ఏపీ ప్రజల సాగు, తాగు నీటి అవసరాలకు కీలకమైన ప్రాజెక్టు పోలవరం. అయితే. దశాబ్దాలుగా ఈ ప్రాజెక్టు నిర్మాణం రెండడుగు లు ముందుకు, నాలుగు అడుగులు వెనక్కి అన్నచందంగా మారింది. ఏ ప్రభుత్వం వచ్చినా.. దీనిని పూర్తి చేస్తామని చెబుతోంది . కానీ, చేతల్లో ఎక్కడో తేడా కొడుతోంది. ఫలితంగా పోలవరం ప్రాజెక్టు.. గోలవరంగా మారిపోయింది. గత వైసీపీ సర్కారు ఈ ప్రాజెక్టును పూర్తి చేస్తామని 2019 ఎన్నికల సమయంలో హామీ ఇచ్చింది. కానీ, ఐదేళ్లలో కనీసం ప్రధాన పనులు ఏవీ చేయకుండానే కాలం హరించింది. అనేక వివాదాలు కూడా తెరమీదికి వచ్చాయి. ఈ నేపథ్యంలో వైసీపీ హయాంలో పోలవరం ప్రాజెక్టు పనుల తీరు తెన్నులపై ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు వైట్ పేపర్ రిలీజ్ చేశారు. దీనిలో ముఖ్యాంఖాలు.. చంద్రబాబు చెప్పిన వాస్తవాలు ఇవీ..
వైసీపీ అసమర్థత!
వైసీపీ ప్రభుత్వ అసమర్థత కారణంగా పోలవరం ప్రాజెక్టు నాశనం అయిపోయిందని చంద్రబాబు వ్యాఖ్యానించారు. ప్రాజెక్టును పూర్తి చేయడంపైనా మోస పూరిత ప్రకటనలు చేశారని తెలిపారు. అధికారంలోకి రాగానే 2021 జూన్ నాటికి పూర్తి చేస్తామన్నారు, ఆ తర్వాత డిసెంబర్ అన్నారు. అప్పటికీ చేయలేదని చంద్రబాబు చెప్పారు. ఇక, 2022 జూన్ నాటికి పోలవరం పూర్తవుతుందని చెప్పారు. తర్వాత మళ్లీ డిసెంబరు నాటికి అన్నారని అప్పుడు కూడా చేయలేదన్నారు. చివరగా అసలు ప్రాజెక్టు ఎప్పటికి పూర్తవుతుందో చెప్పలేమన్నారని దుయ్యబట్టారు.
This post was last modified on June 28, 2024 9:06 pm
ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా దుబాయ్ వేదికగా జరిగిన మ్యాచ్ లో పాకిస్థాన్ పై భారత్ ఘన విజయం సాధించింది.…
ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు రంగం సిద్ధం అయిపోయింది. జనసేన అసెంబ్లీలో తనదైన శైలి 100 శాతం బలంతో అడుగుపెట్టిన…
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలోని రేవంత్రెడ్డి పాలన ప్రారంభించి ఏడాది దాటిపోయింది. ఈ నేపథ్యంలో ఒకదఫా పార్లమెంటు ఎన్నికలు వచ్చాయి.…
ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా సెలవు రోజు అయిన ఆదివారం దుబాయి అంతర్జాతీయ స్టేడియంలో దాయాదీ దేశాలు భారత్, పాకిస్థాన్ ల…
తెలుగు రాష్ట్రాల్లో సంగీత దర్శకులు నిర్వహించే మ్యూజిక్ కన్సర్టులు తక్కువ. ఇళయరాజా రెండుసార్లు హైదరాబాద్ లో చేస్తే భారీ స్థాయిలో…
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఏపీ మంత్రి నారా లోకేశ్ ఆదివారం సరదా సరదాగా గడిపారు. ఓ వైపు పార్టీ…