Political News

పోల‌వ‌రంపై శ్వేత ప‌త్రం.. చంద్ర‌బాబు చెప్పిన నిజాలు!

  • నాడు వైఎస్ చేసిన త‌ప్పే జ‌గ‌న్ చేశారు
  • పోల‌వ‌రంపై జ‌గ‌న్ అడుగడుగునా మాట మార్చారు
  • జూన్‌-డిసెంబ‌ర్‌.. అంటూ ప్రాజెక్టును నాశ‌నం చేశారు
  • ఏపీ సీఎం చంద్ర‌బాబు ఫైర్‌

ఏపీ ప్ర‌జ‌ల సాగు, తాగు నీటి అవ‌స‌రాల‌కు కీల‌క‌మైన ప్రాజెక్టు పోల‌వ‌రం. అయితే. ద‌శాబ్దాలుగా ఈ ప్రాజెక్టు నిర్మాణం రెండ‌డుగు లు ముందుకు, నాలుగు అడుగులు వెన‌క్కి అన్న‌చందంగా మారింది. ఏ ప్ర‌భుత్వం వ‌చ్చినా.. దీనిని పూర్తి చేస్తామ‌ని చెబుతోంది . కానీ, చేత‌ల్లో ఎక్క‌డో తేడా కొడుతోంది. ఫ‌లితంగా పోల‌వ‌రం ప్రాజెక్టు.. గోల‌వ‌రంగా మారిపోయింది. గ‌త వైసీపీ స‌ర్కారు ఈ ప్రాజెక్టును పూర్తి చేస్తామ‌ని 2019 ఎన్నిక‌ల స‌మ‌యంలో హామీ ఇచ్చింది. కానీ, ఐదేళ్ల‌లో క‌నీసం ప్ర‌ధాన ప‌నులు ఏవీ చేయ‌కుండానే కాలం హ‌రించింది. అనేక వివాదాలు కూడా తెర‌మీదికి వ‌చ్చాయి. ఈ నేప‌థ్యంలో వైసీపీ హ‌యాంలో పోల‌వ‌రం ప్రాజెక్టు ప‌నుల తీరు తెన్నుల‌పై ప్ర‌స్తుత ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు వైట్ పేప‌ర్ రిలీజ్ చేశారు. దీనిలో ముఖ్యాంఖాలు.. చంద్ర‌బాబు చెప్పిన వాస్త‌వాలు ఇవీ..

  • పోలవరం ప్రాజెక్టు ద్వారా 194 టీఎంసీల నీరు నిల్వ, వరద నీటితో క‌లిపి 322 టీఎంసీలను వినియోగించుకోవ‌చ్చు. 7.2 లక్షల ఎకరాలకు సాగు, 28.50 లక్షల మందికి తాగునీరు ఇవ్వొచ్చు. 960 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి, వాటర్ టూరిజం అభివృద్ది చేయొచ్చు.
  • ప్రాజెక్టు డయాఫ్రం వాల్ డెప్త్ 90 మీటర్లు. ఎత్తు 20 మీటర్లు, వెడ‌ల్పు 16 మీటర్ల ఎత్త‌యిన గేట్లు ఉంటాయి. 390 కిలోమీటర్ల పొడవైన కుడి, ఎడమ కాల్వలు ఉన్న‌ అతి పెద్ద ప్రాజెక్టు.
  • 2014-19 మ‌ధ్య‌ 24 గంటల్లో 32,315 క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ పనులు చేపట్టారు. ఇది గిన్నీస్ రికార్డు సాధించింది.
  • 2014 నుంచి ఐదేళ్లలో పోలవరం ప్రాజెక్టులో 72 శాతం పనులు పూర్తి చేశారు. రూ.11,762 కోట్లు ఖ‌ర్చు పెట్ట‌గా డీపీఆర్-2 కింద రూ.55,548 కోట్ల వ్యయానికి టెక్నికల్ కమిటీ ఆమోదం తెలిపింది.
  • జ‌గ‌న్ హ‌యాంలో పోల‌వ‌రం ప‌నులు జ‌రిగింది 4%
  • జ‌గ‌న్ పాల‌నా కాలంలో ఈ ప్రాజెక్టు కోసం ఖ‌ర్చు చేసింది 4 వేల‌167 కోట్లు మాత్రంఏ.
  • సీఎంగా జగన్ ప్రమాణ స్వీకారం రోజునే పోలవరంలో పనులు నిలిపివేశారు.
  • 2020 ఆగస్టులో వచ్చిన వరదలకు డయాఫ్రం వాల్ దెబ్బతింది.
  • కాఫర్ డ్యామ్ లో గ్యాప్ లు పూర్తి చేయకపోవడంతోనే డయాఫ్రం వాల్ దెబ్బతింది. దీనిని గుర్తించేందుకు రెండేళ్ల స‌మ‌యం ప‌ట్టింది.
  • 2019లో జ‌గ‌న్ అదికారంలోకి రాగానే కాంట్రాక్టర్ ను మార్చేశారు. దీంతో హెడ్ వర్క్స్ నిలిచాయి. పోలవరం ప్రాజెక్టు అథారిటీ వ‌ద్ద‌న్నా విన‌లేదు. కాంట్రాక్టర్లను మార్చవద్దని సూచించింది. అయినా జగన్ కాంట్రాక్టర్ ను మార్చారు. గ‌తంలో వైఎస్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి చేసిన తప్పునే జగన్ కూడా చేశారు.
  • డయాఫ్రం వాల్ నాశ‌నం అయిపోయింది. దీనిని మరమ్మతు చేయాలంటే రూ.447 కోట్లు ఖర్చవుతుంది. కొత్త డయాఫ్రం వాల్ కట్టాలంటే రూ.990 కోట్లు కావాలి. ఎగువ, దిగువ కాఫర్ డ్యామ్ సీపేజీ వల్ల డ్యామ్ పై ఏ పని చేయాలన్నా వీలు కావడంలేదు.
  • పోల‌వ‌రం నిర్వాసితుల‌కు జ‌గ‌న్ ఇచ్చిన హామీలు అమ‌లు చేయ‌లేదు. టీడీపీ హ‌యాంలో కట్టిన పునరావాస కాలనీల్లో మిగిలిన పనులు కూడా పూర్తి చేయలేదు. టీడీపీ హ‌యాంలో పునరావాసం కోసం రూ.4,114 కోట్లు ఖర్చు పెట్టారు.
  • జ‌గ‌న్ హ‌యాంలో పోల‌వ‌రం బాధితుల పున‌రావాసం కోసం రూ.1,687 కోట్లు ఖర్చు చేసింది.

వైసీపీ అస‌మ‌ర్థ‌త‌!

వైసీపీ ప్ర‌భుత్వ అస‌మ‌ర్థ‌త కార‌ణంగా పోల‌వ‌రం ప్రాజెక్టు నాశ‌నం అయిపోయింద‌ని చంద్ర‌బాబు వ్యాఖ్యానించారు. ప్రాజెక్టును పూర్తి చేయ‌డంపైనా మోస పూరిత ప్ర‌క‌ట‌న‌లు చేశార‌ని తెలిపారు. అధికారంలోకి రాగానే 2021 జూన్ నాటికి పూర్తి చేస్తామన్నారు, ఆ తర్వాత డిసెంబర్ అన్నారు. అప్ప‌టికీ చేయ‌లేద‌ని చంద్ర‌బాబు చెప్పారు. ఇక‌, 2022 జూన్ నాటికి పోల‌వ‌రం పూర్త‌వుతుంద‌ని చెప్పారు. త‌ర్వాత మ‌ళ్లీ డిసెంబరు నాటికి అన్నారని అప్పుడు కూడా చేయ‌లేద‌న్నారు. చివ‌ర‌గా అస‌లు ప్రాజెక్టు ఎప్పటికి పూర్తవుతుందో చెప్పలేమ‌న్నార‌ని దుయ్య‌బ‌ట్టారు.

This post was last modified on June 28, 2024 9:06 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

మహేష్ అభిమానులకు హరీష్ సారి

సోషల్ మీడియాలో చాలా అలెర్ట్ గా ఉండాలి. ముఖ్యంగా సెలబ్రిటీలు బిజీగా షెడ్యూల్స్ లో ఏ మాత్రం ఏమరుపాటుగా ఉన్నా…

9 minutes ago

కొత్త శుక్రవారం గంగార్పణం అవుతోంది

థియేటర్లకు సరైన సినిమాలు వస్తే రావడానికి ప్రేక్షకులు సిద్ధంగా ఉన్నారు. ఎటొచ్చి వాళ్ళను కనీస స్థాయిలో మెప్పించే కంటెంట్ ఉన్నవి…

16 minutes ago

టికెట్ ఇచ్చినా పట్టించుకోలేదా?

తెలంగాణలో రెండు రాజ్య‌స‌భ స్థానాల‌కు పోటీ చేసిన కాంగ్రెస్ పార్టీ అభ్య‌ర్థులు అభిషేక్ మ‌ను సింఘ్వీ, వేం న‌రేందర్ రెడ్డిలు..…

4 hours ago

ఏపీలో హోటల్స్… ఇబ్బంది లేనట్టేనా?

వంటగ్యాస్ కొరత కారణంగా దేశవ్యాప్తంగా చిన్న హోటళ్లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. హోటళ్లకు సరఫరా అయ్యే కమర్షియల్ సిలిండర్ల పంపిణీని…

6 hours ago

ఏపీలో స్పెషల్ ఆఫీసర్ల పాలన.. ఎక్కడంటే!

రాష్ట్రంలోని పలు మున్సిపల్ సంస్థల్లో పాలకవర్గాల గడువు ముగియడంతో అక్కడ స్పెషల్ ఆఫీసర్ల పాలన అమల్లోకి రానుంది. మున్సిపల్ కార్పొరేషన్లు,…

7 hours ago

డైరెక్ట‌ర్ హైప్ ఇస్తుంటే… నాగ్ ఫ్యాన్స్‌కు టెన్ష‌న్‌

టాలీవుడ్ సీనియర్ హీరో అక్కినేని నాగార్జున వ‌రుస‌గా త‌మిళ న‌టులు, టెక్నీషియ‌న్ల‌తో ప‌ని చేస్తున్నాడు. గ‌త ఏడాది ధ‌నుష్‌తో క‌లిసి…

10 hours ago