ఏపీ ప్రజల సాగు, తాగు నీటి అవసరాలకు కీలకమైన ప్రాజెక్టు పోలవరం. అయితే. దశాబ్దాలుగా ఈ ప్రాజెక్టు నిర్మాణం రెండడుగు లు ముందుకు, నాలుగు అడుగులు వెనక్కి అన్నచందంగా మారింది. ఏ ప్రభుత్వం వచ్చినా.. దీనిని పూర్తి చేస్తామని చెబుతోంది . కానీ, చేతల్లో ఎక్కడో తేడా కొడుతోంది. ఫలితంగా పోలవరం ప్రాజెక్టు.. గోలవరంగా మారిపోయింది. గత వైసీపీ సర్కారు ఈ ప్రాజెక్టును పూర్తి చేస్తామని 2019 ఎన్నికల సమయంలో హామీ ఇచ్చింది. కానీ, ఐదేళ్లలో కనీసం ప్రధాన పనులు ఏవీ చేయకుండానే కాలం హరించింది. అనేక వివాదాలు కూడా తెరమీదికి వచ్చాయి. ఈ నేపథ్యంలో వైసీపీ హయాంలో పోలవరం ప్రాజెక్టు పనుల తీరు తెన్నులపై ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు వైట్ పేపర్ రిలీజ్ చేశారు. దీనిలో ముఖ్యాంఖాలు.. చంద్రబాబు చెప్పిన వాస్తవాలు ఇవీ..
వైసీపీ అసమర్థత!
వైసీపీ ప్రభుత్వ అసమర్థత కారణంగా పోలవరం ప్రాజెక్టు నాశనం అయిపోయిందని చంద్రబాబు వ్యాఖ్యానించారు. ప్రాజెక్టును పూర్తి చేయడంపైనా మోస పూరిత ప్రకటనలు చేశారని తెలిపారు. అధికారంలోకి రాగానే 2021 జూన్ నాటికి పూర్తి చేస్తామన్నారు, ఆ తర్వాత డిసెంబర్ అన్నారు. అప్పటికీ చేయలేదని చంద్రబాబు చెప్పారు. ఇక, 2022 జూన్ నాటికి పోలవరం పూర్తవుతుందని చెప్పారు. తర్వాత మళ్లీ డిసెంబరు నాటికి అన్నారని అప్పుడు కూడా చేయలేదన్నారు. చివరగా అసలు ప్రాజెక్టు ఎప్పటికి పూర్తవుతుందో చెప్పలేమన్నారని దుయ్యబట్టారు.
This post was last modified on June 28, 2024 9:06 pm
దసరాకే రావాల్సిన నందమూరి బాలకృష్ణ సినిమా ‘అఖండ-2’ వాయిదా పడి.. ‘రాజాసాబ్’ డేట్ను తీసుకుంది. ప్రభాస్ సినిమా సంక్రాంతికి వాయిదా పడడంతో డిసెంబరు 5కు…
వచ్చే ఏడాది సంక్రాంతి నుంచి ప్రజల మధ్యకు వస్తున్నానని.. తనతో పాటు 175 నియోజకవర్గాల్లో నాయకులు కూడా ప్రజలను కలుసుకోవాలని…
రాజకీయాల్లో విమర్శలు చేయొచ్చు. ప్రతివిమర్శలు కూడా ఎదుర్కొనచ్చు. కానీ, ప్రతి విషయంలోనూ కొన్ని హద్దులు ఉంటాయి. ఎంత రాజకీయ పార్టీకి…
ఏపీలో బీజేపీ-టీడీపీ-జనసేన పొత్తు పెట్టుకుని గత 2024 ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన విషయం తెలిసిందే. ఇప్పటికి 17 మాసాలుగా ఈ…
తెలుగు ప్రేక్షకులకు ఎంతో ఇష్టమైన తమిళ స్టార్ ద్వయం సూర్య, కార్తి చాలా ఏళ్లుగా పెద్ద కమర్షియల్ హిట్ లేక…
భారత ఆర్థిక వ్యవస్థను ప్రభావితం చేసేది.. `రూపాయి మారకం విలువ`. ప్రపంచ దేశాలన్నీ దాదాపు అమెరికా డాలరుతోనే తమతమ కరెన్సీ…