Political News

తమిళ ప్రేక్షకుల్ని దువ్వుతున్న తెలుగు హీరో

‘ఆర్ఎక్స్ 100’ సినిమాతో మంచి పాపులారిటీ సంపాదించాడు యువ కథానాయకుడు కార్తికేయ గుమ్మకొండ. ఈ సినిమా అతడికి చాలానే అవకాశాలు తెచ్చిపెట్టింది. అతను ఇప్పటికే తెలుగు, తమిళ భాషల్లో ‘హిప్పి’ అనే సినిమా కూడా చేశాడు. ఆ చిత్రంతో తమిళ ప్రేక్షకులకు కాస్త పరిచయం అయ్యాడు. ఇప్పుడు తమిళంలో ఓ భారీ చిత్రంలో అతను కీలక పాత్ర పోషిస్తుండటం విశేషం. ఆ చిత్రమే.. వాలిమై. తమిళ బడా హీరోల్లో ఒకడైన అజిత్ ఇందులో హీరో కావడం గమనార్హం.

ఆయనతో ఇంతకుముందు ‘నీర్కొండ పార్వై’ సినిమా (పింక్ రీమేక్) తీసిన వినోద్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఇంత పెద్ద ప్రాజెక్టులోకి కార్తికేయను తీసుకోవడం ఆశ్చర్యం కలిగించే విషయమే. ఐతే ఈ విషయంపై ఇప్పటిదాకా అధికారిక ప్రకటన అయితే ఏమీ రాలేదు. కానీ కార్తికేయ నిన్న తన పుట్టిన రోజు సందర్భంగా ఈ విషయాన్ని చెప్పకనే చెప్పేశాడు.

తనకు పుట్టిన రోజు శుభాకాంక్షలు చెబుతూ అజిత్, తాను కలిసి ఉన్న ఫ్యాన్ మేడ్ పోస్టర్‌ను ట్విట్టర్లో షేర్ చేసిన కార్తికేయ.. తన మీద ప్రేమ కురిపిస్తున్న అజిత్ అభిమానులకు ప్రత్యేక కృతజ్ఞతలు చెప్పాడు. వాళ్లు ఎదురు చూస్తున్న ఒక అదిరిపోయే అప్ డేట్ రాబోతోందని.. కొంచెం ఓపికగా ఉండాలని తమిళ పదాల్లో చెప్పడం విశేషం. ఇంకేం చెప్పాలో అర్థం కావడం లేదని కూడా తమిళంలోనే పేర్కొన్నాడు. #WAITINGFORTHALADHARISANAM అంటూ హ్యాష్ ట్యాగ్ కూడా జోడించాడు.

మామూలుగానే అజిత్ అభిమానుల హంగామా మామూలుగా ఉండదు. ఇక కార్తికేయ ఇలా ట్వీటేసరికి వాళ్ల హడావుడి ఇంకా పెరిగిపోయింది. కార్తికేయ ట్వీట్‌కు వాళ్లు ఫిదా అయిపోయి ఈ ట్వీట్‌ను పెద్ద ఎత్తున రీట్వీట్ చేశారు. కామెంట్లు పెట్టారు. చాలా తెలివిగా అజిత్ అభిమానుల్ని దువ్వుతున్న కార్తికేయ ‘వాలిమై’తో వాళ్ల అంచనాలను ఏమేర అందుకుంటాడో చూడాలి.

This post was last modified on September 22, 2020 2:00 pm

Share

Recent Posts

కాకా… నిజంగా అలా తీస్తే

మెగాస్టార్ చిరంజీవి కొత్త సినిమా ‘కాాకా’ నుంచి ఇటీవల రిలీజ్ చేసిన టైటిల్ గ్లింప్స్ మెగా అభిమానులనే కాక సామాన్య…

5 minutes ago

50 భాషల్లో వారణాసి… డబ్బింగ్ కోసం 1500 ఆర్టిస్టులు

కింగ్ సైజ్ ఫిలిం మేకర్ అని ఎవరికైనా బిరుదు ఇవ్వాల్సి వస్తే అందరి మదిలో మెదిలే ఒకే ఒక్క పేరు…

6 minutes ago

రవితేజకు డబ్బులే డబ్బులు

మాస్ రాజా రవితేజ నిఖార్సయిన హిట్టు కొట్టి నాలుగేళ్లయింది. ఈ నాలుగేళ్లలో ఆయన ఆరు చిత్రాలతో పలకరించాడు. వీటిలో కొన్ని…

4 hours ago

దృశ్యం 4… ఇంకెన్నిసార్లు సాగదీస్తారో

ఏదైనా మితంగా తింటేనే అందం. మితిమీరిందా పొట్ట ఉబ్బిపోయి డాక్టర్ చుట్టూ తిరగాల్సి వస్తుంది. తిండి సామెత సినిమాలకు కూడా…

4 hours ago

హైదరాబాద్ వచ్చిన జాంబీరెడ్డి ఏం చేయబోతున్నాడు

కరోనా తర్వాత థియేటర్స్ కి జనం మళ్ళీ వచ్చేలా చేసిన సినిమాల్లో జాంబీ రెడ్డి ఉంది. దర్శకుడు ప్రశాంత్ వర్మ…

4 hours ago

మహిళను చంపి…. బిర్యానీ వండి…

ఏమైందో ఏమో కానీ ఆ దంపతులు ఒక మహిళను హత్య చేశారు. హత్య చేసి తీరిగ్గా ఆ మహిళ దేహాన్ని…

5 hours ago