ఏపీ నూతన ముఖ్యమంత్రి చంద్రబాబు కలలు కంటున్న రాజధాని అమరావతి నిర్మాణంలో కీలక ఘట్టాని కి కేంద్రం అనుమతి తెలిపింది. రాజధాని ప్రాంతాన్ని కీలకమైన గుంటూరు, విజయవాడ, ప్రకాశం జిల్లాలో ని కొన్ని ప్రాంతాలకు కలుపుతూ.. నిర్మించే రైల్వే లైన్లకు కేంద్ర సర్కారు తాజాగా పచ్చ జెండా ఊపింది. చిత్రం ఏంటంటే.. చంద్రబాబు శుక్రవారం అసెంబ్లీలో ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేస్తున్న సమయం లోనే కేంద్రం నుంచి ఈ సమాచారం అందడం విశేషం.
నవ నగరాలతో ప్రపంచ ప్రఖ్యాత రాజధానిగా అమరావతిని తీర్చిదిద్దాలని చంద్రబాబు సంకల్పించిన విషయం తెలిసిందే. అయితే.. ముందుగా.. ప్రధాన నగరాలైన.. గుంటూరు, విజయవాడ, ఒంగోలు వంటి ప్రాంతాలకు.. ఈ నగరాన్ని అనుసంధాన్ని చేయాల్సి ఉంటుంది. కేవలం రోడ్డు మార్గమే కాకుండా.. రైలు లైను కూడా వేయాలన్నది చంద్రబాబు బృహత్తర ప్రణాళిక.. దీని ప్రకారమే ఆయన 2017-18లో నే ఈ ప్రణాళికలను కేంద్రానికి అందించారు.
అయితే.. తర్వాత కాలంలో బాబుకు కేంద్రానికి మధ్య వివాదం తలెత్తడంతో ఇది ఆగిపోయింది. తర్వాత వచ్చిన వైసీపీ పట్టించుకోలేదు. దీంతో తాజాగా కూటమిగా కేంద్రంలో ప్రభుత్వం ఏర్పడిన తర్వాత.. చంద్రబాబు అమరావతి ప్లానును.. రైల్వేకు అప్పగించారు. ఈ క్రమంలోనే రైల్వే శాఖ.. అమరావతి నూతన లైన్లకు సంబంధించి.. ప్రకటన విడుదల చేసింది.
ఇవీ.. ప్రతిపాదిత లైన్లు..
అనుమతులు ఇవీ..
This post was last modified on June 21, 2024 3:45 pm
రేపు రాత్రి ప్రీమియర్లతో విడుదల కాబోతున్న మన శంకరవరప్రసాద్ గారు మీద ఆల్రెడీ ఉన్న బజ్ మరింత పెరిగే దిశగా…
పాలన అంటే కార్యాలయాల్లో కూర్చుని సమీక్షలు చేయడమే కాదు. ప్రజల మధ్యకు వెళ్లి వారి సమస్యలను ప్రత్యక్షంగా చూడడమే నిజమైన…
తనపై విమర్శలు చేసే వారిని సహజంగా ఎవరైనా ప్రతివిమర్శలతో ఎదుర్కొంటారు. మాటకు మాట అంటారు. ఇక రాజకీయాల్లో అయితే ఈ…
ఇరు తెలుగు రాష్ట్రాల మధ్య ఉన్న జల వివాదాలపై యాగీ చేసుకోకుండా కూర్చుని మాట్లాడుకుంటే సమస్యలు పరిష్కారం అవుతాయని తెలంగాణ…
టీమ్ ఇండియా సీనియర్ పేసర్ మహమ్మద్ షమీ ఇంటర్నేషనల్ కెరీర్ దాదాపు ముగింపు దశకు చేరుకున్నట్లే కనిపిస్తోంది. గతేడాది జరిగిన…
రెండు రాష్ట్రాల మధ్య జల వివాదాలపై ఏపీ సీఎం చంద్రబాబు మరోసారి స్పందించారు. నీళ్లు వద్దు, గొడవలే కావాలని కొందరు…