Political News

ఇది కరక్టేనా జగన్?

వైసీపీ అధినేత‌, మాజీ సీఎం జ‌గ‌న్‌.. అన్న‌ట్టుగానే చేశారు. అసెంబ్లీ స‌మావేశాల‌కు ఆయ‌న డుమ్మా కొట్టా రు. ఆయ‌న‌తోపాటు.. 10 మంది స‌భ్యుల‌ను కూడా రాకుండా చేశారు. శుక్ర‌వారమే పార్టీ ఎమ్మెల్యేల‌తో భేటీ అయిన జ‌గ‌న్‌.. స‌భ‌కు వెళ్లే విష‌యంపై త‌న పార్టీ నేత‌ల‌తో ఆయ‌న చ‌ర్చించారు.

‘మీ ఇష్టం’- అని జ‌గ‌న్ చెప్పినా.. అంత‌ర్లీనంగా.. తాను వెళ్ల‌డం లేద‌ని చెప్పేశారు. దీంతో ఇత‌ర స‌బ్యులు కూడా.. శ‌నివారం స‌భ‌కు డుమ్మా కొట్టారు. మ‌రి ఇది ఏమేర‌కు ఆద‌ర్శ‌మో చూడాలి.

ప్ర‌జా తీర్పును గౌర‌విస్తామ‌ని.. ప్ర‌జ‌ల స‌మ‌స్య‌ల‌ను ప్ర‌స్తావిస్తామ‌ని.. జ‌గ‌న్ ఎన్నిక‌లు ఫ‌లితం వ‌చ్చిన త‌ర్వాత‌.. చెప్పుకొచ్చారు. కానీ, ఇప్పుడు అదే ప్ర‌జాతీర్పును తుంగ‌లోకి తొక్కార‌న్న వాద‌న వినిపిస్తోంది. ప్ర‌స్తుతం శ‌నివారం స‌భ‌లో స్పీక‌ర్‌ను ఎన్నుకున్నారు.

ఏక‌గ్రీవంగా న‌ర్సీప‌ట్నం ఎమ్మెల్యే చింత‌కాయ‌ల అయ్య‌న్న పాత్రుడిని ఎన్నుకున్నారు. ఈ సంద‌ర్భంగా సంప్ర‌దాయం ప్ర‌కారం.. అధికార ప‌క్షం స‌హా ఇత‌ర పార్టీల స‌భ్యులు ఆయ‌న‌ను సీటు వ‌ర‌కు తోడ్కొని వెళ్లి.. సీటులో కూర్చోబెట్టాలి.

ఈ విష‌యంలో జ‌గ‌న్ సంప్ర‌దాయాన్ని వ‌దిలేశారు. వాస్త‌వానికి ఆయ‌న స‌భ‌కు రాక‌పోయినా.. పార్టీలో సీనియ‌ర్ నాయ‌కుడిగా ఉన్న పెద్దిరెడ్డి రామ‌చంద్రారెడ్డిని అయినా.. స‌భ‌కు పంపించి.. సంప్ర‌దాయాన్ని కాపాడుతార‌ని అంద‌రూ అనుకున్నారు. తాడేప‌ల్లి వ‌ర్గాలు కూడా.. ఇదే చెప్పాయి.

కానీ, చివ‌ర‌కు వైసీపీ నాయ‌కులు రెండోరోజు స‌భ‌కు ఎవ‌రూ రాక‌పోవ‌డం గ‌మ‌నార్హం. దీంతో స‌భా నాయ‌కుడిగా చంద్ర‌బాబు, డిప్యూటీసీఎంగా, జ‌న‌సేన అధినేతగా ప‌వ‌న్ క‌ల్యాణ్‌, బీజేపీ త‌ర‌ఫున మంత్రి స‌త్య‌కుమార్ యాద‌వ్‌లే .. అయ్య‌న్న‌ను తోడ్కొని వెళ్లారు.

ఈ ప‌రిణామాల‌ను గ‌మ‌నిస్తే.. జ‌గ‌న్ తాను చెప్పిన‌ట్టే చేశారు.కానీ, సంప్ర‌దాయాల‌ను మాత్రం విస్మ‌రించార నే విమ‌ర్శ‌లు ఎదుర్కొంటున్నారు. ఇక్క‌డ ఓ విష‌యం ప్ర‌స్తావించాలి.

2019లో టీడీపీకి 23 సీట్లు ద‌క్కిన ప్పుడు.. స్పీక‌ర్ తమ్మినేని సీతారాంను.. సీటు వ‌ర‌కు.. తోడ్కొని వెళ్ల‌డంలో చంద్ర‌బాబు ఉదాశీనంగా వ్య‌వ‌హ‌రించార‌ని యాగీ చేశారు. కానీ.. ఇప్పుడు జ‌గ‌న్ కూడా ఇదే ప‌నిచేశారు. దీనికి వైసీపీ నాయ‌కులు ఏం స‌మాధానం చెబుతారో చూడాలి.

This post was last modified on June 22, 2024 12:57 pm

Share
Show comments
Published by
Satya
Tags: Jagan

Recent Posts

పరకామణి చోరీ పై హైకోర్టు సంచలన వ్యాఖ్యలు

వైసీపీ పాల‌నా కాలంలో తిరుమ‌ల శ్రీవారి ప‌ర‌కామ‌ణిలో 900 డాల‌ర్ల  చోరీ జ‌రిగిన విష‌యం తెలిసిందే. ఈ ప‌రిణామం తిరుమ‌ల…

42 minutes ago

వారిని సెంటర్లో పడేసి కొట్టమంటున్న టీడీపీ ఎమ్మెల్యే!

నేటి రాజకీయ నాయకులలో చాలామందిలో పారదర్శకత కోసం భూతద్దం వేసి వెతికినా కనిపించదు. జవాబుదారీతనం గురించి మాట్లడుకునే అవసరం లేదు.…

1 hour ago

రేట్లు లేకపోయినా రాజాసాబ్ లాగుతాడా?

ప్రభాస్ సినిమా అంటే బడ్జెట్లు.. బిజినెస్ లెక్కలు.. వసూళ్లు అన్నీ భారీగానే ఉంటాయి. కొంచెం మీడియం బడ్జెట్లో తీద్దాం అని…

3 hours ago

అడిగిన వెంటనే ట్రైనీ కానిస్టేబుళ్లకు 3 రెట్లు పెంపు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ట్రైనీ కానిస్టేబుళ్లకు భారీ శుభవార్త అందించారు. మంగళగిరి ఏపీఎస్సీ పరేడ్ గ్రౌండ్‌లో 5,757…

8 hours ago

గంటలో ఆర్డర్స్… ఇదెక్కడి స్పీడు పవన్ సారూ!

అడిగిందే తడవు అన్నట్లు.. పాలనలో పవన వేగాన్ని చూపుతున్నారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. మొన్నటికి మొన్న విద్యార్థులు అడిగారని…

8 hours ago