వైసీపీ ప్రభుత్వ హయాంలో వేలమంది మహిళల అదృశ్యం మీద గతంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు అప్పట్లో సంచలనం రేపిన సంగతి గుర్తుండే ఉంటుంది.
ఇప్పుడు కూటమి అధికారంలోకి వచ్చిన పవన్ డిప్యూటీ సీఎం అయిన నేపథ్యంలో వైసీపీ వాళ్లు ఒకప్పటి జనసేనాని ఆరోపణలను గుర్తు చేసి చర్యలు చేపట్టాలంటూ కౌంటర్లు వేస్తున్నారు. ఐతే అధికారంలోకి వచ్చాక ఇలాంటి విషయాలను నాయకులు మరిచిపోతుంటారు. కానీ పవన్ అలా కాదు. తన పరిధిలో ఏం చేయగలరో అది చేయడానికి సిన్సియర్గా ప్రయత్నిస్తున్నట్లే కనిపిస్తోంది.
శనివారం అసెంబ్లీ సమావేశాలు ముగిశాక పవన్ సామాన్య ప్రజల కోసం అమరావతిలో రోడ్డు మీద గ్రీవెన్స్ సెల్ నిర్వహించడం విశేషం. డిప్యూటీ సీఎం అయి ఉండి హంగు ఆర్భాటాలు లేకుండా పవన్ ఇలాంటి కార్యక్రమం పెట్టడం అందరినీ ఆశ్చర్యపరిచింది.
ఈ కార్యక్రమంలో తన కుమార్తె తొమ్మిది నెలల కిందట కనిపించకుండా పోవడం గురించి ఒక మహిళ ఏడుస్తూ వెళ్లగక్కిన ఆవేదనను అర్థం చేసుకుని పవన్ సత్వరం స్పందించిన తీరు ప్రశంసలు అందుకుంటోంది.
విజయవాడలో చదువుకుంటున్న తన కుమార్తె మైనర్ అనీ, ఆమెను ప్రేమ పేరిట ట్రాప్ చేసి కిడ్నాప్ చేశారని, గత తొమ్మిది నెలలుగా ఆమె జాడ తెలియడం లేదని భీమవరం నుంచి వచ్చిన శివకుమారి అనే బాధితురాలు పవన్ ముందు కన్నీటితో మొరపెట్టుకుంది.
మాచవరం పోలీస్ స్టేషన్లో దీనిపై ఫిర్యాదు చేశామని, తమ కూతురు జాడ తెలిసినా పోలీసులు స్పందించడం లేదని ఆమె చెప్పింది.. జాడ తెలిశాక కూడా తమ బిడ్డను తమకు అప్పగించడం లేదని ఆమె తెలపగా.. ఈ కేసుకు సంబంధించిన ఎఫ్ఐఆర్ కాపీని పరిశీలించిన వెంటనే, ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు మాచవరం సీఐకు ఫోన్ చేసి కేసు వివరాలు తెలుసుకున్నాడు. దీనిపై చర్యలకు ఆదేశించారు. అంతే కాక పవన్ పార్టీ నాయకులను వెంటబెట్టి బాధితులను పార్టీ ఆఫీస్ వాహనంలోనే మాచవరం పోలీస్ స్టేషన్కు పంపించడం విశేషం.
This post was last modified on June 23, 2024 11:31 am
వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవరినీ దెబ్బతీయరు.…
రాయ్పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…
కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…
ఉండవల్లిలోని చంద్రబాబు క్యాంపు కార్యాలయానికి తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ఈ రోజు వెళ్లారు. తెలంగాణ రైజింగ్ సమిట్కు…
మలయాళం మెగాస్టార్ గా అభిమానులు పిలుచుకునే మమ్ముట్టి కొత్త సినిమా కలం కవల్ ఇవాళ ప్రేక్షకుల ముందుకొచ్చింది. అఖండ 2…
టీమిండియా స్టార్ క్రికెటర్ స్మృతి మంధాన పెళ్లి ఆగిపోవడం అభిమానులను నిరాశపరిచింది. తండ్రి ఆరోగ్యం బాగోలేకపోవడంతో నవంబర్ 23న జరగాల్సిన…