ఏపీ నూతన ముఖ్యమంత్రి చంద్రబాబు కలలు కంటున్న రాజధాని అమరావతి నిర్మాణంలో కీలక ఘట్టాని కి కేంద్రం అనుమతి తెలిపింది. రాజధాని ప్రాంతాన్ని కీలకమైన గుంటూరు, విజయవాడ, ప్రకాశం జిల్లాలో ని కొన్ని ప్రాంతాలకు కలుపుతూ.. నిర్మించే రైల్వే లైన్లకు కేంద్ర సర్కారు తాజాగా పచ్చ జెండా ఊపింది. చిత్రం ఏంటంటే.. చంద్రబాబు శుక్రవారం అసెంబ్లీలో ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేస్తున్న సమయం లోనే కేంద్రం నుంచి ఈ సమాచారం అందడం విశేషం.
నవ నగరాలతో ప్రపంచ ప్రఖ్యాత రాజధానిగా అమరావతిని తీర్చిదిద్దాలని చంద్రబాబు సంకల్పించిన విషయం తెలిసిందే. అయితే.. ముందుగా.. ప్రధాన నగరాలైన.. గుంటూరు, విజయవాడ, ఒంగోలు వంటి ప్రాంతాలకు.. ఈ నగరాన్ని అనుసంధాన్ని చేయాల్సి ఉంటుంది. కేవలం రోడ్డు మార్గమే కాకుండా.. రైలు లైను కూడా వేయాలన్నది చంద్రబాబు బృహత్తర ప్రణాళిక.. దీని ప్రకారమే ఆయన 2017-18లో నే ఈ ప్రణాళికలను కేంద్రానికి అందించారు.
అయితే.. తర్వాత కాలంలో బాబుకు కేంద్రానికి మధ్య వివాదం తలెత్తడంతో ఇది ఆగిపోయింది. తర్వాత వచ్చిన వైసీపీ పట్టించుకోలేదు. దీంతో తాజాగా కూటమిగా కేంద్రంలో ప్రభుత్వం ఏర్పడిన తర్వాత.. చంద్రబాబు అమరావతి ప్లానును.. రైల్వేకు అప్పగించారు. ఈ క్రమంలోనే రైల్వే శాఖ.. అమరావతి నూతన లైన్లకు సంబంధించి.. ప్రకటన విడుదల చేసింది.
ఇవీ.. ప్రతిపాదిత లైన్లు..
అనుమతులు ఇవీ..
This post was last modified on June 21, 2024 3:45 pm
యాంగ్రీ యంగ్ మ్యాన్ గా ఒకప్పుడు అంకుశం, ఆగ్రహం, మగాడు లాంటి సూపర్ హిట్స్ తో తొంభై దశకంలో మంచి…
ముఖ్యమంత్రి పదవి అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. ప్రతి రాజకీయ నేత సీఎం కావాలనే కోరుకుంటారు. ఇక గ్రాండ్…
ఇవాళ అందరూ బైకర్, రాకాస గురించే మాట్లాడుకుంటున్నారు కానీ వీటితో పాటు కార్మేని సెల్వం అనే డబ్బింగ్ సినిమా రిలీజైన…
వైసీపీ కీలక నేత, మాజీ మంత్రి పేర్ని వెంకట్రామయ్య అలియాస్ పేర్ని నాని జైలుకు వెళ్లేందుకెు సిద్ధపడిపోయారా? అంటే.. అవుననే సమాధానమే…
అమరావతికి చట్టబద్దత కల్పిస్తూ రూపొందించిన బిల్లుకు పార్లమెంట్ ఉభయ సభలు ఆమోదించటం పట్ల ముఖ్యమంత్రి చంద్రబాబు సంతోషం వ్యక్తం చేశారు.…
అమెరికాలో ఉంటున్న తెలుగు అమ్మాయి, ఇన్ఫ్లుయెన్సర్ (పికు నెమలి) సోషల్ మీడియాలో షేర్ చేసిన వీడియో ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాల్లో…