‘ఆర్ఎక్స్ 100’ సినిమాతో మంచి పాపులారిటీ సంపాదించాడు యువ కథానాయకుడు కార్తికేయ గుమ్మకొండ. ఈ సినిమా అతడికి చాలానే అవకాశాలు తెచ్చిపెట్టింది. అతను ఇప్పటికే తెలుగు, తమిళ భాషల్లో ‘హిప్పి’ అనే సినిమా కూడా చేశాడు. ఆ చిత్రంతో తమిళ ప్రేక్షకులకు కాస్త పరిచయం అయ్యాడు. ఇప్పుడు తమిళంలో ఓ భారీ చిత్రంలో అతను కీలక పాత్ర పోషిస్తుండటం విశేషం. ఆ చిత్రమే.. వాలిమై. తమిళ బడా హీరోల్లో ఒకడైన అజిత్ ఇందులో హీరో కావడం గమనార్హం.
ఆయనతో ఇంతకుముందు ‘నీర్కొండ పార్వై’ సినిమా (పింక్ రీమేక్) తీసిన వినోద్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఇంత పెద్ద ప్రాజెక్టులోకి కార్తికేయను తీసుకోవడం ఆశ్చర్యం కలిగించే విషయమే. ఐతే ఈ విషయంపై ఇప్పటిదాకా అధికారిక ప్రకటన అయితే ఏమీ రాలేదు. కానీ కార్తికేయ నిన్న తన పుట్టిన రోజు సందర్భంగా ఈ విషయాన్ని చెప్పకనే చెప్పేశాడు.
తనకు పుట్టిన రోజు శుభాకాంక్షలు చెబుతూ అజిత్, తాను కలిసి ఉన్న ఫ్యాన్ మేడ్ పోస్టర్ను ట్విట్టర్లో షేర్ చేసిన కార్తికేయ.. తన మీద ప్రేమ కురిపిస్తున్న అజిత్ అభిమానులకు ప్రత్యేక కృతజ్ఞతలు చెప్పాడు. వాళ్లు ఎదురు చూస్తున్న ఒక అదిరిపోయే అప్ డేట్ రాబోతోందని.. కొంచెం ఓపికగా ఉండాలని తమిళ పదాల్లో చెప్పడం విశేషం. ఇంకేం చెప్పాలో అర్థం కావడం లేదని కూడా తమిళంలోనే పేర్కొన్నాడు. #WAITINGFORTHALADHARISANAM అంటూ హ్యాష్ ట్యాగ్ కూడా జోడించాడు.
మామూలుగానే అజిత్ అభిమానుల హంగామా మామూలుగా ఉండదు. ఇక కార్తికేయ ఇలా ట్వీటేసరికి వాళ్ల హడావుడి ఇంకా పెరిగిపోయింది. కార్తికేయ ట్వీట్కు వాళ్లు ఫిదా అయిపోయి ఈ ట్వీట్ను పెద్ద ఎత్తున రీట్వీట్ చేశారు. కామెంట్లు పెట్టారు. చాలా తెలివిగా అజిత్ అభిమానుల్ని దువ్వుతున్న కార్తికేయ ‘వాలిమై’తో వాళ్ల అంచనాలను ఏమేర అందుకుంటాడో చూడాలి.
This post was last modified on September 22, 2020 2:00 pm
తమిళగ వెట్రి కళగం అధినేత జోసెఫ్ విజయ్ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయడం ఖరారైంది. ఆరు రోజులుగా ట్విస్టులతో సాగిన రాజకీయ…
రాజకీయాల్లో అవకాశాలు రావడమే అరుదు. వచ్చిన వాటిని వినియోగించుకోవాల్సిన అవసరం.. వాటిని పట్టుకుని ఎదగాల్సిన అవసరం కూడా పార్టీలకు, నాయకులకు…
తమిళనాడు కొత్త ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ కొత్త సినిమా జన నాయకుడు విడుదలకు మార్గం సుగమమయ్యింది. సిఎం పదవిని చేపట్టేందుకు…
పదమూడేళ్ల క్రితం ఇండస్ట్రీకి కొత్త ట్రెండ్ తీసుకొచ్చిన దృశ్యం ఫ్రాంచైజ్ లో మూడో భాగం మే 21 విడుదల కానుంది.…
తమిళనాడు రాజకీయాల్లో చోటు చేసుకున్న అనిశ్చిత పరిస్థితి తొలిగిపోయింది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అతి పెద్ద పార్టీగా అవతరించిన…
దేశ ప్రధాని నరేంద్ర మోడీ.. ఆదివారం హైదరాబాద్లో పర్యటించనున్నారు. వివిధ అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటారు. అయితే.. ఈ పర్యటనలో మరో…