ఏపీ నూతన ముఖ్యమంత్రి చంద్రబాబు కలలు కంటున్న రాజధాని అమరావతి నిర్మాణంలో కీలక ఘట్టాని కి కేంద్రం అనుమతి తెలిపింది. రాజధాని ప్రాంతాన్ని కీలకమైన గుంటూరు, విజయవాడ, ప్రకాశం జిల్లాలో ని కొన్ని ప్రాంతాలకు కలుపుతూ.. నిర్మించే రైల్వే లైన్లకు కేంద్ర సర్కారు తాజాగా పచ్చ జెండా ఊపింది. చిత్రం ఏంటంటే.. చంద్రబాబు శుక్రవారం అసెంబ్లీలో ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేస్తున్న సమయం లోనే కేంద్రం నుంచి ఈ సమాచారం అందడం విశేషం.
నవ నగరాలతో ప్రపంచ ప్రఖ్యాత రాజధానిగా అమరావతిని తీర్చిదిద్దాలని చంద్రబాబు సంకల్పించిన విషయం తెలిసిందే. అయితే.. ముందుగా.. ప్రధాన నగరాలైన.. గుంటూరు, విజయవాడ, ఒంగోలు వంటి ప్రాంతాలకు.. ఈ నగరాన్ని అనుసంధాన్ని చేయాల్సి ఉంటుంది. కేవలం రోడ్డు మార్గమే కాకుండా.. రైలు లైను కూడా వేయాలన్నది చంద్రబాబు బృహత్తర ప్రణాళిక.. దీని ప్రకారమే ఆయన 2017-18లో నే ఈ ప్రణాళికలను కేంద్రానికి అందించారు.
అయితే.. తర్వాత కాలంలో బాబుకు కేంద్రానికి మధ్య వివాదం తలెత్తడంతో ఇది ఆగిపోయింది. తర్వాత వచ్చిన వైసీపీ పట్టించుకోలేదు. దీంతో తాజాగా కూటమిగా కేంద్రంలో ప్రభుత్వం ఏర్పడిన తర్వాత.. చంద్రబాబు అమరావతి ప్లానును.. రైల్వేకు అప్పగించారు. ఈ క్రమంలోనే రైల్వే శాఖ.. అమరావతి నూతన లైన్లకు సంబంధించి.. ప్రకటన విడుదల చేసింది.
ఇవీ.. ప్రతిపాదిత లైన్లు..
అనుమతులు ఇవీ..
This post was last modified on June 21, 2024 3:45 pm
రెండు రోజుల్లలో తన పదవికి రాజీనామా చేయనున్నట్టు ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీపార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ సంచలన ప్రకటన…
ఇంకో పదమూడు రోజుల్లో విడుదల కాబోతున్న దేవర పార్ట్ 1 కోసం అభిమానులే కాదు సగటు సినీ ప్రియులు సైతం…
వలసవాద బ్రిటీష్ విధానాలకు కేంద్ర ప్రభుత్వం స్వస్థి చెబుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే క్రిమినల్ చట్టా లను మార్పు చేశారు.…
కూటమి ప్రభుత్వం ఏర్పడి మూడు మాసాలే అయింది. అయితే.. ఇంతలోనే అతి పెద్ద సమస్య ఉక్కిరి బిక్కిరి చేస్తోంది. విశాఖ…
సైకో కిల్లర్ సినిమాలు, వెబ్ సిరీస్ లు చాలానే చూస్తాం కానీ కొన్ని ఒళ్ళు గగుర్పొడిచేలా ఉంటే అవి నిజంగా…
ఎన్నికల్లో ఓటమి తర్వాత మూడు నెలలు సైలెంట్ గా ఉన్న వైసీపీ నేత, మాజీ మంత్రి రోజా నగరి నియోజకవర్గంలో…