Political News

సంప‌ద సృష్టిపై చంద్ర‌బాబు దిశానిర్దేశం.. ఏం చెప్పారంటే

తాము అధికారంలోకి వ‌స్తే.. రాష్ట్రంలో సంప‌ద‌ను సృష్టిస్తామ‌ని టీడీపీ అధినేత‌, ప్ర‌స్తుత ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు చెప్పిన విష‌యం తెలిసిందే. దీనిలో భాగంగా ఆయ‌న అధికారంలోకి వ‌చ్చిన ప‌క్షం రోజుల్లోనే ప‌ని ప్రారంభించారు. రాష్ట్రానికి పెట్టుబ‌డులు తీసుకురావాల‌ని.. కూట‌మి పార్టీలైన జ‌న‌సేన‌, బీజేపీ ఎంపీల‌కు ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు పిలుపునిచ్చారు. రాష్ట్ర ఆర్థిక ప‌రిస్థితి ఏమాత్రం బాగోలేద‌ని.. ఎన్నిక‌ల స‌మ‌యంలో ఇచ్చిన హామీల‌ను అమ‌లు చేయాల్సి ఉంద‌ని తెలిపారు.

దీనికి పెట్టుబ‌డులు వ‌స్తేనే సాధ్య‌మ‌వుతుంద‌ని చంద్ర‌బాబు తెలిపారు. తాజాగా చంద్ర‌బాబు కూట‌మి పార్టీల త‌ర‌ఫున విజ‌యం ద‌క్కించుకున్న ఎంపీలు, కేంద్ర మంత్రుల‌కు త‌న నివాసంలో విందు ఇచ్చారు. దీనికి బీజేపీ త‌ర‌ఫున విజ‌యం ద‌క్కించుకున్న ఎంపీలు ముగ్గ‌రు, జ‌న‌సేన త‌ర‌ఫున విజ‌యం సాధించిన ఇద్ద‌రు, టీడీపీ త‌ర‌ఫున గెలిచిన ఎంపీలు హాజర‌య్యారు. వీరిని ఉద్దేశించి చంద్ర‌బాబు మాట్లాడుతూ.. రాష్ట్రానికి పెట్టుబ‌డులు అవ‌స‌రం ఎంతో ఉంద‌న్నారు.

ప్ర‌స్తుతం అమ‌రావ‌తి రాజ‌ధానిని ప‌ట్టాలెక్కించే ప‌నిని ప్రారంభించామ‌ని.. ఈ నేప‌థ్యంలో పెట్ట‌బడుల‌కు అవ‌కాశం ఉంద‌ని తెలిపారు. మీ మీ స్థాయిలో పెట్టుబ‌డులు ఆక‌ర్షించేందుకు అవ‌స‌రం ఉన్న అన్ని మార్గాల‌ను వినియోగించుకోవాల‌న్నారు. రాష్ట్రానికి సేవ చేసేందుకు ప్ర‌జ‌లు మ‌నల్ని ఎన్నుకున్నార‌న్న విష‌యాన్ని గ‌మ‌నంలో పెట్టుకుని ఆదిశ‌గా అడుగులు వేయాల‌ని సూచించారు. అంద‌రూ క‌ల‌సి క‌ట్టుగా రాష్ట్రాభివృద్ధికి కృషి చేయాల‌ని కోరారు.

ఇగోల‌కు పోవాల్సిన అవ‌స‌రం లేద‌ని చంద్ర‌బాబు తెలిపారు. ఏ పార్టీల త‌ర‌ఫున విజ‌యం ద‌క్కించుకున్నా.. అంతిమంగా రాష్ట్ర‌మేలు కోసం అంద‌రూ క‌ల‌సి ప‌నిచేయాల‌న్నారు. ఏ స్థాయి పెట్టుబ‌డులు వ‌చ్చినా.. వ‌దులు కోవ‌ద్ద‌ని అంద‌రినీ ఆహ్వానించాల‌ని సూచించారు. త్వ‌ర‌లోనే పెట్టుబ‌డుల‌కు సంబంధించిన విధానాన్ని ప్ర‌క‌టించ‌నున్న‌ట్టు చంద్ర‌బాబు తెలిపారు. ఈ విందుకు.. బీజేపీ రాష్ట్ర అధ్య‌క్షురాలు పురందేశ్వ‌రి, కేంద్ర మంత్రులు రామ్మోహ‌న్‌నాయుడు త‌దిత‌రులు పాల్గొన్నారు.

Satya

Recent Posts

భారత్ బోర్డర్లో దొరికిన అమెరికా మాజీ సైనికుడు… పెద్ద కుట్రేనా?

యూపీలోని మహారాజ్‌గంజ్ జిల్లా నేపాల్ సరిహద్దులో సశస్త్ర సీమా బల్ (ఎస్ఎస్‌బీ) బలగాలకు ఒక విదేశీయుడు పట్టుబడటం దేశవ్యాప్తంగా కలకలం…

9 minutes ago

బహదూర్ పోరాటం ఎలా జరిగింది

ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏదైనా సినిమా ఫలితాన్ని తేల్చి చెప్పేది బాక్సాఫీస్ వసూళ్లే. అవి ఎంత ఘనంగా వచ్చాయనే దాన్ని బట్టే…

15 minutes ago

వంద కోట్ల ఆస్తి… పీకే సంచలన అఫిడవిట్!

రాజకీయ వ్యూహకర్త నుంచి ప్రత్యక్ష రాజకీయాల్లోకి దిగిన ప్రశాంత్ కిషోర్ (పీకే) ఆస్తుల వివరాలు ఇప్పుడు పాలిటిక్స్ లో హాట్…

29 minutes ago

కొడుకుల్ని గెలిపించాడు… నాన్న గెలవాలి

తెలుగు సినీ పరిశ్రమలో అతి పెద్ద కుటుంబాల్లో అక్కినేని వారిది ఒకటి. తరతరాలు కూర్చుని తిన్నా తరగనంత ఆస్తి ఉంది.…

2 hours ago

కోహ్లీ, రోహిత్‌… అసలైన అగ్నిపరీక్ష

టీమిండియా మరో పోరుకు సిద్ధమైంది. ఎడ్జ్‌బాస్టన్ వేదికగా ఇంగ్లాండ్ తో ఈరోజు వన్డే సిరీస్ మొదలుకానుంది. వరుస టీ20 సిరీస్…

3 hours ago

చంద్ర‌బాబు క‌ల‌ల ప్రాజెక్టుకు కేంద్రం గుర్తింపు!

ఏపీ సీఎం చంద్ర‌బాబు క‌ల‌ల ప్రాజెక్టు.. విజ‌య‌న‌గ‌రం జిల్లా భోగాపురంలో నిర్మించిన గ్రీన్‌ఫీల్డ్ అంత‌ర్జాతీయ విమానాశ్ర‌యానికి కేంద్ర ప్ర‌భుత్వం `ప్ర‌త్యేక‌`…

3 hours ago