వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్.. అన్నట్టుగానే చేశారు. అసెంబ్లీ సమావేశాలకు ఆయన డుమ్మా కొట్టా రు. ఆయనతోపాటు.. 10 మంది సభ్యులను కూడా రాకుండా చేశారు. శుక్రవారమే పార్టీ ఎమ్మెల్యేలతో భేటీ అయిన జగన్.. సభకు వెళ్లే విషయంపై తన పార్టీ నేతలతో ఆయన చర్చించారు.
‘మీ ఇష్టం’- అని జగన్ చెప్పినా.. అంతర్లీనంగా.. తాను వెళ్లడం లేదని చెప్పేశారు. దీంతో ఇతర సబ్యులు కూడా.. శనివారం సభకు డుమ్మా కొట్టారు. మరి ఇది ఏమేరకు ఆదర్శమో చూడాలి.
ప్రజా తీర్పును గౌరవిస్తామని.. ప్రజల సమస్యలను ప్రస్తావిస్తామని.. జగన్ ఎన్నికలు ఫలితం వచ్చిన తర్వాత.. చెప్పుకొచ్చారు. కానీ, ఇప్పుడు అదే ప్రజాతీర్పును తుంగలోకి తొక్కారన్న వాదన వినిపిస్తోంది. ప్రస్తుతం శనివారం సభలో స్పీకర్ను ఎన్నుకున్నారు.
ఏకగ్రీవంగా నర్సీపట్నం ఎమ్మెల్యే చింతకాయల అయ్యన్న పాత్రుడిని ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా సంప్రదాయం ప్రకారం.. అధికార పక్షం సహా ఇతర పార్టీల సభ్యులు ఆయనను సీటు వరకు తోడ్కొని వెళ్లి.. సీటులో కూర్చోబెట్టాలి.
ఈ విషయంలో జగన్ సంప్రదాయాన్ని వదిలేశారు. వాస్తవానికి ఆయన సభకు రాకపోయినా.. పార్టీలో సీనియర్ నాయకుడిగా ఉన్న పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని అయినా.. సభకు పంపించి.. సంప్రదాయాన్ని కాపాడుతారని అందరూ అనుకున్నారు. తాడేపల్లి వర్గాలు కూడా.. ఇదే చెప్పాయి.
కానీ, చివరకు వైసీపీ నాయకులు రెండోరోజు సభకు ఎవరూ రాకపోవడం గమనార్హం. దీంతో సభా నాయకుడిగా చంద్రబాబు, డిప్యూటీసీఎంగా, జనసేన అధినేతగా పవన్ కల్యాణ్, బీజేపీ తరఫున మంత్రి సత్యకుమార్ యాదవ్లే .. అయ్యన్నను తోడ్కొని వెళ్లారు.
ఈ పరిణామాలను గమనిస్తే.. జగన్ తాను చెప్పినట్టే చేశారు.కానీ, సంప్రదాయాలను మాత్రం విస్మరించార నే విమర్శలు ఎదుర్కొంటున్నారు. ఇక్కడ ఓ విషయం ప్రస్తావించాలి.
2019లో టీడీపీకి 23 సీట్లు దక్కిన ప్పుడు.. స్పీకర్ తమ్మినేని సీతారాంను.. సీటు వరకు.. తోడ్కొని వెళ్లడంలో చంద్రబాబు ఉదాశీనంగా వ్యవహరించారని యాగీ చేశారు. కానీ.. ఇప్పుడు జగన్ కూడా ఇదే పనిచేశారు. దీనికి వైసీపీ నాయకులు ఏం సమాధానం చెబుతారో చూడాలి.
తెలుగులో చాలా కొద్ది మంది హీరోయిన్లకు మాత్రమే సాధ్యమైన స్టార్ ఇమేజ్ సంపాదించింది సమంత. విజయశాంతి, అనుష్కల తర్వాత హీరోలతో…
కేవలం పది కోట్ల బడ్జెట్లో తెరకెక్కిన సినిమా.. అబ్సెషన్. ఈ హాలీవుడ్ హార్రర్ మూవీ విడుదలైనప్పటి నుంచి వరల్డ్ వైడ్…
స్టార్ హీరో సినిమాల రిపీట్ వేల్యూకి ప్రధానంగా దోహదం చేసేది పాటలే. ఫైట్లు, ఎలివేషన్లు, యాక్షన్ ఎపిసోడ్లు ఎక్కువ లేని…
సంక్రాంతికి రిలీజైన మన శంకరవరప్రసాద్ గారులో ప్రాణ స్నేహితులుగా నటించిన చిరంజీవి, వెంకటేష్ మొదటిసారి స్క్రీన్ పంచుకుని ఎంత పెద్ద…
హెడింగ్ చూడగానే ఏవో ముళ్లచెట్ల వల్ల ఎవరికో ఏదో అయిపోయి షూటింగ్ బ్రేక్ పడిందని అనుకోకండి. ఇక్కడ అడ్డంకులనే కోణంలో…
రాష్ట్రంలో అటవీ సంపదను కాపాడడంతోపాటు.. వన్యప్రాణుల సంరక్షణకు సైతం ప్రాధాన్యం ఇస్తున్న ఉప ముఖ్యమంత్రి, అటవీ శాఖ మంత్రి పవన్…