Political News

టీడీపీలో ప‌ద‌వులు ప్లీజ్‌: జిల్లాకు ఇద్ద‌రు చొప్పున వెయిటింగ్..!

కూట‌మి స‌ర్కారు కొలువు దీరింది. మంచి మెజారిటీతో అధికారంలోకి వ‌చ్చింది. దీంతో ఎన్నిక‌ల స‌మయంలో సీట్లు ద‌క్క‌ని నాయ‌కులు, సీట్లు త్యాగం చేసిన నాయ‌కులు కూడా.. నామినేటెడ్ ప‌ద‌వుల కోసం వెయిటింగ్‌లో ఉన్నారు. అయితే.. చిత్రం ఏంటంటే.. హీనాతి హీనంగా వేసుకున్నా.. జిల్లాకు ఇద్ద‌రు చొప్పున ఇలాంటి వారు తేలుతున్నారు. ఇంకా చెప్పాలంటే.. క‌నీసంలో క‌నీసం.. ముగ్గురు నుంచి న‌లుగురు చొప్పున నాయ‌కులు జిల్లాల్లో ప‌ద‌వుల కోసం వేచి చూస్తున్నారు.

కృష్ణా: ఉమ్మ‌డి కృష్ణాజిల్లాను తీసుకుంటే.. మైల‌వ‌రం సీటును వ‌దులుకున్న దేవినేని ఉమా, మచిలీ ప‌ట్నం ఎంపీ సీటును వ‌దులుకున్న కొన‌క‌ళ్ల నారాయ‌ణ‌, గుడివాడ‌లో స‌హ‌క‌రించిన రావి వెంకటేశ్వ‌రావు, నూజివీడులో అన్నీతానై వ్య‌వ‌హ‌రించిన ముద్ద‌ర‌బోయిన వెంక‌టేశ్వ‌ర‌రావులు కీల‌కంగా ఉన్నారు. ప‌ద‌వుల కోసం ఎదురుచూస్తున్నారు.

గుంటూరు: ఉమ్మ‌డి గుంటూరు జిల్లాలో ప‌ద‌వుల కోసం వేచి ఉన్న‌వారి సంఖ్య చాలానే ఉంది. పెద‌కూర పాడు సీటును వ‌దులుకున్న కొమ్మాల‌పాటి శ్రీధ‌ర్‌, వైసీపీ నుంచి వ‌చ్చి ఎన్నికల ‌స‌మ‌యంలో సేవ చేసిన‌.. జంగా కృష్ణ‌మూర్తి, డొక్కా మాణిక్య వ‌ర‌ప్ర‌సాద‌రావు, ఇక‌, తెనాలి సీటును త్యాగం చేసిన‌.. ఆల‌పాటి రాజేంద్ర‌ప్ర‌సాద్‌, గుంటూరు వెస్ట్ సీటును త్యాగం చేసిన కీల‌క నాయ‌కుడు, అలానే స‌త్తెన‌ప‌ల్లి సీటును వ‌దులుకున్న కోడెల శివ‌రామ‌కృష్ణ వంటి అనేక మంది నాయ‌కులు కూడా.. బాబు నిర్ణ‌యం కోసం వేచి చూస్తున్నారు.

అనంత‌పురం: ఉమ్మ‌డి అనంత‌పురం జిల్లాకు వ‌స్తే.. ఇక్క‌డ కూడా కొంద‌రు సీట్ల‌ను త్యాగం చేశారు. వీరిలో అర్బ‌న్ టికెట్‌ను వ‌దులుకున్న వైకుంఠం ప్ర‌భాక‌ర చౌద‌రి, అనంత‌పురం ఎంపీ సీటును వ‌దులుకు న్న జేసీ ప‌వ‌న్ కుమార్, ధ‌ర్మ‌వ‌రం సీటును త్యాగం చేసిన‌.. ప‌రిటాల శ్రీరాం వంటివారు ఉన్నారు.

నెల్లూరు: నెల్లూరు జిల్లాలోనూ ఎన్నిక‌ల‌కు ముందు మార్పులు చేర్పులు చోటు చేసుకున్నాయి. వేమిరెడ్డి దంప‌తుల కోసం.. టికెట్లు త్యాగం చేసిన వారిలో బీద ర‌విచంద్ర‌యాద‌వ్ వంటి వారు ఉన్నారు. ఎమ్మెల్యే, ఎంపీ సీట్లు వ‌దులుకొని మ‌రీ టీడీపీ కోసం సేవ చేశారు. ఇలా.. అన్ని జిల్లాల్లోనూ లెక్క‌కు మిక్కిలిగానే ఉన్నారు. దీంతో వీరంతా ప‌దవులు ప్లీజ్ అంటూఎదురు చూస్తున్నారు.

This post was last modified on June 26, 2024 10:34 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

చంద్రబాబుపై అంబటి బూతుపురాణం… ఏం జరిగింది?

వైసీపీ హయాంలో తిరుపతి లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వాడారని వచ్చిన ఆరోపణలపై విచారణ జరిపిన సీబీఐ తాజాగా సుప్రీం…

41 minutes ago

చిట్టి ఇలా రెచ్చిపోయిందేంటి…

ఫరియా అబ్దుల్లా అంటే మనందరికీ 'జాతిరత్నాలు' సినిమాలోని చిట్టినే గుర్తొస్తుంది. ఆ సినిమాతో ఓవర్ నైట్ స్టార్ అయిపోయిన ఈ…

1 hour ago

దురంధర్‌ను చెడగొట్టిన నెట్‌ఫ్లిక్స్

దురంధర్.. గత ఏడాది డిసెంబర్లో విడుదలై.. ఇప్పటికీ థియేటర్లలో మంచి వసూళ్లు సాధిస్తున్న సినిమా. ఇంకా థియేట్రికల్ రన్ కొనసాగుతుండగానే…

2 hours ago

పసిడి పతనం: 48 గంటల్లో రూ. 1.8 లక్షల సంపద ఆవిరి

బులియన్ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు ఊహించని విధంగా కుప్పకూలాయి. గత రెండు రోజులుగా సాగుతున్న ఈ పతనం శనివారం…

3 hours ago

11న అసెంబ్లీ… ఆ 11 మంది వస్తారా?

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మళ్లీ వేడి పెరుగుతోంది. 16వ శాసనసభ ఐదో సమావేశాలు ఫిబ్రవరి 11 నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ…

3 hours ago

తిరుమల లడ్డు వ్యవహారం… టీటీడీ ఈవో బదిలీ?

తిరుమల లడ్డు కల్తీ నెయ్యి వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. విచారణ పరిధి క్రమంగా ఉన్నతాధికారుల వరకు విస్తరిస్తోంది. ఈ…

3 hours ago