Political News

వైసీపీ కార్యాలయం.. ఏడాదికి ఎకరాని వెయ్యి

గత ఐదేళ్లలో వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారాన్ని అడ్డు పెట్టుకుని చేసిన అక్రమాలు, అరాచకాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. దీంతో ఐదేళ్ల పాటు తమను వేధించి, అదే పనిగా టార్గెట్ చేసిన వైసీపీకి టీడీపీ-జనసేన ప్రభుత్వం ఇప్పుడు బదులు తీర్చుకునే పనిలో పడింది.

జగన్ అధికారంలోకి రాగానే ప్రభుత్వ భవనమైన ప్రజావేదికను కూల్చి వేయించడమే కాక.. ఆ శిథిలాలను కూడా తొలగించకుండా చంద్రబాబు దాన్ని చూసి కుమిలిపోవాలనే ఎత్తుగడ వేసిన సంగతి తెలిసిందే.

మరోవైపు మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్‌ ఇంట్లోని ప్రభుత్వ ఫర్నీచర్ విషయంలో కేసులు పెట్టి, వేధించి ఆయన ఆత్మహత్యకు పాల్పడే స్థితికి తీసుకురావడాన్ని టీడీపీ వాళ్లు అంత సులువుగా మరిచిపోలేరు.

కూటమి అధికారంలోకి రాగానే జగన్ ప్రభుత్వ ఫర్నీచర్‌ను ఇంకా వాడుకుంటుండడాన్ని బయటపెట్టి ‘ఫర్నీచర్ దొంగ జగన్’ అనే హ్యాష్ ట్యాగ్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యేలా చేశారు.

అంతే కాక నిబంధనలకు విరుద్ధంగా జగన్ తాడేపల్లి ప్యాలెస్‌కు గ్రిల్స్ పెట్టించుకున్న విషయం.. కిలోమీటర్ల కొద్దీ రోడ్డును ఆక్రమించి రాకపోకలు నిషేధించడం.. రుషికొండలో ఏకంగా 550 కోట్లు పెట్టి లగ్జరీ భవనాలను కట్టించుకున్న విషయం.. ఇవన్నీ వెలుగులోకి వచ్చాయి.

తాజాగా తాడేపల్లిలో నిబంధనలకు విరుద్ధంగా కట్టుకుంటున్న వైసీసీ సెంట్రల్ ఆఫీస్ వ్యవహారం బయటపడి దాన్ని సీఆర్డీయే కూల్చి వేయగానే వైసీపీ వాళ్లు గగ్గోలు పెడుతున్నారు.

ఇదే సమయంలో విశాఖపట్నంలో కడుతున్న వైసీపీ ఆఫీస్‌కు సంబంధించి మరో సంచలన విషయం వెలుగులోకి వచ్చింది. అక్కడ కూడా నిబంధనలకు విరుద్ధంగా.. వైజాగ్ కార్పొరేషన్ అభ్యంతరాలను కూడా పట్టించుకోకుండా వైసీపీ ఆఫీస్ కోసం జగన్ ప్రభుత్వం 1.75 ఏకరాల స్థలాన్ని కట్టబెట్టేసిందట. 33 ఏళ్లకు ఆ స్థలాన్ని ఎకరాకు ఏడాదికి కేవలం వెయ్యి రూపాయల మొత్తానికి లీజుకు ఇచ్చిందట. ఈ విషయం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. బాబు సర్కారు నెక్ట్స్ టార్గెట్ ఇదే అవుతుందా.. ఆ బిల్డింగ్ కూడా కూల్చేస్తారా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి.

This post was last modified on June 22, 2024 3:27 pm

Share
Show comments
Published by
Satya
Tags: Feature

Recent Posts

ప్రసాదుగారు మళ్ళీ సిక్సు కొట్టేశారు

మన శంకరవరప్రసాద్ గారు నుంచి మరో పాట వచ్చేసింది. నిజానికీ రిలీజ్ రేపు జరగాలి. కానీ ఒక రోజు ముందుగా…

52 minutes ago

వరల్డ్ కప్ పై గంభీర్ ఘాటు రిప్లై, వాళ్లిద్దరి గురించేనా?

సౌతాఫ్రికాతో వన్డే సిరీస్ విజయం తర్వాత టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ తనదైన స్టైల్లో స్పందించారు. 2027 వరల్డ్…

2 hours ago

గోవా ప్రమాదం.. అసలు తప్పు ఎక్కడ జరిగింది?

గోవా ట్రిప్ అంటే ఫుల్ ఎంజాయ్ అనుకుంటాం. కానీ ఆరపోరాలోని 'బర్చ్ బై రోమియో లేన్' అనే నైట్ క్లబ్…

2 hours ago

పడయప్ప… తెలుగులో కూడా రావాలప్ప

సూపర్ స్టార్ రజనీకాంత్ కెరీర్ లో బెస్ట్ మూవీస్ అంటే వెంటనే గుర్తొచ్చే పేర్లు భాష, నరసింహ, దళపతి. వీటిని…

2 hours ago

‘చిన్న చోరీ’ చేసిన దొంగకు ఉన్న పశ్చాతాపం జగన్ కు లేదా?

తాను చేసింది మహా పాపమే అంటూ.. పరకామణి చోరీ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న నిందితుడు రవికుమార్ తెలిపారు. ఈ వ్యవహారంలో…

3 hours ago

ఇండి’గోల’పై కేటీఆర్ ‘పెత్తనం’ కామెంట్స్

బీఆర్ ఎస్ కార్యనిర్వాహ‌క అధ్య‌క్షుడు, మాజీమంత్రి కేటీఆర్ తాజాగా కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. అధికారం ఒక‌రిద్ద‌రి చేతుల్లో ఉంటే.. ఇలాంటి…

5 hours ago