ఏపీ నూతన ముఖ్యమంత్రి చంద్రబాబు కలలు కంటున్న రాజధాని అమరావతి నిర్మాణంలో కీలక ఘట్టాని కి కేంద్రం అనుమతి తెలిపింది. రాజధాని ప్రాంతాన్ని కీలకమైన గుంటూరు, విజయవాడ, ప్రకాశం జిల్లాలో ని కొన్ని ప్రాంతాలకు కలుపుతూ.. నిర్మించే రైల్వే లైన్లకు కేంద్ర సర్కారు తాజాగా పచ్చ జెండా ఊపింది. చిత్రం ఏంటంటే.. చంద్రబాబు శుక్రవారం అసెంబ్లీలో ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేస్తున్న సమయం లోనే కేంద్రం నుంచి ఈ సమాచారం అందడం విశేషం.
నవ నగరాలతో ప్రపంచ ప్రఖ్యాత రాజధానిగా అమరావతిని తీర్చిదిద్దాలని చంద్రబాబు సంకల్పించిన విషయం తెలిసిందే. అయితే.. ముందుగా.. ప్రధాన నగరాలైన.. గుంటూరు, విజయవాడ, ఒంగోలు వంటి ప్రాంతాలకు.. ఈ నగరాన్ని అనుసంధాన్ని చేయాల్సి ఉంటుంది. కేవలం రోడ్డు మార్గమే కాకుండా.. రైలు లైను కూడా వేయాలన్నది చంద్రబాబు బృహత్తర ప్రణాళిక.. దీని ప్రకారమే ఆయన 2017-18లో నే ఈ ప్రణాళికలను కేంద్రానికి అందించారు.
అయితే.. తర్వాత కాలంలో బాబుకు కేంద్రానికి మధ్య వివాదం తలెత్తడంతో ఇది ఆగిపోయింది. తర్వాత వచ్చిన వైసీపీ పట్టించుకోలేదు. దీంతో తాజాగా కూటమిగా కేంద్రంలో ప్రభుత్వం ఏర్పడిన తర్వాత.. చంద్రబాబు అమరావతి ప్లానును.. రైల్వేకు అప్పగించారు. ఈ క్రమంలోనే రైల్వే శాఖ.. అమరావతి నూతన లైన్లకు సంబంధించి.. ప్రకటన విడుదల చేసింది.
ఇవీ.. ప్రతిపాదిత లైన్లు..
అనుమతులు ఇవీ..
This post was last modified on June 21, 2024 3:45 pm
కెరీర్లో చాలా ఏళ్లు పక్కింటి కుర్రాడి పాత్రలే చేస్తూ వచ్చాడు నేచురల్ స్టార్ నాని. కానీ ‘దసరా’ చిత్రంతో తన…
స్టేజ్ ఎక్కగానే ఎక్కడ లేని ఉత్సాహం వచ్చేస్తుంది కొందరికి. మైక్ పట్టుకుని ఏదేదో మాట్లాడేస్తారు. ఇది సోషల్ మీడియా కాలం…
తమిళంలో నంబర్ వన్ హీరోగా వెలుగొందుతున్న సమయంలో నటనకు స్వస్తి చెప్పి రాజకీయ రంగంలోకి అడుగుపెట్టాడు విజయ్. కానీ ఇక్కడ…
కాస్త స్టార్ ఇమేజ్ ఉన్న ఏ హీరోకైనా.. పేరు వెనుక ఏదో ఒక ట్యాగ్ ఉండాల్సిందే. ఐతే ఒక మోస్తరుగా…
రాష్ట్ర బీజేపీలో నాయకుల నియామకం.. కొత్తగా వచ్చే వారికి అవకాశం ఇవ్వడం... ఉన్న వారికి పనులు కేటాయించడం.. అనేది సహజం.…
ప్రస్తుతం నెలకొన్న వంట గ్యాస్ సంక్షోభం నుంచి బయట పడేందుకు ప్రయత్నిస్తున్నామని చెబుతున్న కేంద్రంలోని నరేంద్ర మోడీ సర్కారు.. తాజాగా…