Political News

వైసీపీ కార్యాలయం.. ఏడాదికి ఎకరాని వెయ్యి

గత ఐదేళ్లలో వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారాన్ని అడ్డు పెట్టుకుని చేసిన అక్రమాలు, అరాచకాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. దీంతో ఐదేళ్ల పాటు తమను వేధించి, అదే పనిగా టార్గెట్ చేసిన వైసీపీకి టీడీపీ-జనసేన ప్రభుత్వం ఇప్పుడు బదులు తీర్చుకునే పనిలో పడింది.

జగన్ అధికారంలోకి రాగానే ప్రభుత్వ భవనమైన ప్రజావేదికను కూల్చి వేయించడమే కాక.. ఆ శిథిలాలను కూడా తొలగించకుండా చంద్రబాబు దాన్ని చూసి కుమిలిపోవాలనే ఎత్తుగడ వేసిన సంగతి తెలిసిందే.

మరోవైపు మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్‌ ఇంట్లోని ప్రభుత్వ ఫర్నీచర్ విషయంలో కేసులు పెట్టి, వేధించి ఆయన ఆత్మహత్యకు పాల్పడే స్థితికి తీసుకురావడాన్ని టీడీపీ వాళ్లు అంత సులువుగా మరిచిపోలేరు.

కూటమి అధికారంలోకి రాగానే జగన్ ప్రభుత్వ ఫర్నీచర్‌ను ఇంకా వాడుకుంటుండడాన్ని బయటపెట్టి ‘ఫర్నీచర్ దొంగ జగన్’ అనే హ్యాష్ ట్యాగ్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యేలా చేశారు.

అంతే కాక నిబంధనలకు విరుద్ధంగా జగన్ తాడేపల్లి ప్యాలెస్‌కు గ్రిల్స్ పెట్టించుకున్న విషయం.. కిలోమీటర్ల కొద్దీ రోడ్డును ఆక్రమించి రాకపోకలు నిషేధించడం.. రుషికొండలో ఏకంగా 550 కోట్లు పెట్టి లగ్జరీ భవనాలను కట్టించుకున్న విషయం.. ఇవన్నీ వెలుగులోకి వచ్చాయి.

తాజాగా తాడేపల్లిలో నిబంధనలకు విరుద్ధంగా కట్టుకుంటున్న వైసీసీ సెంట్రల్ ఆఫీస్ వ్యవహారం బయటపడి దాన్ని సీఆర్డీయే కూల్చి వేయగానే వైసీపీ వాళ్లు గగ్గోలు పెడుతున్నారు.

ఇదే సమయంలో విశాఖపట్నంలో కడుతున్న వైసీపీ ఆఫీస్‌కు సంబంధించి మరో సంచలన విషయం వెలుగులోకి వచ్చింది. అక్కడ కూడా నిబంధనలకు విరుద్ధంగా.. వైజాగ్ కార్పొరేషన్ అభ్యంతరాలను కూడా పట్టించుకోకుండా వైసీపీ ఆఫీస్ కోసం జగన్ ప్రభుత్వం 1.75 ఏకరాల స్థలాన్ని కట్టబెట్టేసిందట. 33 ఏళ్లకు ఆ స్థలాన్ని ఎకరాకు ఏడాదికి కేవలం వెయ్యి రూపాయల మొత్తానికి లీజుకు ఇచ్చిందట. ఈ విషయం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. బాబు సర్కారు నెక్ట్స్ టార్గెట్ ఇదే అవుతుందా.. ఆ బిల్డింగ్ కూడా కూల్చేస్తారా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి.

This post was last modified on June 22, 2024 3:27 pm

Share
Show comments
Published by
Satya
Tags: Feature

Recent Posts

పరకామణి చోరీ పై హైకోర్టు సంచలన వ్యాఖ్యలు

వైసీపీ పాల‌నా కాలంలో తిరుమ‌ల శ్రీవారి ప‌ర‌కామ‌ణిలో 900 డాల‌ర్ల  చోరీ జ‌రిగిన విష‌యం తెలిసిందే. ఈ ప‌రిణామం తిరుమ‌ల…

41 minutes ago

వారిని సెంటర్లో పడేసి కొట్టమంటున్న టీడీపీ ఎమ్మెల్యే!

నేటి రాజకీయ నాయకులలో చాలామందిలో పారదర్శకత కోసం భూతద్దం వేసి వెతికినా కనిపించదు. జవాబుదారీతనం గురించి మాట్లడుకునే అవసరం లేదు.…

1 hour ago

రేట్లు లేకపోయినా రాజాసాబ్ లాగుతాడా?

ప్రభాస్ సినిమా అంటే బడ్జెట్లు.. బిజినెస్ లెక్కలు.. వసూళ్లు అన్నీ భారీగానే ఉంటాయి. కొంచెం మీడియం బడ్జెట్లో తీద్దాం అని…

3 hours ago

అడిగిన వెంటనే ట్రైనీ కానిస్టేబుళ్లకు 3 రెట్లు పెంపు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ట్రైనీ కానిస్టేబుళ్లకు భారీ శుభవార్త అందించారు. మంగళగిరి ఏపీఎస్సీ పరేడ్ గ్రౌండ్‌లో 5,757…

8 hours ago

గంటలో ఆర్డర్స్… ఇదెక్కడి స్పీడు పవన్ సారూ!

అడిగిందే తడవు అన్నట్లు.. పాలనలో పవన వేగాన్ని చూపుతున్నారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. మొన్నటికి మొన్న విద్యార్థులు అడిగారని…

8 hours ago