మాజీసీఎం కేసీఆర్ తనయగా.. రాజకీయాల్లోకి అడుగు పెట్టిన ఆమె.. ఎంపీగా, ఎమ్మెల్సీగా వ్యవహరించారు. ఇక, ఆ పార్టీతో…
టాలీవుడ్లో బిగ్గెస్ట్ సినీ ఫ్యామిలీ ఏది అంటే.. మెగా కుటుంబం గురించే ముందుగా చెప్పుకోవాలి. ఆ కుటుంబంలో ఉన్నంత మంది…
ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో మలయాళ పరిశ్రమను మినహాయిస్తే.. ప్రతి చోటా సినిమాల మేకింగ్ బాగా టైం తీసుకుంటోంది. కొంచెం స్టార్ ఇమేజ్…