Political News

రుషికొండ ప్యాలెస్ ను కొంటా: చంద్రబాబుకు సుఖేశ్ లేఖ

విశాఖప‌ట్నంలోని రుషికొండపై వైసీపీ హ‌యాంలో నిర్మించిన ఇంద్ర‌భ‌వ‌నం.. దేశ‌వ్యాప్తంగా గుర్తింపు పొం దిన విష‌యం తెలిసిందే. అదేవిధంగా చ‌ర్చ‌కు వ‌చ్చిన విష‌యం తెలిసిందే. దాదాపు 500 కోట్ల రూపాయ‌ల ఖ‌ర్చుతో దీనిని నిర్మించార‌ని వార్త‌లు వ‌స్తున్నాయి.

అయితే.. అంత‌క‌న్నా ఎక్కువ సొమ్మునే దీనికి కేటాయించిన‌ట్టు తెలుస్తోంది. ఇక‌, వైసీపీ ప‌డిపోయిన ద‌రిమిలా.. ఇప్పుడు ఈ ప్యాలెస్‌ను ఏం చేయాల‌న్న చ‌ర్చ జోరుగా సాగుతోంది. దీనిపై చంద్ర‌బాబు స‌ర్కారు ఇంకా నిర్ణ‌యం తీసుకోలేదు.

కానీ, తాజాగా ఈ ప్యాలెస్‌ను తాను కొనుగోలు చేస్తానంటూ.. సుఖేశ్ చంద్ర‌.. ఏపీ స‌ర్కారుకు లేఖ రాశారు. అంతేకాదు.. తాను పంపిస్తున్న ఈ లేఖ‌ను ఒప్పందంగా భావించాల‌ని కూడా ఆయ‌న అభ్య‌ర్థించారు. ఇక‌, ఈ ప్యాలెస్‌కు.. ఎంత ధ‌ర పెట్టినా.. దానిపై 20 శాతం చొప్పున అద‌నంగా తాను చెల్లించి కొనుగోలు చేస్తానని చెప్పుకొచ్చారు. ఒకవేళ అమ్మ‌డం ఇష్టం లేక‌పోతే.. క‌నీసం త‌న‌కు లీజుకైనా ఇవ్వాల‌ని కోరారు. ఈ విష‌యంలోనూ త‌న లేఖ‌ను ఒప్పంద ప‌త్రంగా భావించాల‌న్నారు.

ఇదే స‌మ‌యంలో త‌న బాల్యాన్ని కూడా సుఖేశ్ ప్ర‌స్తావించారు. తన బాల్యం విశాఖలోనే గడిచిందన్నారు. విశాఖ ప‌ట్నంతోను.. ఆర్కే బీచ్‌తోనూ త‌న‌కు ఎన‌లేని సంబంధం ఉంద‌ని సుఖేశ్ వివ‌రించారు. తాను తెలుగు కూడా మాట్లాడ‌గ‌ల‌న‌ని స‌ర్టిఫికెట్ ఇచ్చుకున్నారు. ఈ మేర‌కు ఆయ‌న సుదీర్ఘ‌లేఖ రాశారు. అయితే..చంద్ర‌బాబు ప్ర‌భుత్వం దీనిపై ఇంకా ఎలాంటి నిర్ణ‌యం తీసుకోలేదు.

ఎవ‌రీ సుఖేశ్‌?

ఢిల్లీలో వెలుగు చూసిన వేల కోట్ల రూపాయ‌ల మ‌ద్యం కుంభ‌కోణంలో సుఖేశ్ చంద్ర కూడా ఉన్నారు. మ‌నీలాండ‌రింగ్ కేసులో ఈయ‌న‌ను ఈడీ అరెస్టు చేసి.. చాలా కాల‌మే అయింది. త‌ర్వాత కాలంలో ఆయ‌న జైలు నుంచే తీవ్ర వివాదాస్ప‌ద అంశాల‌ను లేవ‌నెత్తుతూ.. రాజ‌కీయంగా దుమారం రేపుతున్నారు. తాజాగా రుషికొండ ప్యాలెస్ వ్య‌వ‌హారంపైనా లేఖ సంధించాడు.

This post was last modified on June 22, 2024 3:47 pm

Share
Show comments
Published by
Satya
Tags: Sukesh

Recent Posts

బీఆర్ఎస్‌లో పూర్తి ప్ర‌క్షాళ‌న… కారణమేంటి?

తెలంగాణ ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ పార్టీని ప్రక్షాళన చేసే దిశగా అడుగులు పడుతున్నాయి. పార్టీలో సంస్థాగతంగా పనిచేస్తున్న వారిని గత…

2 minutes ago

నియోజ‌క‌వ‌ర్గాల‌పై రేవంత్ కొత్త ఫార్ములా… వ‌ర్కువ‌ట్ అయ్యేనా?

2029 పార్ల‌మెంటు ఎన్నిక‌ల నాటికి దేశంలో నియోజ‌క‌వ‌ర్గాల‌ను పున‌ర్విభ‌జించాల‌ని కేంద్ర ప్ర‌భుత్వం ల‌క్ష్యంగా పెట్టుకున్న విష‌యం తెలిసిందే. ఇటు అసెంబ్లీ,…

3 hours ago

పెను సంక్షోభంలో ప్ర‌పంచం…!

అమెరికా - ఇరాన్ దేశాల మధ్య నెలకొన్న చర్చల ప్రతిష్టంభ‌న ప్రపంచ దేశాలను పెను సంక్షోభంలోకి నెట్టే దిశగా మారుతోందా?…

3 hours ago

రాష్ట్ర‌ప‌తికి బహుమతిగా మంగళగిరి చీర

భార‌త రాష్ట్ర‌ప‌తి ద్రౌప‌దిముర్ముతో ఏపీ మంత్రి, టీడీపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి నారా లోకేష్ భేటీ అయ్యారు. పార్టీకి చెందిన…

4 hours ago

ఏపీ కొత్త ఎన్నిక‌ల క‌మిష‌న‌ర్‌… వైసీపీకి షాకేనా?

ఏపీ రాష్ట్ర ఎన్నిక‌ల సంఘం క‌మిష‌న‌ర్ ప‌ద‌వి ఖాళీ అయింది. గ‌త నెల 31వ తేదీ వ‌ర‌కు ఉన్న రాష్ట్ర…

4 hours ago

‘హోం’ ప్రశ్నలపై ‘సీఎం’ సమాధానం చెప్తారా?

తెలంగాణలో కీలకమైన హోం శాఖను సీఎం రేవంత్ రెడ్డి తన దగ్గర పెట్టుకున్నారు. శాంతిభద్రతలను ఆయనే పర్యవేక్షిస్తున్నారు. అయితే తరచుగా…

5 hours ago