Political News

ఇది క‌దా ప‌వ‌న్ క‌ళ్యాణ్ మార్కు

వైసీపీ ప్ర‌భుత్వ హ‌యాంలో వేల‌మంది మ‌హిళ‌ల అదృశ్యం మీద గ‌తంలో జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ చేసిన వ్యాఖ్య‌లు అప్ప‌ట్లో సంచ‌ల‌నం రేపిన సంగ‌తి గుర్తుండే ఉంటుంది.

ఇప్పుడు కూట‌మి అధికారంలోకి వ‌చ్చిన ప‌వ‌న్ డిప్యూటీ సీఎం అయిన నేప‌థ్యంలో వైసీపీ వాళ్లు ఒక‌ప్ప‌టి జ‌న‌సేనాని ఆరోప‌ణ‌లను గుర్తు చేసి చ‌ర్య‌లు చేప‌ట్టాలంటూ కౌంట‌ర్లు వేస్తున్నారు. ఐతే అధికారంలోకి వ‌చ్చాక ఇలాంటి విష‌యాల‌ను నాయ‌కులు మ‌రిచిపోతుంటారు. కానీ ప‌వ‌న్ అలా కాదు. త‌న ప‌రిధిలో ఏం చేయ‌గ‌ల‌రో అది చేయ‌డానికి సిన్సియ‌ర్‌గా ప్ర‌య‌త్నిస్తున్న‌ట్లే క‌నిపిస్తోంది.

శ‌నివారం అసెంబ్లీ స‌మావేశాలు ముగిశాక ప‌వ‌న్ సామాన్య ప్ర‌జ‌ల కోసం అమ‌రావ‌తిలో రోడ్డు మీద గ్రీవెన్స్ సెల్ నిర్వ‌హించ‌డం విశేషం. డిప్యూటీ సీఎం అయి ఉండి హంగు ఆర్భాటాలు లేకుండా ప‌వ‌న్ ఇలాంటి కార్య‌క్ర‌మం పెట్ట‌డం అంద‌రినీ ఆశ్చ‌ర్య‌ప‌రిచింది.

ఈ కార్య‌క్ర‌మంలో త‌న కుమార్తె తొమ్మిది నెల‌ల కింద‌ట క‌నిపించ‌కుండా పోవ‌డం గురించి ఒక మ‌హిళ ఏడుస్తూ వెళ్ల‌గ‌క్కిన‌ ఆవేద‌న‌ను అర్థం చేసుకుని ప‌వ‌న్ స‌త్వ‌రం స్పందించిన తీరు ప్ర‌శంస‌లు అందుకుంటోంది.

విజయవాడలో చదువుకుంటున్న తన కుమార్తె మైనర్ అనీ, ఆమెను ప్రేమ పేరిట ట్రాప్ చేసి కిడ్నాప్ చేశారని, గత తొమ్మిది నెలలుగా ఆమె జాడ తెలియడం లేదని భీమవరం నుంచి వచ్చిన శివకుమారి అనే బాధితురాలు ప‌వ‌న్ ముందు కన్నీటితో మొరపెట్టుకుంది.

మాచవరం పోలీస్ స్టేషన్లో దీనిపై ఫిర్యాదు చేశామని, తమ కూతురు జాడ తెలిసినా పోలీసులు స్పందించడం లేదని ఆమె చెప్పింది.. జాడ తెలిశాక కూడా తమ బిడ్డను తమకు అప్పగించడం లేదని ఆమె తెల‌ప‌గా.. ఈ కేసుకు సంబంధించిన ఎఫ్ఐఆర్ కాపీని పరిశీలించిన వెంటనే, ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు మాచవరం సీఐకు ఫోన్ చేసి కేసు వివరాలు తెలుసుకున్నాడు. దీనిపై చర్యలకు ఆదేశించారు. అంతే కాక ప‌వ‌న్ పార్టీ నాయకులను వెంటబెట్టి బాధితులను పార్టీ ఆఫీస్ వాహనంలోనే మాచవరం పోలీస్ స్టేషన్‌కు పంపించ‌డం విశేషం.

This post was last modified on June 23, 2024 11:31 am

Share
Show comments
Published by
Satya
Tags: Pawan

Recent Posts

పదిహేనేళ్ల దీదీ కంచు కోట ఎలా బద్దలైంది?

తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ… అసెంబ్లీ ఎన్నికల్లో వెనుకబడిపోయారు. బెంగాల్ ను పదిహేనేళ్లుగా పాలిస్తూ…

56 minutes ago

మూడో స్పీడ్ బ్రేకర్ ఏం చెబుతోంది

గత ఏడాది సింగల్ సక్సెస్ తో ట్రాక్ లో పడిన శ్రీవిష్ణుకి అతి తక్కువ గ్యాప్ లో మూడు వరస…

2 hours ago

విజయ్ విజయాన్ని ఏడాది ముందే పసిగట్టిన పీకే

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో టీవీకే ఘన విజయం సాధించే దిశగా దూసుకుపోతోన్న సంగతి తెలిసిందే. ఆ పార్టీ అధినేత, కోలీవుడ్…

3 hours ago

ఈసారి బీజేపీ బౌండరీ కొట్టింది

దేశంలో ఐదు రాష్ట్రాలకు (ఒకటి కేంద్ర పాలిత అసెంబ్లీ ఉన్న పుదుచ్చేరి) జరిగిన ఎన్నికల్లో బీజేపీ మూడు రాష్ట్రాల్లో అప్రతిహత…

5 hours ago

టీవీకే విజయ్ డబుల్ బొనాంజా

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో టీవీకే ఘన విజయం సాధించే దిశగా దూసుకుపోతోన్న సంగతి తెలిసిందే. ఆ పార్టీ అధినేత, కోలీవుడ్…

6 hours ago

మంచి అవకాశం వదిలేస్తావా బంగారం

సమంత మా ఇంటి బంగారం మే 15 రావడం లేదు. ఇంకా అధికారిక ప్రకటన ఇవ్వలేదు కానీ ప్రమోషన్స్ నాలుగైదు…

6 hours ago