Political News

ఆ వెయ్యి కోట్లు ఏమ‌య్యాయి? : ప‌వ‌న్ ఆరా!

వైసీపీ హ‌యాంలో ఏపీలో జ‌రిగిన నిధుల దుర్వినియోగంపై డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్ వ‌రుస స‌మీక్ష‌లు చేస్తున్నారు. ఇటీ వ‌ల పంచాయ‌తీ నిధుల విష‌యంపై ఆరా తీసిన ఆయ‌న ఏటా పంచాయ‌తీల‌కు కేంద్రం నుంచి వ‌స్తున్న నిధుల‌ను ఎలా ఖ‌ర్చు చేస్తున్నార‌ని తెలుసుకున్నారు. దాదాపు 6 వేల కోట్ల‌రూపాయ‌ల‌కు పైగా నిధుల‌ను వైసీపీ స‌ర్కారు ఏం చేసింద‌ని ప్ర‌శ్నించారు. అంతేకాదు.. పంచాయ‌తీల‌కు నిధులు ఎందుకు ఇవ్వ‌లేద‌ని కూడా నిల‌దీశారు. దీనికి పంచాయ‌తీ అధికారులు కొన్ని స‌మాధానాలు చెప్పారు. పంచాయ‌తీలు ఏళ్ల త‌ర‌బ‌డి విద్యుత్ బిల్లులు క‌ట్ట‌లేద‌ని.. దీంతో ఆ నిధుల‌ను మిన‌హాయించుకున్నార‌ని తెలిపారు.

ఈ స‌మాధానంపై సంతృప్తి చెంద‌ని ప‌వ‌న్ క‌ల్యాణ్‌.. పంచాయ‌తీ నిధుల విష‌యంపై త‌న‌కు స‌మ‌గ్ర నివేదిక ఇవ్వాల‌ని అధికారుల‌ను ఆదేశించారు. ఇక‌, ఇప్పుడు తాజాగా ఆయ‌న మ‌రో వెయ్యి కోట్ల రూపాయ‌ల విష‌యాన్ని కూడా అధికారుల‌ను ప్ర‌శ్నించారు. కేంద్రంలో మోడీ అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత‌.. 2014 నుంచి ‘స్వ‌చ్ఛ‌త’ పేరుతో న‌గ‌రాలు, ప‌ట్ట‌ణాల సుందరీక‌ర‌ణ‌కు నిధులు ఇస్తోంది. ఈ క్ర‌మంంలో 2019-24 మ‌ధ్య ఏపీకి స్వ‌చ్ఛాంధ్ర పేరుతో రూ.1000 కోట్ల‌కు పైగా నిధుల‌ను విడుద‌ల చేసింది. ఈ నిధుల‌తో ప‌నులు చేయాల్సి ఉంది. ఈ సొమ్ముల‌ను స్వ‌చ్ఛాంధ్ర కార్పొరేష‌న్ కు ఇచ్చి.. దాని నుంచి రాష్ట్ర వ్యాప్తంగా న‌గ‌రాలు, ప‌ట్ట‌ణాల్లో ప‌నులు చేయించాలి.

సుంద‌రీక‌ర‌ణ‌, మురుగునీటి నిర్వ‌హ‌ణ వంటి ప‌లు కార్య‌క్ర‌మాల‌కు ఈ నిధుల‌ను రాష్ట్ర ప్ర‌భుత్వం వెచ్చించాల్సి ఉంది. అయితే.. ఏపీ స‌ర్కారు ఈ నిధుల‌ను స్వ‌చ్ఛాంధ్ర‌కు కేటాయించ‌లేదు. తాజాగా ఈ కార్పొరేష‌న్ కార్య‌క‌లాపాల‌పై స‌మీక్ష నిర్వ‌హించిన ప‌వ‌న్ క‌ల్యాణ్‌.. నిధులు ఏమ‌య్యాయంటూ.. అధికారుల‌ను నిల‌దీశారు. స్వచ్ఛాంధ్ర కార్పొరేష‌న్‌కు కేంద్రం నుంచి వచ్చిన నిధులు, ఖర్చుల వివరాలపై ఆరా తీశారు. 2019 నుంచి కేంద్ర ప్ర‌భుత్వం వెయ్యి కోట్లకు పైగా ఇచ్చింద‌ని ఈ సంద‌ర్భంగా అధికారులు వివ‌రించారు.

అయితే.. వీటిని త‌మ కార్పొరేష‌న్‌కు రాష్ట్ర ఆర్థిక శాఖ విడుద‌ల చేయ‌లేద‌న్నారు. దీంతో స‌ద‌రు నిధుల‌ను ఏం చేశార‌నేది త‌మ‌కు తెలియ‌ద‌ని వివ‌రించారు. దీంతో ఆగ్ర‌హం వ్య‌క్తం చేసిన ప‌వ‌న్ క‌ల్యాణ్‌.. “మీ కార్పొరేష‌న్‌కు వ‌చ్చిన నిధుల‌ను మీరు ఎందుకు అడిగి తీసుకోలేదు” అని ప్ర‌శ్నించారు. దీనికి స‌మాధానం లేని అధికారులు మౌనం వ‌హించారు. దీనిపై ఆర్థిక శాఖ వివ‌ర‌ణ తీసుకునే ప్ర‌య‌త్నం చేయాల‌ని స‌ద‌రు అధికారుల‌ను ప‌వ‌న్ క‌ల్యాణ్ ఆదేశించారు.

This post was last modified on June 27, 2024 7:43 am

Share

Recent Posts

అనుప‌మ ఆ రోజు ఏడ్చింది అందుకా?

గ‌త కొన్ని రోజులుగా మ‌ల‌యాళ క‌థానాయిక అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్ బ్రేకప్ వ్య‌వ‌హారం సోష‌ల్ మీడియాలో చ‌ర్చ‌నీయాంశంగా మారిన సంగ‌తి తెలిసిందే.…

2 hours ago

తమిళ ప్రేక్షకుల ప్రేమ ఎందుకు తక్కువంటే

తాజాగా విడుదలైన విశ్వనాథ్ అండ్ సన్స్ తెలుగులో చూపిస్తున్న జోరు తమిళంలో ప్రదర్శించడం లేదన్నది వాస్తవం. ఓపెనింగ్స్ నెంబర్లు పోల్చుకుని…

2 hours ago

సోష‌ల్ మీడియా ఎటాక్… ఫరియా క‌న్నీళ్లు

జాతిర‌త్నాలు సినిమాతో మంచి గుర్తింపు సంపాదించి, తెలుగులో వ‌రుస‌గా సినిమాలు చేస్తున్న క‌థానాయిక‌.. ఫ‌రియా అబ్దుల్లా. థియేట‌ర్ బ్యాగ్రౌండ్ నుంచి…

4 hours ago

ప‌వ‌న్ ఒక్క ఆలోచ‌న‌… 5 వేల కుటుంబాల క‌ళ్ల‌లో మెరుపులు!

ఏపీ డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్‌.. అట‌వీశాఖ మంత్రిగా కూడా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. ఆయ‌న చేసిన ఒకే ఒక్క ఆలోచ‌న.. 5…

5 hours ago

రాహుల్ రాముడైతే… జగ్గారెడ్డి హనుమంతుడు

పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ పార్టీ వీరాభిమాని జగ్గారెడ్డి వ్యవహార శైలి గురించి తెలిసిందే. తన…

5 hours ago

కేటీఆర్ బిడ్డ చదువుకోవడానికి గొప్ప కాలేజీ లేదా

‘‘రేపు నా బిడ్డను డ్రాప్ చేయడానికి అమెరికా వెళ్లాలి...ఇక్కడే చదువుకోవచ్చు కదా అని అడిగితే...అంత గొప్ప కాలేజీలు ఇక్కడ ఎక్కడున్నాయి…

5 hours ago