Political News

లోకేష్ బాగానే మాట్లాడాడు

ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్ గా టీడీపీ సీనియర్ నేత చింతకాయల అయ్యన్నపాత్రుడు ఈ రోజు బాధ్యతలు చేపట్టిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా అయ్యన్నపాత్రుడిపై మంత్రి నారా లోకేష్ సభలో కీలక వ్యాఖ్యలు చేశారు. తొలిసారి శాసనసభలో ప్రసంగించిన నారా లోకేష్…అయ్యన్నపాత్రుడుపై ప్రశంసల జల్లు కురిపించారు. ఆయనతో కలిసి పనిచేసే అవకాశం తనకు దక్కడం అదృష్టం అని లోకేష్ అన్నారు. అయ్యన్నపాత్రుడు అంటే అందరి పాత్రుడు అని, ఎప్పుడూ ప్రజల గురించి ఆలోచించే వ్యక్తి అని చెప్పారు.

వైసీపీ పాలనలో ఆయనపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడ్డారని, ఇంటి ప్రహరీ కూడా కూలగొట్టి 23 కేసులు పెట్టినా అలుపెరగకుండా పోరాటం చేశారని ప్రశంసించారు. ఏడు సార్లు ఎమ్మెల్యేగా ఒకసారి ఎంపీగా గెలిచిన అనుభవం ఆయనకు ఉందని, టీడీపీ సీనియర్ నేతలలో ఆయనకు కూడా ఒకరిని చెప్పారు. 25 ఏళ్ల వయసులో మంత్రిగా ఎన్నికై 16 ఏళ్లు మంత్రిగా పనిచేసిన అనుభవం అయ్యన్న సొంతమని అన్నారు.

గతంలో సభ హుందాగా జరిగేదని, కానీ గత ఐదేళ్ల వైసీపీ పాలనలో సభా గౌరవం తగ్గేలా వైసీపీ సభ్యులు వ్యవహరించారని మండిపడ్డారు. సభా సంప్రదాయాలు, సభ ప్రతిష్ట పెరిగేలా సభ్యులకు దిశా నిర్దేశం చేయాలని అయ్యన్నపాత్రుడును లోకేష్ కోరారు. అయ్యన్నపాత్రుడు నాయకత్వంలో విశాఖలో ఎన్నో మంచి పనులు జరిగాయని, అభివృద్ధి జరిగిందని గుర్తు చేసుకున్నారు. ఆయన నుంచి ఎన్నో విషయాలు నేర్చుకోవాలని, తనకు ఆయన ఎన్నోసార్లు అమూల్యమైన సలహాలు సూచనలు ఇచ్చారని అన్నారు.

ఒకే పార్టీ, ప్రజలు అజెండాగా టిడిపి నమ్ముకుని 45 ఏళ్ల పాటు రాజకీయాల్లో ఉన్నారని గుర్తు చేశారు. అయ్యన్నపాత్రుడు ఆధ్వర్యంలో సభను గౌరవప్రదంగా అందరం కలిసి ముందుకు తీసుకువెళదామని లోకేష్ మిగతా సభ్యులకు పిలుపునిచ్చారు. ఇక ఈ శాసనసభలో ప్రతిపక్షం లేదని కాబట్టి స్వపక్షమే విపక్షంలా మారి ప్రజా సమస్యలపై సభ లోపల, సభ బయట చర్చించి పరిష్కరించేందుకు కృషి చేద్దామని సభ్యులకు పిలుపునిచ్చారు. తొలిసారిగా సభలో లోకేష్ మాట్లాడిన తీరు అద్భుతంగా ఉందని సోషల్ మీడియాలో ఆయనపై ప్రశంసలు కురుస్తున్నాయి.

This post was last modified on June 22, 2024 3:38 pm

Share
Show comments
Published by
Satya
Tags: Lokesh

Recent Posts

బీఆర్ఎస్‌లో పూర్తి ప్ర‌క్షాళ‌న… కారణమేంటి?

తెలంగాణ ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ పార్టీని ప్రక్షాళన చేసే దిశగా అడుగులు పడుతున్నాయి. పార్టీలో సంస్థాగతంగా పనిచేస్తున్న వారిని గత…

5 minutes ago

నియోజ‌క‌వ‌ర్గాల‌పై రేవంత్ కొత్త ఫార్ములా… వ‌ర్కువ‌ట్ అయ్యేనా?

2029 పార్ల‌మెంటు ఎన్నిక‌ల నాటికి దేశంలో నియోజ‌క‌వ‌ర్గాల‌ను పున‌ర్విభ‌జించాల‌ని కేంద్ర ప్ర‌భుత్వం ల‌క్ష్యంగా పెట్టుకున్న విష‌యం తెలిసిందే. ఇటు అసెంబ్లీ,…

3 hours ago

పెను సంక్షోభంలో ప్ర‌పంచం…!

అమెరికా - ఇరాన్ దేశాల మధ్య నెలకొన్న చర్చల ప్రతిష్టంభ‌న ప్రపంచ దేశాలను పెను సంక్షోభంలోకి నెట్టే దిశగా మారుతోందా?…

4 hours ago

రాష్ట్ర‌ప‌తికి బహుమతిగా మంగళగిరి చీర

భార‌త రాష్ట్ర‌ప‌తి ద్రౌప‌దిముర్ముతో ఏపీ మంత్రి, టీడీపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి నారా లోకేష్ భేటీ అయ్యారు. పార్టీకి చెందిన…

4 hours ago

ఏపీ కొత్త ఎన్నిక‌ల క‌మిష‌న‌ర్‌… వైసీపీకి షాకేనా?

ఏపీ రాష్ట్ర ఎన్నిక‌ల సంఘం క‌మిష‌న‌ర్ ప‌ద‌వి ఖాళీ అయింది. గ‌త నెల 31వ తేదీ వ‌ర‌కు ఉన్న రాష్ట్ర…

4 hours ago

‘హోం’ ప్రశ్నలపై ‘సీఎం’ సమాధానం చెప్తారా?

తెలంగాణలో కీలకమైన హోం శాఖను సీఎం రేవంత్ రెడ్డి తన దగ్గర పెట్టుకున్నారు. శాంతిభద్రతలను ఆయనే పర్యవేక్షిస్తున్నారు. అయితే తరచుగా…

6 hours ago