ప్రపంచవ్యాప్తంగా అత్యుత్తమ సినిమాలకు గుర్తింపు ఇచ్చే అవార్డుగా పేరున్న ఆస్కార్ విజేతలను ఎంపిక చేసేందుకు ప్రత్యేకంగా ఒక కమిటీ ఉందన్న సంగతి తెలిసిందే. వీళ్ళ ఓట్లు చాలా కీలకంగా పరిగణించబడతాయి. దేశ విదేశాల నుంచి ఎంపిక చేసిన ప్రతినిధులతో ఈ వడబోత మాములుగా ఉండదు. అయితే ఈసారి సభ్యులుగా ఏకంగా పదకొండు మంది భారతీయులు చోటు దక్కించుకోవడం గర్వకారణంగా చెప్పాలి. ఆర్ఆర్ఆర్ లోని నాటు నాటు పాటకు అకాడెమి అవార్డు సాధించడంతో పాటు ఇంటర్నేషనల్ లెవెల్ లో దాన్ని బ్లాక్ బస్టర్ లో చేయడంలో దర్శకుడు రాజమౌళి చేసిన కృషి కళ్లారా చూశాం.
ఇప్పుడు దానికి గుర్తింపు సతీ సమేతంగా దక్కింది. అకాడెమిలో రాజమౌళితో పాటు ఆయన భార్య స్థానం సంపాదించుకున్నారు. కాస్ట్యూమ్ డిజైన్ విభాగంలో ఆవిడకు ఈ గౌరవం దక్కింది. మిగిలిన పేర్లు చూస్తే ఎక్సెల్ ఎంటర్ టైన్మెంట్ అధినేత రితీష్ సిధ్వాని, ప్రసిద్ధ కెమెరామెన్ రవి వర్మన్ (పొన్నియిన్ సెల్వన్ 2 పనితనానికి), శీతల్ శర్మ (గంగూబాయ్ కటియావాడి డిజైనర్), రీమా దాస్ (విలేజ్ రాక్ స్టార్స్ దర్శకురాలు), నిషా పహుజా (టు కిల్ ఏ టైగర్ డైరెక్షన్), హేమా త్రివేది (సేవింగ్ ఫేస్ డాక్యూమెంటరీ), జితేష్ పాండ్య (పిఆర్ మార్కెటింగ్ నిపుణుడు), ప్రేమ్ రక్షిత్ (ప్రొడక్షన్ టెక్నాలజీ) లిస్టులో ఉన్నారు.
ఆర్ఆర్ఆర్ బృందం నుంచి ముగ్గురు ఎంపిక కావడం టాలీవుడ్ కు గర్వకారణమే. ఆస్కార్ బోర్డు పూర్తిగా తెల్ల మనుషులతో నిండిపోయి అమెరికా సినిమాలు తప్ప మరొకటి గుర్తించే స్థితిలో లేదనే కామెంట్లు గత కొంత కాలంగా సీరియస్ గా వినిపిస్తున్న నేపథ్యంలో అకాడెమి విదేశీ చిత్రాలను మరింత సీరియస్ గా తీసుకోవడం మొదలుపెట్టింది. ఆర్ఆర్ఆర్, పారసైట్ లు ఆ కారణంగానే పురస్కారాలు దక్కించుకున్నాయనే మాట వాస్తవం. ఇప్పుడు మెంబెర్స్ రూపంలోనూ ప్రాధాన్యత కలిగించడం చూస్తే క్రమంగా మనకూ ప్రతి సంవత్సరం ఖచ్చితంగా న్యాయం జరుగుతుందనే నమ్మకం కలుగుతోంది.
This post was last modified on June 26, 2024 12:18 pm
ఏ రాష్ట్రంలో అయినా... ప్రతిపక్ష నాయకులకు ప్రభుత్వాలు పెద్దగా ఇంపార్టెన్స్ ఇవ్వవు. సహజంగా రాజకీయ వైరాన్ని కొనసాగిస్తాయి. ఏపీ సహా…
ఏపీ రాజధాని అమరావతిపై వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలు రాష్ట్రంలో తీవ్ర దుమారం రేపాయి. పార్టీలకు…
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురం నియోజకవర్గానికి సంక్రాంతి పండుగ ముందుగానే వచ్చింది. శుక్రవారం నుంచి…
కన్నడలో ఒకప్పటి స్టార్ హీరోయిన్, తర్వాత రాజకీయ నాయకురాలిగా మారిన దివ్య స్పందన అలియాస్ రమ్య జర్నీలో వివాదాలకు లోటేమీ…
ప్రైవేట్ పబ్లిక్ పార్ట్నర్ షిప్(పీపీపీ) ద్వారా రాష్ట్రంలో మెడికల్ కాలేజీలతో పాటు పర్యాటక ప్రాంతాలను కూడా అభివృద్ధి చేయాలని సీఎం…
వైసీపీ పార్లమెంట్ సభ్యుడు, సీనియర్ నేత మిథున్ రెడ్డి ఆస్తులు భారీగా పెరిగాయని పేర్కొంటూ ఏడిఆర్ సర్వే తాజాగా వెల్లడించింది.…