తాము అధికారంలోకి వస్తే.. రాష్ట్రంలో సంపదను సృష్టిస్తామని టీడీపీ అధినేత, ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పిన విషయం తెలిసిందే. దీనిలో భాగంగా ఆయన అధికారంలోకి వచ్చిన పక్షం రోజుల్లోనే పని ప్రారంభించారు. రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకురావాలని.. కూటమి పార్టీలైన జనసేన, బీజేపీ ఎంపీలకు ముఖ్యమంత్రి చంద్రబాబు పిలుపునిచ్చారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఏమాత్రం బాగోలేదని.. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయాల్సి ఉందని తెలిపారు.
దీనికి పెట్టుబడులు వస్తేనే సాధ్యమవుతుందని చంద్రబాబు తెలిపారు. తాజాగా చంద్రబాబు కూటమి పార్టీల తరఫున విజయం దక్కించుకున్న ఎంపీలు, కేంద్ర మంత్రులకు తన నివాసంలో విందు ఇచ్చారు. దీనికి బీజేపీ తరఫున విజయం దక్కించుకున్న ఎంపీలు ముగ్గరు, జనసేన తరఫున విజయం సాధించిన ఇద్దరు, టీడీపీ తరఫున గెలిచిన ఎంపీలు హాజరయ్యారు. వీరిని ఉద్దేశించి చంద్రబాబు మాట్లాడుతూ.. రాష్ట్రానికి పెట్టుబడులు అవసరం ఎంతో ఉందన్నారు.
ప్రస్తుతం అమరావతి రాజధానిని పట్టాలెక్కించే పనిని ప్రారంభించామని.. ఈ నేపథ్యంలో పెట్టబడులకు అవకాశం ఉందని తెలిపారు. మీ మీ స్థాయిలో పెట్టుబడులు ఆకర్షించేందుకు అవసరం ఉన్న అన్ని మార్గాలను వినియోగించుకోవాలన్నారు. రాష్ట్రానికి సేవ చేసేందుకు ప్రజలు మనల్ని ఎన్నుకున్నారన్న విషయాన్ని గమనంలో పెట్టుకుని ఆదిశగా అడుగులు వేయాలని సూచించారు. అందరూ కలసి కట్టుగా రాష్ట్రాభివృద్ధికి కృషి చేయాలని కోరారు.
ఇగోలకు పోవాల్సిన అవసరం లేదని చంద్రబాబు తెలిపారు. ఏ పార్టీల తరఫున విజయం దక్కించుకున్నా.. అంతిమంగా రాష్ట్రమేలు కోసం అందరూ కలసి పనిచేయాలన్నారు. ఏ స్థాయి పెట్టుబడులు వచ్చినా.. వదులు కోవద్దని అందరినీ ఆహ్వానించాలని సూచించారు. త్వరలోనే పెట్టుబడులకు సంబంధించిన విధానాన్ని ప్రకటించనున్నట్టు చంద్రబాబు తెలిపారు. ఈ విందుకు.. బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి, కేంద్ర మంత్రులు రామ్మోహన్నాయుడు తదితరులు పాల్గొన్నారు.
ప్రతి సంవత్సరం విజయ్కి స్పెషల్ పిక్తో పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్పే త్రిష.. ఈసారి చెప్పలేదు. ఇన్స్టాగ్రామ్లో కూడా ఆయన్ని…
నిజమే…ఆ ఇద్దరూ కలిశారు. రాష్ట్ర అభివృద్ది కోసం రాజకీయాలను పక్కనపెట్టేశారు. అంతే… ఇద్దరు ముగ్గురయ్యారు. ఆ ముగ్గురూ నలుగురయ్యారు. వెరసి…
కొందరు స్టార్ హీరోయిన్లు కెరీర్ మంచి ఊపులో కొనసాగుతున్న టైంలోనే వ్యక్తిగత జీవితంలో సెటిల్ అవ్వాలని చూస్తుంటారు. ఈ క్రమంలో…
మొన్నామధ్య విడుదలైన యాక్షన్ కింగ్ అర్జున్ డబ్బింగ్ సినిమా 'బ్లాస్ట్ జోన్' తెలుగు రాష్ట్రాల్లో బాగానే ఆడింది. ప్రమోషన్లు పెద్దగా…
పవన్ కళ్యాణ్ స్వయంగా ట్విట్టర్ ఖాతాలో ఈ ఫొటోను పోస్ట్ చేశారు. ఈ ఫొటోలో పవన్ కళ్యాణ్తో పాటు కనిపిస్తున్నది…
సోషల్ మీడియాలో ఇప్పుడో టాపిక్ హాట్ డిస్కషన్ గా మారింది. హైదరాబాద్ కు చెందిన ఒక ప్రేక్షకుడు బుక్ మై…