Political News

టీడీపీలో ప‌ద‌వులు ప్లీజ్‌: జిల్లాకు ఇద్ద‌రు చొప్పున వెయిటింగ్..!

కూట‌మి స‌ర్కారు కొలువు దీరింది. మంచి మెజారిటీతో అధికారంలోకి వ‌చ్చింది. దీంతో ఎన్నిక‌ల స‌మయంలో సీట్లు ద‌క్క‌ని నాయ‌కులు, సీట్లు త్యాగం చేసిన నాయ‌కులు కూడా.. నామినేటెడ్ ప‌ద‌వుల కోసం వెయిటింగ్‌లో ఉన్నారు. అయితే.. చిత్రం ఏంటంటే.. హీనాతి హీనంగా వేసుకున్నా.. జిల్లాకు ఇద్ద‌రు చొప్పున ఇలాంటి వారు తేలుతున్నారు. ఇంకా చెప్పాలంటే.. క‌నీసంలో క‌నీసం.. ముగ్గురు నుంచి న‌లుగురు చొప్పున నాయ‌కులు జిల్లాల్లో ప‌ద‌వుల కోసం వేచి చూస్తున్నారు.

కృష్ణా: ఉమ్మ‌డి కృష్ణాజిల్లాను తీసుకుంటే.. మైల‌వ‌రం సీటును వ‌దులుకున్న దేవినేని ఉమా, మచిలీ ప‌ట్నం ఎంపీ సీటును వ‌దులుకున్న కొన‌క‌ళ్ల నారాయ‌ణ‌, గుడివాడ‌లో స‌హ‌క‌రించిన రావి వెంకటేశ్వ‌రావు, నూజివీడులో అన్నీతానై వ్య‌వ‌హ‌రించిన ముద్ద‌ర‌బోయిన వెంక‌టేశ్వ‌ర‌రావులు కీల‌కంగా ఉన్నారు. ప‌ద‌వుల కోసం ఎదురుచూస్తున్నారు.

గుంటూరు: ఉమ్మ‌డి గుంటూరు జిల్లాలో ప‌ద‌వుల కోసం వేచి ఉన్న‌వారి సంఖ్య చాలానే ఉంది. పెద‌కూర పాడు సీటును వ‌దులుకున్న కొమ్మాల‌పాటి శ్రీధ‌ర్‌, వైసీపీ నుంచి వ‌చ్చి ఎన్నికల ‌స‌మ‌యంలో సేవ చేసిన‌.. జంగా కృష్ణ‌మూర్తి, డొక్కా మాణిక్య వ‌ర‌ప్ర‌సాద‌రావు, ఇక‌, తెనాలి సీటును త్యాగం చేసిన‌.. ఆల‌పాటి రాజేంద్ర‌ప్ర‌సాద్‌, గుంటూరు వెస్ట్ సీటును త్యాగం చేసిన కీల‌క నాయ‌కుడు, అలానే స‌త్తెన‌ప‌ల్లి సీటును వ‌దులుకున్న కోడెల శివ‌రామ‌కృష్ణ వంటి అనేక మంది నాయ‌కులు కూడా.. బాబు నిర్ణ‌యం కోసం వేచి చూస్తున్నారు.

అనంత‌పురం: ఉమ్మ‌డి అనంత‌పురం జిల్లాకు వ‌స్తే.. ఇక్క‌డ కూడా కొంద‌రు సీట్ల‌ను త్యాగం చేశారు. వీరిలో అర్బ‌న్ టికెట్‌ను వ‌దులుకున్న వైకుంఠం ప్ర‌భాక‌ర చౌద‌రి, అనంత‌పురం ఎంపీ సీటును వ‌దులుకు న్న జేసీ ప‌వ‌న్ కుమార్, ధ‌ర్మ‌వ‌రం సీటును త్యాగం చేసిన‌.. ప‌రిటాల శ్రీరాం వంటివారు ఉన్నారు.

నెల్లూరు: నెల్లూరు జిల్లాలోనూ ఎన్నిక‌ల‌కు ముందు మార్పులు చేర్పులు చోటు చేసుకున్నాయి. వేమిరెడ్డి దంప‌తుల కోసం.. టికెట్లు త్యాగం చేసిన వారిలో బీద ర‌విచంద్ర‌యాద‌వ్ వంటి వారు ఉన్నారు. ఎమ్మెల్యే, ఎంపీ సీట్లు వ‌దులుకొని మ‌రీ టీడీపీ కోసం సేవ చేశారు. ఇలా.. అన్ని జిల్లాల్లోనూ లెక్క‌కు మిక్కిలిగానే ఉన్నారు. దీంతో వీరంతా ప‌దవులు ప్లీజ్ అంటూఎదురు చూస్తున్నారు.

This post was last modified on June 26, 2024 10:34 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

నెట్ ఫ్లిక్స్ ఒకవైపు… డాల్బీ సినిమా ఇంకోవైపు

టాలీవుడ్ కు సంబంధించి హైదరాబాద్ ఇవాళ రెండు కీలక ఘట్టాలకు సాక్ష్యంగా నిలబడుతోంది. నెట్ ఫ్లిక్స్ కార్యాలయాన్ని తెలంగాణ ముఖ్యమంత్రి…

35 minutes ago

కాలర్ లాంటి కంటెంట్ ఉంటే చాలు

మార్చి 19 విడుదల కాబోతున్న ఉస్తాద్ భగత్ సింగ్ నుంచి 'మెడ ముట్టుకుంటే తొడ కొట్టినట్టే' పాట వచ్చినప్పుడు పాజిటివిటీ…

2 hours ago

‘అటవీశాఖ అధికారులను కిడ్నాప్ చెయ్యాలి’

అమరావతిలో జరిగిన కలెక్టర్ల సదస్సులో అటవీ శాఖ అధికారుల పనితీరుపై సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ…

3 hours ago

కష్టాల నాయకుడికి ‘ప్రైమ్’ షాకు ?

రాజకీయాలంటే అంతే. అడుగుపెట్టాక చాలా బురదను కడుక్కోవాల్సి ఉంటుంది. కొందరు తట్టుకుంటారు. కొందరు వదిలేస్తారు. చిరంజీవి ప్రజారాజ్యం విషయంలో ఎక్కడైతే…

3 hours ago

పవన్ ఫ్యాన్స్ బాధ అర్థం చేసుకున్నారు

అభిమానులందు పవన్ అభిమానులు వేరయా అంటే అందులో అతిశయోక్తి ఏమీ లేదు. ఆయనకున్న లాయల్ ఫ్యాన్ బేస్ ఇండియా మొత్తంలో…

4 hours ago

అక్షయ్ కామెడీ… ఇప్పుడు పండుతుందా?

​బాలీవుడ్ ఖిలాడీ అక్షయ్ కుమార్ ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద సరైన సక్సెస్ కోసం ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో తనకి ఎన్నో…

5 hours ago