Political News

వైసీపీ కార్యాలయం.. ఏడాదికి ఎకరాని వెయ్యి

గత ఐదేళ్లలో వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారాన్ని అడ్డు పెట్టుకుని చేసిన అక్రమాలు, అరాచకాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. దీంతో ఐదేళ్ల పాటు తమను వేధించి, అదే పనిగా టార్గెట్ చేసిన వైసీపీకి టీడీపీ-జనసేన ప్రభుత్వం ఇప్పుడు బదులు తీర్చుకునే పనిలో పడింది.

జగన్ అధికారంలోకి రాగానే ప్రభుత్వ భవనమైన ప్రజావేదికను కూల్చి వేయించడమే కాక.. ఆ శిథిలాలను కూడా తొలగించకుండా చంద్రబాబు దాన్ని చూసి కుమిలిపోవాలనే ఎత్తుగడ వేసిన సంగతి తెలిసిందే.

మరోవైపు మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్‌ ఇంట్లోని ప్రభుత్వ ఫర్నీచర్ విషయంలో కేసులు పెట్టి, వేధించి ఆయన ఆత్మహత్యకు పాల్పడే స్థితికి తీసుకురావడాన్ని టీడీపీ వాళ్లు అంత సులువుగా మరిచిపోలేరు.

కూటమి అధికారంలోకి రాగానే జగన్ ప్రభుత్వ ఫర్నీచర్‌ను ఇంకా వాడుకుంటుండడాన్ని బయటపెట్టి ‘ఫర్నీచర్ దొంగ జగన్’ అనే హ్యాష్ ట్యాగ్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యేలా చేశారు.

అంతే కాక నిబంధనలకు విరుద్ధంగా జగన్ తాడేపల్లి ప్యాలెస్‌కు గ్రిల్స్ పెట్టించుకున్న విషయం.. కిలోమీటర్ల కొద్దీ రోడ్డును ఆక్రమించి రాకపోకలు నిషేధించడం.. రుషికొండలో ఏకంగా 550 కోట్లు పెట్టి లగ్జరీ భవనాలను కట్టించుకున్న విషయం.. ఇవన్నీ వెలుగులోకి వచ్చాయి.

తాజాగా తాడేపల్లిలో నిబంధనలకు విరుద్ధంగా కట్టుకుంటున్న వైసీసీ సెంట్రల్ ఆఫీస్ వ్యవహారం బయటపడి దాన్ని సీఆర్డీయే కూల్చి వేయగానే వైసీపీ వాళ్లు గగ్గోలు పెడుతున్నారు.

ఇదే సమయంలో విశాఖపట్నంలో కడుతున్న వైసీపీ ఆఫీస్‌కు సంబంధించి మరో సంచలన విషయం వెలుగులోకి వచ్చింది. అక్కడ కూడా నిబంధనలకు విరుద్ధంగా.. వైజాగ్ కార్పొరేషన్ అభ్యంతరాలను కూడా పట్టించుకోకుండా వైసీపీ ఆఫీస్ కోసం జగన్ ప్రభుత్వం 1.75 ఏకరాల స్థలాన్ని కట్టబెట్టేసిందట. 33 ఏళ్లకు ఆ స్థలాన్ని ఎకరాకు ఏడాదికి కేవలం వెయ్యి రూపాయల మొత్తానికి లీజుకు ఇచ్చిందట. ఈ విషయం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. బాబు సర్కారు నెక్ట్స్ టార్గెట్ ఇదే అవుతుందా.. ఆ బిల్డింగ్ కూడా కూల్చేస్తారా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి.

This post was last modified on June 22, 2024 3:27 pm

Share
Show comments
Published by
Satya
Tags: Feature

Recent Posts

వైసీపీ పంచాంగం.. కేంద్రం ప్లస్.. రాష్ట్రం మైనస్

ఏపీలో త్వరలో మంత్రుల శాఖలు మారతాయట..? ప్రభుత్వంలో భారీగానే మార్పులు ఉంటాయట..? ఇది ఏ రాజకీయ విశ్లేషలు చెప్పిన జోస్యం…

10 minutes ago

ఆ యూట్యూబర్లకు ‘పరాభవం’ తప్పదట

సాధారణంగా ఉగాది సందర్భంగా రాజకీయ నాయకులు, వ్యాపారవేత్తలు తమ ఇంట్లో పంచాంగ శ్రవణం జరుపుతుంటారు. ఈ సందర్భంగా వారికి ఈ…

1 hour ago

క‌విత పార్టీకి న్యాయ చిక్కులు… ఏం జరిగింది?

బీఆర్ఎస్ నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చి.. సొంత పార్టీ పెట్టుకునేందుకు రెడీ అయిన మాజీ సీఎం కేసీఆర్ కుమార్తె క‌విత త‌న…

3 hours ago

ఫిక్స్… మూడో భాగం ఛాన్స్ లేదు

బాక్సాఫీస్ వద్ద ర్యాంపేజ్ చూపిస్తున్న దురంధర్ ది రివెంజ్ కు సంబంధించి ఒక ముఖ్యమైన ప్రశ్న అందరి మెదళ్లను తొలిచేసింది.…

3 hours ago

పవన్ పట్టుకు బాలినేని లొంగిపోయారా?

బాలినేని శ్రీనివాస రెడ్డి జనసేనలో చేరిన తర్వాత పెద్దగా యాక్టివ్ గా లేని సంగతి తెలిసిందే. అధికారికంగా జనసేన నిర్వహించే…

4 hours ago

ఊపిరి పీల్చుకుంటున్న తెలుగు థియేటర్లు

ఫిబ్రవరితో మొదలుపెట్టి మార్చి రెండో వారం దాకా పట్టుమని వారం రోజులు హౌస్ ఫుల్ చేసే సినిమా లేక గగ్గోలు…

4 hours ago