వైసీపీ మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు. గత నెల 13న జరిగిన సార్వత్రిక ఎన్నికల సమయంలో ఆయన గుంటూరు జిల్లా మాచర్ల నియోజకవర్గంలోని పాలవాయి గేటు పోలింగ్ బూత్లో ఈవీఎం, వీవీప్యాట్ను ధ్వంసం చేశారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఈ ఘటనపై ఎన్నికల సంఘం పలు పలు పార్టీల నాయకులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసు లు కేసులు నమోదు చేశారు. అదేసమయంలో పోలింగ్ తర్వాత రోజు చోటు చేసుకున్న హింసాత్మక ఘటనలు.. సీఐ నారాయణ స్వామి దాడి, హత్యాయత్నం జరిగినట్టు వచ్చిన ఫిర్యాదులతో కూడా.. పోలీసులు కేసు పెట్టారు.
ఇక, టీడీపీ పోలింగ్ బూత్ ఏజెంట్ శేషగిరిపైనా దాడి చేసి హత్యాయత్నం చేశారంటూ.. పిన్నెల్లి రామకృష్నారెడ్డి, ఆయన సోదరుడు వెంకట్రామిరెడ్డిపై కేసులు నమోదయ్యాయి. ఆయా కేసుల్లో ముందస్తు బెయిలు తెచ్చుకున్న పిన్నెల్లి ఇప్పటి వరకు అరెస్టు నుంచి రక్షణ పొందారు. అయితే.. ఈ ముందస్తు బెయిలు గడువు ముగిసిపోయింది. దీనిని పొడిగించేందుకు హైకోర్టు నిరాకరిం చింది. దీంతో పిన్నెల్లి సోదరులను అరెస్టు చేయాలని ఎస్పీ ఆదేశించారు. దీంతో గుంటూరు పోలీసులు రంగంలోకి దిగి పిన్నెల్లి సోదరులను అరెస్టు చేసే ప్రయత్నం చేశారు.
అయితే.. పోలీసుల రాకను గమనించిన వెంకట్రామి రెడ్డి తప్పించుకుని పారిపోగా.. రామకృష్ణారెడ్డి మాత్రం పోలీసులకు చిక్కారు. దీంతో ఆయనను అరెస్టు చేశారు. తొలుత గుంటూరు ఎస్పీ కార్యాలయానికి తరలించిన అనంతరం.. ఆసుపత్రికి తీసుకువెళ్లారు. అక్కడ వైద్య పరీక్షల తర్వాత.. స్థానిక కోర్టులో ప్రవేశ పెట్టి.. అనంతర చర్యలు తీసుకోనున్నారు. ఇదిలావుంటే.. పిన్నెల్లి అరెస్టు సందర్భంగా పోలీసులు గుంటూరులోని వైసీపీ కార్యాలయం సహా.. కీలక నేతల ఇళ్ల వద్ద నిఘా పెట్టారు. ఎలాంటి అలజడులు రేగకుండా జాగ్రత్తలు చేపట్టారు. గతంలో ముందస్తు బెయిల్ ఇచ్చిన కోర్టు పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని సొంత నియోజకవర్గం మాచర్లలో అడుగు పెట్టకుండా ఆదేశించిన విషయం తెలిసిందే. దీంతో ఆయన గుంటూరులోనే ఉంటున్నారు.
This post was last modified on June 26, 2024 8:57 pm
అక్కినేని నాగేశ్వరరావు మనవడు సుమంత్ను చూస్తే పెద్ద స్టార్ కావడానికి అవసరమైన అన్ని లక్షణాలు ఉన్నట్లే కనిపిస్తాడు. ఆరడుగుల ఆజానుబాహుడు,…
పోలవరం జిల్లా ఈర్లపల్లి గ్రామానికి చెందిన 10వ తరగతి విద్యార్ధిని ముర్రం శివాని ఆత్మహత్య చేసుకుంది. దీనికి సంబంధించిన కారణాలు…
తెలంగాణలో ఆక్రమ కట్టడాలకు సింహ స్వప్నంగా మారిన హైడ్రా విధానంపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. తమ మాటంటే హైడ్రాకు…
వైసీపీ నేత, ఫైర్ బ్రాండ్ నాయకుడు, మాజీ మంత్రి జోగి రమేష్ ఫ్యామిలీలో కోడలు చేసిన ఆరోపణలు పెను కుదుపునకు…
సినిమాల్లో రాజకీయ అంశాలు పెట్టాలంటే ఒకటికి రెండుసార్లు ఆలోచించుకోవాల్సిన పరిస్థితులున్నాయి ప్రస్తుతం. తమ నాయకుల మీద పొలిటికల్ కౌంటర్లు వేస్తే…
జన నాయకుడు సినిమా ఎలా ఉందనేది మళ్ళీ చెప్పనవసరం లేదు. విజయ్ ఇమేజ్ పుణ్యమాని రెండు వందల కోట్లు దాటేసింది…