Political News

కాంగ్రెస్ నేత‌ల ఎదురు చూపులు!

తెలంగాణ‌లో కాంగ్రెస్ అధికారంలో ఉన్నా ఆ పార్టీ నేత‌ల్లో అసంతృప్తి త‌ప్ప‌డం లేద‌నే అభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. గ‌తేడాది అసెంబ్లీ ఎన్నిక‌ల్లో ఆ పార్టీ అనూహ్య విజ‌యంతో అధికారంలోకి వ‌చ్చింది.

కానీ ఇప్ప‌టివ‌ర‌కూ నామినేటెడ్ పోస్టుల‌ను భ‌ర్తీ చేయ‌క‌పోవ‌డంతో ఆ ప‌ద‌వులపై ఆశ‌లు పెట్టుకున్న కాంగ్రెస్ నేత‌లు ఎదురు చూస్తూనే ఉన్నారు. ఇంకెప్పుడు ప‌ద‌వులు ఇస్తారా? అని వెయిట్ చేస్తున్నారు. ముఖ్యంగా ఆ పార్టీ విజ‌యం కోసం ప‌ని చేసిన నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లు ఎక్కువ‌గా ఆశ ప‌డుతున్నారు.

తెలంగాణ‌లో ఉనికే ప్ర‌మాదంలో ప‌డ్డ కాంగ్రెస్ గ‌త ఎన్నిక‌ల్లో సంచ‌ల‌న విజ‌యం సాధించింది. దీనికి రేవంత్ రెడ్డి ముఖ్య కార‌ణ‌మైతే.. ఆయ‌న పిలుపుతో ఎన్నిక‌ల్లో క‌ష్ట‌ప‌డ్డ నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లు మ‌రో కార‌ణం.

త‌మ పార్టీ అధికారంలో వ‌చ్చింది కాబ‌ట్టి ప్ర‌భుత్వంలో భాగ‌మ‌వ్వాల‌నే నాయ‌కుల సంఖ్య ఎక్కువ‌గానే ఉంది. వీళ్లంద‌రూ ప‌ద‌వుల కోసం ఎదురు చూస్తున్నారు. నామినేటెడ్ ప‌ద‌వులు కేటాయిస్తార‌నే ఆశ‌తో ఉన్నారు.

కానీ లోక్‌స‌భ ఎన్నిక‌ల నేప‌థ్యంలో కోడ్‌తో ఇన్ని రోజులు ఈ ప‌ద‌వుల‌ను భ‌ర్తీ చేయ‌లేదు. ఇప్పుడు కోడ్ ముగిసింది అయినా నిరీక్ష‌ణ త‌ప్ప‌డం లేదు. ఈ ప‌ద‌వుల కోసం పోటీ ఎక్కువ‌గా ఉండ‌టం, త్వ‌ర‌లోనే స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌లు జ‌రిగే అవ‌కాశం ఉండ‌టంతో భ‌ర్తీ కోసం టైం ప‌ట్టే అవ‌కాశ‌ముంది.

జెండా మోసిన నాయ‌కులు ప‌ద‌విపై కోరిక‌తో ఉన్నారు కానీ హైక‌మాండ్ నుంచి గ్రీన్ సిగ్న‌ల్ వ‌స్తేనే వాళ్ల క‌ల తీరుతుంద‌నే చెప్పాలి. ఈ నేప‌థ్యంలో నామినేటెడ్ ప‌ద‌వుల భ‌ర్తీ ఎప్పుడూ అని నాయ‌కులు వేయి క‌ళ్ల‌తో ఎదురు చూస్తున్నారు. అధిష్ఠానం గ్రీన్ సిగ్న‌ల్ కోసం క‌ళ్లు కాయ‌లు కాచేలా చూస్తున్నారు.

This post was last modified on June 19, 2024 2:26 pm

Share
Show comments
Published by
Satya
Tags: Congress

Recent Posts

నియోజ‌క‌వ‌ర్గాల‌పై రేవంత్ కొత్త ఫార్ములా… వ‌ర్కువ‌ట్ అయ్యేనా?

2029 పార్ల‌మెంటు ఎన్నిక‌ల నాటికి దేశంలో నియోజ‌క‌వ‌ర్గాల‌ను పున‌ర్విభ‌జించాల‌ని కేంద్ర ప్ర‌భుత్వం ల‌క్ష్యంగా పెట్టుకున్న విష‌యం తెలిసిందే. ఇటు అసెంబ్లీ,…

3 hours ago

పెను సంక్షోభంలో ప్ర‌పంచం…!

అమెరికా - ఇరాన్ దేశాల మధ్య నెలకొన్న చర్చల ప్రతిష్టంభ‌న ప్రపంచ దేశాలను పెను సంక్షోభంలోకి నెట్టే దిశగా మారుతోందా?…

3 hours ago

రాష్ట్ర‌ప‌తికి బహుమతిగా మంగళగిరి చీర

భార‌త రాష్ట్ర‌ప‌తి ద్రౌప‌దిముర్ముతో ఏపీ మంత్రి, టీడీపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి నారా లోకేష్ భేటీ అయ్యారు. పార్టీకి చెందిన…

4 hours ago

ఏపీ కొత్త ఎన్నిక‌ల క‌మిష‌న‌ర్‌… వైసీపీకి షాకేనా?

ఏపీ రాష్ట్ర ఎన్నిక‌ల సంఘం క‌మిష‌న‌ర్ ప‌ద‌వి ఖాళీ అయింది. గ‌త నెల 31వ తేదీ వ‌ర‌కు ఉన్న రాష్ట్ర…

4 hours ago

‘హోం’ ప్రశ్నలపై ‘సీఎం’ సమాధానం చెప్తారా?

తెలంగాణలో కీలకమైన హోం శాఖను సీఎం రేవంత్ రెడ్డి తన దగ్గర పెట్టుకున్నారు. శాంతిభద్రతలను ఆయనే పర్యవేక్షిస్తున్నారు. అయితే తరచుగా…

5 hours ago

కేసీఆర్ వరకు వెళ్లిన సీతక్క పంచాయితీ

తెలంగాణలో అధికార పార్టీ కాంగ్రెస్ కు చెందిన మహిళా నేత, సీఎం ఎనుముల రేవంత్ రెడ్డి కేబినెట్ లో కీలక…

6 hours ago