Political News

ఇది క‌దా ప‌వ‌న్ క‌ళ్యాణ్ మార్కు

వైసీపీ ప్ర‌భుత్వ హ‌యాంలో వేల‌మంది మ‌హిళ‌ల అదృశ్యం మీద గ‌తంలో జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ చేసిన వ్యాఖ్య‌లు అప్ప‌ట్లో సంచ‌ల‌నం రేపిన సంగ‌తి గుర్తుండే ఉంటుంది.

ఇప్పుడు కూట‌మి అధికారంలోకి వ‌చ్చిన ప‌వ‌న్ డిప్యూటీ సీఎం అయిన నేప‌థ్యంలో వైసీపీ వాళ్లు ఒక‌ప్ప‌టి జ‌న‌సేనాని ఆరోప‌ణ‌లను గుర్తు చేసి చ‌ర్య‌లు చేప‌ట్టాలంటూ కౌంట‌ర్లు వేస్తున్నారు. ఐతే అధికారంలోకి వ‌చ్చాక ఇలాంటి విష‌యాల‌ను నాయ‌కులు మ‌రిచిపోతుంటారు. కానీ ప‌వ‌న్ అలా కాదు. త‌న ప‌రిధిలో ఏం చేయ‌గ‌ల‌రో అది చేయ‌డానికి సిన్సియ‌ర్‌గా ప్ర‌య‌త్నిస్తున్న‌ట్లే క‌నిపిస్తోంది.

శ‌నివారం అసెంబ్లీ స‌మావేశాలు ముగిశాక ప‌వ‌న్ సామాన్య ప్ర‌జ‌ల కోసం అమ‌రావ‌తిలో రోడ్డు మీద గ్రీవెన్స్ సెల్ నిర్వ‌హించ‌డం విశేషం. డిప్యూటీ సీఎం అయి ఉండి హంగు ఆర్భాటాలు లేకుండా ప‌వ‌న్ ఇలాంటి కార్య‌క్ర‌మం పెట్ట‌డం అంద‌రినీ ఆశ్చ‌ర్య‌ప‌రిచింది.

ఈ కార్య‌క్ర‌మంలో త‌న కుమార్తె తొమ్మిది నెల‌ల కింద‌ట క‌నిపించ‌కుండా పోవ‌డం గురించి ఒక మ‌హిళ ఏడుస్తూ వెళ్ల‌గ‌క్కిన‌ ఆవేద‌న‌ను అర్థం చేసుకుని ప‌వ‌న్ స‌త్వ‌రం స్పందించిన తీరు ప్ర‌శంస‌లు అందుకుంటోంది.

విజయవాడలో చదువుకుంటున్న తన కుమార్తె మైనర్ అనీ, ఆమెను ప్రేమ పేరిట ట్రాప్ చేసి కిడ్నాప్ చేశారని, గత తొమ్మిది నెలలుగా ఆమె జాడ తెలియడం లేదని భీమవరం నుంచి వచ్చిన శివకుమారి అనే బాధితురాలు ప‌వ‌న్ ముందు కన్నీటితో మొరపెట్టుకుంది.

మాచవరం పోలీస్ స్టేషన్లో దీనిపై ఫిర్యాదు చేశామని, తమ కూతురు జాడ తెలిసినా పోలీసులు స్పందించడం లేదని ఆమె చెప్పింది.. జాడ తెలిశాక కూడా తమ బిడ్డను తమకు అప్పగించడం లేదని ఆమె తెల‌ప‌గా.. ఈ కేసుకు సంబంధించిన ఎఫ్ఐఆర్ కాపీని పరిశీలించిన వెంటనే, ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు మాచవరం సీఐకు ఫోన్ చేసి కేసు వివరాలు తెలుసుకున్నాడు. దీనిపై చర్యలకు ఆదేశించారు. అంతే కాక ప‌వ‌న్ పార్టీ నాయకులను వెంటబెట్టి బాధితులను పార్టీ ఆఫీస్ వాహనంలోనే మాచవరం పోలీస్ స్టేషన్‌కు పంపించ‌డం విశేషం.

This post was last modified on June 23, 2024 11:31 am

Share

Recent Posts

సుమంత్ ఈసారి బలంగా వస్తున్నాడు

అక్కినేని నాగేశ్వ‌ర‌రావు మ‌న‌వ‌డు సుమంత్‌ను చూస్తే పెద్ద స్టార్ కావ‌డానికి అవ‌స‌ర‌మైన అన్ని ల‌క్ష‌ణాలు ఉన్న‌ట్లే క‌నిపిస్తాడు. ఆర‌డుగుల ఆజానుబాహుడు,…

24 minutes ago

విద్యార్థిని ఆత్మ‌హ‌త్య‌.. చంద్ర‌బాబు తీవ్ర ఆవేద‌న.. ఏంటీ బంధం?

పోలవరం జిల్లా ఈర్లపల్లి గ్రామానికి చెందిన 10వ తరగతి విద్యార్ధిని ముర్రం శివాని ఆత్మ‌హ‌త్య చేసుకుంది. దీనికి సంబంధించిన కార‌ణాలు…

27 minutes ago

రంగ‌నాథ్‌ను తప్పించండి… హైడ్రాపై హైకోర్టు సీరియ‌స్‌!

తెలంగాణ‌లో ఆక్ర‌మ క‌ట్టడాల‌కు సింహ స్వ‌ప్నంగా మారిన హైడ్రా విధానంపై హైకోర్టు కీల‌క వ్యాఖ్య‌లు చేసింది. త‌మ మాటంటే హైడ్రాకు…

2 hours ago

జోగి ఫ్యామిలీలో `కోడ‌లి` కుదుపు!

వైసీపీ నేత‌, ఫైర్ బ్రాండ్ నాయ‌కుడు, మాజీ మంత్రి జోగి ర‌మేష్ ఫ్యామిలీలో కోడ‌లు చేసిన ఆరోప‌ణలు పెను కుదుపున‌కు…

3 hours ago

కొత్త సినిమాల్లో పొలిటికల్ పంచులు చూశారా?

సినిమాల్లో రాజకీయ అంశాలు పెట్టాలంటే ఒకటికి రెండుసార్లు ఆలోచించుకోవాల్సిన పరిస్థితులున్నాయి ప్రస్తుతం. తమ నాయకుల మీద పొలిటికల్ కౌంటర్లు వేస్తే…

4 hours ago

థియేటర్ చెక్స్… నాయకుడి పద్దతి బాగుంది

జన నాయకుడు సినిమా ఎలా ఉందనేది మళ్ళీ చెప్పనవసరం లేదు. విజయ్ ఇమేజ్ పుణ్యమాని రెండు వందల కోట్లు దాటేసింది…

4 hours ago