Political News

టీడీపీలో ప‌ద‌వులు ప్లీజ్‌: జిల్లాకు ఇద్ద‌రు చొప్పున వెయిటింగ్..!

కూట‌మి స‌ర్కారు కొలువు దీరింది. మంచి మెజారిటీతో అధికారంలోకి వ‌చ్చింది. దీంతో ఎన్నిక‌ల స‌మయంలో సీట్లు ద‌క్క‌ని నాయ‌కులు, సీట్లు త్యాగం చేసిన నాయ‌కులు కూడా.. నామినేటెడ్ ప‌ద‌వుల కోసం వెయిటింగ్‌లో ఉన్నారు. అయితే.. చిత్రం ఏంటంటే.. హీనాతి హీనంగా వేసుకున్నా.. జిల్లాకు ఇద్ద‌రు చొప్పున ఇలాంటి వారు తేలుతున్నారు. ఇంకా చెప్పాలంటే.. క‌నీసంలో క‌నీసం.. ముగ్గురు నుంచి న‌లుగురు చొప్పున నాయ‌కులు జిల్లాల్లో ప‌ద‌వుల కోసం వేచి చూస్తున్నారు.

కృష్ణా: ఉమ్మ‌డి కృష్ణాజిల్లాను తీసుకుంటే.. మైల‌వ‌రం సీటును వ‌దులుకున్న దేవినేని ఉమా, మచిలీ ప‌ట్నం ఎంపీ సీటును వ‌దులుకున్న కొన‌క‌ళ్ల నారాయ‌ణ‌, గుడివాడ‌లో స‌హ‌క‌రించిన రావి వెంకటేశ్వ‌రావు, నూజివీడులో అన్నీతానై వ్య‌వ‌హ‌రించిన ముద్ద‌ర‌బోయిన వెంక‌టేశ్వ‌ర‌రావులు కీల‌కంగా ఉన్నారు. ప‌ద‌వుల కోసం ఎదురుచూస్తున్నారు.

గుంటూరు: ఉమ్మ‌డి గుంటూరు జిల్లాలో ప‌ద‌వుల కోసం వేచి ఉన్న‌వారి సంఖ్య చాలానే ఉంది. పెద‌కూర పాడు సీటును వ‌దులుకున్న కొమ్మాల‌పాటి శ్రీధ‌ర్‌, వైసీపీ నుంచి వ‌చ్చి ఎన్నికల ‌స‌మ‌యంలో సేవ చేసిన‌.. జంగా కృష్ణ‌మూర్తి, డొక్కా మాణిక్య వ‌ర‌ప్ర‌సాద‌రావు, ఇక‌, తెనాలి సీటును త్యాగం చేసిన‌.. ఆల‌పాటి రాజేంద్ర‌ప్ర‌సాద్‌, గుంటూరు వెస్ట్ సీటును త్యాగం చేసిన కీల‌క నాయ‌కుడు, అలానే స‌త్తెన‌ప‌ల్లి సీటును వ‌దులుకున్న కోడెల శివ‌రామ‌కృష్ణ వంటి అనేక మంది నాయ‌కులు కూడా.. బాబు నిర్ణ‌యం కోసం వేచి చూస్తున్నారు.

అనంత‌పురం: ఉమ్మ‌డి అనంత‌పురం జిల్లాకు వ‌స్తే.. ఇక్క‌డ కూడా కొంద‌రు సీట్ల‌ను త్యాగం చేశారు. వీరిలో అర్బ‌న్ టికెట్‌ను వ‌దులుకున్న వైకుంఠం ప్ర‌భాక‌ర చౌద‌రి, అనంత‌పురం ఎంపీ సీటును వ‌దులుకు న్న జేసీ ప‌వ‌న్ కుమార్, ధ‌ర్మ‌వ‌రం సీటును త్యాగం చేసిన‌.. ప‌రిటాల శ్రీరాం వంటివారు ఉన్నారు.

నెల్లూరు: నెల్లూరు జిల్లాలోనూ ఎన్నిక‌ల‌కు ముందు మార్పులు చేర్పులు చోటు చేసుకున్నాయి. వేమిరెడ్డి దంప‌తుల కోసం.. టికెట్లు త్యాగం చేసిన వారిలో బీద ర‌విచంద్ర‌యాద‌వ్ వంటి వారు ఉన్నారు. ఎమ్మెల్యే, ఎంపీ సీట్లు వ‌దులుకొని మ‌రీ టీడీపీ కోసం సేవ చేశారు. ఇలా.. అన్ని జిల్లాల్లోనూ లెక్క‌కు మిక్కిలిగానే ఉన్నారు. దీంతో వీరంతా ప‌దవులు ప్లీజ్ అంటూఎదురు చూస్తున్నారు.

This post was last modified on June 26, 2024 10:34 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

నాడూ మూడే!… నేడూ మూడే!

వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి మూడు అనే అంకె అంటే చాలా ఇష్టంగానే ఉన్నట్టుంది. కనీసం రాజధాని కూడా…

2 hours ago

మోడీ ముందు జ‌గ‌న్ మ‌రింత‌ ప‌లుచ‌న‌!

ప్ర‌స్తుతం ఎవ‌రు ఔన‌న్నా.. కాద‌న్నా.. దేశానికే కాదు.. దేశంలోని రాజ‌కీయాల‌కు కూడా ప్ర‌ధాని మోడీ పెద్ద‌దిక్కుగా మారారన్నది వాస్త‌వం. ఆయ‌న‌ను…

3 hours ago

రాముడి పాత్ర వద్దన్న రణబీర్

ఒక పెద్ద సినిమాలో రాముడి పాత్రను పోషించడం ఏ నటుడికైనా అరుదైన అవకాశమే. దాన్ని లైఫ్ టైం ఛాన్స్‌లాగే ఫీలవుతారు ఎవ్వరైనా. ‘ఆదిపురుష్’ ఫలితం…

4 hours ago

దళిత క్రైస్తవుల విషయంలో జగన్ కన్నా షర్మిలే బెటర్?

వైసీపీ అధినేత, తన బ్రదర్ జగన్‌పై ఏపీ కాంగ్రెస్ చీఫ్ షర్మిల మరోసారి విమర్శలు గుప్పించారు. దళిత క్రైస్తవులకు రిజర్వేషన్…

4 hours ago

గుణశేఖర్ గారు లాజిక్ మిస్సయ్యారు

ఒక్కడు, చూడాలని ఉంది లాంటి అద్భుతమైన బ్లాక్ బస్టర్స్ ఇచ్చిన దర్శకుడు గుణశేఖర్ కొత్త మూవీ యుఫొరియా ఫిబ్రవరిలో విడుదలైన…

4 hours ago

షాకిచ్చిన రామ్ చరణ్… పెద్ది వస్తోందా?

ఏప్రిల్ 30 పెద్ది రావడం లేదని లోకం కోడై కూస్తోంది. నిర్మాణ సంస్థ అధికారికంగా ప్రకటించకపోయినా ఇతర నిర్మాతలు ఆ…

5 hours ago